ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.
ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్నర్గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.
లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!
ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత.
4, మార్చి 2011, శుక్రవారం
3, మార్చి 2011, గురువారం
అంతా లొల్లియ(మేము అందరము ఒక్కటే)
తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు కలిసి కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెక్ పెట్టే యోచన చేస్తున్నాయి. వైయస్ జగన్ వర్గం కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవరగుడి నారాయణ రెడ్డిని పోటీకి దించుతోంది. ఈ స్థితిలో ఇంచార్జీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి, వైయస్ వివేకానంద రెడ్డి, కాంగ్రెసు నాయకుడు తులసి రెడ్డి కలిసి తెలుగుదేశం పార్టీలతో సయోధ్యకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. తెలుగుదేశం నాయకుడు పాలకొండ రాయుడితో, మదన్మోహన్ రెడ్డి, పుత్తా నర్సింహారెడ్డిలతో చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీకి కూడా వైయస్ జగన్ ప్రధాన ప్రత్యర్థి కాబట్టి కాంగ్రెసుకు సహకరించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ స్థితిలో వైయస్ జగన్ వర్గం అభ్యర్థిని ఓడించేందుకు పోటీకి దిగకూడదని తెలుగుదేశం నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. శత్రువు శత్రువు మిత్రుడనే నీతిని తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరించే అవకాశం ఉంది. కాంగ్రెసు తన అభ్యర్థిగా వరదరాజులు రెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది.
ఎవడి పని వాడు చెయ్యాలి
జస్టిస్ కృష్ణ కమిటీ ముందు
చిన్నబోయిన తర్కాన్ని
వేర్పాటు వాద న్యాయవాదులు
అంగీకరించడం లేదు
అంది వచ్చిన అవకాశాన్ని
జార విడుచుకొని
తమ తెలివి తేటలను
జనాలకు తెలియజేయాలని
కనిపించిన ప్రతి ప్రజా ప్రతినిధిని
నిలదీస్తూ నిష్టూరపరుస్తున్నారు
గతంలో ఇలాగే తమ పని తాము చేయక
తెలుగు తమ్ముళ్ళ దగ్గర
తన్నించుకోవడం తలుచుకొంటుంటే
గుర్తుకు వస్తోంది
ఎవడి పని వాడు చెయ్యాలి అనే తెలుగు కథ
చిన్నబోయిన తర్కాన్ని
వేర్పాటు వాద న్యాయవాదులు
అంగీకరించడం లేదు
అంది వచ్చిన అవకాశాన్ని
జార విడుచుకొని
తమ తెలివి తేటలను
జనాలకు తెలియజేయాలని
కనిపించిన ప్రతి ప్రజా ప్రతినిధిని
నిలదీస్తూ నిష్టూరపరుస్తున్నారు
గతంలో ఇలాగే తమ పని తాము చేయక
తెలుగు తమ్ముళ్ళ దగ్గర
తన్నించుకోవడం తలుచుకొంటుంటే
గుర్తుకు వస్తోంది
ఎవడి పని వాడు చెయ్యాలి అనే తెలుగు కథ
తల్లడిల్లుతున్న తెలుగు తల్లి
భాషను తల్లి తర్వాత తల్లిగా (ప్రచారం) చేసిన వాడు తెలుగు వాడే !
అలాగే ……
తన సొంత రాష్ట్రం లో తన సొంత భాషను అధికార భాషగా చేసుకోలేక పోయినవాడు,
అరవై ఏళ్లయినా తన భాషను పక్కన పెట్టి ఇంకా పరాయి భాషలో పరిపాలన సాగించే
అసమర్దుడూ తెలుగు వాడే అన్న కఠోర వాస్తవాన్ని కూడా మరచి పోవద్దు.
తమిళ తంబి, హిందీ అన్న ఇతర భాషల వాళ్ళు తమ రాష్ట్రాల్లో చక్కగా ప్రజల భాషలో
పాలన సాగించు కుంటున్నారు.
వాళ్ళేమీ తమ భాషలను తల్లులుగా ప్రచారం చేసి విగ్రహాలు నెలకొల్పుకోక పోయినా
తమ భాషలను అద్భుతంగా పాలనా భాషలుగా తీర్చి దిద్దుకున్నారు.
మనం…
ఏదో తల్లి అంటూ ఆత్మవంచనకు, పర వంచనకు పాల్పడుతున్నాం.
ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే తప్ప నిజమైన అభిమానం కాదు.
మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గురజాడ ఊరికే అన్నాడా మరి.
అలాగే ……
తన సొంత రాష్ట్రం లో తన సొంత భాషను అధికార భాషగా చేసుకోలేక పోయినవాడు,
అరవై ఏళ్లయినా తన భాషను పక్కన పెట్టి ఇంకా పరాయి భాషలో పరిపాలన సాగించే
అసమర్దుడూ తెలుగు వాడే అన్న కఠోర వాస్తవాన్ని కూడా మరచి పోవద్దు.
తమిళ తంబి, హిందీ అన్న ఇతర భాషల వాళ్ళు తమ రాష్ట్రాల్లో చక్కగా ప్రజల భాషలో
పాలన సాగించు కుంటున్నారు.
వాళ్ళేమీ తమ భాషలను తల్లులుగా ప్రచారం చేసి విగ్రహాలు నెలకొల్పుకోక పోయినా
తమ భాషలను అద్భుతంగా పాలనా భాషలుగా తీర్చి దిద్దుకున్నారు.
మనం…
ఏదో తల్లి అంటూ ఆత్మవంచనకు, పర వంచనకు పాల్పడుతున్నాం.
ఇదంతా రాజకీయ కుట్రలో భాగమే తప్ప నిజమైన అభిమానం కాదు.
మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్ అని గురజాడ ఊరికే అన్నాడా మరి.
2, మార్చి 2011, బుధవారం
అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.---- మీ నాని
పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.పరమ మంగళకరమైనది శివ స్వరూపం.ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహా శివరాత్రి.లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు,జ్యోతి రూపంలో,లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు.
పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.
ప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.
దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.
పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శు ద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండ వది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాల భాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేని వారు శివ నామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు.త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమ యంలో శివస్మరణ, శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటకీి తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వ రుడు. ‘శివ’ శబ్దాన్ని దీర్ఘంతీస్తే ‘శివా’ ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు, సూర్యుడు, అగ్ని ఈ మూడిం టిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చే ది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిధి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిధి నెలలో రెండుసార్లు వస్తుంది.
ప్రతిమాసము ఏకాదశినాడు, శివుడు ఉపవాసాలతో వుండేవాడని, వేద పురాణాలలో చెప్పడం జరిగింది.అలాంటి ఏకాదశినాడు ప్రతి మానవుడు ఉపవాసము ఉండుటం వలన మహాశివరాత్రి రోజున కలిగేటటువంటి ఫలితాన్ని పొందు తారని, విభూతి, రుద్రాక్ష మహిమవలన మనకు సకల కోరికలు నెరవేరుతాయని పార్వతీదేశి కఠోరమైన తపస్సు ద్వారా తెలిపింది.ఆసమయంలోనే రాజమందిరంలో ిహమవంతుని కల్పిన సప్తఋషూలు పార్వతీపరమేశ్వరుల వివాహం లోక శుభకరమవుతుంద ని, వారి దాంపత్యం ముల్లోకాలకు ఆదర్శప్రాయమవుతుందని పలికి సం బంధం నిశ్చయించిన హిమవంతుని ప్రార్థన మేరకు వివాహ ముహూ ర్తాన్ని కూడా నిర్ణయించారు. ఆ సమయములో మొదటి మఘమాసంలో బహుళ చతుర్థశినాడు తొలిసారిగా లింగోద్భవం జరిగింది.
దానినే మహా శివరాత్రిగా లోకులు భావించారు.
1, మార్చి 2011, మంగళవారం
తెలుగు హీరోల్లో టాప్ రెమ్యునేషన్ ఆ హీరోకా.. . .. .
బెంగుళూరు మిర్రర్ పత్రిక రీసెంట్ గా టాలీవుడ్ హీరోల రెమ్యునేషన్స్ అంటూ ఓ లిస్ట్ ని ప్రచురించింది. ఆ లిస్ట్ లో రెమ్యునేషన్ లో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజంగా అంతంత రెమ్యునేషన్స్ ఆ హీరోలు అందుకుంటున్నారా అనేది పెద్ద చర్చనీయాంశమైంది.
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...
ఆ పత్రికలో పడిన దాని ప్రకారం రెమ్యునేషన్స్ ...
జూ.ఎన్టీఆర్ : 9 కోట్లు
రవితేజ : 7 కోట్లు
పవన్ కళ్యాణ్ :6.5 కోట్లు
మహేష్ బాబు: 6 కోట్లు
రామ్ చరణ్ :6 కోట్లు
నాగార్జున :5 కోట్లు
అల్లు అర్జున్ : 5 కోట్లు
వెంకటేష్ : 4 కోట్లు
నాగచైతన్య : 3.5 కోట్లు
రాణా : 3 కోట్లు
ఇవీ ఆ రెమ్యునేషన్స్ ..వీటిని బేస్ చేసుకుని ఇప్పటికే కొన్ని టీవీ ఛానెల్స్ వారు పోగ్రామ్ లు ప్రసారం చేసారు. ఇంతకీ ఇవి నిజమేనంటారా...
ఆకాశం దాటి వస్తావా? ఓ చందమామ
ఏనాడు కనుగున్నానో నిను
చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..
నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు
నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి
కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!
పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు
చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..
నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు
నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి
కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!
పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు
చలం కలం లోంచి రవీంద్రుని గీతాలు
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని...
నాలోని లోతైన మాటల్ని నీతో చెప్పాలని వేదన పడతాను.
నువ్వు నవ్వుతావేమోనని భయం.
అందుకని నన్ను చూసి నేనే నవ్వుకుని
నా రహస్యాన్ని పరిహాసంలో వెదచల్లేస్తాను.
నా బాధని నువ్వు తేలిక చేస్తావేమోనని నేనే తేలిక చేసుకుంటాను.
నీతో చెప్పాలనుకున్న అసలు నిజమైన మాటల్ని
నీకు చెప్పాలని వాంఛిస్తాను.
కాని వాటిని నమ్మవేమోనని వూరుకుంటాను.
అందుకనే నేను అనుకున్న దానికి విరుద్దంగా
మాట్లాడి వాటిని అనృతంలో దాస్తాను.
నా ఆవేదనని నువ్వు హేళన చేస్తావేమోనని
నేను దాన్ని అర్థం లేకుండా మారుస్తాను.
నీకోసం నాలో వున్న విలువైన మాటల్ని పలుకుదామని
ఆశ పడతాను. కాని నువు వాటికి సరైన విలువనివ్వవని
భయపడి వూరుకుంటాను. అందుకనే నీకు
కఠినమైన పేర్లు పెట్టి మార్దవం లేని
కర్కశురాలివని ప్రగల్భాలు పలుకుతాను
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని నిన్ను గాయం చేస్తాను.
నీ పక్కనే నిశ్శబ్దంగా కూచోవాలని , వాంఛిస్తాను.
కాని నా పెదవుల్లోంచి నా హృదయం బయలు పడుతుందేమోనని
అధైర్యపడతాను. నా వేదనని మొరటుగా వాడతాను.
నువ్వే అట్లా చేస్తావేమోనని వెరచి
నేను నీనించి దూరంగా పోదామనుకుంటాను.
కాని నాకాధైర్యం లేదు. నా పిరికితనం నీకు
తెలిసిపోతుందేమోనని భయం .
అందుకనే నా తలని ఠీవిగా పైకెత్తి, నిర్లక్ష్యంగా నీ సమక్షానికి వొస్తాను.
నీ కళ్ళనించి అంతులేని ఘాతాలు నా గాయాల్ని మాననీవు
నాలోని లోతైన మాటల్ని నీతో చెప్పాలని వేదన పడతాను.
నువ్వు నవ్వుతావేమోనని భయం.
అందుకని నన్ను చూసి నేనే నవ్వుకుని
నా రహస్యాన్ని పరిహాసంలో వెదచల్లేస్తాను.
నా బాధని నువ్వు తేలిక చేస్తావేమోనని నేనే తేలిక చేసుకుంటాను.
నీతో చెప్పాలనుకున్న అసలు నిజమైన మాటల్ని
నీకు చెప్పాలని వాంఛిస్తాను.
కాని వాటిని నమ్మవేమోనని వూరుకుంటాను.
అందుకనే నేను అనుకున్న దానికి విరుద్దంగా
మాట్లాడి వాటిని అనృతంలో దాస్తాను.
నా ఆవేదనని నువ్వు హేళన చేస్తావేమోనని
నేను దాన్ని అర్థం లేకుండా మారుస్తాను.
నీకోసం నాలో వున్న విలువైన మాటల్ని పలుకుదామని
ఆశ పడతాను. కాని నువు వాటికి సరైన విలువనివ్వవని
భయపడి వూరుకుంటాను. అందుకనే నీకు
కఠినమైన పేర్లు పెట్టి మార్దవం లేని
కర్కశురాలివని ప్రగల్భాలు పలుకుతాను
నీకు బాధంటే అసలు తెలీనే తెలీదేమోనని నిన్ను గాయం చేస్తాను.
నీ పక్కనే నిశ్శబ్దంగా కూచోవాలని , వాంఛిస్తాను.
కాని నా పెదవుల్లోంచి నా హృదయం బయలు పడుతుందేమోనని
అధైర్యపడతాను. నా వేదనని మొరటుగా వాడతాను.
నువ్వే అట్లా చేస్తావేమోనని వెరచి
నేను నీనించి దూరంగా పోదామనుకుంటాను.
కాని నాకాధైర్యం లేదు. నా పిరికితనం నీకు
తెలిసిపోతుందేమోనని భయం .
అందుకనే నా తలని ఠీవిగా పైకెత్తి, నిర్లక్ష్యంగా నీ సమక్షానికి వొస్తాను.
నీ కళ్ళనించి అంతులేని ఘాతాలు నా గాయాల్ని మాననీవు
ఠాగూరు గారి ఒక గీతానికి స్వేఛ్చానువాదం!
దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో
గోడ వారగా నేలపై
నిద్రతో వొరిగి వున్నాడో యువ యోగి.
ఆరిపోయిన దీపాలు ,
మూసేసిన నగరపు గేట్లు,
నక్షత్రాలన్నీ నల్లని మేఘాలతో
కప్పిన ఆ రాత్రిలో...
హఠాత్తుగా అతని హృదయం వొణికింది.
అడుగులు ఘల్లుమంటో దగ్గిరవతోన్న చప్పుడు.
కలవరంగా కళ్లు తెరిచాడతడు.
ఆమె పట్టుకున్న దీపపు కాంతిలో అతని దయాపూరితమైన కళ్లు మెరిశాయి.
ఆ యువతి నాట్యకత్తె. ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి.
దీపపు కాంతిని చిన్నగా చేసి అంది.
' మీ క్షమను కోరుతున్నాను.
యిహ లోకపు సుఖాలన్నింటినీ త్యజించిన యువకుడా!
ధూళి నిండిన యీ పానుపు వీడి అందమైన నా మహలుకు రండి'.
'జవ్వనీ నీ దార్లో వెళ్లిపో .
సమయమొచ్చినపుడు నేను రాకుండా వుండను '.
*
ఆ నగరంపై చంద్రుడు అంతులేని ఆశలను
వెన్నెల్లో గుప్పించి కురిపిస్తున్నాడు.
దారికిరువైపులా చెట్లు తలలూపుతున్నాయి.
యెక్కణ్నించో సన్నని మురళీగానం గాల్లో తేలుతో.
ఆ దేవదారు చెట్ల మీంచి యేవో విషాద పాటలు ప్రవహిస్తున్నాయి.
అందరూ వొదిలేసిన ఆ వొంటరి వీధి వెంబడి
ఆ నగరపు గేట్లను దాటాడు ఆ యువ యోగి.
ఆ నగరపు గోడ నీడలో ఓ స్త్రీ , శరీరంపై మచ్చలతో .
యువకుడు కూచుని ఆమె తలని వొడిలోకి తీసుకున్నాడు.
ఆమె అంది 'దయను కురిపించే మీరు ధన్యులు.
యింతకీ యెవరు మీరు?'
'నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను
గోడ వారగా నేలపై
నిద్రతో వొరిగి వున్నాడో యువ యోగి.
ఆరిపోయిన దీపాలు ,
మూసేసిన నగరపు గేట్లు,
నక్షత్రాలన్నీ నల్లని మేఘాలతో
కప్పిన ఆ రాత్రిలో...
హఠాత్తుగా అతని హృదయం వొణికింది.
అడుగులు ఘల్లుమంటో దగ్గిరవతోన్న చప్పుడు.
కలవరంగా కళ్లు తెరిచాడతడు.
ఆమె పట్టుకున్న దీపపు కాంతిలో అతని దయాపూరితమైన కళ్లు మెరిశాయి.
ఆ యువతి నాట్యకత్తె. ఆమె కళ్లు యవ్వనోత్సాహం నింపుకున్నాయి.
దీపపు కాంతిని చిన్నగా చేసి అంది.
' మీ క్షమను కోరుతున్నాను.
యిహ లోకపు సుఖాలన్నింటినీ త్యజించిన యువకుడా!
ధూళి నిండిన యీ పానుపు వీడి అందమైన నా మహలుకు రండి'.
'జవ్వనీ నీ దార్లో వెళ్లిపో .
సమయమొచ్చినపుడు నేను రాకుండా వుండను '.
*
ఆ నగరంపై చంద్రుడు అంతులేని ఆశలను
వెన్నెల్లో గుప్పించి కురిపిస్తున్నాడు.
దారికిరువైపులా చెట్లు తలలూపుతున్నాయి.
యెక్కణ్నించో సన్నని మురళీగానం గాల్లో తేలుతో.
ఆ దేవదారు చెట్ల మీంచి యేవో విషాద పాటలు ప్రవహిస్తున్నాయి.
అందరూ వొదిలేసిన ఆ వొంటరి వీధి వెంబడి
ఆ నగరపు గేట్లను దాటాడు ఆ యువ యోగి.
ఆ నగరపు గోడ నీడలో ఓ స్త్రీ , శరీరంపై మచ్చలతో .
యువకుడు కూచుని ఆమె తలని వొడిలోకి తీసుకున్నాడు.
ఆమె అంది 'దయను కురిపించే మీరు ధన్యులు.
యింతకీ యెవరు మీరు?'
'నీకిచ్చిన మాట ప్రకారం నేను వచ్చాను
మరణశయ్య
నా మరణశయ్య పక్కనుండి నువ్వెళుతున్నప్పుడు
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.
నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.
జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.
నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?
వో పుష్ప గుఛ్చాన్ని వుంచుతావేమోనని ఆరాటపడ్డాను.
నీ స్పర్శతో పునరుజ్జీవనడవుతాననే
ఆశతో నీ వైపు దీనంగా చూశాను.
నీ కన్నీటి స్పర్శ నన్ను అమరుణ్ణి చేస్తుందని
నీ కంటి నుండి వొక్క చుక్కైనా రాలుతుందేమోనని
నిస్తేజంగా నీ వైపు చూశాను.
జాలిలేని నీ హృదయాన్ని యింకా యింకా కోరుకోవడం
మృత్యువుని నా దగ్గిరనుంచి యింకా యింకా దూరం చేస్తోంది.
నాకు వూపిరాడకుండా వుంది యీ సగం చావుతో.
నాకింక పొద్దు పొడవని గాఢమైన నిద్ర ఎపుడు లభిస్తుంది?
నువ్వు నిశ్చబ్దమైన వేళ !
నువ్వు నిశ్చబ్దమైనపుడు నాలో నువ్వు శబ్దమవుతున్నావ్!
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.
జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో
శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.
చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.
నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.
జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో
శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.
చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.
నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !
26, ఫిబ్రవరి 2011, శనివారం
ప్రతిరోజూ ఒక మంచిమాట
మన ప్రవర్తనే మనకు మిత్రులనుగానీ, శత్రువులనుగానీ సమకూరుస్తుంది.
లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం
ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు.
లోకంలో ఎప్పుడూ ద్వేషాన్ని ద్వేషంతో ఎదుర్కోలేం. ప్రేమతో మాత్రమే ద్వేషాన్ని ఎదుర్కోగలం
ప్రతి పక్షికి కావల్సిన ఆహారాన్ని భగవంతుడు ఇస్తాడు. అంతేగాని దాని నోటికి ఆహారాన్ని అందివ్వడు.
రాంగోపాల్వర్మ చేతిలో కంప్లీట్గా క్లీన్బోల్డయిన రజనీకాంత్
రోజూ అందరినీ రకరకాల ప్రశ్నలతో కంఫ్యూజ్ చేసి కంగారుపెట్టే TV9 రజనీకాంత్ ఈరోజు రాంగోపాల్వర్మ చేతిలో కంప్లీట్గా క్లీన్బోల్డయ్యాడు. గంటసేపు జరిగిన ప్రోగ్రాంలో కనీసం ఒక్కసారి కూడా రాంగోపాల్వర్మకు సమానస్థాయిలో కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వలేకపొయ్యాడు. అనేక సందర్భాల్లో డిస్కషన్ ఎలా నడపాలో తెలియక వెర్రిమొహం వేశాడు. తనవాదనకు పనికొస్తారేమోనని ఇద్దరు మూవీ జర్నలిస్టులని పిలిస్తే వాల్లు ఇంకొంచెం కంఫ్యూషన్ క్రియేట్ చేశారు కానీ ఏవిధంగానూ రజనీకాంత్కు సహాయం కాలేకపొయ్యారు.
రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.
రాంగోపాల్వర్మ పూర్తి డిస్కషన్లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.
రోజూ అందరు పబ్లిక్ ఫిగర్లపైనా బురదచల్లి, మల్లీ వారొచ్చి తమపైన వచ్చిన వార్తలను ఖండిస్తే మరొకసారి అదికూడా చూపించి టీఆర్పీ పెంచుకోవడానికి చీప్ట్రిక్స్ ఆడే TV9 రాంగోపాల్వర్మతో ఎందుకు పెట్టుకున్నామురాబాబూ అనుకునేలా డిస్కషన్ నడిచింది. ఎలాగయినా సరే వర్మను వెధవను చేద్దామని అదే ప్రశ్నను మల్లీమల్లీ ఎపాటిలాగే అడిగిన రజనీకాంత్ ఈసారి మల్లీమల్లీ వెధవయ్యాడు.
రాంగోపాల్వర్మ పూర్తి డిస్కషన్లో ఒకే పాయింటుపైన ఉన్నాడు. తను తీసే సినిమాలు బాగులేవని విమర్శించొచు, కానీ వర్మ ప్రేక్షకులను వెధవలు అనుకుంటాడని ఆయన తరఫున వీరెలా చెబుతారనే దానికి రజనీకాంత్ దగ్గర సమాధానం లేదు. కాస్సేపు బురద జల్లుడు కార్యక్రమం, కాస్సేపు వర్మకు సలహాలిచ్చే కార్యక్రమం, కాస్సేపు ప్రేక్షకులను రక్షించబోయే కార్యక్రమం చేసి అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. ఇక ఏనాడూ సమాజానికి పనికొచ్చే ఒక్క స్పెషల్ రిపోర్టు చూపించక ఎప్పుడూ పనికిమాలిన డిబేట్లు పెట్టి ఒకరినొకరు తిట్టుకునేట్టు చెయ్యడం, లేకపోతే పబ్లిక్ఫిగర్లపై బురదజల్లడం చేసి టీఆర్పీ పెంచుకునే TV9 వర్మకు సామాజిక స్పృహ నేర్పే ప్రయత్నం చెయ్యబొయి బోర్లాపడ్డం గమ్మత్తుగా ఉంది. పనిలో పనిగా ఇందులో యండమూరి కూడా ఫూల్ అయ్యాడు.
తిరోగమన పథంలో మమత రైలు
రైల్వే బడ్జెట్ చరిత్రలో 2011 ఫిబ్రవరి 25 చిరస్థాయిగా నిలిచిపోతుంది. అయితే ఈవిధంగా నిలిచిపోవటానికి కారణం ఏదో సాధించినందువల్ల కాదు. ఏమీ సాధించలేకపోవటం వల్లనే. సాధారణంగా బడ్జెట్ అంటే గత సంవత్సరం పని తీరును పరిశీలించుకుని అసంపూర్ణంగా మిగిలిన లక్ష్యాలను, అందుకు కారణాలను మదింపు చేసుకోవటం, ఆ వెలుగులో వర్తమాన కర్తవ్యభారం స్వీకరించటం. మమతా బెనర్జీ ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో ఈ మూడింటిలో ఏదీ జరగలేదు. ఒకసారి మంత్రిగారి ఉపన్యాసం విన్న వారికి, చదివిన వారికి ఎవరికైనా ఈ బడ్జెట్ 2011-2012 సంవత్సరానికే లేక రానున్న దశాబ్ద కాలానికా, అర్థదశాబ్దానికా అన్న సందేహం కలుగుతుంది. ప్రతిపాదించిన కొత్త రైల్వే లైన్ల సర్వే మొదలు, లైను డబ్లింగ్ వరకూ, స్టేషన్ నిర్మాణాల మొదలు, సంబంధిత పరిశ్రమల నిర్మాణాల వరకూ 12వ పంచవర్ష ప్రణాళికలో చేపడతామని బడ్జెట్ ప్రసంగం చెప్తోంది. ఇంకా మనం 11వ పంచవర్ష ప్రణాళిక ముగింపు దశకు చేరుకోలేదు. ఇక 12వ ప్రణాళికా కాలంలో చేపట్టం అంటే సదరు ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కావటం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత ఆర్థిక వ్యవస్థ కంటే రైల్వేల ప్రగతి వేగవంతంగా ఉందని చెప్పిన మంత్రి దానికనుగుణంగా మిగిలిన పనులు చేపట్టకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రైల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్, కోచ్, వ్యాగన్ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్లో డీజిల్ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత? అందులో వ్యాగన్లు తరలించగలిగిన నెట్వర్క్ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.
నిపుణుల అంచనా ప్రకారం ఆర్థిక వ్యవస్థ 9 శాతం వృద్ధి రేటుతో ముందుకెళ్తుంటే రవాణా రంగం ప్రత్యేకించి రైల్వే 11 శాతం వృద్ధిరేటు సాధించాలి. అప్పుడే విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ అవసరాలను తీర్చటానికి సాధ్యమవుతుంది. దీనికి భిన్నంగా గత రెండేళ్లుగా భారత రైల్వే విస్తరణ రైల్వేబోర్డు మాజీ సభ్యుల అంచనాల మేరకు కేవలం 5 శాతానికి పడిపోయింది. రైల్వేల ఆర్థికశక్తి సామర్ధ్యాలకు, మనుగడకు ఆపరేషన్ రేషియో కీలకం. వంద రూపాయాల ఆదాయం సాధించటానికి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందో దాన్ని ఆపరేషన్ నిష్పత్తిగా నిర్ధారిస్తారు. నాలుగేళ్ల క్రితం వరకూ 76 శాతంగా ఉన్న ఈ నిష్పత్తి గత రెండు సంవత్సరాల్లో 95 శాతానికి పెరిగింది. వాస్తవిక అంచనాలు, నిధుల లభ్యత, ద్రవ్యోల్బణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ నిష్పత్తి 115చేరుతుంది. అంటే వంద రూపాయలు సంపాదించటానికి భారత రైల్వే 115 రూపాయలు ఖర్చుపెడుతోంది. దక్షిణ మధ్య రైల్వేలో వందరూపాయల సంపాదనకు 146 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే మొత్తంగా భారత రైల్వే సగటున 15 శాతం లోటులో నడుస్తోంది. బహుశా భారతరైల్వే చరిత్రలో ఇంత అథమ స్థాయిలో ఎన్నడూ లేని పరిస్థితిని నేడు రైల్వేలు చవిచూస్తున్నాయి.
మొత్తం ఆర్థిక వ్యవస్థకు ఎక్కిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం మత్తు రైల్వే శాఖకూ ఎక్కింది. ఈ విధానం కింద 52 ప్రాజెక్టులు గత సంవత్సరం ప్రారంభించారు. వీటి ప్రగతి గురించి ఒక్కమాట కూడా బడ్జెట్ ప్రసంగంలో లేదు. కేవలం ఇవన్నీ ఈ సంవత్సరం పూర్తవుతాయి, సమగ్ర పరిశీలన దశలో ఉన్నాయి అన్న మాటలు తప్ప వీటి గురించి మరిన్ని వివరాలు కనిపించవు. రైల్వేల విస్తరణకు మూల నిధి ఖాతా, అభివృద్ధి నిధి ఖాతాలు కీలకం. ఈ రెండు ఖాతాల్లో నిధులు నామమాత్రపు దశకు చేరుకోవటంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పథకాలకు కేటాయించాల్సిన మేర కూడా రైల్వే శాఖ వద్ద నిధులు లేవు. దాంతో ఈ పథకం కింద వచ్చిన ప్రతిపాదనలన్నింటినీ మూటకట్టి అటకెక్కించారు. మరో ముఖ్యమైన విషయం మిగులు నిధుల పద్దు. ఈ పద్దు నుండే తక్షణ వ్యయం సమకూర్చబడుతుంది. 2007-2008లో 25000 కోట్ల రూపాయలు ఉంటే 2010-2011 ఆర్థిక సంవత్సరానికి ఈ నిధులు 1328 కోట్లకు కుదించుకుపోయాయి. నూతన పథకాలు, ప్రాజెక్టులు చేపట్టకపోవటానికి ఇదీ మూల కారణం. ఈ విషయాన్ని దాచిఉంచటానికి రైల్వే శాఖ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. విస్తరణ విషయంలోనూ బడ్జెట్ సంతృప్తికరంగా లేదు. గత సంవత్సరం బడ్జెట్లో సంవత్సరానికి వెయ్యి కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం పూర్తిచేస్తామని లక్ష్యంగా పెట్టుకొంది. 2009లో ప్రకటించిన విజన్ 2020 పత్రం ప్రకారం 2020 నాటికి దేశంలో అదనంగా మరో 2,5000 కిలోమీటర్ల కొత్త రైలు మార్గాలు నిర్మాణం జరగాలి. అంటే మరో ఎనిమిదేళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి కావాలి. అయితే దీనికి సంబంధించి శక్తి సామర్ధ్యాలు, శ్రామికులు, నిధులు, స్థల సేకరణ, ప్రణాళికల తయారీ గురించి పల్లెత్తు మాట లేకుండానే బడ్జెట్ ప్రసంగం ముగిసింది. పైగా ఈ సంవత్సరానికి మరో 800 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం కొత్తగా చేపడతామని డాబుసరిప్రకటనకు మాత్రం బడ్జెట్లో చోటు దక్కింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద ఈపాటికేవచ్చిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోగా మరో ఏడు రంగాల్లో ఇటువంటి ప్రాజెక్టులు చేపట్టాలని బడ్జెట్ ప్రతిపాదిస్తోంది. మరో 190 రైల్వే లైన్లకు సంబంధించి సర్వే పూర్తి చేయటానికి 12వ పంచవర్ష ప్రణాళిక కాలాన్ని లక్ష్యంగా నిర్ధారించుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న భద్రాచలం కొవ్వూరు రైల్వే లైను సర్వే కూడా ఏకంగా పన్నెండవ ప్రణాళికా కాలానికి గెంటివేయబడింది. అంటే కేవలం సర్వేకే మరో ఐదేళ్లు పడితే, 2017 నాటికి పూర్తి అయ్యేట్లయితే కేవలం మిగిలిన మూడు సంవత్సరాల్లో నిర్మాణం ఎలా పూర్తవుతుందన్నది ఎవరికీ అంతుబట్టని బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది.
రైల్వేల విస్తరణకు కీలకమైన ఇంజనీరింగ్, కోచ్, వ్యాగన్ పరిశ్రమల నిర్మాణానికి ప్రభుత్వం ఎంచుకున్న కేంద్రాలు పరిశీలిస్తే రైల్వే శాఖ మానసిక స్థితి గురించి సందేహాలు రాకపోవు. జమ్ము కాశ్మీర్లో రైలు బ్రిడ్జిలు, మణిపూర్లో డీజిల్ ఇంజన్లు తయారు చేసి దేశమంతటా పంపిణీ చేస్తామన్న మంత్రి ప్రకటన వెనక భారతదేశ భౌగోళిక పరిస్థితులు, దానికున్న పరిమితులు గురించిన అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్ కొన్ని సరిహద్దు ప్రాంతాలకు రోడ్డు నిర్మాణానికి కావల్సిన యంత్ర సామాగ్రిని తరలించాలంటే కనీసం ఆర్నెల్ల వ్యవధి అవసరం. అటువంటిది జమ్ము కాశ్మీర్లో తయారు చేసిన రైలు బ్రిడ్జి సామగ్రి దేశంలో మిగిలిన ప్రాంతాలకు చేరవేయటానికి ఎంత సమయం పడుతుంది ? అసలు జమ్ము కాశ్మీర్ నుండి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మధ్య ఉన్న రైల్వే నెట్వర్క్ ఎంత? అందులో వ్యాగన్లు తరలించగలిగిన నెట్వర్క్ ఎంత అన్నది పరిశీలిస్తే ఈ ప్రతిపాదనల హేతుబద్దతను ప్రశ్నించకుండా ఉండలేము. అదేవిధంగా మణిపూర్లో నిర్మించిన డీజిలు ఇంజన్లను కనీసం ఈశాన్యభారతంలోని ఏడు రాష్ట్రాలకు చేరవేయటానికే ఏళ్ల గడువు పడుతుంది. అటువంటిది మిగిలిన దేశానికి చేరవేయటానికి ఉన్న సాధనాల గురించి కూడా పరిశీలించకుండా ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసిందీ ప్రభుత్వం. ఏతావాతా చెప్పాలంటే ఈ బడ్జెట్ అత్యంత అశ్రద్ధతో, అసమంజస ప్రతిపాదనలతో, వచ్చే సంవత్సరాల కోసం రూపొందించిన బడ్జెట్ తప్ప కనీసం రానున్న ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ కాదు అన్నది స్పష్టంగా రూఢి అవుతోంది.
బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం
"హల్లో ఆల్! టీవీ జీరో సమర్పిస్తున్న బడ్జెట్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పదండి అసెంబ్లీ కెళ్ళి అక్కడున్న మా ప్రతినిధి భిక్షపతితో మాట్లాడుదాం. హల్లో భిక్షు! అసెంబ్లీలో ఏం జరుగుతోంది!"
"హల్లో...ఆ..హల్లో...."
"ఆ...హల్లొ! భిక్షు, నేను ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి...అసెంబ్లీలో ఏం జరుగుతోంది?"
"వెంకట్! రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ వివరాలను చదివేందుకు రాబోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా కనబడే రెడ్డిగారు ఈరోజు మరింత హుందాగా ఆఫీసు గదిలోకి అడుగుపెట్టడం మేము చూసాం. చాలా సాధారణమైన దుస్తులతో వచ్చారు."
"భిక్షు! సాధారణమైన దుస్తులు అన్నారు. అవేంటో మన ప్రేక్షకులకి వివరించగలరా?"
"వెంకట్! తెలుపు కలర్ సిల్కు చొక్కా, తెలుపు కలర్ రెమాండ్స్ ప్యాంటు, రెండు మూడు బంగారు ఉంగరాలు, ఒమేగా వాచు మొదలైనవి"
"థాంక్స్ భిక్షు! మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి మేమూ మిమ్మల్ని ఫాలో అవుతాము"
**********
"వెంకట్! అసెంబ్లీలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ఆర్థిక మంత్రి ఆనం రెడ్డి గారు తమ సిల్కు రెమాండ్స్ దుస్తుల్ని వదిలేసి తెల్ల కాటన్ పంచె, ఎర్ర చొక్కా, పసుపు తలపాగాతో భుజం మీద తంబూర మోసుకొని మైకు ముందుకు వచ్చారు. ఆయనకు ఎడంవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గులాబీ కలర్ పంచె మీద నలుపు చొక్కా వేసుకొని డప్పు పట్టుకొని నిలబడ్డారు. మరో వైపు గీతారెడ్దిగారు తామర మొగ్గలున్న కాషాయం కలర్ చీరలో డప్పు పట్టుకొని నిలబడున్నారు"
"అలాగా! అసలిదంతా దేనికి జరుగుతోంది భిక్షు?"
"ఆగండి వెంకట్! ఆనంగారేదో ఆడబోతున్నారు!"
ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా"
నల్లారి & గీత: "ఆహా", "ఓహో"
ఆనం: "కనరా తింగరి తెలుగువాడా! అంకెల తీరులను!
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "ఒక్కటి పక్కన సున్నాలు పేర్చి, బడ్జెట్టు కూర్చేము"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "కూర్చిన బడ్జెట్ కూర్చుని చెబితే బోరుగ ఉండేను"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "బోరే కొడితే మీరంతా బలు గురకలు పెట్టేరు"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "అందుకోసమే చిందులు వేస్తూ, వందలు వేల లక్షలు తెచ్చి, ఎలెక్షన్లలో వాగ్దానాలకు కలెక్షన్లతో కనెక్షనిచ్చి ఈ బడ్జెట్ తెచ్చాము"
నల్లారి & గీత: "తందానా...తందానా బల్ దేవ తందనానా"
ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా...అయ్యలారా, అమ్మలారా! సోనియా మేడమ్ ఘనమైన ఆశీర్వాదాలతో, చచ్చి పరలోకములో ప్రజా సంక్షేమం చింతిస్తున్న వైయెస్సార్ ఆత్మ సాక్షిగా, మేము ప్రతిపాదిస్తున్నాము మరో లక్ష కోట్ల బడ్జెట్...ఈ బడ్జెట్ లోని అంశాలేవయ్యా అంటే... "
నల్లారి & గీత: "ఏవయ్యా!"
ఆనం: "బోధన ఫీజులు చెల్లించలేము"
నల్లారి & గీత: "లేము"
ఆనం: "చేనేత కార్మికులనాదుకోము"
నల్లారి & గీత: "కోము"
ఆనం: "బడుగు రైతుల బకాయిలన్నీ...."
నల్లారి & గీత: "అన్నీ..."
ఆనం: "మాఫీ చెయ్యలేము"
నల్లారి & గీత: "తందాన బల్ తానె తందన...తానె తందనానా"
**********
"వెంకట్! గట్టిగట్టివన్నీ గాలికి కొట్టుకుపోతే పుల్లిస్తరాకు గతేంటన్నట్టు ఆనంగారు, వారి వంతలు వంతులేసుకుని పాడుతున్నారు. ఈ "బుర్ర" క(వ్య)ధ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. మన సాటిలైటు బిల్లు పెరక్కముందే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తే మేలు. జై హింద్!"
"హల్లో...ఆ..హల్లో...."
"ఆ...హల్లొ! భిక్షు, నేను ఉల్లి వెంకట్, టీవీ జీరో స్టుడియో నుంచి...అసెంబ్లీలో ఏం జరుగుతోంది?"
"వెంకట్! రాష్ట్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి గారు రాష్ట్ర బడ్జెట్ వివరాలను చదివేందుకు రాబోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా, హుందాగా కనబడే రెడ్డిగారు ఈరోజు మరింత హుందాగా ఆఫీసు గదిలోకి అడుగుపెట్టడం మేము చూసాం. చాలా సాధారణమైన దుస్తులతో వచ్చారు."
"భిక్షు! సాధారణమైన దుస్తులు అన్నారు. అవేంటో మన ప్రేక్షకులకి వివరించగలరా?"
"వెంకట్! తెలుపు కలర్ సిల్కు చొక్కా, తెలుపు కలర్ రెమాండ్స్ ప్యాంటు, రెండు మూడు బంగారు ఉంగరాలు, ఒమేగా వాచు మొదలైనవి"
"థాంక్స్ భిక్షు! మీరు అసెంబ్లీలోకి వెళ్ళండి మేమూ మిమ్మల్ని ఫాలో అవుతాము"
**********
"వెంకట్! అసెంబ్లీలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మన ఆర్థిక మంత్రి ఆనం రెడ్డి గారు తమ సిల్కు రెమాండ్స్ దుస్తుల్ని వదిలేసి తెల్ల కాటన్ పంచె, ఎర్ర చొక్కా, పసుపు తలపాగాతో భుజం మీద తంబూర మోసుకొని మైకు ముందుకు వచ్చారు. ఆయనకు ఎడంవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు, గులాబీ కలర్ పంచె మీద నలుపు చొక్కా వేసుకొని డప్పు పట్టుకొని నిలబడ్డారు. మరో వైపు గీతారెడ్దిగారు తామర మొగ్గలున్న కాషాయం కలర్ చీరలో డప్పు పట్టుకొని నిలబడున్నారు"
"అలాగా! అసలిదంతా దేనికి జరుగుతోంది భిక్షు?"
"ఆగండి వెంకట్! ఆనంగారేదో ఆడబోతున్నారు!"
ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా"
నల్లారి & గీత: "ఆహా", "ఓహో"
ఆనం: "కనరా తింగరి తెలుగువాడా! అంకెల తీరులను!
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "ఒక్కటి పక్కన సున్నాలు పేర్చి, బడ్జెట్టు కూర్చేము"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "కూర్చిన బడ్జెట్ కూర్చుని చెబితే బోరుగ ఉండేను"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "బోరే కొడితే మీరంతా బలు గురకలు పెట్టేరు"
నల్లారి & గీత: "తందాన తానా"
ఆనం: "అందుకోసమే చిందులు వేస్తూ, వందలు వేల లక్షలు తెచ్చి, ఎలెక్షన్లలో వాగ్దానాలకు కలెక్షన్లతో కనెక్షనిచ్చి ఈ బడ్జెట్ తెచ్చాము"
నల్లారి & గీత: "తందానా...తందానా బల్ దేవ తందనానా"
ఆనం: "థా ఝంక తరికిట తరికిట థా...అయ్యలారా, అమ్మలారా! సోనియా మేడమ్ ఘనమైన ఆశీర్వాదాలతో, చచ్చి పరలోకములో ప్రజా సంక్షేమం చింతిస్తున్న వైయెస్సార్ ఆత్మ సాక్షిగా, మేము ప్రతిపాదిస్తున్నాము మరో లక్ష కోట్ల బడ్జెట్...ఈ బడ్జెట్ లోని అంశాలేవయ్యా అంటే... "
నల్లారి & గీత: "ఏవయ్యా!"
ఆనం: "బోధన ఫీజులు చెల్లించలేము"
నల్లారి & గీత: "లేము"
ఆనం: "చేనేత కార్మికులనాదుకోము"
నల్లారి & గీత: "కోము"
ఆనం: "బడుగు రైతుల బకాయిలన్నీ...."
నల్లారి & గీత: "అన్నీ..."
ఆనం: "మాఫీ చెయ్యలేము"
నల్లారి & గీత: "తందాన బల్ తానె తందన...తానె తందనానా"
**********
"వెంకట్! గట్టిగట్టివన్నీ గాలికి కొట్టుకుపోతే పుల్లిస్తరాకు గతేంటన్నట్టు ఆనంగారు, వారి వంతలు వంతులేసుకుని పాడుతున్నారు. ఈ "బుర్ర" క(వ్య)ధ ఇప్పట్లో ముగిసేట్టు లేదు. మన సాటిలైటు బిల్లు పెరక్కముందే ఈ ప్రసారాన్ని ఇంతటితో ముగిస్తే మేలు. జై హింద్!"
23, ఫిబ్రవరి 2011, బుధవారం
స్వతంత్ర భారత దేశాన్ని . . . . . . . . . .
నేత్తురోడ్చి, ఆత్మార్పణకావించుకుని ఎందరో వీరులు మనకు అందించినా ఈ స్వతంత్ర భారత దేశాన్ని ఎలాంటి నాయకులకు అందిస్తున్నాం!!
ప్రజారంజకమైన, సామాన్యులకి చేయుత నిచ్చే పధకాలు ప్రవేశపెట్టడం, వాటిని సక్రమంగా అమలు చేసేలా చూడటం.. ప్రజా సమస్యలు గురించి చ...ర్చించడం
నల్లధనాన్ని భారతదేశానికీ తిరిగి రప్పిచ్చడం, దానిని విద్య,వైద్యం, అన్ని మౌలిక అవసరాలకు, వెనకపడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగపడేలా చేయటం
ఇవి మీ నుండి అసిస్తున్నవి
ఒకరినొకరు తిట్టుకుంటూ అడ్డుగోలుగా సంపాదిస్తూ తన మీదకి కత్తి వచ్చినపుడు కుల,మత,ప్రాంతాలని అడుపెట్టుకుంటూ Divide and Rule అనుకునే నిచమైన రాజకీయవాదులు
..మసాల వార్తలే వ్యాపరమనుకునే మీడియా... అంత ప్రజలు గమనిస్తూనే వున్నారు.
గొప్ప ఉద్యమాలను స్వప్రయోజనాలకి వాడుతూ అమయుకులని బలి చేస్తూ పోతే మీకే ఘోరి కట్టగలరు
ప్రజారంజకమైన, సామాన్యులకి చేయుత నిచ్చే పధకాలు ప్రవేశపెట్టడం, వాటిని సక్రమంగా అమలు చేసేలా చూడటం.. ప్రజా సమస్యలు గురించి చ...ర్చించడం
నల్లధనాన్ని భారతదేశానికీ తిరిగి రప్పిచ్చడం, దానిని విద్య,వైద్యం, అన్ని మౌలిక అవసరాలకు, వెనకపడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగపడేలా చేయటం
ఇవి మీ నుండి అసిస్తున్నవి
ఒకరినొకరు తిట్టుకుంటూ అడ్డుగోలుగా సంపాదిస్తూ తన మీదకి కత్తి వచ్చినపుడు కుల,మత,ప్రాంతాలని అడుపెట్టుకుంటూ Divide and Rule అనుకునే నిచమైన రాజకీయవాదులు
..మసాల వార్తలే వ్యాపరమనుకునే మీడియా... అంత ప్రజలు గమనిస్తూనే వున్నారు.
గొప్ప ఉద్యమాలను స్వప్రయోజనాలకి వాడుతూ అమయుకులని బలి చేస్తూ పోతే మీకే ఘోరి కట్టగలరు
హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.
హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.
హైరరాబాద్ ఎవరిది అన్న వాదనకి చరిత్ర నుండి సాక్ష్యాలు
===============================
హైదరాబాదు కట్టి 400 ఏళ్ళు దాటింది అంటే సుమారు 1600 లలో
1600-1788 వరకూ నిజాం పాలన లో ఉన్న సర్కార్ జిల్లాల (కోస్తా ఆంధ...్ర జిల్లాలు) ప్రజలు.
1600-1800 వరకూ నిజాం పాలన లో ఉన్న దత్తమండలాల (రాయలసీమ జిల్లాలు) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న మరట్వాడ (మహారాష్ట్ర మరట్వాడా జిల్లాల) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న 4 కర్నాటక జిల్లాల ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న తెలంగాణా జిల్లాల ప్రజలు
1948-1956 వరకూ భారత హైదరాబాదు ప్రావిడెన్సు ప్రజలు
1956-2011 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
వీళ్ళ అందరి డబ్బులూ ఉన్నాయి
1800-1948 వరకూ హైదరాబాద్ సంస్థాన సైనిక సాయంకోసం సర్కారు (కోస్తా ఆంధ్ర జిల్లాలు), దత్తమండలం(రాయలసీమ జిల్లాలు) ప్రాంతాలని బ్రిటిష్ వాళ్లకి అమ్మగా వచ్చిన డబ్బులూ ఉన్నాయి. ఈ డబ్బు ను హైదరాబ్ అభివృద్దికి వాడారు. హైదరాబాద్ ప్రతి ఇటుకలో ప్రతి ఆంధ్రుడి ముత్తాతల దగ్గర నుండి ఈ తరం వరకు ఉన్న వాళ్ళ సొమ్ము ఉంది.
హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు. తెలంగాణా వాళ్ళ అబ్బ సొత్తు అసలే కాదు, హైదరాబాద్ కావాలనుకుంటే కలిసిఉండాలి లేకపోతే శుభం.
హైరరాబాద్ ఎవరిది అన్న వాదనకి చరిత్ర నుండి సాక్ష్యాలు
===============================
హైదరాబాదు కట్టి 400 ఏళ్ళు దాటింది అంటే సుమారు 1600 లలో
1600-1788 వరకూ నిజాం పాలన లో ఉన్న సర్కార్ జిల్లాల (కోస్తా ఆంధ...్ర జిల్లాలు) ప్రజలు.
1600-1800 వరకూ నిజాం పాలన లో ఉన్న దత్తమండలాల (రాయలసీమ జిల్లాలు) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న మరట్వాడ (మహారాష్ట్ర మరట్వాడా జిల్లాల) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న 4 కర్నాటక జిల్లాల ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న తెలంగాణా జిల్లాల ప్రజలు
1948-1956 వరకూ భారత హైదరాబాదు ప్రావిడెన్సు ప్రజలు
1956-2011 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
వీళ్ళ అందరి డబ్బులూ ఉన్నాయి
1800-1948 వరకూ హైదరాబాద్ సంస్థాన సైనిక సాయంకోసం సర్కారు (కోస్తా ఆంధ్ర జిల్లాలు), దత్తమండలం(రాయలసీమ జిల్లాలు) ప్రాంతాలని బ్రిటిష్ వాళ్లకి అమ్మగా వచ్చిన డబ్బులూ ఉన్నాయి. ఈ డబ్బు ను హైదరాబ్ అభివృద్దికి వాడారు. హైదరాబాద్ ప్రతి ఇటుకలో ప్రతి ఆంధ్రుడి ముత్తాతల దగ్గర నుండి ఈ తరం వరకు ఉన్న వాళ్ళ సొమ్ము ఉంది.
హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు. తెలంగాణా వాళ్ళ అబ్బ సొత్తు అసలే కాదు, హైదరాబాద్ కావాలనుకుంటే కలిసిఉండాలి లేకపోతే శుభం.
ప్రతిరోజూ ఒక మంచిమాట
నాలుక కత్తిలాంటిది, ఎలాంటి రక్తపాతం లేకుండానే ఇది మనుషులను చంపివేయగలదు.
పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.
పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.
పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.
ఓ యువకా మేలుకో, పుట్టుకతో వృద్ధుణ్ణి కానని చాటుకో
"వెళ్ళండి, దేశంలో ఎక్కడెక్కడ కరువు కాటకాలు సంభవించి దారిద్య్రం తాండవిస్తుందో, ఎక్కడైతే ప్రజలు కష్టాలు కన్నీళ్లతో బాధపడుతున్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి. వాళ్ళకు చేయి అందించండి. కష్టాలను ఉపశమింపజేయండి. వారలనాదుకునేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మరణించవచ్చు. చావు ఎప్పటికైనా తప్పదు. ప్రజలకు సేవ చేసే కర్తవ్యంలో చావడాన్ని మహదావకాశంగా స్వీకరించండి. భావితరాలకు ఆదర్శంగా నిలవండి. ఈ దేశ భవిష్యత్తు గురించిన ఆశలన్నీ యువకులైన మీపైనే ఉంచుతున్నాను" ఈ మాటలన్నదెవరో కాదు. నిరంతరం ప్రజల కోసం పరితపించిన మహా తాత్వికుడు స్వామి వివేకానందుడు.
ఈ గమనంలో యువకులదే ప్రధాన పాత్రగా ఉండాలని పూర్వపు నాయకులందరూ కాంక్షించారు. వివేకానందుడుకూడా ఒక దేశపు ఉన్నతి యువతపైనే ఆధారపడియుందని (What we want is muscles of iron and nerves of steel....& Arise, Awake and Stop not till the goal is reached....etc) బోధించాడు
ఈ గమనంలో యువకులదే ప్రధాన పాత్రగా ఉండాలని పూర్వపు నాయకులందరూ కాంక్షించారు. వివేకానందుడుకూడా ఒక దేశపు ఉన్నతి యువతపైనే ఆధారపడియుందని (What we want is muscles of iron and nerves of steel....& Arise, Awake and Stop not till the goal is reached....etc) బోధించాడు
ఆహార భద్రత అంటే చాలీ చాలని సరుకుల్ని తక్కువ రేట్లకు పంచి పేదరికాన్ని మరింత పెంచడమూ, పేదల్ని అవమానించడమా? రైతు భద్రతతో కూడిన ఉత్పాదన, నిల్వలు, పేదల కొనుగోలు శక్తీ పెంచడమా?
ఐరాస రూపొందించిన మానవాభివృద్ధి సూచికలో మన దేశం భూటాన్, లావోస్కన్నా వెనుకబడి ఉన్నది. కాని ఇదే దేశంలో ఫోర్బ్స్ పత్రిక జాబితాకెక్కిన 49 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ సంపదను ఉచితంగా అందుకున్నవారే. నిజానికి డబ్బు కొరత మన దేశానికి లేనేలేదు. ప్రస్తుత బిల్లుకు ఆహార భద్రత అని పేరు పెట్టామే కాని 'ఆహార హక్కు' అనలేదు.
"ప్రతిరంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్" అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు) అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది" అనే విషయం తెలియదనుకోవాలా?
ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా?? దాదాపు 22 దేశాలు ఆహార హక్కును అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆహార హక్కును బ్రెజిల్ రాజ్యాంగం స్పష్టంగా గుర్తించింది. గత ఏడాది ఫిబ్రవరి 3న అక్కడి ఉభయ సభలూ బిల్లును ఆమోదించాక బ్రెజిల్లో రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఇప్పుడు అక్కడ ఆహార హక్కు రాజ్యాంగపరమైన మానవ హక్కుగా ఏర్పడింది. అదే విధంగా తగినంత ఆహారాన్ని పొందే హక్కును గౌరవించి, రక్షించి, నెరవేర్చాలనే స్పష్టమైన బాధ్యతను రాజ్యానికి కల్పించే అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై కూడా బ్రెజిల్ సంతకాలు చేసి, ఆమోదించింది.
ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ దాదాపు అదేవాగుడు మరోలా వాగారు.
ద్రవ్యోల్భణ కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?
జీవించే హక్కు వాస్తవరూపం దాల్చాలంటే ఆహార హక్కు ప్రాథమికావసరమని మన రాజ్యాంగంలోని 21వ అధికరణం చెబుతోంది. అందరికీ ఆహార భద్రతను హామీ ఇచ్చేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదికను అందించే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తామని 2009లో రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో సూచించారు. పేదలకు నిర్దేశిత హక్కులతో ఆహారానికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం అనేది దేశంలో ఆహారం, పౌష్టికత భద్రతను హామీ ఇచ్చే దిశలో ఒక ముఖ్యమైన చర్యగా భావించారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం లేదా గోధుమలు కేజీ 3 రూపాయల వంతున సరఫరా చేయాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలకు నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో విఫలమైనట్లయితే ఆ కుటుంబాలు 'ఆహార భద్రతా అలవెన్స్' నగదు రూపంలో పొందే అవకాశం ఆహార భద్రతా చట్టం కల్పిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(Targeted Public Distribution System or TPDS) దారిద్య్ర రేఖ(బిపిఎల్)కు దిగువన ఉన్న జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ, అవినీతి వల్లా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో 15 నుండి 20 రూపాయల వరకూ ఉన్న బియ్యాన్ని(రెండో రకం)2రూపాయలకే అందించడంవల్ల చాలామంది పేదలకు ఉపయోగకరంగానే ఉన్నా, ఎందరో అనర్హులు (కొందరు మధ్య, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయి), కొందరు మధ్య తరగతి, పేద వర్గాలవారుకూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో 8 నుండి 10రూపాయలకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీన్ని అరికట్టడం ప్రభుత్వాలకు చేతకాదని తేలిపోయినందున అంత్యోదయ వర్గాలకుతప్ప మిగతా వర్గాలకు పీడీ్ఎస్ ను పూర్తిగా రద్దుపరచి వారికి నగదు బదిలీ పధకంలాంటివాటిద్వారా సామాజిక రక్షణ కల్పించి వారికి కావలిసిన సరకులేవో వారే (మార్కెట్ ధరలకే) కొనుక్కునేలా చేయడం తద్వారా పీడీ్ఎస్ సరకుల నాణ్యత బాగాలేనందున అవి అమ్ముకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నామనే అపవాదునుండి తప్పుకోవచ్చేమో? అయితే ఇందులోనూ అవే ఇబ్బందులు-అంటే అర్హుల గుర్తింపు, కట్టుదిట్టమైన వ్యవస్థలేకపోవడం వంటివాటివల్ల ఇదికూడా అనర్హుల జేబుల్లోకి చేరడం తద్వారా మరింతమంది సోమరుల్ని తయారు చెయ్యడం జరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. అయితే వస్తు సబ్సిడీల ద్వారా అనర్హులకూ లబ్ది చేకూర్చేబదులు బహిరంగ మార్కెట్ను ప్రోత్సహించి పేదలకు నగదు సహాయం చెయ్యడమనేది నిజమైన ప్రత్యామ్నాయమని నేను నమ్ముతాను.రైతు సేద్యానికి వాడే ట్రాక్టర్లకిచ్చే డీజిల్ సబ్సిడీ పేరుతో రోల్స్రాయిస్ కార్లలో తిరిగేవాడిక్కూడ సబ్సిడీపై డీజిల్ ఇచ్చే దుష్ట వ్యవస్థను ప్రక్షాలించి గ్రామస్థాయిలో ట్రాక్టర్లుండే రైతన్నలందరికీ నేరుగా డీజిల్ సబ్సిడీ (నగదు ౠపేణా) ఇవ్వండి. ఇదే సూత్రం గ్యాస్ సిలిండర్కూ వర్తిస్తుంది. పేదోడికోసమని సిలిండర్ ధర పెంచం. కానీ పెద్దోడు నెలకు ఒకటి వాడితే పేదోడు మూడునాలుగు నెలలకు ఒకటి వాడతాడు. 100లో ఉండే 60మంది ఉండే పేదోళ్ళు సంవత్సరానికి (60X3=180) సిలిండర్లు వాడితే పెద్దోళ్ళు (40X12X1=240) సిలిండర్లు వాడతారు. ఒక్కో సిలిండరుపై పెద్దోళ్ళకు 200 ఎక్కువ వడ్డించి పేదోడికి ఇంకో వంద తగ్గించినా (2400X200-180X100= 10000) ఇంకా 10000 ప్రభుత్వానికి లాభమే:)
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తరహాలో స్వయం ప్రతిపత్తి గల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/అనర్హులు అవకతవకలకు పాల్పడకుండా అన్ని బిపిఎల్ కుటుంబాలకూ ఆహార ధాన్యాలు కేటాయించగలుగుతాయి.
"ప్రతిరంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్" అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు) అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది" అనే విషయం తెలియదనుకోవాలా?
ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా?? దాదాపు 22 దేశాలు ఆహార హక్కును అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆహార హక్కును బ్రెజిల్ రాజ్యాంగం స్పష్టంగా గుర్తించింది. గత ఏడాది ఫిబ్రవరి 3న అక్కడి ఉభయ సభలూ బిల్లును ఆమోదించాక బ్రెజిల్లో రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఇప్పుడు అక్కడ ఆహార హక్కు రాజ్యాంగపరమైన మానవ హక్కుగా ఏర్పడింది. అదే విధంగా తగినంత ఆహారాన్ని పొందే హక్కును గౌరవించి, రక్షించి, నెరవేర్చాలనే స్పష్టమైన బాధ్యతను రాజ్యానికి కల్పించే అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై కూడా బ్రెజిల్ సంతకాలు చేసి, ఆమోదించింది.
ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ దాదాపు అదేవాగుడు మరోలా వాగారు.
ద్రవ్యోల్భణ కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?
జీవించే హక్కు వాస్తవరూపం దాల్చాలంటే ఆహార హక్కు ప్రాథమికావసరమని మన రాజ్యాంగంలోని 21వ అధికరణం చెబుతోంది. అందరికీ ఆహార భద్రతను హామీ ఇచ్చేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదికను అందించే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తామని 2009లో రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో సూచించారు. పేదలకు నిర్దేశిత హక్కులతో ఆహారానికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం అనేది దేశంలో ఆహారం, పౌష్టికత భద్రతను హామీ ఇచ్చే దిశలో ఒక ముఖ్యమైన చర్యగా భావించారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం లేదా గోధుమలు కేజీ 3 రూపాయల వంతున సరఫరా చేయాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలకు నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో విఫలమైనట్లయితే ఆ కుటుంబాలు 'ఆహార భద్రతా అలవెన్స్' నగదు రూపంలో పొందే అవకాశం ఆహార భద్రతా చట్టం కల్పిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(Targeted Public Distribution System or TPDS) దారిద్య్ర రేఖ(బిపిఎల్)కు దిగువన ఉన్న జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ, అవినీతి వల్లా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో 15 నుండి 20 రూపాయల వరకూ ఉన్న బియ్యాన్ని(రెండో రకం)2రూపాయలకే అందించడంవల్ల చాలామంది పేదలకు ఉపయోగకరంగానే ఉన్నా, ఎందరో అనర్హులు (కొందరు మధ్య, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయి), కొందరు మధ్య తరగతి, పేద వర్గాలవారుకూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో 8 నుండి 10రూపాయలకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీన్ని అరికట్టడం ప్రభుత్వాలకు చేతకాదని తేలిపోయినందున అంత్యోదయ వర్గాలకుతప్ప మిగతా వర్గాలకు పీడీ్ఎస్ ను పూర్తిగా రద్దుపరచి వారికి నగదు బదిలీ పధకంలాంటివాటిద్వారా సామాజిక రక్షణ కల్పించి వారికి కావలిసిన సరకులేవో వారే (మార్కెట్ ధరలకే) కొనుక్కునేలా చేయడం తద్వారా పీడీ్ఎస్ సరకుల నాణ్యత బాగాలేనందున అవి అమ్ముకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నామనే అపవాదునుండి తప్పుకోవచ్చేమో? అయితే ఇందులోనూ అవే ఇబ్బందులు-అంటే అర్హుల గుర్తింపు, కట్టుదిట్టమైన వ్యవస్థలేకపోవడం వంటివాటివల్ల ఇదికూడా అనర్హుల జేబుల్లోకి చేరడం తద్వారా మరింతమంది సోమరుల్ని తయారు చెయ్యడం జరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. అయితే వస్తు సబ్సిడీల ద్వారా అనర్హులకూ లబ్ది చేకూర్చేబదులు బహిరంగ మార్కెట్ను ప్రోత్సహించి పేదలకు నగదు సహాయం చెయ్యడమనేది నిజమైన ప్రత్యామ్నాయమని నేను నమ్ముతాను.రైతు సేద్యానికి వాడే ట్రాక్టర్లకిచ్చే డీజిల్ సబ్సిడీ పేరుతో రోల్స్రాయిస్ కార్లలో తిరిగేవాడిక్కూడ సబ్సిడీపై డీజిల్ ఇచ్చే దుష్ట వ్యవస్థను ప్రక్షాలించి గ్రామస్థాయిలో ట్రాక్టర్లుండే రైతన్నలందరికీ నేరుగా డీజిల్ సబ్సిడీ (నగదు ౠపేణా) ఇవ్వండి. ఇదే సూత్రం గ్యాస్ సిలిండర్కూ వర్తిస్తుంది. పేదోడికోసమని సిలిండర్ ధర పెంచం. కానీ పెద్దోడు నెలకు ఒకటి వాడితే పేదోడు మూడునాలుగు నెలలకు ఒకటి వాడతాడు. 100లో ఉండే 60మంది ఉండే పేదోళ్ళు సంవత్సరానికి (60X3=180) సిలిండర్లు వాడితే పెద్దోళ్ళు (40X12X1=240) సిలిండర్లు వాడతారు. ఒక్కో సిలిండరుపై పెద్దోళ్ళకు 200 ఎక్కువ వడ్డించి పేదోడికి ఇంకో వంద తగ్గించినా (2400X200-180X100= 10000) ఇంకా 10000 ప్రభుత్వానికి లాభమే:)
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తరహాలో స్వయం ప్రతిపత్తి గల కమిషన్ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/అనర్హులు అవకతవకలకు పాల్పడకుండా అన్ని బిపిఎల్ కుటుంబాలకూ ఆహార ధాన్యాలు కేటాయించగలుగుతాయి.
స్వతంత్రతంటే తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!
1) ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.
ప్రజధనం కొల్లగోట్టే ముఠాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.
అతివినయం చూపించే రాబంధులు,
పదవీ నియామకం కోసమేగా ఈ పకడ్బందీలు.
రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.
పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.
మార్పుకోసమే ఎదురుచూసే పిచ్చిజనాలు,
ఏనాటికి జరగదదని తెలుసుకోలేరు పచ్చినిజాలు.
2) నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,
మనుషులని చంపటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మానవత్వం,
ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
మా దేశం నేర్పిన పాఠం ఇదే, మా మనుషులు నడిచే బాట ఇదే?!
ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,
ఇదే మేము నేర్చుకున్న మానవత్వం, మా నవతకు నేర్పుతున్న మా'నవత్వం'?!
3) బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం!
మానవతను వదిలేద్దాం.....
బ్రతుకు హీనమైపోతున్నా, భవిత పాడైపోతున్నా,
ప్రజలు చచ్చిపోతున్నా,ప్రగతి పతనమవుతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!
రాష్ట్రం రగిలిపోతున్నా, బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా, ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!
సిగ్గులేక బ్రతుకేద్దాం, గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం,
మార్పు రాలేదని బాధపడదాం, ఎదుటివారి మీద నిందలేద్దాం,
మనం మాత్రం మారక్కర్లేదని సరిపెట్టుకుందాం!
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతుకీడుస్తూ బ్రతికేద్దాం,
స్వతంత్రమంటే ఏంటో తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!!
నేటి వరకే ఈ నీటిమూటలు.
ప్రజధనం కొల్లగోట్టే ముఠాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.
అతివినయం చూపించే రాబంధులు,
పదవీ నియామకం కోసమేగా ఈ పకడ్బందీలు.
రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.
పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.
మార్పుకోసమే ఎదురుచూసే పిచ్చిజనాలు,
ఏనాటికి జరగదదని తెలుసుకోలేరు పచ్చినిజాలు.
2) నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,
మనుషులని చంపటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మానవత్వం,
ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!
మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
మా దేశం నేర్పిన పాఠం ఇదే, మా మనుషులు నడిచే బాట ఇదే?!
ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,
ఇదే మేము నేర్చుకున్న మానవత్వం, మా నవతకు నేర్పుతున్న మా'నవత్వం'?!
3) బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం!
మానవతను వదిలేద్దాం.....
బ్రతుకు హీనమైపోతున్నా, భవిత పాడైపోతున్నా,
ప్రజలు చచ్చిపోతున్నా,ప్రగతి పతనమవుతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!
రాష్ట్రం రగిలిపోతున్నా, బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా, ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!
సిగ్గులేక బ్రతుకేద్దాం, గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం,
మార్పు రాలేదని బాధపడదాం, ఎదుటివారి మీద నిందలేద్దాం,
మనం మాత్రం మారక్కర్లేదని సరిపెట్టుకుందాం!
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతుకీడుస్తూ బ్రతికేద్దాం,
స్వతంత్రమంటే ఏంటో తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!!
ప్రభుత్వమునకు మంగళాశాసనము-అథర్వణవేదము- దీనికి మన నాయకులెలా భాష్యం చెబుతున్నారో చూడండి
ఓ ప్రజాపాలకా! నీవు ప్రజలచే ఎన్నుకొనబడిన సత్యమైన పాలకుడవుగా ప్రవర్తింపుము.దివ్యతేజ స్సంపన్నుడవై ప్రకాశింపుము.నీవు ప్రజల ఆపదలను తొలగించి సన్మార్గమున అభీష్టసిద్ధి నందునట్లు నడిపింపుము.నీకు ప్రజలందరు మోకరిల్లి నమస్కరింతురు.దేవతలు అదృశ్యముగ నిన్ను అనుగ్రహింతురు. న్యాయము-దయ నీకు పరమ ధర్మములు.సంపదను ప్రజాహితమునకై వినియోగింపుము.సద్వర్తనమే నీ కీర్తికి బాట. దృఢమైన దయగల పాలకుడుగ పది కాలములు జీవింపుము. అందరితో కీర్తిని పంచుకొని ఆర్జింపుము.ఆనందింపుము. అహంకారము,అధికారమదము నీ దరిచేరకుండుగాక. (అధర్వణ వేదము-3-4-2)
మరి మన నాయకుడు దీనికి తన భాష్యం ఎలా చెబుతున్నాడో చూద్దాం
నేను పేరుకే ప్రజలచే ఎన్నుకోబడ్డాను కానీ నావెనుక అండగా EVMలున్నాయి తెలుసుగా.అక్రమార్క స్సంపన్నుడనై ప్రకాశిస్తా.ప్రజలు ఒకవేళ పొరపాటున సుఖసంతోషాలతో ఉన్నా వారికి లేని ఆపదలను సృష్టించి అంటే వేర్పాటువాదాలు,మతఘర్షణలు లాంటివి కలిగించి ఇబ్బందుల పాలుజేస్తా.సన్మార్గములో నడిచే వాళ్ళను కూడా పెళ్ళికి ముందు అది తప్పుకాదు ఇది తప్పుకాదు అని న్యాయస్థానాలతో తీర్పులిప్పించి వాళ్ళను చెడిపోయేటట్లు తయారుచేస్తా.ప్రజలందరినీ భయకంపితులనుజేసి నాకు మోకరిల్లేటట్లు చేస్తా.సారావ్యాపారాలు చేస్తూ దేవాలయాల ధర్మకర్తగా దేవతలనే ఓ ఆటాడిస్తా.వాళ్ళు చచ్చినట్లు నన్ననుగ్రహించేటట్లు చేసుకుంటా. అన్యాయము-కాఠిన్యము నాకు పరమ ధర్మములు.దేశసంపదను నా కుటుంబహితమునకు మాత్రమే వినియోగిస్తా.దుర్వర్తనమే నా కీర్తికి రాజమార్గం.దృఢమైన కఠిన హృదయము గల పాలకుడుగా పది కాలాలు జీవిస్తా. సహ మంత్రులందరితో కీర్తిని పంచుకొంటా. ఆనందిస్తా.అహంకారము, అధికారమదమే ఎల్లప్పుడూ నా సుగుణాలుగా భాసిల్లునట్లు చేసుకుంటా.
మరి మన నాయకుడు దీనికి తన భాష్యం ఎలా చెబుతున్నాడో చూద్దాం
నేను పేరుకే ప్రజలచే ఎన్నుకోబడ్డాను కానీ నావెనుక అండగా EVMలున్నాయి తెలుసుగా.అక్రమార్క స్సంపన్నుడనై ప్రకాశిస్తా.ప్రజలు ఒకవేళ పొరపాటున సుఖసంతోషాలతో ఉన్నా వారికి లేని ఆపదలను సృష్టించి అంటే వేర్పాటువాదాలు,మతఘర్షణలు లాంటివి కలిగించి ఇబ్బందుల పాలుజేస్తా.సన్మార్గములో నడిచే వాళ్ళను కూడా పెళ్ళికి ముందు అది తప్పుకాదు ఇది తప్పుకాదు అని న్యాయస్థానాలతో తీర్పులిప్పించి వాళ్ళను చెడిపోయేటట్లు తయారుచేస్తా.ప్రజలందరినీ భయకంపితులనుజేసి నాకు మోకరిల్లేటట్లు చేస్తా.సారావ్యాపారాలు చేస్తూ దేవాలయాల ధర్మకర్తగా దేవతలనే ఓ ఆటాడిస్తా.వాళ్ళు చచ్చినట్లు నన్ననుగ్రహించేటట్లు చేసుకుంటా. అన్యాయము-కాఠిన్యము నాకు పరమ ధర్మములు.దేశసంపదను నా కుటుంబహితమునకు మాత్రమే వినియోగిస్తా.దుర్వర్తనమే నా కీర్తికి రాజమార్గం.దృఢమైన కఠిన హృదయము గల పాలకుడుగా పది కాలాలు జీవిస్తా. సహ మంత్రులందరితో కీర్తిని పంచుకొంటా. ఆనందిస్తా.అహంకారము, అధికారమదమే ఎల్లప్పుడూ నా సుగుణాలుగా భాసిల్లునట్లు చేసుకుంటా.
ఆంధ్రా సీమలో మనదే హవా
నాన్న బిక్ష
నా దయా దాక్షిణ్యం అని
దీక్షల మీద దీక్షలు చేసి
హైదరాబాదులో ఏడురోజుల దీక్ష సెట్టు వేసి
బ్యాక్ గ్రౌండులో
ఆంధ్రా సీమలో మనదే హవా
అనే సర్వే పాట వినిపించినా
వినిపించుకొనే నాధుడు లేదు
జనం సొమ్ము తిన్నాడనే ఫీలింగో ఏమో
అయ్యోపాపం మూడు రోజులుగా తినడం లేదు
అనే జాలి కూడా కలగడం లేదు జనాలకు
నా దయా దాక్షిణ్యం అని
దీక్షల మీద దీక్షలు చేసి
హైదరాబాదులో ఏడురోజుల దీక్ష సెట్టు వేసి
బ్యాక్ గ్రౌండులో
ఆంధ్రా సీమలో మనదే హవా
అనే సర్వే పాట వినిపించినా
వినిపించుకొనే నాధుడు లేదు
జనం సొమ్ము తిన్నాడనే ఫీలింగో ఏమో
అయ్యోపాపం మూడు రోజులుగా తినడం లేదు
అనే జాలి కూడా కలగడం లేదు జనాలకు
20, ఫిబ్రవరి 2011, ఆదివారం
ప్రతిరోజూ ఒక మంచి మాట
రాజకీయాలు అంత అప్రతిష్టపాలైన వ్యాపారం కానే కాదు. కానీ ప్రతిష్టలేని వ్యక్తులే దాన్ని అలా తయారు చేస్తారు.
ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.
మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.
ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.
మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.
త్రాగుబోతులు
త్రాగండిరా! త్రాగి తూలండిరా!తూలి తూలి ఎప్పుడో ఒకప్పుడు చావండిరా! నువ్వు చస్తే ప్రభుత్వానికేమి బాధరా?
బాధంతా నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులదీ,నీ పైన ఆధారపడ్డ నీ భార్యాబిడ్డలదే గానీ నీలాంటివాళ్ళ త్రాగుడుతో
వచ్చే ఆదాయంతో నడిపే ఈ పనికిమాలిన ప్రభుత్వానిది కాదురా!
ప్రపంచదేశాలు మన భారతీయ సంస్కృతి,సంస్కారాలు చాలా గొప్పవని భావిస్తూ మన సంస్కృతికి నమస్కరిస్తూ గౌరవిస్తుండగా మీరేమో ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ,మత్తులో మునుగుతూ మీ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఇంటిలోని వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
ప్రజలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి అందించాల్సిన ప్రభుత్వం ప్రజల కష్టార్జితంపై,వారి వ్యసనాలపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని
నడపడం ఎంత సిగ్గుచేటు,ఇలాంటి ప్రభుత్వంలో బ్రతులీడ్చడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.
ఈమధ్య త్రాగి బండి నడుపుతూ క్రిందపడి ఆస్పత్రి పాలయిన స్నేహితుని పరిస్థితి చూసి నా ఆవేదన ఇది.
నూటికి తొంభై శాతం ప్రమాదాలు త్రాగుడు వల్లే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో! సాయంత్రం ఆరయిందంటే
చాలు మందు షాపుల దగ్గర చూడాలి కోలాహలం.ఏ గుడి గోపురాల్లో కూడా ఉండరేమో అంత జనం. ఇంతకు ముందు
గుట్టుగా త్రాగేవారు ఇప్పుడంతా బహిరంగమే.త్రాగడమే ఓ గొప్ప అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.ఎప్పుడు మారునో ఈ పరిస్థితి?
బాధంతా నిన్ను నమ్ముకున్న నీ తల్లిదండ్రులదీ,నీ పైన ఆధారపడ్డ నీ భార్యాబిడ్డలదే గానీ నీలాంటివాళ్ళ త్రాగుడుతో
వచ్చే ఆదాయంతో నడిపే ఈ పనికిమాలిన ప్రభుత్వానిది కాదురా!
ప్రపంచదేశాలు మన భారతీయ సంస్కృతి,సంస్కారాలు చాలా గొప్పవని భావిస్తూ మన సంస్కృతికి నమస్కరిస్తూ గౌరవిస్తుండగా మీరేమో ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ,మత్తులో మునుగుతూ మీ ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఇంటిలోని వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు.
ప్రజలకు విద్య,ఆరోగ్యం,ఉపాధి అందించాల్సిన ప్రభుత్వం ప్రజల కష్టార్జితంపై,వారి వ్యసనాలపై వచ్చే ఆదాయంతో ప్రభుత్వాన్ని
నడపడం ఎంత సిగ్గుచేటు,ఇలాంటి ప్రభుత్వంలో బ్రతులీడ్చడం మనం చేసుకున్న దౌర్భాగ్యం.
ఈమధ్య త్రాగి బండి నడుపుతూ క్రిందపడి ఆస్పత్రి పాలయిన స్నేహితుని పరిస్థితి చూసి నా ఆవేదన ఇది.
నూటికి తొంభై శాతం ప్రమాదాలు త్రాగుడు వల్లే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదేమో! సాయంత్రం ఆరయిందంటే
చాలు మందు షాపుల దగ్గర చూడాలి కోలాహలం.ఏ గుడి గోపురాల్లో కూడా ఉండరేమో అంత జనం. ఇంతకు ముందు
గుట్టుగా త్రాగేవారు ఇప్పుడంతా బహిరంగమే.త్రాగడమే ఓ గొప్ప అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి.ఎప్పుడు మారునో ఈ పరిస్థితి?
17, ఫిబ్రవరి 2011, గురువారం
గవర్నరు గారూ, వాళ్ళ దౌర్జన్యాలు చూసారు కదా..!
గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఇవ్వాళ సభలోను, బయటా జరిగిన ఏ సంఘటన కూడా సభకు గౌరవాన్నివ్వదు. మనకు ప్రజాస్వామ్యమున్నదనే స్పృహనూ కలిగించదు.
1. సభలో గవర్నరు ప్రసంగం చేస్తూండగా నిరసనలు తెలపడం మామూలే. గవర్నరు దగ్గర్నుంచి ప్రసంగం కాగితాలు లాగేసుకోడం కూడా విన్నాం. గవర్నరు మైకును ఇలా గతంలో కూడా లాగేసుకున్నారేమో తెలవదు. అయితే గవర్నరు మాట్టాడుతూండగా వెనక్కి నక్కినక్కి వెళ్ళి ఆయన కుర్చీ లాగిపడెయ్యడం, ఆయన మీదకు దాడికి పోవడం ఎక్కడైనా చూసారా? సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా ఉండబోతోంది?
2. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అంటూ ఆవేదన చెందిన జయప్రకాశ్ నారాయణ పై చేసిన దాడి చూసారు కదా? సభ ఆవరణలోనే, ఒక శాసనసభ్యుడిపై, మరొక సభ్యుడి అనుచరుడే, ఈ దాడికి పాలబడ్డాడు! వాళ్ళ దుశ్చర్యలను నిరసిస్తే వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. బైట పరిస్థితి ఎలా ఉండబోతోంది?
3. ’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం. ఇలాంటి నాయకుల నుండి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాసనసభ్యుడికి దిక్కు లేదు.., మరి మామూలు జనం గతేంటి?
4. సంఘటనను టీవీల్లో చూసాక కూడా, చర్చల్లో పాల్గొని అడ్డగోలుగా వాదిస్తున్నారు తెరాస నాయకులు. ఒకాయన, ’అబ్బే అసలు కొట్టనే లేదు’ అంటూ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ కొట్టేవాడి వెనకే ఉన్నా డితగాడు. సరే, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా చెప్పుకోనీండి, విచారణలో నిజాలు ఎలాగూ తేలతాయి. అయితే కొందరు తెరాస నాయకులు మరీ భయంకరమైన వాదన వినిపిస్తున్నారు.. జేపీ తన ఇష్టం వచ్చినప్పుడు మాట్టాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరచాడు, అందుచేతే దాడి చేసారు అంటూ దుర్మార్గంగా మాట్టాడుతున్నారు. విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. వీళ్ళు తప్పుడు పనులు చేస్తూంటే జేపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు. దుష్టుడికి వాడి దౌష్ట్యాన్ని విమర్సిస్తే నచ్చదు, ఎదురు తిరిగి వాదిస్తాడు. కానీ తమను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే అంటూ ఈ దౌర్జన్యకారులు చెబుతున్నారు. ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం శాంతి భద్రతలను నియంత్రించడంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వపు పనితీరు చూస్తూంటే ఆ శక్తి ఈ ప్రభుత్వానికి ఉందనే నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ఆ నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాల్సి ఉందని విజ్ఞప్తి.
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
ఇవ్వాళ సభలోను, బయటా జరిగిన ఏ సంఘటన కూడా సభకు గౌరవాన్నివ్వదు. మనకు ప్రజాస్వామ్యమున్నదనే స్పృహనూ కలిగించదు.
1. సభలో గవర్నరు ప్రసంగం చేస్తూండగా నిరసనలు తెలపడం మామూలే. గవర్నరు దగ్గర్నుంచి ప్రసంగం కాగితాలు లాగేసుకోడం కూడా విన్నాం. గవర్నరు మైకును ఇలా గతంలో కూడా లాగేసుకున్నారేమో తెలవదు. అయితే గవర్నరు మాట్టాడుతూండగా వెనక్కి నక్కినక్కి వెళ్ళి ఆయన కుర్చీ లాగిపడెయ్యడం, ఆయన మీదకు దాడికి పోవడం ఎక్కడైనా చూసారా? సభలోనే, గవర్నరుకే ఇట్టా జరిగిందంటే.. ఇక బయట పరిస్థితి ఎట్టా ఉండబోతోంది?
2. ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా మనల్ని ప్రజలు ఎన్నుకున్నది? అంటూ ఆవేదన చెందిన జయప్రకాశ్ నారాయణ పై చేసిన దాడి చూసారు కదా? సభ ఆవరణలోనే, ఒక శాసనసభ్యుడిపై, మరొక సభ్యుడి అనుచరుడే, ఈ దాడికి పాలబడ్డాడు! వాళ్ళ దుశ్చర్యలను నిరసిస్తే వాళ్ళు చేసిన నిర్వాకం ఇది. బైట పరిస్థితి ఎలా ఉండబోతోంది?
3. ’కొట్టుండిరా ఆణ్ణి’ అని రెచ్చగొట్టి అనుచరుల చేత కొట్టించిన నాయకుణ్ణి, రెచ్చగొడుతూండగా టీవీల్లో చూసాం. ఇలాంటి నాయకుల నుండి ప్రజాస్వామ్యానికి రక్షణ లేదు, శాసనసభ్యుడికి దిక్కు లేదు.., మరి మామూలు జనం గతేంటి?
4. సంఘటనను టీవీల్లో చూసాక కూడా, చర్చల్లో పాల్గొని అడ్డగోలుగా వాదిస్తున్నారు తెరాస నాయకులు. ఒకాయన, ’అబ్బే అసలు కొట్టనే లేదు’ అంటూ పచ్చి అబద్ధం చెప్పాడు. ఆ కొట్టేవాడి వెనకే ఉన్నా డితగాడు. సరే, వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా చెప్పుకోనీండి, విచారణలో నిజాలు ఎలాగూ తేలతాయి. అయితే కొందరు తెరాస నాయకులు మరీ భయంకరమైన వాదన వినిపిస్తున్నారు.. జేపీ తన ఇష్టం వచ్చినప్పుడు మాట్టాడి తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను అవమానపరచాడు, అందుచేతే దాడి చేసారు అంటూ దుర్మార్గంగా మాట్టాడుతున్నారు. విషయాన్ని దారి మళ్ళిస్తున్నారు. వీళ్ళు తప్పుడు పనులు చేస్తూంటే జేపీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపించాడు. దుష్టుడికి వాడి దౌష్ట్యాన్ని విమర్సిస్తే నచ్చదు, ఎదురు తిరిగి వాదిస్తాడు. కానీ తమను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే అంటూ ఈ దౌర్జన్యకారులు చెబుతున్నారు. ప్రజల నోళ్ళు నొక్కేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మీ ప్రభుత్వం శాంతి భద్రతలను నియంత్రించడంలో కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ప్రభుత్వపు పనితీరు చూస్తూంటే ఆ శక్తి ఈ ప్రభుత్వానికి ఉందనే నమ్మకం కలగడం లేదు. ప్రజలకు ఆ నమ్మకం కలిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తక్షణమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మీరు ముఖ్యమంత్రిని ఆదేశించాల్సి ఉందని విజ్ఞప్తి.
తూలుతున్న ఉద్యమం
తాగుబోతు నాయకత్వంలో
దహనాలు చేయడం
ప్రజా ప్రతినిధులను కొట్టడం
పైసలివ్వకుండా ప్రయాణాలు చేయడం
రోజుకో ఎలక్షన్ పెట్టుకోవడం
ఇంటిల్లిపాది పాదుకలు మొయ్యడం
కిరోసిన్ ఆత్మహత్యలు
పరీక్షలు ఎగ్గోట్టడాలతో
ఉద్యమం తూలుతోంది.
దహనాలు చేయడం
ప్రజా ప్రతినిధులను కొట్టడం
పైసలివ్వకుండా ప్రయాణాలు చేయడం
రోజుకో ఎలక్షన్ పెట్టుకోవడం
ఇంటిల్లిపాది పాదుకలు మొయ్యడం
కిరోసిన్ ఆత్మహత్యలు
పరీక్షలు ఎగ్గోట్టడాలతో
ఉద్యమం తూలుతోంది.
ప్రతిరోజూ ఒక మంచిమాట
కోపం మరో వ్యక్తికి హానికలిగించేందుకు ముందే నీకు హాని కలుగజేస్తుంది.
ప్రారంభంలో ప్రతీకారం తృప్తిగా ,తియ్యగా ఉంటుంది. ముందుకెళ్ళినకొద్దీ అది ఎదురుదెబ్బ కొడుతూ, వగరెక్కి విషతుల్యమవుతుంది.
పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.
ప్రారంభంలో ప్రతీకారం తృప్తిగా ,తియ్యగా ఉంటుంది. ముందుకెళ్ళినకొద్దీ అది ఎదురుదెబ్బ కొడుతూ, వగరెక్కి విషతుల్యమవుతుంది.
పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమానామేమిటంటే వారిద్దరూ అన్యోన్యంగా ఉండడమే.
16, ఫిబ్రవరి 2011, బుధవారం
ఒక మంచిమాట
చదువుకున్నవారందరూ మానవాళి గురించి ఆలోచిస్తారు. కానీ తమ పొరుగువారిని మాత్రం వారు ద్వేషిస్తారు.
మనకి ఎవరైనా అసహనం కలిగించినప్పుడు,వెంటనే ప్రతీకారదృష్టితో ఆలోచించకుండా ఎదుటి వ్యక్తివైపు నుంచి కూడా ఆలోచించిచూస్తే,మన మనస్సులో కొత్త మార్పు రావచ్చు.మాత్రలూ,మంత్రాలూ వాడటం కాకుండా,‘నాకు అసహనం ఎందుకు కలిగింది’ అని పరిశీలించుకుని మన ఆలోచన ధోరణిని అవగాహన చేసుకోగలిగితే,అసహనం దానంతటదే అంతరించిపోతుంది
మనకి ఎవరైనా అసహనం కలిగించినప్పుడు,వెంటనే ప్రతీకారదృష్టితో ఆలోచించకుండా ఎదుటి వ్యక్తివైపు నుంచి కూడా ఆలోచించిచూస్తే,మన మనస్సులో కొత్త మార్పు రావచ్చు.మాత్రలూ,మంత్రాలూ వాడటం కాకుండా,‘నాకు అసహనం ఎందుకు కలిగింది’ అని పరిశీలించుకుని మన ఆలోచన ధోరణిని అవగాహన చేసుకోగలిగితే,అసహనం దానంతటదే అంతరించిపోతుంది
ఉషోదయం
మబ్బుతో మబ్బు పోటీపడ్డట్టు కొత్తందాలు
పొద్దులో ముద్దబంతి పూవల్లే సూరీడు చందాలు
ఎద్దుల మెడలో గంటల కూనిరాగాలు
అబ్బురపరచెడి ఎన్నో ఉదయాలు
కుంచెతో అద్దిన చేయికి వందనాలు
* * * * * * * * * * * * * * *
ఏటి మలుపులో మావ పిలుపులు
కొండ దాపున కోయిల అలుకలు
గూటి పడవలో కన్నియ కలలు
ఊరు నిదురకి పిట్టల జోలలు
ఉదయరాగాల ఉషోదయాలు
* * * * * * * * * * * * * * *
ఆత్మబంధువా, అభ్యర్థన మన్నించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
పొద్దులో ముద్దబంతి పూవల్లే సూరీడు చందాలు
ఎద్దుల మెడలో గంటల కూనిరాగాలు
అబ్బురపరచెడి ఎన్నో ఉదయాలు
కుంచెతో అద్దిన చేయికి వందనాలు
* * * * * * * * * * * * * * *
ఏటి మలుపులో మావ పిలుపులు
కొండ దాపున కోయిల అలుకలు
గూటి పడవలో కన్నియ కలలు
ఊరు నిదురకి పిట్టల జోలలు
ఉదయరాగాల ఉషోదయాలు
* * * * * * * * * * * * * * *
ఆత్మబంధువా, అభ్యర్థన మన్నించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలో లచ్మనా! ఓయ్ నేన్రెడీ!
నాటి లక్ష్మణుడు కష్టాల్లో రాముని వెంటే ఉన్నాడు
నేటి లక్ష్మణుడు భారత క్రికెట్టును ఓటమి కష్టాలనుంచి కాపాడడానికి ఎప్పుడూ నేనుంటానంటున్నాడు .మరీ ఆ లక్ష్మణుడుకి ప్రసంశలు ఎవి?
నేటి లక్ష్మణుడు భారత క్రికెట్టును ఓటమి కష్టాలనుంచి కాపాడడానికి ఎప్పుడూ నేనుంటానంటున్నాడు .మరీ ఆ లక్ష్మణుడుకి ప్రసంశలు ఎవి?
15, ఫిబ్రవరి 2011, మంగళవారం
ప్రతిరోజూ ఒక మంచిమాట
మనల్ని ఇతరులు ఎలా గౌరవించాలని వాంఛిస్తామో , అదే గౌరవం ఇతరులపట్ల చూపడాన్ని సభ్యత అంటాము
ఖర్చులకోసం వెంటవస్తున్న వారితో
తాత కష్టార్జితాన్ని
నాన్న పాదయాత్ర చేసి కడుక్కొని
కొడుక్కు కొరత రాకుండా
వెనకేసి వెళ్ళిపోయాడు
నాన్న పాదయాత్ర చేసిన కష్టార్జితం కోసం
తన కష్టార్జితాన్ని వదిలించుకోవడం
ఎలాగో తెలీక
ఖర్చులకోసం వెంటవస్తున్న వారితో
తిరునాళ్ళు జరిపిస్తూ
తిప్పలు పడుతున్నాడు
నాన్న పాదయాత్ర చేసి కడుక్కొని
కొడుక్కు కొరత రాకుండా
వెనకేసి వెళ్ళిపోయాడు
నాన్న పాదయాత్ర చేసిన కష్టార్జితం కోసం
తన కష్టార్జితాన్ని వదిలించుకోవడం
ఎలాగో తెలీక
ఖర్చులకోసం వెంటవస్తున్న వారితో
తిరునాళ్ళు జరిపిస్తూ
తిప్పలు పడుతున్నాడు
పోయినోడి చిత్త సుద్ధి
ధన యజ్ఞం అజెండా ప్రకారం
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?
పోయినోడి చిత్త సుద్ధి
ధన యజ్ఞం అజెండా ప్రకారం
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?
నేను సైతం కలలు గన్నాను
అబ్దుల్ కలాం కనమన్నట్టు
అద్భుతమైన కలలో తేలి
నేను సైతం కలలు గన్నాను
తేరగా తెరవేలుపుకు కుర్చీ వచ్చేస్తుందని
సినిమా ఠాగూర్ చెప్పినట్లు
నేను సైతం అంటూ
తెరవేలుపుతో పాటు వచ్చాను
తెగితే వెంట్రుకే కదా అని
అరంగేట్రం అయితే అద్భుతం
ఆ తరువాత ‘చేతి’ కి
వ్యతిరేకంగా పనిచేయడానికి
చేతి చమురు చాల వదిలింది
టికెట్టుకు పోతే టీత్ బయటబెట్టి నవ్వి
డబ్బులు తియ్యమంటే
అరువిప్పిచ్చుకొని
అరవిందు దగ్గర టికెట్టు తీసుకొని
అయిన వాళ్ళ దగ్గర అవమానాలు పొంది
ఓటర్ల చేతిలో అన్యాయం చెయ్యబడినా
పార్టీకి భగ్న ప్రేమికుడిగా భంగపడుతూ
భవిష్యత్ నాయకుడిగా
కలలను కొనసాగిస్తుంటే
హస్తిన రాయభారంతో
బ్రాంతి నుండి బయటపడి
బాధపడుతున్నా
అధ్యక్షులకైతే ఆ సముద్రంలో
ఏదో ఒక పదవి వస్తుంది
రెండిట్లో ఒకటోడి ఒక చోట
నాయకుడనిపించుకొన్నాడు మరి
గెలిచిన మిగితా వాళ్ళు కూడా
మిణుకు మిణుకు మనే ఆశలతో
మేము సైతం అంటూ
సముద్రంలో దూకడానికి సంసిద్దమయ్యారు
ఓడిన నేను ఇప్పుడు
ఓండ్ర పెట్టి ఒనగూర్చుకోనేది ఏముంది?
రక్త దానం చేసి చేసి మిగిలి ఉన్న
రక్తాన్ని మరగబెట్టుకోవడం ఎందుకు?
రేపటి తరం ధీరులకు రక్త వారధులు కట్టి
రిక్త హస్తాలతో నిలిచి
కుటుంబాలను కునారిల్లించుకోకండి అనే
సలహా ఇవ్వడం తప్ప చేసేదేముంది?
అద్భుతమైన కలలో తేలి
నేను సైతం కలలు గన్నాను
తేరగా తెరవేలుపుకు కుర్చీ వచ్చేస్తుందని
సినిమా ఠాగూర్ చెప్పినట్లు
నేను సైతం అంటూ
తెరవేలుపుతో పాటు వచ్చాను
తెగితే వెంట్రుకే కదా అని
అరంగేట్రం అయితే అద్భుతం
ఆ తరువాత ‘చేతి’ కి
వ్యతిరేకంగా పనిచేయడానికి
చేతి చమురు చాల వదిలింది
టికెట్టుకు పోతే టీత్ బయటబెట్టి నవ్వి
డబ్బులు తియ్యమంటే
అరువిప్పిచ్చుకొని
అరవిందు దగ్గర టికెట్టు తీసుకొని
అయిన వాళ్ళ దగ్గర అవమానాలు పొంది
ఓటర్ల చేతిలో అన్యాయం చెయ్యబడినా
పార్టీకి భగ్న ప్రేమికుడిగా భంగపడుతూ
భవిష్యత్ నాయకుడిగా
కలలను కొనసాగిస్తుంటే
హస్తిన రాయభారంతో
బ్రాంతి నుండి బయటపడి
బాధపడుతున్నా
అధ్యక్షులకైతే ఆ సముద్రంలో
ఏదో ఒక పదవి వస్తుంది
రెండిట్లో ఒకటోడి ఒక చోట
నాయకుడనిపించుకొన్నాడు మరి
గెలిచిన మిగితా వాళ్ళు కూడా
మిణుకు మిణుకు మనే ఆశలతో
మేము సైతం అంటూ
సముద్రంలో దూకడానికి సంసిద్దమయ్యారు
ఓడిన నేను ఇప్పుడు
ఓండ్ర పెట్టి ఒనగూర్చుకోనేది ఏముంది?
రక్త దానం చేసి చేసి మిగిలి ఉన్న
రక్తాన్ని మరగబెట్టుకోవడం ఎందుకు?
రేపటి తరం ధీరులకు రక్త వారధులు కట్టి
రిక్త హస్తాలతో నిలిచి
కుటుంబాలను కునారిల్లించుకోకండి అనే
సలహా ఇవ్వడం తప్ప చేసేదేముంది?
9, ఫిబ్రవరి 2011, బుధవారం
ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....
నగిషీ కొసం ప్రాకులాడే మానవుడు
అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...
కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...
గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....
జీవన నాడులైన అప్యాయతలను వదిలి....
స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....
అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...
మమకారాలను అదృష్యం చేస్తూ.....
మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!
కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....
గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!
బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...
ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....
ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....
అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...
కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...
గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....
జీవన నాడులైన అప్యాయతలను వదిలి....
స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....
అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...
మమకారాలను అదృష్యం చేస్తూ.....
మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!
కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....
గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!
బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...
ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....
ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....
నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...
నీ కనులకు కాంతి నేను....
నీ కలలను కన్నది నేను....
నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....
నీ చిరునవ్వు.... దిగులు... నేను....
నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...
నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....
నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...
నీ కన్నిటిని తుడిచేది నేను....
నువ్వు గెలిచిన విజయం నేను...
నీ అలసట తీర్చేది నేను....
నీ మెలుకువకు దీపం నేను....
నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....
నీ కలలను కన్నది నేను....
నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....
నీ చిరునవ్వు.... దిగులు... నేను....
నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...
నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....
నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...
నీ కన్నిటిని తుడిచేది నేను....
నువ్వు గెలిచిన విజయం నేను...
నీ అలసట తీర్చేది నేను....
నీ మెలుకువకు దీపం నేను....
నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....
యువత వేతుకులాట
దేనికొసం ఈ యువత వేతుకులాట...!?
అందం కొసమా....?
తగ్గుతున్న లావణ్యం కొసమా...?
కానే కాదు....
మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!
బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....
ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....
శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....
మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!
మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!
ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!
రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!
నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....
మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....
అందం కొసమా....?
తగ్గుతున్న లావణ్యం కొసమా...?
కానే కాదు....
మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!
బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....
ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....
శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....
మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!
మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!
ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!
రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!
నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....
మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....
అత్మసైర్ధ్యం
గెలుపు కొసం కదిలే నీ పాదాలకు సందేహపు అడ్డుకట్ట వేయ్యకు...
నదిలా పరుగులు తీసే నీ ఆశయపు పయనాన్ని నిరాశతొ ఆనకట్ట కట్టకు...
నీ కలల వెనుక కదిలే ఆశల ఆరాటాన్ని అలసిపొనివ్వకు....
క్షణాలలొ కుదుటపడే ఆవేశాన్ని ఆరని చితిగా మార్చకు....
కృంగదీస్తున్న కష్టాలపై కసిరగలాలి....
అడుగంటుతున్న నీ జీవితం ... వసంతంతొ చిగురించాలి....
బ్రతుకును గేలి చేస్తున్న ప్రతి అపజయం....
నీ పట్టుదల పిడికిలిలొ బందికావాలి....
విర్రవిగుతూ విరుచుకుపడే అవమానాలు...
నీ ఆత్మవిశ్వాసం ముందు విలవిలబొవాలి.....
నీ చేదు జ్ఞాపకమేదయినా అనుభవాన్నిచ్చే ఓదార్పుగా నిలవాలి....
పసితనం దాటిన నీ ప్రాయం... సమరానికి స్వాగతమవ్వాలి...
పసిడితనంతొ నిండిన నీ యువ్వనం....ప్రయత్నంలొ ఎదురైన పరాజయాలను ఆస్వాదించాలి.....
రగిలే శ్వాసే నడిచే నీ గమ్యాన్ని చేర్చే దిశగా మారాలి..
కంటిదడిలొ నీ కన్నీరు ఇంకిపొయినా...బ్రతుకు ఓడిలొ నవ్వులు విరియాలి ...
కలగనే నీ సౌదమేదయినా దైర్యాన్ని పునాదిగా కట్టాలి...
యదను తాకే గాయాలు ఏవైనా... మదిని పుసే చైత్రాలవ్వాలి...
ఎదురుచూసే కాలలు ఏన్నతైనేంటి.....విజయాన్ని ఆస్వాదించే ఆ ఒక్కరొజు కావాలి....
వెలుగుగా మారే వేకులేన్నుంటేనేం... అడియాసలను చీల్చే ఆనందం రావాలి.....
సుటిపొటి మాటలు తూపాకులైతేనేంటి...ధగా చేస్తున్న కాలపు గుండెల్లొ తూటవవ్వాలి...
గగనమే నీ తొలి కడలి....బ్రమరమే నీ మజిలి....
అలలుగా మారిన నీ ఆలొచన సంద్రాన్ని నలుదిశల విస్తరించు.....
హేలన చేసిన అపజయం ....నీ నమ్మకమనే ఆత్మసైర్ధ్యానికి బానిసవుతుంది.....
నదిలా పరుగులు తీసే నీ ఆశయపు పయనాన్ని నిరాశతొ ఆనకట్ట కట్టకు...
నీ కలల వెనుక కదిలే ఆశల ఆరాటాన్ని అలసిపొనివ్వకు....
క్షణాలలొ కుదుటపడే ఆవేశాన్ని ఆరని చితిగా మార్చకు....
కృంగదీస్తున్న కష్టాలపై కసిరగలాలి....
అడుగంటుతున్న నీ జీవితం ... వసంతంతొ చిగురించాలి....
బ్రతుకును గేలి చేస్తున్న ప్రతి అపజయం....
నీ పట్టుదల పిడికిలిలొ బందికావాలి....
విర్రవిగుతూ విరుచుకుపడే అవమానాలు...
నీ ఆత్మవిశ్వాసం ముందు విలవిలబొవాలి.....
నీ చేదు జ్ఞాపకమేదయినా అనుభవాన్నిచ్చే ఓదార్పుగా నిలవాలి....
పసితనం దాటిన నీ ప్రాయం... సమరానికి స్వాగతమవ్వాలి...
పసిడితనంతొ నిండిన నీ యువ్వనం....ప్రయత్నంలొ ఎదురైన పరాజయాలను ఆస్వాదించాలి.....
రగిలే శ్వాసే నడిచే నీ గమ్యాన్ని చేర్చే దిశగా మారాలి..
కంటిదడిలొ నీ కన్నీరు ఇంకిపొయినా...బ్రతుకు ఓడిలొ నవ్వులు విరియాలి ...
కలగనే నీ సౌదమేదయినా దైర్యాన్ని పునాదిగా కట్టాలి...
యదను తాకే గాయాలు ఏవైనా... మదిని పుసే చైత్రాలవ్వాలి...
ఎదురుచూసే కాలలు ఏన్నతైనేంటి.....విజయాన్ని ఆస్వాదించే ఆ ఒక్కరొజు కావాలి....
వెలుగుగా మారే వేకులేన్నుంటేనేం... అడియాసలను చీల్చే ఆనందం రావాలి.....
సుటిపొటి మాటలు తూపాకులైతేనేంటి...ధగా చేస్తున్న కాలపు గుండెల్లొ తూటవవ్వాలి...
గగనమే నీ తొలి కడలి....బ్రమరమే నీ మజిలి....
అలలుగా మారిన నీ ఆలొచన సంద్రాన్ని నలుదిశల విస్తరించు.....
హేలన చేసిన అపజయం ....నీ నమ్మకమనే ఆత్మసైర్ధ్యానికి బానిసవుతుంది.....
నా "నీడ"
నీ వెవరొ నాకు తెలుసు....
నా వెంట పడుతున్నావని తెలుసు...
నాకు తొడుగా వుంటావని కూడ తెలుసు....
కాని కొన్ని సమయాలలొ....అంటే....
మబ్బులు కమ్మినప్పుడు మేఘగర్జనకు భయపడి పారిపొతావు...
వర్షం పడినప్పుడు తడిసిపొతానని భయపడి దాగుంటావు....
చీకటి అలుముకున్నప్పుడు భయపడి నాలొ కలిసిపొతావు...
కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ....
నన్ను ఒంటరి వాడిని చేసినా..
నన్ను వీడి పారిపొయినా...
భయపడను.... బాధపడను....
ఎందుకొ తెలుసా....
నీవు ఎందుకు పనికిరాని నా "నీడ"వి కాబట్టి.....!
నా వెంట పడుతున్నావని తెలుసు...
నాకు తొడుగా వుంటావని కూడ తెలుసు....
కాని కొన్ని సమయాలలొ....అంటే....
మబ్బులు కమ్మినప్పుడు మేఘగర్జనకు భయపడి పారిపొతావు...
వర్షం పడినప్పుడు తడిసిపొతానని భయపడి దాగుంటావు....
చీకటి అలుముకున్నప్పుడు భయపడి నాలొ కలిసిపొతావు...
కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ....
నన్ను ఒంటరి వాడిని చేసినా..
నన్ను వీడి పారిపొయినా...
భయపడను.... బాధపడను....
ఎందుకొ తెలుసా....
నీవు ఎందుకు పనికిరాని నా "నీడ"వి కాబట్టి.....!
కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....
ఓటు నాడు నీతుల కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....
మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....
విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......
బ్రతుకు బరువై...గుండె చెరువై....
వర్షం మరుగై.....నీరు కరువై.....
భొరు...భొరున విలపిస్తూ....
భూమాతకు చిల్లులు వేసినా....
బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....
అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....
క్షేమం మరచి... క్షామం వలచి
కనికరించని వరునుడు....
ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....
భాగొగులు మారెదేప్పుడు.....
వారి తలరాతలు మార్చేదెవ్వరొ....
తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....
ఎందుకొ నాకనిపిస్తుంది.....! మరి ఎందుకొ??????
మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....
విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......
బ్రతుకు బరువై...గుండె చెరువై....
వర్షం మరుగై.....నీరు కరువై.....
భొరు...భొరున విలపిస్తూ....
భూమాతకు చిల్లులు వేసినా....
బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....
అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....
క్షేమం మరచి... క్షామం వలచి
కనికరించని వరునుడు....
ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....
భాగొగులు మారెదేప్పుడు.....
వారి తలరాతలు మార్చేదెవ్వరొ....
తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....
ఎందుకొ నాకనిపిస్తుంది.....! మరి ఎందుకొ??????
ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....
ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....రెండూ సూర్యుడు నుండే వస్తాయి...
వాసన ఇచ్చే పూలు...నేల రాలే ఆకులు... రెండూ చెట్టు నుండే వస్తాయి...
ఆహ్లదనిచ్చే చిరు జల్లులు....ప్రాణాలు తీసే తుఫాను... రెండూ మేఘాలే సృష్టిస్తాయి....
ఆకలిని తీర్చే పంటలు...కలచవేసే భూకంపాలు ... రెండూ పృధీ నుండే పుడతాయి...
ఎగిసిపడే అలలు...ముంచెత్తే సునామీలు....రెండూ సముద్రం నుంచే జ్వలిస్తాయి...
జన్మనివ్వటం...ప్రాణాలు తియ్యడం...రెండూ దేవుడి నుంచే అవతరిస్తాయి...
అందానిచ్చే పర్వాతాలు...ఆత్మహత్యల లొయలు...రెండూ కొండల నుండే జ్వనిస్తాయి...
కృంగదీసే కష్టాలు...సేదతీరే సుఖా:లు...రెండూ మానవ ఇతిహాసంలొ బాగాలవుతాయి...
తొక్కుతున్న బండ...మ్రోక్కుతున్నా శిలలు...రెండు రాయి నుండే వస్తాయి...
కంటని తడిపే ఓటమి...కన్నీటిని తుడిచే చెలిమి...రెండు జీవితానికి బొమ్మ బొరుసులవుతాయి...
తప్పటడుగుల పసితనం...తప్పుటడుగుల యువ్వనం...రెండు వయస్సు నుండే పుడతాయి....
గుండెలొ ద్వేషం...ఆదరించే అభిమానం...రెండు ప్రేమనుండే వస్తాయి...
సమతుల్యం కోసం ప్రతి దానిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి...
మంచిని ఆస్వాదించాలి...చెడుని పోరాడాలి...అప్పుడు గెలుపు నీ ఇంటిపేరవుతుంది...
వాసన ఇచ్చే పూలు...నేల రాలే ఆకులు... రెండూ చెట్టు నుండే వస్తాయి...
ఆహ్లదనిచ్చే చిరు జల్లులు....ప్రాణాలు తీసే తుఫాను... రెండూ మేఘాలే సృష్టిస్తాయి....
ఆకలిని తీర్చే పంటలు...కలచవేసే భూకంపాలు ... రెండూ పృధీ నుండే పుడతాయి...
ఎగిసిపడే అలలు...ముంచెత్తే సునామీలు....రెండూ సముద్రం నుంచే జ్వలిస్తాయి...
జన్మనివ్వటం...ప్రాణాలు తియ్యడం...రెండూ దేవుడి నుంచే అవతరిస్తాయి...
అందానిచ్చే పర్వాతాలు...ఆత్మహత్యల లొయలు...రెండూ కొండల నుండే జ్వనిస్తాయి...
కృంగదీసే కష్టాలు...సేదతీరే సుఖా:లు...రెండూ మానవ ఇతిహాసంలొ బాగాలవుతాయి...
తొక్కుతున్న బండ...మ్రోక్కుతున్నా శిలలు...రెండు రాయి నుండే వస్తాయి...
కంటని తడిపే ఓటమి...కన్నీటిని తుడిచే చెలిమి...రెండు జీవితానికి బొమ్మ బొరుసులవుతాయి...
తప్పటడుగుల పసితనం...తప్పుటడుగుల యువ్వనం...రెండు వయస్సు నుండే పుడతాయి....
గుండెలొ ద్వేషం...ఆదరించే అభిమానం...రెండు ప్రేమనుండే వస్తాయి...
సమతుల్యం కోసం ప్రతి దానిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి...
మంచిని ఆస్వాదించాలి...చెడుని పోరాడాలి...అప్పుడు గెలుపు నీ ఇంటిపేరవుతుంది...
అనాధ పిల్లలు వేదన
రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో
అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!
ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే
మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!
మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో
ఒక చుక్క విలువను నాపై కార్చండి!
మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో
మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు
ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !
రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని
తుడిచే పిలగాడినీ నేనే....!
మీ ఎంగిలి ప్లేట్లను కడిగి
మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!
లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య
తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.
ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల
లోకాన ఉమ్మివేయబడ్డాను......
నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?
నాకెవరిమీద అసూయ లేదండీ.....!
మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు
ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!
నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో
రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని
ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....
నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....
ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....
అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!
ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే
మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!
మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో
ఒక చుక్క విలువను నాపై కార్చండి!
మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో
మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు
ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !
రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని
తుడిచే పిలగాడినీ నేనే....!
మీ ఎంగిలి ప్లేట్లను కడిగి
మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!
లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య
తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.
ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల
లోకాన ఉమ్మివేయబడ్డాను......
నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?
నాకెవరిమీద అసూయ లేదండీ.....!
మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు
ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!
నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో
రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని
ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....
నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....
ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....
రేపటి నా పయనం
నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....
గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......
నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....
కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....
గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....
గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....
రేపటి నా పయనం ఎటువైపని....
వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే
నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....
చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే
అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...
పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....
గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....
స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే
సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...
ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...
మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....
ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....
కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....
ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....
వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి.....
గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......
నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....
కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....
గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....
గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....
రేపటి నా పయనం ఎటువైపని....
వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే
నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....
చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే
అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...
పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....
గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....
స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే
సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...
ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...
మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....
ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....
కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....
ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....
వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి.....
మీ చేతిలో బాంబ్
మొబైల్ఫోన్ లేకపోతే ఏమవుతుంది..? ఒక్కసారి ఆలోచించండి.. అమ్మో ప్రపంచం ఆగిపోతుంది అంటారా..? కావచ్చు.. సెల్ చేతిలో లేకపోతే ఒక్కక్షణం కూడా మనకు తోచదు. రోజులో ఒక్కకాల్ అయినా రాకపోతే.. మనసు విలవిలలాడిపోతుంది. ఆదిలాబాద్లో ఉన్నవాడిని.. అనకాపల్లిలో ఉన్నవాడిని.. అమెరికాలో ఉన్నవాడినీ ఒక్క క్షణంలో కలిపేశక్తి మొబైల్ సొంతం. కానీ.. అదే సెల్ఫోన్.. ఇప్పుడు మన పాలిట పిశాచిలా మారింది. మన ప్రాణాన్ని బలితీసుకోబోతోంది.
మన చేతిలో... మన జేబులో.. మన ఇంట్లో.. చివరకు మన జీవితంలో.. ప్రతీ చోటా బాంబ్... ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలో 70 కోట్లమంది మృత్యువును చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు.. మీ చేతిలో బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు.. ఎవరి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు.. ఎలాగైనా పోవచ్చు.. ఆ బాంబే.. సెల్ఫోన్. మన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నమహమ్మారి. మన ప్రాణాన్ని కబలించడానికి సెల్ చురుగ్గా పావులు కదుపుతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్ను కలిగిస్తోంది సెల్ఫోన్. సాధారణ వ్యక్తులతో పోల్చితే.. సెల్ వాడుతున్నవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 400 శాతం ఎక్కువట. దీన్ని బట్టి.. మీ చేతిలో ఉన్న సెల్ఫోన్ ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి..
ఈ విషయాన్ని ఏదో అల్లాటప్పా సర్వే తేల్చింది కాదు.. పిచ్చిసర్వే చెప్పింది అంతకన్నా కాదు.. మన కేంద్ర ప్రభుత్వం తేల్చిన విషయం. సెల్ఫోన్ రేడియేషన్ ఎఫెక్ట్పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయడానికి, ఎనిమిదిమంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మెంబర్ సెక్రటరీ, డీఓటీ నుంచి సభ్యులను ఈ కమిటీలో నియమించింది. సెల్ఫోన్ వినియోగంపై విస్తృతంగా పరిశోధించిన ఈ కమిటీ.. సెల్ఫోన్ రేడియేషన్కు సంబంధించి భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. అందులో కీలకమైన విషయమే.. బ్రెయిన్ క్యాన్సర్ ఎఫెక్ట్. అందుకే.. సెల్ఫోన్ రేడియేషన్పై ఇంత ఆందోళన. బ్రెయిన్ క్యాన్సర్ను 400 శాతం పెంచుతుందంటే.. సెల్ఫోన్ తెచ్చిపెట్టే ముప్పును ఊహించవచ్చు.
క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా అంతే. ఎర్లీస్టేజ్లో గుర్తించకపోతే.. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మెదడులో కణుతులు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సెల్ వాడకం ఎక్కువైతే.. బ్రెయిన్లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే.. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఎన్నో పరిశోధనలు కూడా చెప్పాయి. ఇది వాస్తవమా.. కాదా అన్నది తేల్చడానికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 400 శాతం ఎక్కువని తేలడంతో.. సెల్ వినియోగంపై అంతా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెల్లే కదా అని ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మాత్రం.. మీ లైఫ్కు గ్యారెంటీ ఉండదు. సెల్ వినియోగదారులూ... తస్మాత్ జాగ్రత్త.
ఎన్నో సమస్యలు
రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా...? ఎంత ట్రై చేసినా కళ్లు మూతపడడం లేదా..? మనిషి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉదయమంతా అలసిపోయిన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కొత్త శక్తిని సంపాదించుకొనేది నిద్రపోయే సమయంలోనే. కానీ.. ఎంతో అవసరమైన ఈ నిద్రే ఇప్పుడు చాలామందికి సమస్య. నిద్రలేమితో రాత్రుళ్లు నెట్టుకొస్తున్నవాళ్లు ఎంతోమంది. అర్థరాత్రి దాటినా వారికి కునుకుపట్టదు.. ఫలితం.. పగలు పూర్తిస్థాయిలో పనిచేయలేరు. అంతా చికాకుగా ఉంటుంది.
దీనికి కారణం.. సెల్ఫోన్ వాడకం. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో నూటికి డెబ్బై శాతం మంది సెల్బాధితులే. మొబైల్లో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయేవారినే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. బెడ్ ఎక్కిన తర్వాత సెల్ను వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారికేసరిగ్గా నిద్రపట్టడం లేదని కేంద్రం నియమించిన కమిటీ తన రిపోర్ట్లో పేర్కొంది..
సెల్ఎక్కువగా వాడితే వచ్చే మరో సమస్య తలనొప్పి. మొబైల్ను విపరీతంగా వాడేవారిలో తరచూ కనిపించే సమస్య ఇది. సెల్ఫోన్ కారణంగా తలలో జరిగే మార్పులే దీనికి కారణం. మొబైల్ ఫోన్ను చెవికి అతికించేసుకుని మాట్లాడేవారూ మనమధ్య తరచూ కనిపిస్తుంటారు. వారికి సెల్లే లోకం. అలాంటి వారిని చెవి సమస్యలు చుట్టుముడతాయి. చెవిలో ఏవో శబ్దాలు మారుమోగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వినికిడిశక్తి తగ్గిపోతుంది. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలం సెల్ఫోన్ వాడుతున్నవారిలో చెవి సంబంధ వ్యాధులు ఎక్కువగా బయటపడుతున్నట్లు ఎన్నో పరిశోధనల్లో తేలింది.
సెల్తో మాటలు కలుస్తున్నాయేమో గానీ, మనశ్సాంతి మాత్రం కరువవుతోంది. సెల్వాడకంతో ఒత్తిడి పెరుగుతుంది. సెల్ఫోన్ రేడియేషన్పై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలిస్తే.. ఏకాగ్రత తగ్గిపోవడం, విసుగు, అరుగుదల లోపించడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం, శరీరంపై ట్యూమర్లు రావడం, మగతగా ఉండడం.. మతిమరుపు పెరగడం లాంటి ఎన్నో సమస్యలు సెల్కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే.. మీరు చేయాల్సిందల్లా.. వేలాదిరూపాయలు పోసి ట్రీట్మెట్ తీసుకోవడం కాదు... సింపుల్గా సెల్ను పక్కన పెట్టేయడం.
మగాళ్లకూ ముప్పే
సెల్ఫోన్తో మగాళ్లకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు. సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల సంఖ్య ఈ సెల్ఫోన్ వల్ల తగ్గిపోతున్నాయన్నది జెఎన్యూ పరిశోధకులు తేల్చిన విషయం.
మగ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని జెఎన్యూ స్కాలర్స్ కనిపెట్టారు. సెల్ఫోన్ వెలువరిచే రేడియేషన్కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్లోని డీఎన్ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని జెఎన్యూ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, సెల్ వినియోగించేవిషయంలో మగాళ్లు చాలా జాగ్ర్తత్తగా ఉండాలంటున్నారు. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకూడదంటున్నారు..
పిల్లలకు ఫోనొద్దు
మహిళలకూ సెల్తో ప్రమాదమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరీ ప్రమాదం. గర్భం దాల్చిన తర్వాత ఫోన్ను ఎక్కువగా వాడితే.. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కొన్ని అవయవాలు సరిగా ఎదకపోవచ్చు. ఇక చిన్నపిల్లలను మొబైల్ఫోన్కు వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే వయస్సులో మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా పడుతుంది.
మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు.. సెల్ టవర్లు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని నిమిషాలు గంటలు మాత్రమే వినియోగించే ఫోన్ వల్లే ఇన్ని సమస్యలున్నప్పుడు.. 24గంటలూ రేడియేషన్ను వెలువరిచే సెల్టవర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. టవర్కు సమీపంలో ఉండేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని ఎన్నో రిపోర్ట్స్లో బయటపడింది. ఈ ప్రాంతాల్లో ఉండేవారికి చర్మసంబంధ వ్యాధులూ ఎక్కువగా వస్తాయి. ఏవైనా వ్యాధులు వస్తే.. అవి తగ్గడమూ చాలా ఆలస్యమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. సెల్ద్వారా.. సెల్ టవర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సిందే.
శరీరం ఛిద్రం
అమెరికా నుంచి ఫోన్ చేసినా.. అరక్షణంలోనే మనకు ఫోన్ వచ్సేస్తుంది. మనం మాట్లాడేది వెంటనే అవతలివైపు చేరిపోతుంది. ఇంత వేగంగా ఎలా వెళ్లగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం.. సెల్ సిగ్నల్స్ వెళ్లే వేగమే.. సెకనుకు లక్షమైళ్ల వేగంతో ఈ సిగ్నల్ పాస్ అవుతుంటాయి. ఇదే రేడియేషన్. గామారేస్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఆల్ఫా ఆర్టికల్స్ లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిసి... దూసుకుపోతుంటాయి. మన శరీరాల్లోనుంచి కూడా ఇవి చొచ్చుకుపోతాయి. అంతవేగంతో ఇవి ప్రయాణిస్తూ.. మన శరీరంలోని కణాలను అవి ఢీకొడితే.. ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి... అందుకే శరీరంలో కణజాలం దెబ్బతింటుంది.
మనం ఉపయోగించే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరమూ రేడియేషన్ను విడుదల చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, రేడియో, సెల్ఫోన్, టెలివిజన్ ఇలా ప్రతీదీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేయవడం వల్లే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఈ రేడియేషన్ పాస్ అవుతుంది.
సెల్ఫోన్ను వాడుతున్నప్పుడు కూడా... ఈ రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మొబైల్ను మనం చెవికి ఆనించి ఉంచుతాం కాబట్టి.. ఆ రేడియేషన్ ఎఫెక్ట్.. మన తలపై ఎక్కువగా పడుతుంది. దాని కారణంగా మెదడులో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. సున్నితమైన మెదడు.. ఈ రేడియేషన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
రేడియేషన్ కారణంగా మన శరీరంలోని రక్త కణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై పరిశోధన జరిగింది.రేడియేషన్ లేనప్పుడు.. రక్తకణాలు విడివిడిగా ఉంటాయి. అదే లో రేడియేషన్కు గురిచేసినప్పుడు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొన్ని విడిగా ఉన్నాయి. అదే కంప్యూటర్ ముందు గంటకు పైగా గడిపినప్పుడు ఈ రక్తకణాలు మరికాస్త దగ్గరకు జరిగాయి. అదే పది నిమిషాల పాటే సెల్పోన్లో మాట్లాడితే ఆ రక్తకణాలు కుచించుకుపోయాయి. ఈ తరహా రక్తకణాల అమరిక.. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లలోనే కనిపిస్తుంటుంది. అందుకే.. సెల్ వాడుతున్నవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త!
మీ సెల్ మీకు హెల్ చూపించకూడదనుకుంటే.. మొదటి అడుగు నుంచే జాగ్రత్త పడాలి. సెల్ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొబైల్.. రేడియేషన్ ఎంత విడుదల చేస్తుందన్నవిషయాన్ని ప్రతీ కంపెనీ తప్పనిసరిగా మ్యాన్యువల్లో పేర్కొనాలి. దీన్నే స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేట్.. SAR అంటారు. మన దేశంలో దీని మాగ్జిమమ్ లిమిట్ 2 వాట్ పర్ కేజీ. ఓ రకంగా ఇది కూడా ప్రమాదకరమైన స్థాయే. SAR వాల్యూ 2 వాట్ ఉంటే హైరేడియేషన్ను ఆ ఫోన్ వెలువరుస్తుందని అర్థం. అందుకే... అంతకన్నా తక్కువగా ఉన్న ఫోన్లలో కొనుగోలు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ SAR విలువపై కీలకమైన సలహాను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 వాట్ను.. 1.6 వాట్కు తగ్గించాలని సూచించింది. ఇక రేడియేషన్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న చోట నుంచి మొబైల్ టవర్లను తొలగించడంతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయకూడదని సూచించింది. సెల్ వినియోగం పెరగడంపైనా ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సెల్ వాడుతున్నవారు.. అత్యవసరానికి మాత్రమే ఫోన్ను వాడాలే తప్ప.. అనవసరంగా వాడితే ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షల సెల్టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు. అందుకే.. టవర్ల సంఖ్య పెరగుతూనే ఉంది. పైగా కొత్త కంపెనీలు రావడంతో ఈ టవర్లు విచ్చలవిడిగా జనం మధ్య కొలువుతీరవచ్చు. అంటే ఓ రకంగా మరింత రేడియేషన్ మనపై దాడిచేయబోతుందన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని కంపెనీలు ఒకేటవర్ను వాడుకునేలా నిబంధనలు మార్చాలి. అప్పుడు రేడియేషన్ ప్రభావం కాస్త తగ్గొచ్చు. అంతే తప్ప.. జనం మధ్య టవర్లే లేకుండా చేస్తే.. సెల్ మూగబోతుంది. జనానికి పిచ్చెక్కుతుంది.
మొబైల్ వాడే వారూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఫోన్ను చెవికి ఆనించడం కన్నా, ఇయర్ ఫోన్స్ వాడడం మేలు. కాల్ చేసేటప్పుడు శరీరానికి కనీసం ఒక ఇంచ్ దూరంలో ఫోన్ను పెట్టడం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోదు. ఒకవేళ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. చెవి వేడెక్కితే వెంటనే కాల్ను ఎండ్ చేయాలి. వీలైనంతవరకూ తక్కువ మాట్లాడడం వల్ల రేడియేషన్కు గురికాకుండా ఉండొచ్చు.
మన చేతిలో... మన జేబులో.. మన ఇంట్లో.. చివరకు మన జీవితంలో.. ప్రతీ చోటా బాంబ్... ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలో 70 కోట్లమంది మృత్యువును చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు.. మీ చేతిలో బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు.. ఎవరి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు.. ఎలాగైనా పోవచ్చు.. ఆ బాంబే.. సెల్ఫోన్. మన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నమహమ్మారి. మన ప్రాణాన్ని కబలించడానికి సెల్ చురుగ్గా పావులు కదుపుతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్ను కలిగిస్తోంది సెల్ఫోన్. సాధారణ వ్యక్తులతో పోల్చితే.. సెల్ వాడుతున్నవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 400 శాతం ఎక్కువట. దీన్ని బట్టి.. మీ చేతిలో ఉన్న సెల్ఫోన్ ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి..
ఈ విషయాన్ని ఏదో అల్లాటప్పా సర్వే తేల్చింది కాదు.. పిచ్చిసర్వే చెప్పింది అంతకన్నా కాదు.. మన కేంద్ర ప్రభుత్వం తేల్చిన విషయం. సెల్ఫోన్ రేడియేషన్ ఎఫెక్ట్పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయడానికి, ఎనిమిదిమంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మెంబర్ సెక్రటరీ, డీఓటీ నుంచి సభ్యులను ఈ కమిటీలో నియమించింది. సెల్ఫోన్ వినియోగంపై విస్తృతంగా పరిశోధించిన ఈ కమిటీ.. సెల్ఫోన్ రేడియేషన్కు సంబంధించి భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. అందులో కీలకమైన విషయమే.. బ్రెయిన్ క్యాన్సర్ ఎఫెక్ట్. అందుకే.. సెల్ఫోన్ రేడియేషన్పై ఇంత ఆందోళన. బ్రెయిన్ క్యాన్సర్ను 400 శాతం పెంచుతుందంటే.. సెల్ఫోన్ తెచ్చిపెట్టే ముప్పును ఊహించవచ్చు.
క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా అంతే. ఎర్లీస్టేజ్లో గుర్తించకపోతే.. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మెదడులో కణుతులు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సెల్ వాడకం ఎక్కువైతే.. బ్రెయిన్లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే.. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఎన్నో పరిశోధనలు కూడా చెప్పాయి. ఇది వాస్తవమా.. కాదా అన్నది తేల్చడానికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 400 శాతం ఎక్కువని తేలడంతో.. సెల్ వినియోగంపై అంతా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెల్లే కదా అని ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మాత్రం.. మీ లైఫ్కు గ్యారెంటీ ఉండదు. సెల్ వినియోగదారులూ... తస్మాత్ జాగ్రత్త.
ఎన్నో సమస్యలు
రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా...? ఎంత ట్రై చేసినా కళ్లు మూతపడడం లేదా..? మనిషి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉదయమంతా అలసిపోయిన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కొత్త శక్తిని సంపాదించుకొనేది నిద్రపోయే సమయంలోనే. కానీ.. ఎంతో అవసరమైన ఈ నిద్రే ఇప్పుడు చాలామందికి సమస్య. నిద్రలేమితో రాత్రుళ్లు నెట్టుకొస్తున్నవాళ్లు ఎంతోమంది. అర్థరాత్రి దాటినా వారికి కునుకుపట్టదు.. ఫలితం.. పగలు పూర్తిస్థాయిలో పనిచేయలేరు. అంతా చికాకుగా ఉంటుంది.
దీనికి కారణం.. సెల్ఫోన్ వాడకం. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో నూటికి డెబ్బై శాతం మంది సెల్బాధితులే. మొబైల్లో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయేవారినే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. బెడ్ ఎక్కిన తర్వాత సెల్ను వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారికేసరిగ్గా నిద్రపట్టడం లేదని కేంద్రం నియమించిన కమిటీ తన రిపోర్ట్లో పేర్కొంది..
సెల్ఎక్కువగా వాడితే వచ్చే మరో సమస్య తలనొప్పి. మొబైల్ను విపరీతంగా వాడేవారిలో తరచూ కనిపించే సమస్య ఇది. సెల్ఫోన్ కారణంగా తలలో జరిగే మార్పులే దీనికి కారణం. మొబైల్ ఫోన్ను చెవికి అతికించేసుకుని మాట్లాడేవారూ మనమధ్య తరచూ కనిపిస్తుంటారు. వారికి సెల్లే లోకం. అలాంటి వారిని చెవి సమస్యలు చుట్టుముడతాయి. చెవిలో ఏవో శబ్దాలు మారుమోగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వినికిడిశక్తి తగ్గిపోతుంది. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలం సెల్ఫోన్ వాడుతున్నవారిలో చెవి సంబంధ వ్యాధులు ఎక్కువగా బయటపడుతున్నట్లు ఎన్నో పరిశోధనల్లో తేలింది.
సెల్తో మాటలు కలుస్తున్నాయేమో గానీ, మనశ్సాంతి మాత్రం కరువవుతోంది. సెల్వాడకంతో ఒత్తిడి పెరుగుతుంది. సెల్ఫోన్ రేడియేషన్పై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను పరిశీలిస్తే.. ఏకాగ్రత తగ్గిపోవడం, విసుగు, అరుగుదల లోపించడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం, శరీరంపై ట్యూమర్లు రావడం, మగతగా ఉండడం.. మతిమరుపు పెరగడం లాంటి ఎన్నో సమస్యలు సెల్కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే.. మీరు చేయాల్సిందల్లా.. వేలాదిరూపాయలు పోసి ట్రీట్మెట్ తీసుకోవడం కాదు... సింపుల్గా సెల్ను పక్కన పెట్టేయడం.
మగాళ్లకూ ముప్పే
సెల్ఫోన్తో మగాళ్లకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు. సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల సంఖ్య ఈ సెల్ఫోన్ వల్ల తగ్గిపోతున్నాయన్నది జెఎన్యూ పరిశోధకులు తేల్చిన విషయం.
మగ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని జెఎన్యూ స్కాలర్స్ కనిపెట్టారు. సెల్ఫోన్ వెలువరిచే రేడియేషన్కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్లోని డీఎన్ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని జెఎన్యూ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, సెల్ వినియోగించేవిషయంలో మగాళ్లు చాలా జాగ్ర్తత్తగా ఉండాలంటున్నారు. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకూడదంటున్నారు..
పిల్లలకు ఫోనొద్దు
మహిళలకూ సెల్తో ప్రమాదమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరీ ప్రమాదం. గర్భం దాల్చిన తర్వాత ఫోన్ను ఎక్కువగా వాడితే.. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కొన్ని అవయవాలు సరిగా ఎదకపోవచ్చు. ఇక చిన్నపిల్లలను మొబైల్ఫోన్కు వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే వయస్సులో మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా పడుతుంది.
మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు.. సెల్ టవర్లు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని నిమిషాలు గంటలు మాత్రమే వినియోగించే ఫోన్ వల్లే ఇన్ని సమస్యలున్నప్పుడు.. 24గంటలూ రేడియేషన్ను వెలువరిచే సెల్టవర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. టవర్కు సమీపంలో ఉండేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని ఎన్నో రిపోర్ట్స్లో బయటపడింది. ఈ ప్రాంతాల్లో ఉండేవారికి చర్మసంబంధ వ్యాధులూ ఎక్కువగా వస్తాయి. ఏవైనా వ్యాధులు వస్తే.. అవి తగ్గడమూ చాలా ఆలస్యమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. సెల్ద్వారా.. సెల్ టవర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సిందే.
శరీరం ఛిద్రం
అమెరికా నుంచి ఫోన్ చేసినా.. అరక్షణంలోనే మనకు ఫోన్ వచ్సేస్తుంది. మనం మాట్లాడేది వెంటనే అవతలివైపు చేరిపోతుంది. ఇంత వేగంగా ఎలా వెళ్లగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం.. సెల్ సిగ్నల్స్ వెళ్లే వేగమే.. సెకనుకు లక్షమైళ్ల వేగంతో ఈ సిగ్నల్ పాస్ అవుతుంటాయి. ఇదే రేడియేషన్. గామారేస్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఆల్ఫా ఆర్టికల్స్ లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిసి... దూసుకుపోతుంటాయి. మన శరీరాల్లోనుంచి కూడా ఇవి చొచ్చుకుపోతాయి. అంతవేగంతో ఇవి ప్రయాణిస్తూ.. మన శరీరంలోని కణాలను అవి ఢీకొడితే.. ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి... అందుకే శరీరంలో కణజాలం దెబ్బతింటుంది.
మనం ఉపయోగించే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరమూ రేడియేషన్ను విడుదల చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్, రేడియో, సెల్ఫోన్, టెలివిజన్ ఇలా ప్రతీదీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ను విడుదల చేయవడం వల్లే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఈ రేడియేషన్ పాస్ అవుతుంది.
సెల్ఫోన్ను వాడుతున్నప్పుడు కూడా... ఈ రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మొబైల్ను మనం చెవికి ఆనించి ఉంచుతాం కాబట్టి.. ఆ రేడియేషన్ ఎఫెక్ట్.. మన తలపై ఎక్కువగా పడుతుంది. దాని కారణంగా మెదడులో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. సున్నితమైన మెదడు.. ఈ రేడియేషన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
రేడియేషన్ కారణంగా మన శరీరంలోని రక్త కణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై పరిశోధన జరిగింది.రేడియేషన్ లేనప్పుడు.. రక్తకణాలు విడివిడిగా ఉంటాయి. అదే లో రేడియేషన్కు గురిచేసినప్పుడు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొన్ని విడిగా ఉన్నాయి. అదే కంప్యూటర్ ముందు గంటకు పైగా గడిపినప్పుడు ఈ రక్తకణాలు మరికాస్త దగ్గరకు జరిగాయి. అదే పది నిమిషాల పాటే సెల్పోన్లో మాట్లాడితే ఆ రక్తకణాలు కుచించుకుపోయాయి. ఈ తరహా రక్తకణాల అమరిక.. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లలోనే కనిపిస్తుంటుంది. అందుకే.. సెల్ వాడుతున్నవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.
తస్మాత్ జాగ్రత్త!
మీ సెల్ మీకు హెల్ చూపించకూడదనుకుంటే.. మొదటి అడుగు నుంచే జాగ్రత్త పడాలి. సెల్ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొబైల్.. రేడియేషన్ ఎంత విడుదల చేస్తుందన్నవిషయాన్ని ప్రతీ కంపెనీ తప్పనిసరిగా మ్యాన్యువల్లో పేర్కొనాలి. దీన్నే స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేట్.. SAR అంటారు. మన దేశంలో దీని మాగ్జిమమ్ లిమిట్ 2 వాట్ పర్ కేజీ. ఓ రకంగా ఇది కూడా ప్రమాదకరమైన స్థాయే. SAR వాల్యూ 2 వాట్ ఉంటే హైరేడియేషన్ను ఆ ఫోన్ వెలువరుస్తుందని అర్థం. అందుకే... అంతకన్నా తక్కువగా ఉన్న ఫోన్లలో కొనుగోలు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ SAR విలువపై కీలకమైన సలహాను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 వాట్ను.. 1.6 వాట్కు తగ్గించాలని సూచించింది. ఇక రేడియేషన్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న చోట నుంచి మొబైల్ టవర్లను తొలగించడంతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయకూడదని సూచించింది. సెల్ వినియోగం పెరగడంపైనా ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సెల్ వాడుతున్నవారు.. అత్యవసరానికి మాత్రమే ఫోన్ను వాడాలే తప్ప.. అనవసరంగా వాడితే ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షల సెల్టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు. అందుకే.. టవర్ల సంఖ్య పెరగుతూనే ఉంది. పైగా కొత్త కంపెనీలు రావడంతో ఈ టవర్లు విచ్చలవిడిగా జనం మధ్య కొలువుతీరవచ్చు. అంటే ఓ రకంగా మరింత రేడియేషన్ మనపై దాడిచేయబోతుందన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని కంపెనీలు ఒకేటవర్ను వాడుకునేలా నిబంధనలు మార్చాలి. అప్పుడు రేడియేషన్ ప్రభావం కాస్త తగ్గొచ్చు. అంతే తప్ప.. జనం మధ్య టవర్లే లేకుండా చేస్తే.. సెల్ మూగబోతుంది. జనానికి పిచ్చెక్కుతుంది.
మొబైల్ వాడే వారూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఫోన్ను చెవికి ఆనించడం కన్నా, ఇయర్ ఫోన్స్ వాడడం మేలు. కాల్ చేసేటప్పుడు శరీరానికి కనీసం ఒక ఇంచ్ దూరంలో ఫోన్ను పెట్టడం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోదు. ఒకవేళ ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. చెవి వేడెక్కితే వెంటనే కాల్ను ఎండ్ చేయాలి. వీలైనంతవరకూ తక్కువ మాట్లాడడం వల్ల రేడియేషన్కు గురికాకుండా ఉండొచ్చు.
వెర్రి పరుగు
దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు
అదొక మానసిక స్థితి
సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.
కొత్తగా పునర్నిర్మాణం అంటున్నాడు
అమాత్య పదవి రాలేదని
వేర్పాటు వాద సిద్దాంతం తో పుట్టిన పార్టీని
కూడా జాతీయ స్థాయి పార్టీ
కాదు కాదు అవినీతిలో అంతర్జాతీయ స్థాయి కి
కృషి చేస్తున్న పార్టీలోకి
కలుపు కొంటామని
ఆ పార్టీ వాళ్ళు చెబుతుంటే
వేర్పాటు నాయకుడు ఖండిస్తూ
రాష్ట్రాన్ని చీల్చడమే కాదు
రెండో ముక్క
పునర్నిర్మాణం లో కూడా
భాగం పంచుకొంటామని చెబుతున్నాడు
అంటే పునర్నిర్మాణం జరిగేలా
పునాదులతో కూడా
ఆంద్ర రాష్ట్ర తిరోగమనం
జరిగే వరకు గమ్మున ఉండే
ప్రసక్తే లేదని ప్రస్పుటం చేస్తున్నాడు.
వేర్పాటు వాద సిద్దాంతం తో పుట్టిన పార్టీని
కూడా జాతీయ స్థాయి పార్టీ
కాదు కాదు అవినీతిలో అంతర్జాతీయ స్థాయి కి
కృషి చేస్తున్న పార్టీలోకి
కలుపు కొంటామని
ఆ పార్టీ వాళ్ళు చెబుతుంటే
వేర్పాటు నాయకుడు ఖండిస్తూ
రాష్ట్రాన్ని చీల్చడమే కాదు
రెండో ముక్క
పునర్నిర్మాణం లో కూడా
భాగం పంచుకొంటామని చెబుతున్నాడు
అంటే పునర్నిర్మాణం జరిగేలా
పునాదులతో కూడా
ఆంద్ర రాష్ట్ర తిరోగమనం
జరిగే వరకు గమ్మున ఉండే
ప్రసక్తే లేదని ప్రస్పుటం చేస్తున్నాడు.
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని పాపులర్ డైలాగు
రెండున్నర ఏళ్ల రీళ్ళను
వెనక్కు తిప్పితే
వెంకన్న సాక్షిగా
ఆయన పాదాల చెంత
సామాజిక న్యాయం
ప్రజా రాజ్యం తో సాధ్యం అని పొలికేక పెట్టే డైలాగుతో
షాట్ మొదలయ్యింది
అందరూ అంచనా వేసినట్టే
హీరో అవినీతి సామ్రాట్టులకు మళ్ళీ
అధికారం అందించడంలో
విజేతగా నిలిచే సన్నివేశాలు చిత్రీకరించి
ఇక జెండా పీకేద్దాం అని గుస గుసలు పోయినప్పుడు
గుస్సా అయి అంతెత్తున లేచి
జనం గుండెల్లో నుండి తీసేసేదెవరు అని
తీక్షణంగా ప్రశ్నించే సన్నివేశాన్ని బాగా పండించి
మరో షాట్ లో
నేనే పోయినా
పార్టీ ఉంటుందని ఉద్ఘాటించే సన్నివేశంలో
ఉద్విగ్నత ను చూపి
నూట ఏభయ్యో సినిమా కథ కోసం
వెతుకుతున్నానంటూ
అభిమానులకు ఎన్నో ఆశలు కల్పించే
మరో సన్నివేశంతో
కథలో కీలక మలుపు తిప్పి
రెండున్నర ఏళ్ల రీళ్లకు
హస్తినలో దహన సంస్కారాలు చేసే సన్నివేశంతో
షాటు మొదలెట్టి
దానికి దర్శకురాలిగా
విదేశీ పరిజ్ఞానంతో
స్వదేశీలో రెచ్చిపోతున్న
సోనియా గాంధీని ఎన్నుకొని
కొత్త సినిమాను మొదలెట్టాడు
ఆంటోనీ కథా చర్చలు గావిస్తే
పటేల్ రాసిన మాటలతో
మొయిలీ క్లాప్ తో
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని
పాపులర్ డైలాగు ‘సామాజిక న్యాయాన్ని సాధించడానికి’ అంటూ
హీరో కొత్తగా చెప్పడాన్ని
డీ ఎస్ కిరణ్ కేరింతల మధ్య
దర్శకురాలి దగ్గర చాన్స్ రాని
మరో హీరో ఫ్యాన్సు కుత కుతల మధ్య
అద్బుతంగా ప్రారంభమయ్యింది
వెనక్కు తిప్పితే
వెంకన్న సాక్షిగా
ఆయన పాదాల చెంత
సామాజిక న్యాయం
ప్రజా రాజ్యం తో సాధ్యం అని పొలికేక పెట్టే డైలాగుతో
షాట్ మొదలయ్యింది
అందరూ అంచనా వేసినట్టే
హీరో అవినీతి సామ్రాట్టులకు మళ్ళీ
అధికారం అందించడంలో
విజేతగా నిలిచే సన్నివేశాలు చిత్రీకరించి
ఇక జెండా పీకేద్దాం అని గుస గుసలు పోయినప్పుడు
గుస్సా అయి అంతెత్తున లేచి
జనం గుండెల్లో నుండి తీసేసేదెవరు అని
తీక్షణంగా ప్రశ్నించే సన్నివేశాన్ని బాగా పండించి
మరో షాట్ లో
నేనే పోయినా
పార్టీ ఉంటుందని ఉద్ఘాటించే సన్నివేశంలో
ఉద్విగ్నత ను చూపి
నూట ఏభయ్యో సినిమా కథ కోసం
వెతుకుతున్నానంటూ
అభిమానులకు ఎన్నో ఆశలు కల్పించే
మరో సన్నివేశంతో
కథలో కీలక మలుపు తిప్పి
రెండున్నర ఏళ్ల రీళ్లకు
హస్తినలో దహన సంస్కారాలు చేసే సన్నివేశంతో
షాటు మొదలెట్టి
దానికి దర్శకురాలిగా
విదేశీ పరిజ్ఞానంతో
స్వదేశీలో రెచ్చిపోతున్న
సోనియా గాంధీని ఎన్నుకొని
కొత్త సినిమాను మొదలెట్టాడు
ఆంటోనీ కథా చర్చలు గావిస్తే
పటేల్ రాసిన మాటలతో
మొయిలీ క్లాప్ తో
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని
పాపులర్ డైలాగు ‘సామాజిక న్యాయాన్ని సాధించడానికి’ అంటూ
హీరో కొత్తగా చెప్పడాన్ని
డీ ఎస్ కిరణ్ కేరింతల మధ్య
దర్శకురాలి దగ్గర చాన్స్ రాని
మరో హీరో ఫ్యాన్సు కుత కుతల మధ్య
అద్బుతంగా ప్రారంభమయ్యింది
వెర్రి బాగుల వాడు
వెనకటికి మా ఊరిలో ఒక సామెత ఉండేది. ఎందుకూ పనికి రాని ఒక వెర్రి బాగుల వాడిని, ఒరేయ్ నీకు పొలం ఎంత ఉందిరా అని అడిగితే, రాజు గారిదీ నాదీ కలిపి నూటఒక్క ఎకరాలు అని చెప్పుకొనేవాడంట. ఇంతకీ అందులో నీది ఎంతరా అని గుచ్చి అడిగితే మాత్రం సిగ్గు పడుతూ ఒక ఎకరం నాది, వంద ఎకరాలు రాజు గరివీ అని ఒప్పుకొనేవాడంట.
కొత్త గా సోనియమ్మ జపం చేస్తున్న మన వెర్రి బాగుల వాడు కూడా, ఇప్పుడు నావీ కాంగ్రెస్ వీ కలిపి నూటా డబ్బయ్యి స్థానాలు అని చెప్పుకొంటున్నాడూ. కలిపి సరే, నీవి సొంతం గా ఎన్ని అని ఎవరన్నా పొరుగు రాష్ట్రం వారు అడిగితే మాత్రం వెకిలి గా నవ్వుతూ పద్దెనిమిదిలో రెండు పోగా పదహారు అని చెప్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషులు పుడతారని ముందే ఊహించి కాబోలు మన పెద్దలు అలాంటి సామెతలు సృష్టించారు.
తిరుపతి లో హోటెల్ గదిని ఏదో దొంగల స్తావారాన్ని వెతికినట్టు వెతికించినది ఈ కాంగ్రెస్ వారే అన్నది గుర్తుందో లేదో ఈ కొత్త బిచ్చగానికి.
కొత్త గా సోనియమ్మ జపం చేస్తున్న మన వెర్రి బాగుల వాడు కూడా, ఇప్పుడు నావీ కాంగ్రెస్ వీ కలిపి నూటా డబ్బయ్యి స్థానాలు అని చెప్పుకొంటున్నాడూ. కలిపి సరే, నీవి సొంతం గా ఎన్ని అని ఎవరన్నా పొరుగు రాష్ట్రం వారు అడిగితే మాత్రం వెకిలి గా నవ్వుతూ పద్దెనిమిదిలో రెండు పోగా పదహారు అని చెప్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషులు పుడతారని ముందే ఊహించి కాబోలు మన పెద్దలు అలాంటి సామెతలు సృష్టించారు.
తిరుపతి లో హోటెల్ గదిని ఏదో దొంగల స్తావారాన్ని వెతికినట్టు వెతికించినది ఈ కాంగ్రెస్ వారే అన్నది గుర్తుందో లేదో ఈ కొత్త బిచ్చగానికి.
5, ఫిబ్రవరి 2011, శనివారం
ఆశ
ఇష్టంతో కష్టపడి, కష్టాన్నే ఇష్టపడి
కష్టపడి ఇష్టపడి, ఆశయానికి కట్టుబడి కన్నీటిని బంధించి
భాధల్ని గర్జించి,రేపటి ఉదయం కొసం వేచిచూడు....
నేడు ఎవ్వరిదైనా , రేపు మనది...
కష్టపడి ఇష్టపడి, ఆశయానికి కట్టుబడి కన్నీటిని బంధించి
భాధల్ని గర్జించి,రేపటి ఉదయం కొసం వేచిచూడు....
నేడు ఎవ్వరిదైనా , రేపు మనది...
నిరీక్షణ
ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది...
ఆవేశం ఏనాడు కలిగెనో, ఆనాడే తెలిసిందది.....
ఏ మేఘం ఏ వాన చినుకై....
చిగురాకై మొలకెత్తెనో.....
ఏ రాగం ఏ గుండె లోతున, ఏ గీతం పలికించునో...
ఆనాడైనా నా నిరీక్షణ ఫలించునా????
ఆవేశం ఏనాడు కలిగెనో, ఆనాడే తెలిసిందది.....
ఏ మేఘం ఏ వాన చినుకై....
చిగురాకై మొలకెత్తెనో.....
ఏ రాగం ఏ గుండె లోతున, ఏ గీతం పలికించునో...
ఆనాడైనా నా నిరీక్షణ ఫలించునా????
నమ్మకం
నమ్మకం
చీకటి లో ఉన్నానని చింత పడకు
దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమినే ఓడించి గెలిచే మర్గాన్ని వెతుకు
నమ్మకం నీ చేతిలో ఒక ఆయుథం
ఆ నమ్మకం తో ముందుకు వెళ్ళు
విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది
చీకటి లో ఉన్నానని చింత పడకు
దానిని చీల్చుకొని వచ్చే వెలుగు కోసం ఎదురుచూడు
ఓటమి పొందానని కలత చెందకు
ఓటమినే ఓడించి గెలిచే మర్గాన్ని వెతుకు
నమ్మకం నీ చేతిలో ఒక ఆయుథం
ఆ నమ్మకం తో ముందుకు వెళ్ళు
విజయం అన్ని వేళలా నీ చెంతనే ఉంటుంది
నా బాల్యమా
చిన్న నాటి ఊసులలో ఎంత హయి ఉంది.....అది
తల్చుకున్న కొద్దీ బాధ రగులుతుంది
కరుణలేని కాలప్రభువు ఇంద్రజాలమిది
అదితెలియని హ్రుదయాల ఆవేదన ఇది...
ఓ చిలిపినవ్వు ప్రాయమా ఏమైపోయావు????
నా బాల్యమా....నీవేమైపోయావు॥
తల్చుకున్న కొద్దీ బాధ రగులుతుంది
కరుణలేని కాలప్రభువు ఇంద్రజాలమిది
అదితెలియని హ్రుదయాల ఆవేదన ఇది...
ఓ చిలిపినవ్వు ప్రాయమా ఏమైపోయావు????
నా బాల్యమా....నీవేమైపోయావు॥
రాయబారం!!.....
ఆకాశం అందుకోవాలని సాగర కెరటాల ఆరాటం...
దిగంతాల్లో కలుస్తానంటూ ఓక వాగ్దానం
చందమామ సాక్ష్యంగా మిగిలింది
వెన్నెల వెలుగు దారాలతో రాయబారం......
దిగంతాల్లో కలుస్తానంటూ ఓక వాగ్దానం
చందమామ సాక్ష్యంగా మిగిలింది
వెన్నెల వెలుగు దారాలతో రాయబారం......
నేనూ సైనికుడినే
విజ్గ్నానం వేటలో
సౌకర్యాల దాహంలో
ధనసముపార్జనా సమ్మొహనంలో
దూరతీరాలను చేరి
ఉభయసంధ్యల మధ్య
పరుగుపందెంగా మారి
సరిహద్దు గస్తీ సైనికుడి నిరంతర కవాతులా
విరామమెరుగని జీవితం అలసిన క్షణాన
భవిష్యత్తు ప్రణాళికకై నేను ఒక సైనికుడిలా శ్రమిస్తున్నాను.....
సౌకర్యాల దాహంలో
ధనసముపార్జనా సమ్మొహనంలో
దూరతీరాలను చేరి
ఉభయసంధ్యల మధ్య
పరుగుపందెంగా మారి
సరిహద్దు గస్తీ సైనికుడి నిరంతర కవాతులా
విరామమెరుగని జీవితం అలసిన క్షణాన
భవిష్యత్తు ప్రణాళికకై నేను ఒక సైనికుడిలా శ్రమిస్తున్నాను.....
దృశ్యం మారదేం????
రోజూ చేస్తున్న అదే పని...
అవే ఉదయాలు , అవే సాయంత్రాలు
అవే హృదయాలు , అవే అనుభూతులు
రోజులు గడుస్తున్నాయ్ , ఋతువులు మారుతున్నయ్
కానీ దృశ్యం మారదేం?????
ప్రతి రోజూ ఉరుకులు పరుగులు
వెక్కిరిస్తూ ట్రాఫిక్ జాం.... లు
చావడానికి బ్రతుకుతున్న మనుషులు
బ్రతకడానికి చస్తున్న మనుషులు
క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయ్.....
పాత సంవత్సరాలు పొతున్నయ్....
కానీ దృశ్యం మారదేం????
దృశ్యాన్నిమారుస్తుందని "క్రొత్త"ని అహ్వానిస్తే
మరుక్షణం లో "పాతై" పోయి , నన్ను వెక్కిరిస్తోంది!!!!
వెక్కిరింతలోనైనా నాకు అవగతమౌతుందా???
దృశ్యం ఎప్పటికీ మారదని.....
మార్చాల్సింది నా దృష్టిని అని !!!!!!
అవే ఉదయాలు , అవే సాయంత్రాలు
అవే హృదయాలు , అవే అనుభూతులు
రోజులు గడుస్తున్నాయ్ , ఋతువులు మారుతున్నయ్
కానీ దృశ్యం మారదేం?????
ప్రతి రోజూ ఉరుకులు పరుగులు
వెక్కిరిస్తూ ట్రాఫిక్ జాం.... లు
చావడానికి బ్రతుకుతున్న మనుషులు
బ్రతకడానికి చస్తున్న మనుషులు
క్రొత్త సంవత్సరాలు వస్తున్నాయ్.....
పాత సంవత్సరాలు పొతున్నయ్....
కానీ దృశ్యం మారదేం????
దృశ్యాన్నిమారుస్తుందని "క్రొత్త"ని అహ్వానిస్తే
మరుక్షణం లో "పాతై" పోయి , నన్ను వెక్కిరిస్తోంది!!!!
వెక్కిరింతలోనైనా నాకు అవగతమౌతుందా???
దృశ్యం ఎప్పటికీ మారదని.....
మార్చాల్సింది నా దృష్టిని అని !!!!!!
అలసిపోతున్నాను.....
కాల భూతం యంత్ర దంతాలలో చిక్కిన
అనుభూతుల అవశేషాలను పోల్చుకోలేక!
కాల వర్తన పద ఘట్టనలో చిట్లిన
అందమైన అవకాశాలను అందుకోలేక!!
నిద్రలేని సాంత్వనలో ఛిద్రమైన స్వప్నాలను
అతికించి తిలకించి పులకించి అలిసాను...........
వర్తమానం పైన బెంగ లేదు,ఆశ అనేది ఉంటేగా!!!!
గతం వల్ల బాధ లేదు,గుర్తుండాలిగా ముందు!!!
భయమంతా భవిష్యత్తు గురించే? ఎదురవుతుందా అసలు అని?!!!!
మరింకా చేసేదేముంది,వర్తమానం గతం అవుతుందని
భవిష్యత్తు ఇప్పుడే వస్తుందని, వేచి ఉండడం తప్ప????????
అనుభూతుల అవశేషాలను పోల్చుకోలేక!
కాల వర్తన పద ఘట్టనలో చిట్లిన
అందమైన అవకాశాలను అందుకోలేక!!
నిద్రలేని సాంత్వనలో ఛిద్రమైన స్వప్నాలను
అతికించి తిలకించి పులకించి అలిసాను...........
వర్తమానం పైన బెంగ లేదు,ఆశ అనేది ఉంటేగా!!!!
గతం వల్ల బాధ లేదు,గుర్తుండాలిగా ముందు!!!
భయమంతా భవిష్యత్తు గురించే? ఎదురవుతుందా అసలు అని?!!!!
మరింకా చేసేదేముంది,వర్తమానం గతం అవుతుందని
భవిష్యత్తు ఇప్పుడే వస్తుందని, వేచి ఉండడం తప్ప????????
అనుభవాల ఆలాపన
జీవితం ఒక అనుభవాల మూట
ఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటే
గుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…॥
మూట ముడి విప్పావంటే…
ఆనుభవాలు సాంతం నిన్ను చుట్టుముట్టేస్తాయి...
ఎప్పటికప్పుడు దాన్ని కట్టిపడేస్తూ ఉంటే
గుట్టు చప్పుడు కాకుండా ఊంటుంది…॥
మూట ముడి విప్పావంటే…
ఆనుభవాలు సాంతం నిన్ను చుట్టుముట్టేస్తాయి...
నాన్నా..
నాన్నా అను పదమే.. నాదసుధారసమై
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం
చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..
తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని
తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..
హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై
సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా..
నడిపించును జీవితం
నవరస భరితం… నవరస భరితం
చిటివ్రేలు పట్టి లోకచిత్రాలే చూపించు
తప్పటడుగులే దిద్ది సత్పధాల నడిపించు
జిలిబిలి ఆటలలోనే జీవితాశయాలు నింపి
ఇంతింతై ఎదుగువేళ..ఎంతెంతో మురిసిపోవు.. నాన్నా ..
తనయుడె తన జీవమని.. తనకే సర్వస్వమని
కనులముందు తన రూపే.. కదలాడుట భాగ్యమని
తలమునకలు వేయునంత
తనకొకింత దూరమైన
తల్లడిల్లి తపియించే
తండ్రికి వేరెవరు సాటి .. నాన్నా ..
హితమై జీవితమై
మహిత మార్గదర్శకమై
ఉపదేశామృతమై
ఉజ్వల భవితవ్యమై
సఖుడై గురుడై జనకుడె
స్వాచార్యదేవుడై
సతము సుతుని నీడయై
చల్లని దీవెనలనిచ్చు.. నాన్నా..
పోలవరం పోరాటానికి రెండో నాయకుడు
పోలవరం పై పోరాటం అని
మీడియా ముందు
గతంలో ఓ సునామీ నాయకుడు శివాలెత్తి పోయాడు
జనం లోకి వెళ్లి చైతన్యం తేలేక చతికిల బడి
రాష్ట్రంలో ప్రభుత్వానికి
పోగాలం వస్తుంది అని అనిపించినపుడు
కేంద్రం నుండి పోలేరమ్మ పిలిస్తే
పొంగిపోతూ వెళ్లి
అధికార భాగస్వామ్యం కోసం బాసలు చేసుకొని
దానికి పోలవరం పై చర్చలు చేయడానికి వెళ్లానని ప్రతిసారీ చెబుతూ
ఆ సమస్య పై ఆ సునామీ వీరుడు వేలాడుతూ ఉండగానే
పోగేసిన జనం డబ్బుల మూటల పై
ముప్పిరిగొంటున్న సమస్యలతో సతమవుతూ
అరెస్టు ఎప్పుడు జరుగుతుందో అని అదిరిపడుతూ
మడమ తిప్పలేక ముందుకు వెళ్ళలేక
ముచ్చటగా మూడు దీక్షలు చేసి
నాన్న ఆరేళ్ళ జమానాలో అంటుకోని సమస్యను
ఈ రెండో నాయకుడు తోడుతున్నాడు
పీఠం కోసం అలిగిన ఈ పెంకి నాయకుడు
ఈ సమస్య ఎత్తుకొంటే సమస్యే మరుగున పడడం ఖాయం
మీడియా ముందు
గతంలో ఓ సునామీ నాయకుడు శివాలెత్తి పోయాడు
జనం లోకి వెళ్లి చైతన్యం తేలేక చతికిల బడి
రాష్ట్రంలో ప్రభుత్వానికి
పోగాలం వస్తుంది అని అనిపించినపుడు
కేంద్రం నుండి పోలేరమ్మ పిలిస్తే
పొంగిపోతూ వెళ్లి
అధికార భాగస్వామ్యం కోసం బాసలు చేసుకొని
దానికి పోలవరం పై చర్చలు చేయడానికి వెళ్లానని ప్రతిసారీ చెబుతూ
ఆ సమస్య పై ఆ సునామీ వీరుడు వేలాడుతూ ఉండగానే
పోగేసిన జనం డబ్బుల మూటల పై
ముప్పిరిగొంటున్న సమస్యలతో సతమవుతూ
అరెస్టు ఎప్పుడు జరుగుతుందో అని అదిరిపడుతూ
మడమ తిప్పలేక ముందుకు వెళ్ళలేక
ముచ్చటగా మూడు దీక్షలు చేసి
నాన్న ఆరేళ్ళ జమానాలో అంటుకోని సమస్యను
ఈ రెండో నాయకుడు తోడుతున్నాడు
పీఠం కోసం అలిగిన ఈ పెంకి నాయకుడు
ఈ సమస్య ఎత్తుకొంటే సమస్యే మరుగున పడడం ఖాయం
బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే
ఓ సారి టికెట్టు నిరాకరించి
మరో సారి టికెట్టు ఇచ్చి ఎం పీ చేసిన పార్టీని
వారసత్వ కుర్చీ ఇవ్వలేదని
లక్ష్యం నెరవేరలేదని
దీక్షల మీద దీక్షలు కక్షతో చేస్తూ
కాంగ్రెస్స్ ను హస్తిన కే వెళ్లి కడిగేస్తూ
నా దయా దాక్షణ్యం మీ ప్రభుత్వం అనే
పుల్ల విరుపు మాటలకు విరుగుడుగా
ప్రత్యమ్నాయం అంటూ వచ్చిన
ప్రజారాజ్యం తో మంత్రాంగం నెరిపితే
ఆపద్బాంధవుడు మా నాయకుడే అని
రాజ్యం ప్రతినిధిలు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ
కాంగ్రెస్స్ కు రాష్ట్రంలో ఇమేజి ఉన్న నాయకుని కొరతను
మా నాయకుని ప్రత్యామ్నాయం పూడుస్తుందని
పూనకం వచ్చినట్లు ఊగిపోతూ పొంగిపోతున్నారు
125 ఏళ్ల చరిత్ర కల కాంగ్రెస్స్ కౌగిలి
కొత్త బిక్షగాళ్ళకు ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసినట్టు లేదు
అంతెందుకు ఈయన ఇమేజ్ ఏంటో
ఎంతో అనుభవం ఉన్న ఆ పార్టీ అంచనావేయదా
కుటుంబ ఇమేజి తప్ప ఎవడి ఇమేజ్ ను భరించని పార్టీ అది
ప్రస్తుతానికి పావుగా వాడుకోబడుతుంటే
బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే.
మరో సారి టికెట్టు ఇచ్చి ఎం పీ చేసిన పార్టీని
వారసత్వ కుర్చీ ఇవ్వలేదని
లక్ష్యం నెరవేరలేదని
దీక్షల మీద దీక్షలు కక్షతో చేస్తూ
కాంగ్రెస్స్ ను హస్తిన కే వెళ్లి కడిగేస్తూ
నా దయా దాక్షణ్యం మీ ప్రభుత్వం అనే
పుల్ల విరుపు మాటలకు విరుగుడుగా
ప్రత్యమ్నాయం అంటూ వచ్చిన
ప్రజారాజ్యం తో మంత్రాంగం నెరిపితే
ఆపద్బాంధవుడు మా నాయకుడే అని
రాజ్యం ప్రతినిధిలు ఉబ్బి తబ్బిబ్బు అవుతూ
కాంగ్రెస్స్ కు రాష్ట్రంలో ఇమేజి ఉన్న నాయకుని కొరతను
మా నాయకుని ప్రత్యామ్నాయం పూడుస్తుందని
పూనకం వచ్చినట్లు ఊగిపోతూ పొంగిపోతున్నారు
125 ఏళ్ల చరిత్ర కల కాంగ్రెస్స్ కౌగిలి
కొత్త బిక్షగాళ్ళకు ద్రుత రాష్ట్ర కౌగిలి అని తెలిసినట్టు లేదు
అంతెందుకు ఈయన ఇమేజ్ ఏంటో
ఎంతో అనుభవం ఉన్న ఆ పార్టీ అంచనావేయదా
కుటుంబ ఇమేజి తప్ప ఎవడి ఇమేజ్ ను భరించని పార్టీ అది
ప్రస్తుతానికి పావుగా వాడుకోబడుతుంటే
బడాయి పోతున్న రాజ్యం బాగుపడేది కలే.
అవినీతి పార్టీకి ఆసరాగా వచ్చిన అందరి వాని పార్టీ
ప్రజలందరూ కలిసి
అవినీతి మంత్రుల
పంచలూడ గొట్టమని
పవనుడు యువ రాజాగా చెప్పడం
అల్లుడని కూడా చూడకుండా
అత్తోల్ల ఊరిలో
అన్నయ్య పై నమ్మకం నభూతో నభవిష్యత్గా
ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం
ఆదరించడం జరిగిపోయింది
అభిమానుల రక్తానికి సేవ అనే లేబులు వేసి
ప్రజలను కూడా పీల్చడానికి వస్తే
పిచ్చి వదిలించి పంపారు
కానీ అన్నయ్య
పాలక పక్షంతో
లోపాయకారిగా అంటకాగిన విధం
ఎన్నికలయ్యి ఏడాది కాక మునుపే బయటపడింది
అధికార యావ ప్రజలకందరికీ తెలిసి వచ్చింది
కానీ అంతిమంగా నష్టపోయింది ప్రజలే
అవినీతి పార్టీకి ఆసరాగా వచ్చిన
అందరి వాని పార్టీ అని
గ్రహించక మరో సారి పాతక పాలక పార్టీ
గ్రహణాన్ని పొడిగించుకొన్నారు
అవినీతి మంత్రుల
పంచలూడ గొట్టమని
పవనుడు యువ రాజాగా చెప్పడం
అల్లుడని కూడా చూడకుండా
అత్తోల్ల ఊరిలో
అన్నయ్య పై నమ్మకం నభూతో నభవిష్యత్గా
ప్రజలు తప్పుగా అర్థం చేసుకోవడం
ఆదరించడం జరిగిపోయింది
అభిమానుల రక్తానికి సేవ అనే లేబులు వేసి
ప్రజలను కూడా పీల్చడానికి వస్తే
పిచ్చి వదిలించి పంపారు
కానీ అన్నయ్య
పాలక పక్షంతో
లోపాయకారిగా అంటకాగిన విధం
ఎన్నికలయ్యి ఏడాది కాక మునుపే బయటపడింది
అధికార యావ ప్రజలకందరికీ తెలిసి వచ్చింది
కానీ అంతిమంగా నష్టపోయింది ప్రజలే
అవినీతి పార్టీకి ఆసరాగా వచ్చిన
అందరి వాని పార్టీ అని
గ్రహించక మరో సారి పాతక పాలక పార్టీ
గ్రహణాన్ని పొడిగించుకొన్నారు
చేతి ఉండ సాక్షిగా
ప్రజలకు పసందుగా ప్రసాదం పెట్టి
కొడుకు కోసం కొల్లగొట్టడానికి
అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే
ఆయన పాలనలోని పాపాలను
ఓ పత్రిక చేసే ప్రతి ఆరోపణకు
కన్న కొడుకినే సాక్షిగా పెట్టి
ఉచితానుచితాలు మరిచి
ఉండ తో ప్రత్యారోపణ చేయిస్తూ
మొదటి పేజిలో వల్లించిన సుభాషితాలు
కడుక్కున్న బురద
ప్రజల మది నుండి మాయం అవక ముందే
ఉండ తిరగబడి ఆ కొడిక్కే బురద జల్లుతోంది
తను తీసిన గోతిలో తనే పడ్డాడు అనే సామెత
‘చేతి’ ‘ఉండ’ ‘సాక్షిగా’ నిరూపితమయ్యింది.
కొడుకు కోసం కొల్లగొట్టడానికి
అధికారాన్ని దుర్వినియోగం చేస్తుంటే
ఆయన పాలనలోని పాపాలను
ఓ పత్రిక చేసే ప్రతి ఆరోపణకు
కన్న కొడుకినే సాక్షిగా పెట్టి
ఉచితానుచితాలు మరిచి
ఉండ తో ప్రత్యారోపణ చేయిస్తూ
మొదటి పేజిలో వల్లించిన సుభాషితాలు
కడుక్కున్న బురద
ప్రజల మది నుండి మాయం అవక ముందే
ఉండ తిరగబడి ఆ కొడిక్కే బురద జల్లుతోంది
తను తీసిన గోతిలో తనే పడ్డాడు అనే సామెత
‘చేతి’ ‘ఉండ’ ‘సాక్షిగా’ నిరూపితమయ్యింది.
27, జనవరి 2011, గురువారం
నాకు నచ్చిన కొన్ని మంచి అమృతవాక్కు
మనం చదవడమే నేర్చుకున్నాం కాని ఆలోచించడానికి శిక్షణను పొందలేదు.
--సర్వేపల్లి రాధాకృష్ణ
వంద ఉద్బోదల కన్నా ఒక అనుభవం గొప్పది
--వివేకానంద
ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు
--రమణ మహర్షి
మనం ముందుకే నడవాలి. ఎన్నో సార్లు, దారిలో నిరాశ ఆవహిస్తుంది. కాని చివరకు, దప్పికతో ఉన్న బాటసారి నీటిని కనుగొంటాడు. నిజానికి దప్పిక కంటే ముందే నీరు అక్కడ ఉంది.
-- ఓషో
ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి
--ఆల్బర్ట్ ఐన్స్టియిన్
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది
--జిడ్డు కృష్ణమూర్తి
నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.
- రామకృష్ణ పరమహంస
నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు
--కాజ చైతన్య
ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న
--మదర్ థెరిస్సా
నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు
- ధీరూభాయి అంబానీ
బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.
--జవహర్ లాల్ నెహ్రూ
జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
--ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్
ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు. ...
--స్వామి శివానంద సరస్వతి.
ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
--వివేకానంద
తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
--మాతా అమృతానందమయి
--సర్వేపల్లి రాధాకృష్ణ
వంద ఉద్బోదల కన్నా ఒక అనుభవం గొప్పది
--వివేకానంద
ఒక వ్యక్తి సంతోషముగా వుంటే తప్ప ఇతరులకు సంతోషం కలిగించలేడు
--రమణ మహర్షి
మనం ముందుకే నడవాలి. ఎన్నో సార్లు, దారిలో నిరాశ ఆవహిస్తుంది. కాని చివరకు, దప్పికతో ఉన్న బాటసారి నీటిని కనుగొంటాడు. నిజానికి దప్పిక కంటే ముందే నీరు అక్కడ ఉంది.
-- ఓషో
ఇబ్బందులు కొత్త శక్తిని తెచ్చిపెడతాయి, మన ఆలోచనలకు పదునుపెడతాయి
--ఆల్బర్ట్ ఐన్స్టియిన్
అసలైన విప్లవం జరగవలసినది హృదయపు లోతులలో... మనిషిలో... రాజకీయ, ఆర్ధిక విప్లవాలు కానీ, సామాజిక సంస్కరణలు కానీ ఈ పరివర్తనను తేలేవు. నూతన ఆదర్శాలు, మతాత్మకమైన ఆశయాలు అవలంబించినా, కొత్త సిద్ధాంతాలతో, కొత్త పద్ధతులలో మనిషిని నిర్భందించినా ఇది జరగదు. తనని తాను పూర్తిగా అవగాహన చేసుకుంటూ హృదయంతో స్పందిస్తూ జీవించటంలోనే పరివర్తన సాధ్యమౌతుంది
--జిడ్డు కృష్ణమూర్తి
నూతిలోని కప్పలా ఉండకూడదు. మతోన్మాదులంతా అలాంటి వారే. వారు తమ మతమే గొప్పదనుకుంటారు. కానీ, తక్కిన మతాలలోని మంచిని చూడరు.
- రామకృష్ణ పరమహంస
నీదనుకోనేది ఇక్కడలేదు. అది గ్రహించేసరికి నీవిక్కడ వుండటం లేదు
--కాజ చైతన్య
ఎప్పుడూ ప్రార్ధించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న
--మదర్ థెరిస్సా
నిన్ను నిన్నుగా వదిలేస్తే నువ్వు నీలోని శక్తులని గుర్తించగలుగుతావు
- ధీరూభాయి అంబానీ
బంగారాన్ని గాని, గంధాన్ని గాని ఏం చేసినా వాటి గుణం మారుదు. అదే విధంగా ఉత్తముడికి ఎన్ని కష్టాలు వచ్చినా అతని ఉత్తమ గుణం మారుదు.
--జవహర్ లాల్ నెహ్రూ
జీవితంలోని సగం బాధలు 'సరే' అని త్వరగాను.. 'వద్దు' అని అలస్యంగాను.. చెప్పటం వల్లనే కలుగుతాయి.
--ఆర్ట్ ఆఫ్ లివింగ్, శ్రీశ్రీ రవి శంకర్
ఈ లోకంలో ప్రతి మనిషీ పూర్ణానందాన్ని కోరుకుంటాడు. కాబట్టి అటువంటి ఆనందాన్ని కేవలం సత్కార్యం ద్వారానే మానవుడు పొందగలడు. ...
--స్వామి శివానంద సరస్వతి.
ఇసుమంత ఆచరణ ఇరవై వేల టన్నుల మాటలతో సమానము.
--వివేకానంద
తనను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం ఆవివేకం.
--మాతా అమృతానందమయి
25, జనవరి 2011, మంగళవారం
సుఖం
ఆండాళ్ ,భర్త బతికున్నంత కాలం పట్టించుకొనలేదు .ఈ మధ్యనే పైకెళ్ళి పోయాడు శ్యామసుందరం. అప్పటి నుండీ ఆమెకు ,సుందరం లేని లోటు బాగా అనుభవం లోకి వచ్చింది.తను చేసిన తప్పులకు బాధ పడింది.ఎలాగైనా సుందరాన్ని క్షమించమని అడగాలనుకొంది. ఉగ్రానంద స్వామి వారి సహాయంతో సుందరం ఆత్మతో మాట్లాడ గలిగింది ,
" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"
" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "
"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "
"నేను బానే ఉన్నాను "
" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "
"నాకు ఇక్కడ చాలా బాగుంది "
" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "
" లేదు , నరకం అంధకూపం లో "
" ఏవండీ, నేను ఆండాళ్ ని, మిమ్మల్ని బాగా బాధ పెట్టాను,క్షమించండి.నాతో ఒక్కసారి మాట్లాడండి"
" చెప్పు ఆండాళ్ళు , ఎలా ఉన్నావు ? "
"మీరు వెళ్ళిన తరువాత ఇక్కడ నాకు ఏమీ బాగా లేదు .మీరెలా ఉన్నారు ? "
"నేను బానే ఉన్నాను "
" ఇక్కడ ఉన్నప్పటి కంటే బాగున్నారా ? "
"నాకు ఇక్కడ చాలా బాగుంది "
" అంటే మీరు స్వర్గం లో ఉన్నారా ? "
" లేదు , నరకం అంధకూపం లో "
సిగ్గులేని బండ
రైతులు చస్తున్నారంటే
సన్నాసి వైరాగ్యాన్ని చూపించి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై
తక్షణమే స్పందించి
అధిక ధరలపై
49రూ. 99రూ. లకే
రక రకాల కూరగాయలు అని ప్రకటించి
ఆచరణలో చేతులెత్తేసి
రచ్చ బండ దగ్గర చర్చ చేద్దామని వచ్చే
వీళ్ళను చూసి
రచ్చ బండే సిగ్గు పడుతుందేమో
సన్నాసి వైరాగ్యాన్ని చూపించి
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై
తక్షణమే స్పందించి
అధిక ధరలపై
49రూ. 99రూ. లకే
రక రకాల కూరగాయలు అని ప్రకటించి
ఆచరణలో చేతులెత్తేసి
రచ్చ బండ దగ్గర చర్చ చేద్దామని వచ్చే
వీళ్ళను చూసి
రచ్చ బండే సిగ్గు పడుతుందేమో
మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా
అనగనగా ఒక ధీరుడు గురించి మన అంతర్జాల సమీక్షకులు చిన్నపిల్లలు చూసే సినిమా గా తేల్చేసారు.
కానీ నా దృష్టిలో అది ప్రతి ఒక్క తెలుగువాడు చూసి ఆనందించదగిన చిత్రంగా అనిపించింది.
ప్రతినాయకి గా మంచు లక్ష్మి నటన ప్రత్యేకం. దానికన్నా ప్రత్యేకమయినది దర్శకుని ప్రతిభ.
మొదటి నుండి చివరి వరకు కనులు ఆరగించే విందులో రెప్ప పాటు వల్లా ఏమన్నా తప్పిపోతామో అని సంకోచించే దృశ్య కావ్యం. అంతర్జాతీయ స్థాయి కి తగ్గకుండా డిస్నీ తో కలిసి మన దర్శకేంద్రుని కుమారుడు తీసాడు. సాంకేతికంగా మన తెలుగు సినీ స్థాయి ఒక మెట్టు ముందుకు పడింది. ఒక అరవోడు కాని ఇందులో అర్ధ స్థాయి కి చేరినా అరిచి గోల చేసే వారు. వారితో పాటు పొరిగింటి పులగూర పొగడ్త రాయుళ్ళు రెచ్చి పోయేవారు.
కానీ మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా అనిపిస్తోంది.
కానీ నా దృష్టిలో అది ప్రతి ఒక్క తెలుగువాడు చూసి ఆనందించదగిన చిత్రంగా అనిపించింది.
ప్రతినాయకి గా మంచు లక్ష్మి నటన ప్రత్యేకం. దానికన్నా ప్రత్యేకమయినది దర్శకుని ప్రతిభ.
మొదటి నుండి చివరి వరకు కనులు ఆరగించే విందులో రెప్ప పాటు వల్లా ఏమన్నా తప్పిపోతామో అని సంకోచించే దృశ్య కావ్యం. అంతర్జాతీయ స్థాయి కి తగ్గకుండా డిస్నీ తో కలిసి మన దర్శకేంద్రుని కుమారుడు తీసాడు. సాంకేతికంగా మన తెలుగు సినీ స్థాయి ఒక మెట్టు ముందుకు పడింది. ఒక అరవోడు కాని ఇందులో అర్ధ స్థాయి కి చేరినా అరిచి గోల చేసే వారు. వారితో పాటు పొరిగింటి పులగూర పొగడ్త రాయుళ్ళు రెచ్చి పోయేవారు.
కానీ మనవాళ్ళకు దక్కాల్సిన అందలానికి మన అంధత్వమే అడ్డవుతోందా అనిపిస్తోంది.
21, జనవరి 2011, శుక్రవారం
ఇన్నాళ్ళకు భిన్నత్వంలో ఏకత్వం
ఉల్లి పాయలు అత్యవసర వస్తువు
పెట్రోలు సౌఖర్యార్ధం వాడే వస్తువు
బీరు విలాస వస్తువు
మూడు విభిన్న వస్తువుల ఏకత్వం ఎక్కడ ఉందంటే
దాని ధరల్లో ………..
ఏదైనా మన దేశంలో 65 రూపాయలే.
భిన్నత్వంలో ఏకత్వం కోసం
రాజకీయ నాయకుల కృషి ఫలించిన వేళ
జాతి యావత్తు పండుగ చేసుకొనే వేళ
పెట్రోలు సౌఖర్యార్ధం వాడే వస్తువు
బీరు విలాస వస్తువు
మూడు విభిన్న వస్తువుల ఏకత్వం ఎక్కడ ఉందంటే
దాని ధరల్లో ………..
ఏదైనా మన దేశంలో 65 రూపాయలే.
భిన్నత్వంలో ఏకత్వం కోసం
రాజకీయ నాయకుల కృషి ఫలించిన వేళ
జాతి యావత్తు పండుగ చేసుకొనే వేళ
ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే
ఆశించి భంగపడితే
భరించలేను అని బాధపడడం కన్నా
పక్కింటోడికి కూడా
కరెంటు పోతే కలిగే ఆనందంలా
మనకన్నా ఓ మెట్టు కింద ఉన్న వారితో పోల్చుకొని
స్వాంతన పొందుతుంటాం
అలా జనం డబ్బు
రాజ మార్గంలో కొట్టేసే
వారసత్వపు కుర్చీ దూరమయితే
ఆ బాధకు అంతుండదు
అది అనుభవించే వారికే తెలుస్తుంది
అందుకే స్వాంతనకోసం సచ్చినింట
మళ్ళీ కన్నీళ్లు తెప్పించి
సచ్చినోళ్ళు మన అయ్యలా సంపాదించి ఇవ్వక
పోయారు అని దగ్గరనుండి పోల్చుకొని
స్వాంతన పొందడానికే
మళ్ళీ మళ్ళీ ఓదార్పు చెయ్యాలనిపిస్తోందేమో
ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే.
భరించలేను అని బాధపడడం కన్నా
పక్కింటోడికి కూడా
కరెంటు పోతే కలిగే ఆనందంలా
మనకన్నా ఓ మెట్టు కింద ఉన్న వారితో పోల్చుకొని
స్వాంతన పొందుతుంటాం
అలా జనం డబ్బు
రాజ మార్గంలో కొట్టేసే
వారసత్వపు కుర్చీ దూరమయితే
ఆ బాధకు అంతుండదు
అది అనుభవించే వారికే తెలుస్తుంది
అందుకే స్వాంతనకోసం సచ్చినింట
మళ్ళీ కన్నీళ్లు తెప్పించి
సచ్చినోళ్ళు మన అయ్యలా సంపాదించి ఇవ్వక
పోయారు అని దగ్గరనుండి పోల్చుకొని
స్వాంతన పొందడానికే
మళ్ళీ మళ్ళీ ఓదార్పు చెయ్యాలనిపిస్తోందేమో
ఇదే నిజమైతే ఇక ఎడతెగని ఓదార్పే.
అణుమోహన్ జీ గురువును గుర్తుకు తెచ్చుకో
పంతం పట్టి నెగ్గించుకొన్న పని
అణు బిల్లు తప్ప
తతిమా విషయాలలో
దేశం యావత్తూ
నీ వ్యక్తిత్వాన్నే శంకించే
పరిస్థితుల్లోకి నెట్టబడుతోంటే కూడా
ఆ పదవి పట్టుకొని
125 ఏళ్ల కాంగ్రెస్స్ ను కాపాడుతున్నావు
ఎందుకు?
నీ గురుగు నరసింహుని పేరును
ఏ మురికి వచ్చినా వదిలించుకోడానికి వాడుతూ
ప్రపంచీకరణ ఫలాల గురించి చెప్పేప్పుడు ప్రక్కన బెడుతున్నారు
అది తెలిసి కూడా
ఏమన్నా ఎందుకోసం పడుతున్నావు
ఎన్నాళ్ళు పడతావు?
నువ్వు ఏమి చేసినా
అధినేత్రి భట్రాజులు ఆమె కొడుకు భజన చేస్తుంటే కూడా
ఎందుకు సహిస్తున్నావు?
అణు బిల్లు తప్ప
తతిమా విషయాలలో
దేశం యావత్తూ
నీ వ్యక్తిత్వాన్నే శంకించే
పరిస్థితుల్లోకి నెట్టబడుతోంటే కూడా
ఆ పదవి పట్టుకొని
125 ఏళ్ల కాంగ్రెస్స్ ను కాపాడుతున్నావు
ఎందుకు?
నీ గురుగు నరసింహుని పేరును
ఏ మురికి వచ్చినా వదిలించుకోడానికి వాడుతూ
ప్రపంచీకరణ ఫలాల గురించి చెప్పేప్పుడు ప్రక్కన బెడుతున్నారు
అది తెలిసి కూడా
ఏమన్నా ఎందుకోసం పడుతున్నావు
ఎన్నాళ్ళు పడతావు?
నువ్వు ఏమి చేసినా
అధినేత్రి భట్రాజులు ఆమె కొడుకు భజన చేస్తుంటే కూడా
ఎందుకు సహిస్తున్నావు?
మహా ప్రస్థానం- శ్రీ శ్రీ
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచం జలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోట లన్నిటిని దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకుల కుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరుపులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండీ ముందుకు!
పదండీ త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు ?
శ్రీ శ్రీ - ఏప్రిల్ 12, 1994
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!
కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదంత రాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచం జలపాతం?
దారి పొడుగునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడిచీ,
పేటలు కడచీ,
కోట లన్నిటిని దాటండి!
నదీ నదాలు,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకుల కుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
దరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రముల ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడ లేదా మరో ప్రపంచపు
కణకణ మండే త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరుపులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సల సల క్రాగే చమురా? కాదిది,
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె,
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండీ ముందుకు!
పదండీ త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడ లేదా మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగ భుగలు ?
శ్రీ శ్రీ - ఏప్రిల్ 12, 1994
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం
కవితా! ఓ కవితా! - 'మహా ప్రస్థానం'
కవితా! ఓ కవితా!
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?
నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిక్షంలో
ఏయే ఘోషలు, భాషలు, ద్~రుశ్యాల్ తోచాయో ?
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో ?
నీకై నే నేరిన వేయే ధ్వనులలో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝుంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;
ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులలో?
నక్షత్రాంతర్నిబడ నిఖలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుధ్ద్ధం,
అన్నీ, నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం
మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే ద్రుశ్యాలా?
వినిపించే భాష్యాలా ?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం
ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధ నిమీలత నేత్రాల
భయంకర భాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఝాకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల
హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నని కన్నని విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
చంధస్సుల సర్వపరిష్వంగం వదలి----
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా స్~రుష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హ్~రుదయుని జేస్తే-
నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగాననూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.
అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘ్రుణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!
నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న,
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడినై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా ఊహంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హ్~రుద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విన్~రుమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! ఓ కవితా! ఓ కవితా!
-శ్రీ శ్రీ,1937
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం
నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో
నిను నే నొక సుముహూర్తంలో,
అతి సుందర సుస్యందనమందున
దూరంగా వినువీధుల్లో విహరించే
అందని అందానివిగా
భావించిన రోజులలో,
నీకై బ్రతుకే ఒక తపమై
వెదుకాడే నిమిషాలందు నిషాలందున,
ఎటు నే చూచిన చటులాలంకారపు
మటుమాయల నటనలలో
నీ రూపం కనరానందున,
నా గుహలో, కుటిలో, చీకటిలో
ఒక్కడనై స్రుక్కిన రోజులు లేవా?
నీ ప్రాబల్యంలో,
చిరదీక్షా శిక్షా తపస్సమీక్షణలో,
నిశ్చల సమాధిలో,
స్వర్గద్వారపు తోరణమై వ్రేలిన నా
మస్తిక్షంలో
ఏయే ఘోషలు, భాషలు, ద్~రుశ్యాల్ తోచాయో ?
నే నేయే చిత్ర విచిత్ర శ్యమంత
రోచిర్ని వహం చూశానో!
నా గీతం ఏయే శక్తులలో
ప్రాణస్పందన పొందిందో ?
నీకై నే నేరిన వేయే ధ్వనులలో,
ఏయే మూలల వెదికిన ప్రోవుల
ప్రోవుల రణన్ని నాదాలో!
నడిరే యాకస మావర్తించిన,
మేఘా లావర్షించిన,
ప్రచండ ఝుంఝూ ప్రభంజనం
గజగజ లాడించిన
నడి సంద్రపు కెరటాల్లో, మ్రోగిన
శంఖారావం, ఢంకాధ్వానం;
ఆ రాత్రే,
కారడవులలో లయాతీతమై
విరుతించిన నానాజంతుధ్వనులలో?
నక్షత్రాంతర్నిబడ నిఖలగానం,
భూకంపాలు, ప్రభుత్వ పతనాలు,
విప్లవం, యుధ్ద్ధం,
అన్నీ, నీ చైతన్యం!
నీ విశ్వరూప సాక్షాత్కారం
మరి నిన్ను స్మరిస్తే
నా కగుపించే ద్రుశ్యాలా?
వినిపించే భాష్యాలా ?
అగ్ని సరస్సున వికసించిన వజ్రం!
ఎగిరే లోహశ్యేనం!
ఫిరంగిలో జ్వరం ద్వనించే మ్రుదంగ నాదం
ఇంకా నే నేం విన్నానా?
నడిరే నిద్దురలో
అపుడే ప్రసవించిన శిశువు నెడద నిడుకొని
రుచిర స్వప్నాలను కాంచే
జవరాలి మనఃప్రపంచపు టావర్తాలు!
శిశువు చిత్ర నిద్రలో
ప్రాచీన స్మ్రుతు లూచే చప్పుడు!
వైద్యశాలలో,
శస్త్రకారుని మహేంద్రజాలంలో,
చావు బ్రదుకుల సంధ్యాకాలంలో
కన్నులుమూసిన రోగార్తుని
రక్తనాళ సంస్పందన!
కాలువ నీళులలో జారిపడి
కదలగ నైనా చాలని
త్రాగుబోతు వ్యక్తావ్యక్తాలాపన!
ప్రేలాపన!
కడుపు దహించుకుపోయే
పడుపుకత్తె రాక్షసరతిలో
అర్ధ నిమీలత నేత్రాల
భయంకర భాధల పాటల పల్లవి!
ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం!
ఉన్మాది మనస్సినీవాలిలో
ఝాకంకేకా, భేకంబాకా!
సమ్మెకట్టిన కూలీల,
సమ్మెకట్టిన కూలీల భార్యల, బిడ్డల
ఆకటి చీకటి చిచ్చుల
హాహాకారం! ఆర్తారావం!
ఒక లక్ష నక్షత్రాల మాటలు,
ఒక కోటి జలపాతాల పాటలు,
శతకోటి సముద్రతరంగాల మ్రోతలు!
విన్నానమ్మా! విన్నా, నెన్నో విన్నాను.
నా విన్నని కన్నని విన్నవించగా
మాటలకై వెదుకాడగపోతే
అవి,
పుంఖానుపుంఖంగా
శ్మశానాలవంటి నిఘంటువుల దాటి,
వ్యాకరణాల సంకెళ్ళు విడిచి,
చంధస్సుల సర్వపరిష్వంగం వదలి----
వడిగా, వడివడిగా
వెలువడినై, పరుగుడినై, నా యెదనడుగిడినై!
ఆ చెలరేగిన కలగాపులగపు
విలయావర్తపు
బలవత్ ఝరవత్ పరివర్తనలో,
నే నేయే వీధులలో
చంక్రమణం చేశానో,
నా స్~రుష్టించిన గానంలో
ప్రక్షుళిత మామక పాపపరంపర
లానంద వశంవద హ్~రుదయుని జేస్తే-
నీకై మేలుకొనిన
సకలేంద్రియములతో
ఏది రచిస్తున్నానో, చూస్తున్నానో,
ఊపిరి తీస్తున్నానో
నిర్వికల్ప సమాధిలో
నా ప్రాణం నిర్వాణం పొందిందో,
అటు నను మంత్రించిన,
సమ్ముగ్ధంగావించిన ఆ గాంధర్వానికి,
తారానివహపు ప్రేమసమాగమంలో
జన్మించిన సంగీతానికి...
నా నాడుల తీగలపై సాగిన
నాద బ్రహ్మ్మపు పరిచుంబనలో,
ప్రాణావసానవేళాజనితం,
నానాగాననూనస్వానావళితం,
బ్రతుకును ప్రచండభేరుండ గరు
త్పరిరంభంలో పట్టిన గానం,
సుఖదుఃఖాదిక ద్వంద్వాతీతం.
అమోఘ, మఘాధ, మచింత్య, మమేయం,
ఏకాంతం, ఏకైకం,
క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం,
బ్రహ్మానుభవం కలిగించిన,
నను కరిగించిన కవనఘ్రుణీ!
రమణీ!
కవితా! ఓ కవితా!
నా జనని గర్భంలో,
ఆకారం లేకుండా నిద్రిస్తూన్న,
నా అహంకారానికి
ఆకలి గొల్పించిన నాడో!
నా బహిరంత రింద్రియాలలో
ప్రాణం ప్రసరించగ, నే నీ భూలోకంలో పడి
సుఖదుఃఖా లేవేవో
వస్తూంటే తలదాలిచి
ప్రపంచ పరిణాహంలో
ప్రయాణికుడనై,
పరివ్రాజకుడినై,
విహ్వలంగా వర్తించేవేళ
అభయహస్త ముద్రతో ననుదరిసిన
నన్ను పునీతుని కావించిన కవితా!
లలిత లలిత కరుణామహితా
అనుపమితా!
అపరిమితా!
కవితా! ఓ కవితా
నేడో నా ఊహంచల
సాహసికాంసం కప్పిన నా
నిట్టూర్పులు వినిపిస్తాయా?
నే నేదో విరచిస్తానని,
నా రచనలలో లోకం ప్రతిఫలించి,
నా తపస్సు ఫలించి,
నా గీతం గుండెలలో ఘార్ణిల్లగ
నా జాతి జనులు పాడుకొనే
మంత్రంగా మ్రోగించాలని
నా ఆకాశాలను
లోకానికి చేరువగా,
నా ఆదర్శాలను
సోదరులంతా పంచుకునే
వెలుగుల రవ్వల జడిగా,
అందీ అందకపోయే
నీ చేలాంచముల విసరుల
కొసగాలులతో నిర్మించిన
నా నుడి నీ గుడిగా,
నా గీతం నైవేద్యంగా, హ్~రుద్యంగా,
అర్పిస్తానో
నా విసరిన రస విన్~రుమర
కుసుమ పరాగం!
ఓహో! ఓ రసధుని! మణిఖని! జననీ! ఓ కవితా!
కవితా! ఓ కవితా! ఓ కవితా!
-శ్రీ శ్రీ,1937
శ్రీ శ్రీ 'మహా ప్రస్తానం' నుంచి సంగ్రహితం
20, జనవరి 2011, గురువారం
నాకు పదవే ముఖ్యం
48 గంటల తరువాత దీక్ష చేస్తే
శరీరంలో ఏ అవయమూ తిప్పలేము
అందుకోసం దీక్ష ఎందుకు దండగ
మడమ తిప్పేది లేదు అనే పదాన్ని
పద్దతిగా అర్థం చేసుకొంటే సరి
ఎన్ని రోజులు బతికామని కాదు
ఎలా బతికామన్నది ముఖ్యం
అందుకోసమే ముఖ్యమంత్రి సీటును
బతికి సాధించాలి
దీక్షలు పొగిడించి టపా కట్టి కాదు.
డబ్బెవడికి చేదు అన్నదే
నా ఆశయానికి ఆయువు పట్టు
అది మా నాన్న జమానా నుండి
ఒడిసిపట్టినాను కాబట్టే
ఈ రోజు పెట్టుబడి పెట్టగలుగుతున్నా
నా కోసం జనాలను రప్పించగలుగుతున్నా
జన నాయకులచే
నాకు దక్కని కుర్చీ నాయకుణ్ణి
నిద్రలేకుండా చేయగలుగుతున్నా
అర్థం చేసుకొంటే మంచిది
ఆలస్యం చేసే కొద్దీ నా అసహనం పెరుగుతుంది
ఆ తదుపరి అధిష్టానం కూడా ఆపలేందు.
నిజంగా రైతులకోసం ఎవరు పోరాడినా మద్దతివ్వాలి
కానీ ఆ పోరాటంలో ఎవడు కుర్చీకి దగ్గర అయినా నేను సహించ
ఆ పోరాటాన్ని పొట్టనింపు కొంటూ చేస్తున్నారని ప్రాపగాండా చేస్తా
దీనితో రైతు సమస్యలు పలుచనైనా పరవాలేదు
నాకు పదవే ముఖ్యం.
శరీరంలో ఏ అవయమూ తిప్పలేము
అందుకోసం దీక్ష ఎందుకు దండగ
మడమ తిప్పేది లేదు అనే పదాన్ని
పద్దతిగా అర్థం చేసుకొంటే సరి
ఎన్ని రోజులు బతికామని కాదు
ఎలా బతికామన్నది ముఖ్యం
అందుకోసమే ముఖ్యమంత్రి సీటును
బతికి సాధించాలి
దీక్షలు పొగిడించి టపా కట్టి కాదు.
డబ్బెవడికి చేదు అన్నదే
నా ఆశయానికి ఆయువు పట్టు
అది మా నాన్న జమానా నుండి
ఒడిసిపట్టినాను కాబట్టే
ఈ రోజు పెట్టుబడి పెట్టగలుగుతున్నా
నా కోసం జనాలను రప్పించగలుగుతున్నా
జన నాయకులచే
నాకు దక్కని కుర్చీ నాయకుణ్ణి
నిద్రలేకుండా చేయగలుగుతున్నా
అర్థం చేసుకొంటే మంచిది
ఆలస్యం చేసే కొద్దీ నా అసహనం పెరుగుతుంది
ఆ తదుపరి అధిష్టానం కూడా ఆపలేందు.
నిజంగా రైతులకోసం ఎవరు పోరాడినా మద్దతివ్వాలి
కానీ ఆ పోరాటంలో ఎవడు కుర్చీకి దగ్గర అయినా నేను సహించ
ఆ పోరాటాన్ని పొట్టనింపు కొంటూ చేస్తున్నారని ప్రాపగాండా చేస్తా
దీనితో రైతు సమస్యలు పలుచనైనా పరవాలేదు
నాకు పదవే ముఖ్యం.
నాది 2 రోజుల దీక్షే – 2
లక్ష మందితో చేపట్టే నా దీక్ష లక్ష్యం
ఒక ధపా పార్టీ అధికారం లోకి వస్తే
ఒక ఏడాది సరిపోయే రాష్ట్ర బడ్జెట్ సంపద
నా కుటుంబ పరం అవ్వాలి
నా చెయ్యి నొప్పెట్టే వరకు చెయ్యి ఊపుకోనివ్వాలి
ట్రాఫిక్ జాం అయ్యి నిదానంగా మా నాన్న విగ్రహాలు
చూస్తూ వెళ్ళేన్ని విగ్రహాలు పెట్టనివ్వాలి
మా మావయ్యకు మిక్సేసెంత ఎరువు కేటాయించాలి
మతపరంగా వచ్చే డబ్బులు మా బావకే రావాలి
ప్రస్తుతానికి ఈ 48 గంటలకు ఇవే
ఇవీ కాదని మొండికేస్తే
పవరును దూరం చేస్తా
నా మీడియాతో పరువు తీసేస్తా
నాకు సిగ్గు పడే అలావాటు లేకున్నా సిగ్గు పడి
నేను సిగ్గుపడుతున్నానని ప్రజలకు చెబుతా
ప్రక్క రాష్ట్రం లో నా కోట ఉన్నా
ఈ రాష్ట్రం లో ఉన్నందుకు బాధపడుతున్నా అని చెబుతా
ఒక ధపా పార్టీ అధికారం లోకి వస్తే
ఒక ఏడాది సరిపోయే రాష్ట్ర బడ్జెట్ సంపద
నా కుటుంబ పరం అవ్వాలి
నా చెయ్యి నొప్పెట్టే వరకు చెయ్యి ఊపుకోనివ్వాలి
ట్రాఫిక్ జాం అయ్యి నిదానంగా మా నాన్న విగ్రహాలు
చూస్తూ వెళ్ళేన్ని విగ్రహాలు పెట్టనివ్వాలి
మా మావయ్యకు మిక్సేసెంత ఎరువు కేటాయించాలి
మతపరంగా వచ్చే డబ్బులు మా బావకే రావాలి
ప్రస్తుతానికి ఈ 48 గంటలకు ఇవే
ఇవీ కాదని మొండికేస్తే
పవరును దూరం చేస్తా
నా మీడియాతో పరువు తీసేస్తా
నాకు సిగ్గు పడే అలావాటు లేకున్నా సిగ్గు పడి
నేను సిగ్గుపడుతున్నానని ప్రజలకు చెబుతా
ప్రక్క రాష్ట్రం లో నా కోట ఉన్నా
ఈ రాష్ట్రం లో ఉన్నందుకు బాధపడుతున్నా అని చెబుతా
అయ్య హయాంలో
అయ్య హయాంలో
హలంతో దున్నేవాడు
ఆత్మ హత్యలు చేసుకొంటుంటే
లక్ష కోట్ల దీక్షలో ఉన్నందువల్ల
లక్ష దీక్ష కు నదీ తీరాన గుడారం వేయలేదు
హస్తిన వారి అభయ హస్తపు హవాతో
జల యజ్ఞపు ధనాన్ని జలగలా పీల్చే దీక్ష లో ఉన్నందువల్ల
హస్తినలో జల దీక్ష చెయ్యాలనిపించలేదు
నాన్న హయాములో పెట్రోలు ధరలు పెంచినప్పుడు
ప్రజా ధనం కోసం పెట్రేగిపోయ్యే దీక్షలో ఉన్నందువల్ల
విశాఖ తీరాన జన దీక్ష చెయ్యాలనిపించలేదు
జనం డబ్బు సాక్షిగా
హస్తిన జేజమ్మ భయపడి
రాష్ట్రంలో కుర్చీ పై కూర్చో పెట్టే వరకు
లేదంటే జనం అయ్యకు ఏమారినట్టు ఏమారే వరకు
అదీ కాదంటే కాంగ్రెస్ కు కుర్చీ దూరమయ్యే వరకు
ఇక ఒకటే దీక్షలు
హలంతో దున్నేవాడు
ఆత్మ హత్యలు చేసుకొంటుంటే
లక్ష కోట్ల దీక్షలో ఉన్నందువల్ల
లక్ష దీక్ష కు నదీ తీరాన గుడారం వేయలేదు
హస్తిన వారి అభయ హస్తపు హవాతో
జల యజ్ఞపు ధనాన్ని జలగలా పీల్చే దీక్ష లో ఉన్నందువల్ల
హస్తినలో జల దీక్ష చెయ్యాలనిపించలేదు
నాన్న హయాములో పెట్రోలు ధరలు పెంచినప్పుడు
ప్రజా ధనం కోసం పెట్రేగిపోయ్యే దీక్షలో ఉన్నందువల్ల
విశాఖ తీరాన జన దీక్ష చెయ్యాలనిపించలేదు
జనం డబ్బు సాక్షిగా
హస్తిన జేజమ్మ భయపడి
రాష్ట్రంలో కుర్చీ పై కూర్చో పెట్టే వరకు
లేదంటే జనం అయ్యకు ఏమారినట్టు ఏమారే వరకు
అదీ కాదంటే కాంగ్రెస్ కు కుర్చీ దూరమయ్యే వరకు
ఇక ఒకటే దీక్షలు
మొండి చేయి
ఆత్మ హత్యలు చేసుకొనే రైతుల శవాలపై చల్లడానికి
అత్తరును కూడా అధిష్టానాన్ని అడగలేరు
రైల్వే కేటాయింపులు గురించి
కేంద్రాన్ని అడుగుతారనే ఆశలేదు
ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేంత హోదా లేదు
విపత్తులు వస్తే నిధుల గురించి వీరు చెబితే
వినే నాధుడు కూడా ఉండడని తెలుసు
సాటి ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా
సన్నాసులు దద్దమ్మలు అని అంటుంటే కూడా
ఉలుకూ పలుకు ఉండదు
అటువంటి వారు ఓ రెండు వారాలుగా
ఒకోడి ఇంట్లో ఒకో రోజు పకోడీ సమావేశం పెట్టుకొని
ఆవేశాల హడావిడి చేసి
అమ్మ దయ తలచితే
మేము చెయ్యి చాపి అందుకొంటామని
నోరు కూడా జారారు
ఇప్పుడు తీరా కేంద్ర మంత్రి వర్గ కేటాయింపుల్లో
బోర్లా పడి ‘మొండి చేయి’ చూసారు.
అత్తరును కూడా అధిష్టానాన్ని అడగలేరు
రైల్వే కేటాయింపులు గురించి
కేంద్రాన్ని అడుగుతారనే ఆశలేదు
ప్రాజెక్టులకు జాతీయ హోదా తెచ్చేంత హోదా లేదు
విపత్తులు వస్తే నిధుల గురించి వీరు చెబితే
వినే నాధుడు కూడా ఉండడని తెలుసు
సాటి ప్రజా ప్రతినిధులని కూడా చూడకుండా
సన్నాసులు దద్దమ్మలు అని అంటుంటే కూడా
ఉలుకూ పలుకు ఉండదు
అటువంటి వారు ఓ రెండు వారాలుగా
ఒకోడి ఇంట్లో ఒకో రోజు పకోడీ సమావేశం పెట్టుకొని
ఆవేశాల హడావిడి చేసి
అమ్మ దయ తలచితే
మేము చెయ్యి చాపి అందుకొంటామని
నోరు కూడా జారారు
ఇప్పుడు తీరా కేంద్ర మంత్రి వర్గ కేటాయింపుల్లో
బోర్లా పడి ‘మొండి చేయి’ చూసారు.
19, జనవరి 2011, బుధవారం
మన మనసులలో కొలువైన మహానటుడు యన్టీఆర్ 15వ వర్ధంతి
పురాణ పురుషుడంటే తెలుగువారికి వెంటనే గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ఎన్టీఆర్ అటు తర్వాత రాజకీయాల్లోనూ తనదైన ముద్రవేశారు. కిలో రెండు రూపాయల బియ్యం, జనతా వస్ర్తాల పంపిణీ, మద్యపాన నిషేధం వంటి అంశాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. ఆ మహానటుని పదిహేనో వర్ధంతి ఇవాళ.
సింహం లాంటి నడక, మాటల్లో గాంభీర్యం, నవ్వులోనూ రాజసం కురిపించడం ఒక్క ఎన్టీరామారావుకే సొంతం. విశ్వవిఖ్యాత నటసార్వబౌముడిగా ఖ్యాతి గడించించిన ఆయన రాజకీయాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరీ, వెంకటరామమ్మ దంపతులకు 1923, మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు
చదువు పూర్తయ్యాక మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించాడు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలువనీయలేదు. మన దేశంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాతాళబైరవితో హీరోగా స్థిరపడ్డారు.
అనంతరం పలు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు టాప్ హీరోగా వెలిగారు. తన సినీ కెరీర్లో వందలాది చిత్రాల్లో నటించినా... ప్రజలకు దగ్గర చేసింది మాత్రం పౌరాణిక పాత్రలే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పురాణ పురుషులను ప్రజలు ఆయనలో చూసుకున్నారంటేనే ఎన్టీఆర్ ఆ పాత్రలకు ఎంతగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. ఇక ఎన్టీ రామారావు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే.
అదో చరిత్ర. 1982లో తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాష్ట్రానికే పరిమితంగాక అటు దేశ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రవేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించారు.
తన 73 యేట 1996 జనవరి 18న ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తుది శ్వాస విడిచేవరకు పనిచేసిన మహామనిషి ఎన్టీఆర్కు తెలుగుజాతి ఘననివాళులు అర్పిస్తోంది
సింహం లాంటి నడక, మాటల్లో గాంభీర్యం, నవ్వులోనూ రాజసం కురిపించడం ఒక్క ఎన్టీరామారావుకే సొంతం. విశ్వవిఖ్యాత నటసార్వబౌముడిగా ఖ్యాతి గడించించిన ఆయన రాజకీయాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరీ, వెంకటరామమ్మ దంపతులకు 1923, మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు
చదువు పూర్తయ్యాక మద్రాస్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి సబ్-రిజిస్ట్రార్గా ఉద్యోగం సాధించాడు. అయితే సినిమాల్లో నటించాలనే కోరిక ఆ ఉద్యోగంలో ఎక్కువ కాలం నిలువనీయలేదు. మన దేశంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఎన్టీఆర్ పాతాళబైరవితో హీరోగా స్థిరపడ్డారు.
అనంతరం పలు సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాల్లో నటించి దశాబ్దాలపాటు టాప్ హీరోగా వెలిగారు. తన సినీ కెరీర్లో వందలాది చిత్రాల్లో నటించినా... ప్రజలకు దగ్గర చేసింది మాత్రం పౌరాణిక పాత్రలే.. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పురాణ పురుషులను ప్రజలు ఆయనలో చూసుకున్నారంటేనే ఎన్టీఆర్ ఆ పాత్రలకు ఎంతగా ఒదిగిపోయారో అర్థమవుతుంది. ఇక ఎన్టీ రామారావు రాజకీయ జీవితం గురించి చెప్పాలంటే.
అదో చరిత్ర. 1982లో తెలుగుదేశం పార్టీని కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారు. ప్రభుత్వ పాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. రాష్ట్రానికే పరిమితంగాక అటు దేశ రాజకీయాల్లోనూ ఆయన తనదైన ముద్రవేశారు. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా వ్యవహరించారు.
తన 73 యేట 1996 జనవరి 18న ఎన్టీఆర్ ఈ లోకాన్ని వీడిపోయారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తుది శ్వాస విడిచేవరకు పనిచేసిన మహామనిషి ఎన్టీఆర్కు తెలుగుజాతి ఘననివాళులు అర్పిస్తోంది
15, జనవరి 2011, శనివారం
శ్రీ శ్రీ
కుక్క పిల్లా.... సబ్బు బిళ్ళా.... అగ్గి పుల్లా....
కదేది కవితకు అనర్హం
అన్నీ నీవైపే చుస్తుంటాయ్....
తమలోతు కనుక్కొమంటాయ్....
హీనంగా చూడకు దేన్ని....
కవితామయమేనొయ్ అన్నీ....
కళ్ళుంటె చూసి....
వాక్కుంటే రాసి....
ప్రపంచం ఒక పద్మవ్యుహం....
కవిత్వం ఒక తీరని దాహం....
కదేది కవితకు అనర్హం
అన్నీ నీవైపే చుస్తుంటాయ్....
తమలోతు కనుక్కొమంటాయ్....
హీనంగా చూడకు దేన్ని....
కవితామయమేనొయ్ అన్నీ....
కళ్ళుంటె చూసి....
వాక్కుంటే రాసి....
ప్రపంచం ఒక పద్మవ్యుహం....
కవిత్వం ఒక తీరని దాహం....
ధనార్జన
ధనం కోసం
దర్జా కోసం
కన్న వారిని విడిచి
తన వారిని విడిచి
ఆకలి దప్పికలు మరచి
కూటి కోసం కోటి విద్యలన్న
సూత్రం మరచి
ఎవరి కోసం ? ఎవరి కోసం?
ఎందు కోసం? ఎందు కోసం?
ఈ విచిత్ర పోరాటం
అని
అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే
కాసు కోసం , పచ్చనోటు వాసన కోసం
అంటూ ఆత్మ పరుగు తీసింది
అంతరాత్మ నివ్వెర పోయింది............
దర్జా కోసం
కన్న వారిని విడిచి
తన వారిని విడిచి
ఆకలి దప్పికలు మరచి
కూటి కోసం కోటి విద్యలన్న
సూత్రం మరచి
ఎవరి కోసం ? ఎవరి కోసం?
ఎందు కోసం? ఎందు కోసం?
ఈ విచిత్ర పోరాటం
అని
అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే
కాసు కోసం , పచ్చనోటు వాసన కోసం
అంటూ ఆత్మ పరుగు తీసింది
అంతరాత్మ నివ్వెర పోయింది............
డబ్బు.....
ఆత్మ ఉండడానికి మనిషిని కాను
నేను శాశించే నిర్జీవాన్ని....
నిన్ను నడిపించే యంత్రాన్ని
ఏ అధికారానికి నేను తల వంచను
సృష్టి కర్తతో సలాం కొట్టించుకునే నవాబును
మనిషి సృష్టించిన మత్తును నేను
నేను లేని చోటు లేదు
నన్ను తలచని నాధుడు లేడు
అన్నింటిలో నేనే
ఆకలిలో నేనే
చీకటిలో నేనే -- వెలుతురులో నేనే
మనసులొ నేనే -- మాటలలొ నేనే
నీలోనూ నేనే-
నాలోనూ నేనే
నాలో ఈ జగమంతా ఉంది.....
ఉండి తీరుతుంది ---
నా పేరే ధనం....
నా పేరే డబ్బు.......
నేను శాశించే నిర్జీవాన్ని....
నిన్ను నడిపించే యంత్రాన్ని
ఏ అధికారానికి నేను తల వంచను
సృష్టి కర్తతో సలాం కొట్టించుకునే నవాబును
మనిషి సృష్టించిన మత్తును నేను
నేను లేని చోటు లేదు
నన్ను తలచని నాధుడు లేడు
అన్నింటిలో నేనే
ఆకలిలో నేనే
చీకటిలో నేనే -- వెలుతురులో నేనే
మనసులొ నేనే -- మాటలలొ నేనే
నీలోనూ నేనే-
నాలోనూ నేనే
నాలో ఈ జగమంతా ఉంది.....
ఉండి తీరుతుంది ---
నా పేరే ధనం....
నా పేరే డబ్బు.......
ఒక ప్రేమికుడి ప్రేమ
నీకు తెలుసా!!!
రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటే
హఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....
నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీ
ప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదు
జీవితానికి జీవం పొసేది ప్రేమ
ఉక్కులాంటి హ్రుదయాన్ని కదిలించేది ప్రేమ
చిలిపి కళ్ళ కదలిక ప్రేమ
చెప్పలేని నా మనస్సే ఒక మూగ ప్రేమ
నీ అందమైన నవ్వులతో నా జీవితం ప్రతి రోజూ ప్రారంభం అవ్వాలని కోరుతూ....
ఒక ప్రేమికుడు.....
రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటే
హఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....
నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీ
ప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదు
జీవితానికి జీవం పొసేది ప్రేమ
ఉక్కులాంటి హ్రుదయాన్ని కదిలించేది ప్రేమ
చిలిపి కళ్ళ కదలిక ప్రేమ
చెప్పలేని నా మనస్సే ఒక మూగ ప్రేమ
నీ అందమైన నవ్వులతో నా జీవితం ప్రతి రోజూ ప్రారంభం అవ్వాలని కోరుతూ....
ఒక ప్రేమికుడు.....
గతచిత్రం
కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది।
నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లోఏయే కోర్కెలు దాచుకున్నదీసముద్రం గుర్తుంచుకోదు।
కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకంతుదకంటా వెంటాడుతుంది।
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచిమరల మరల కళ్ళెదుట చూపెడుతుంది।
కలిసి కనుమరుగైన మనుషులు,అంది చేజారిన అవకాశాలు,అపరిపక్వతతో, అమాయకతతోపొంది,
పోగొట్టుకొన్న విలువైన అనుభవాలుకిక్కిరిసిన పలు శకలాలుగా తోచి గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది।
ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,అంతా ముగిసిన గతం లో కూడావింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది।
నిరుడు రాలిన ఆకులమీద ఏ చిత్రాలు గీసుకున్నదీ ఏ చెట్టు గుర్తుంచుకోదు।
పోయిన పున్నమిరాత్రి ఎగసిన అలల్లోఏయే కోర్కెలు దాచుకున్నదీసముద్రం గుర్తుంచుకోదు।
కాని, మనిషిని మాత్రం ఒక జ్ఞాపకంతుదకంటా వెంటాడుతుంది।
పొరలు పొరలుగా రాల్చిన గత రూపాల్ని అరల్లో దాచిమరల మరల కళ్ళెదుట చూపెడుతుంది।
కలిసి కనుమరుగైన మనుషులు,అంది చేజారిన అవకాశాలు,అపరిపక్వతతో, అమాయకతతోపొంది,
పోగొట్టుకొన్న విలువైన అనుభవాలుకిక్కిరిసిన పలు శకలాలుగా తోచి గతం మనసును ఉక్కిరి బిక్కిరి చేస్తుంది।
ఏమీ తెలియని భవిష్యత్తులోనే కాదు,అంతా ముగిసిన గతం లో కూడావింతైన మార్మికత యేదో నిండిఉంటుంది.
రాయాలని ఉంది!
నందన వనం లో ఎగిరే
రంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేం
కీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నైతేనేం
మనిషి మనస్సులో సదా పరుగులెత్తేకోరికల గురించి రాయాలని ఉంది॥
హేమంతం లో గాలిని నింపే పొగమంచులా నైతేనేం
గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా నైతేనేం
మనిషి మనసున నిండిన ఆర్ద్రత గురించి రాయాలని ఉంది॥
రాయాలని ఉంది.......
మనిషి ఆశలనూ, భావాలనూ,
చెరిగి పోని జీవిత సత్యాలనూ
నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది॥
రంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేం
కీకారణ్యం లో వేగంగా ఉరికే చిరుత పులిలా నైతేనేం
మనిషి మనస్సులో సదా పరుగులెత్తేకోరికల గురించి రాయాలని ఉంది॥
హేమంతం లో గాలిని నింపే పొగమంచులా నైతేనేం
గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా నైతేనేం
మనిషి మనసున నిండిన ఆర్ద్రత గురించి రాయాలని ఉంది॥
రాయాలని ఉంది.......
మనిషి ఆశలనూ, భావాలనూ,
చెరిగి పోని జీవిత సత్యాలనూ
నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది॥
నీ స్నేహం
కమ్మని కావ్యం నీ స్నేహం,
చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం,
నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం,
హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం,
నా కళ్ళలో ఆశ నీ స్నేహం,
నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......
చెరిగిపోని నీ దరహాసం నా ఙ్నాపకం,
నా వేకువ ఉషస్సులో నీ ఉషొదయం,
హ్రుదయం లో శిలగా నిలిచి పోయే మధురక్షణం నీ స్నేహం,
నా కళ్ళలో ఆశ నీ స్నేహం,
నే పలికిన తొలి కవితా రూపం నీ స్నేహం......
మళ్ళిరాని అవకాశం
కోల్పోవద్దు మరో అవకాశం
రాకపోవచ్చు తిరిగి నీ కోసం॥
మనసు విప్పి మాట్లాడడానికి,
ఒక మంచి మాటను చెప్పడానికీ,
ప్రేమిస్తున్నానని తెలుపుతూ,
ఒక సందేశం పంపించడానికీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఎంతో దూరాన వున్న,
అమ్మానాన్నల కోసం,
వారం, వారం ఫోనులో,
వార్తలు తెలిపే లేఖలో॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
అందరికీ రానిది ఆ,
అవకాశం వచ్చిందా
అదే ఒక అదృష్టం,
కర్తవ్యం నెరవేర్చే,
స్థితిలో నువ్వుంటే,
నీకు దేవుడు ఇచ్చిన పుణ్యం॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
మనసారా స్పందిస్తూ,
మమతలనే అందిస్తూ,
ఓ “థేంక్ యూ”, ఒక “సారీ”,
“ఐ లవ్ యూ” చెప్పేందుకు॥ …। కోల్పోవద్దు మరో అవకాశం
వచ్చిన దానిని వదిలీ,
ఎదురుచూడకు మరో సారి,
అతి విలువైన క్షణాల మధ్య,
ఉండొచ్చు కొన్ని జీవిత కాలాల వ్యవధి॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఆలసించబోకుమసలు,
ఆచరణను మరచీ,
కలగా కరిగే బ్రతుకున,
కావచ్చునిదే (నీ) ఆఖరి మజిలీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
రాకపోవచ్చు తిరిగి నీ కోసం॥
మనసు విప్పి మాట్లాడడానికి,
ఒక మంచి మాటను చెప్పడానికీ,
ప్రేమిస్తున్నానని తెలుపుతూ,
ఒక సందేశం పంపించడానికీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఎంతో దూరాన వున్న,
అమ్మానాన్నల కోసం,
వారం, వారం ఫోనులో,
వార్తలు తెలిపే లేఖలో॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
అందరికీ రానిది ఆ,
అవకాశం వచ్చిందా
అదే ఒక అదృష్టం,
కర్తవ్యం నెరవేర్చే,
స్థితిలో నువ్వుంటే,
నీకు దేవుడు ఇచ్చిన పుణ్యం॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
మనసారా స్పందిస్తూ,
మమతలనే అందిస్తూ,
ఓ “థేంక్ యూ”, ఒక “సారీ”,
“ఐ లవ్ యూ” చెప్పేందుకు॥ …। కోల్పోవద్దు మరో అవకాశం
వచ్చిన దానిని వదిలీ,
ఎదురుచూడకు మరో సారి,
అతి విలువైన క్షణాల మధ్య,
ఉండొచ్చు కొన్ని జీవిత కాలాల వ్యవధి॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
ఆలసించబోకుమసలు,
ఆచరణను మరచీ,
కలగా కరిగే బ్రతుకున,
కావచ్చునిదే (నీ) ఆఖరి మజిలీ॥ …। కోల్పోవద్దు మరో అవకాశం …।
కనిపించడం లేదు
నా మనసు కనిపించడం లేదు
నువ్వేమైన పట్టుకేల్లవా?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నాయి
ఆ భావాత్మక క్షణాలు ఇంకా జ్ఞాపకమే
రంగుల మధ్య రూపు దిద్దుకున్న నా జీవితం జ్ఞాపకమే
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నాయి
విప్లవాలు రగిల్చి ఉద్యమాలు తెచ్చిన పుస్తకాలున్నాయి
పుస్తకాల కోసం పడ్డ ఆ క్షణాలు ఇంకా జ్ఞాపకమే
ఇల్లంతా పరచుకున్న కవిత్వముంది
కవిత్వం మధ్య కదలాడే నా జీవితం ఉంది...
ఆశ్రద్దగా పడేసుకున్న నా గెలుపు భావ చిత్రాలున్నాయి...
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్య
చెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి .....
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
మిత్రమా , నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా..
నా మనసేమైనా పట్టుకేల్లవా ???
నువ్వేమైన పట్టుకేల్లవా?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నాయి
ఆ భావాత్మక క్షణాలు ఇంకా జ్ఞాపకమే
రంగుల మధ్య రూపు దిద్దుకున్న నా జీవితం జ్ఞాపకమే
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నాయి
విప్లవాలు రగిల్చి ఉద్యమాలు తెచ్చిన పుస్తకాలున్నాయి
పుస్తకాల కోసం పడ్డ ఆ క్షణాలు ఇంకా జ్ఞాపకమే
ఇల్లంతా పరచుకున్న కవిత్వముంది
కవిత్వం మధ్య కదలాడే నా జీవితం ఉంది...
ఆశ్రద్దగా పడేసుకున్న నా గెలుపు భావ చిత్రాలున్నాయి...
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్య
చెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి .....
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
మిత్రమా , నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా..
నా మనసేమైనా పట్టుకేల్లవా ???
నా పేరు స్నేహం!!
పరుగెత్తే లాంటి కాలంతో నువ్వూ పోటీ పడుతూ
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను !!!
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి ...
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను....
నీ జీవితంలో ప్రతి విజయానికి
నీ వాళ్ళంతా గర్వించి నప్పుడు కాస్తంత విచ్చుకొనే నీ
పెదవుల నుండి రాలిపడే పూవులోని తావి నేనవుతాను....
నా పేరే స్నేహం!!
ఒక కొత్త ఆలోచనతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినపుడు
నువ్వు మర్చిపోయిన ఓ చిన్ని జ్ఞాపకాన్ని భద్రంగా
దాచి ఉంచుకుని నీకందించడానికి నీ వెనుకే నేనుంటాను..
నిలకడ లేని కాలం నీ మనసుకి చేసే గాయాల
బాధ నీ కళ్ళలో కనిపించినపుడు ఆ
బాధను పంచుకొనే నీ బాధకు ఓదార్పు నేనవుతాను !!!
నిన్ను నువ్వు వెతుక్కొనే ప్రయత్నంలో
నేలోనికి నువ్వు నడిచి వెళ్లి పోయి ...
దారి మసకబారినపుడు ఆసరాగా చేయందించి నిన్ను
ముదుకు నడిపించడానికి నీతో నేనుంటాను....
నీ జీవితంలో ప్రతి విజయానికి
నీ వాళ్ళంతా గర్వించి నప్పుడు కాస్తంత విచ్చుకొనే నీ
పెదవుల నుండి రాలిపడే పూవులోని తావి నేనవుతాను....
నా పేరే స్నేహం!!
ప్రయాణం
ఈ ప్రయాణం నేను కోరుకున్నదే నేమో
ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు
ఈ సహప్రయానికులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు
ఇది వేల్లెచోటు నేను అడిగిందే అనుకుంటాను...
ఇది కదిలే దారి నాకు నచ్చేదేనని ఆశిస్తాను
ఇది బయల్దేరిన స్థలం మాత్రం నేను మెచ్చినది కాదు
ఇక్కడంతా చీకటి
ఇక్కడంతా ఇరుకు
ఇక్కడ చిన్న కునుకుకు కూడా అవకాశం లేదు
ఇక్కడంతా హడావుడి...
ఇక్కడంతా కదలిక తెలియని వేగం
ఇక్కడ మనసు విప్పి మాట్లాడడానికి ఎవరు లేరు
నాకు నేను ఉహలోకాన్ని అల్లుకుంటాను
నాకు నేను బెత్తెడు జాగా చెక్కుకుంటాను
నాకు నేను దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను...
ఈ విమానం నేను ఎక్కాలనుకున్నదే కాబోలు
ఈ సహప్రయానికులు మాత్రం నేను తెచ్చుకున్న వారు కారు
ఇది వేల్లెచోటు నేను అడిగిందే అనుకుంటాను...
ఇది కదిలే దారి నాకు నచ్చేదేనని ఆశిస్తాను
ఇది బయల్దేరిన స్థలం మాత్రం నేను మెచ్చినది కాదు
ఇక్కడంతా చీకటి
ఇక్కడంతా ఇరుకు
ఇక్కడ చిన్న కునుకుకు కూడా అవకాశం లేదు
ఇక్కడంతా హడావుడి...
ఇక్కడంతా కదలిక తెలియని వేగం
ఇక్కడ మనసు విప్పి మాట్లాడడానికి ఎవరు లేరు
నాకు నేను ఉహలోకాన్ని అల్లుకుంటాను
నాకు నేను బెత్తెడు జాగా చెక్కుకుంటాను
నాకు నేను దగ్గర కావడానికి ప్రయత్నిస్తాను...
నిద్ర
రోజంతా అవిశ్రాంతంగా ఆలోచనల
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది......
నిద్ర కనురెప్పల గవాక్షాలను
తాకే ముందు ఏదో గమ్మత్తైన భావన
బరువైన తామర పూవుల స్పర్శ
ముంగురుల చివర్లను కదిలించినట్లు
నీలాంబరి ఆనంద మందారాలు పూయించినట్లు
సన్నగా పాడే సెలయేటి ప్రవాహంలో
జలకన్యలా నేను సుతారంగా జారిపోతాను
నా దారిలో ఎన్నో సౌగంధికా పుష్పాలు
అనుభవాల పరిమళాలు వీచే సన్నజాజి పూగుత్తులు
రంగు రంగుల స్వప్నాల రెక్కలను
విప్పుతూ ఎగిరే సీతాకోకచిలుకలు....
అందమైన ఆలాపనలా సుళ్ళు తిరుగుతూ
కలల అలల మీద తేలే జ్ఞాపకాల ఆనవాళ్ళతో
జలపాతగీతమై సాగిపోయే నాకు
హఠాత్తుగా ఒక కొండ శిల అడ్డుగా నిలుస్తుంది
చటుక్కున కనులు విప్పేసరికి
ఉమ్మెత్త పువ్వులా ఉదయం తెల్లగా నవ్వుతుంది .....
జలతారు పోగుల్ని నేసి నేసి
అలసిన స్పృహ వెచ్చని చీకటి గుహలలో
ముడుచుకుని పడుకుంటుంది......
నిద్ర కనురెప్పల గవాక్షాలను
తాకే ముందు ఏదో గమ్మత్తైన భావన
బరువైన తామర పూవుల స్పర్శ
ముంగురుల చివర్లను కదిలించినట్లు
నీలాంబరి ఆనంద మందారాలు పూయించినట్లు
సన్నగా పాడే సెలయేటి ప్రవాహంలో
జలకన్యలా నేను సుతారంగా జారిపోతాను
నా దారిలో ఎన్నో సౌగంధికా పుష్పాలు
అనుభవాల పరిమళాలు వీచే సన్నజాజి పూగుత్తులు
రంగు రంగుల స్వప్నాల రెక్కలను
విప్పుతూ ఎగిరే సీతాకోకచిలుకలు....
అందమైన ఆలాపనలా సుళ్ళు తిరుగుతూ
కలల అలల మీద తేలే జ్ఞాపకాల ఆనవాళ్ళతో
జలపాతగీతమై సాగిపోయే నాకు
హఠాత్తుగా ఒక కొండ శిల అడ్డుగా నిలుస్తుంది
చటుక్కున కనులు విప్పేసరికి
ఉమ్మెత్త పువ్వులా ఉదయం తెల్లగా నవ్వుతుంది .....
డైరీలో ఒక పేజి
తొలి పొద్దువై వచ్చావు
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది
జాబిల్లివై వెలిగావు
కాలమంతా కౌగిలింతై
కలల అలల పై కదిలించావు
నీ కన్నుల్లో కనుపాపని చేసి
కమ్మని కలలే చూపావు
ఎడబాటుతో తడబడిపోయా
ఏకాంతం లో నిన్నే తలిచా
తొలి వలపు పిలుపు విన్నా
నీలి మేఘాలలో నీకై వెదికా
కలలలుగా కదిలే నీలి మేఘాలు
సంధ్య కాంతులకి తల్లడిల్లి
నిశబ్ద నిశీధిలో నలుపెక్కాయి
మసక మసక చీకటికి
సువాసనలద్దె మల్లెలమ్మ
మనసు విప్పితమకంగానవ్వింది
ధనమేరా.........
నాకు ఎంతో ఇష్టమైన పాటలలొ, ఇది ఒకటి. ధనము, దాని విలువ గురించి ఎంతో బాగా వ్రాసారు. ముఖ్యంగా కొన్ని వాఖ్యాలు అద్భుతం. "ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా ", "శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం"
వ్రాసినది:(తెలియదు)
పాడినది: ఘంటసాల
చిత్రం: లక్ష్మి నివాసం.
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
మానవుడె ధనమన్నది సృజియించెనురా
దానికి తానె తెలియని దాసుడాయెరా!
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడపెట్టరా
కొండలైన కరగి పోవు కూర్చొని తింటె
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటె.
కూలివాడి చెమటలోన ధనమున్నది రా
కాలి కాపు కండల్లొ ధనమున్నది రా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీ దేవిని నిరసించుట తీరని దోషం.
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా ", "శ్రమజీవికి జగమంతా లక్ష్మి నివాసం"
వ్రాసినది:(తెలియదు)
పాడినది: ఘంటసాల
చిత్రం: లక్ష్మి నివాసం.
ధనమేరా అన్నిటికి మూలం
ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం
మానవుడె ధనమన్నది సృజియించెనురా
దానికి తానె తెలియని దాసుడాయెరా!
ధనలక్ష్మిని అదుపులోన పెట్టినవాడే
గుణవంతుడు, బలవంతుడు, భగవంతుడు రా
ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా
లేనినాడు ఒడలు వంచి కూడపెట్టరా
కొండలైన కరగి పోవు కూర్చొని తింటె
అయ్యో! కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటె.
కూలివాడి చెమటలోన ధనమున్నది రా
కాలి కాపు కండల్లొ ధనమున్నది రా
శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం
ఆ శ్రీ దేవిని నిరసించుట తీరని దోషం.
బెంగుళూరులో భోజనాల గోల
బెంగుళూరులో " ఆంధ్రా స్టైల్ భోజనం" అన్న బోర్డ్ పెడితే చాలు, జనాలు తండోపతండాలుగా ఎగబడతారు. బోర్డ్ ఒక్కటి చాలు, లోపల మనం పచ్చ గడ్డి పెట్టినా సుబ్బరంగా చెల్లుతుంది. ఇక గొందుకి రెండు ఆంధ్రాస్టైల్ పూటకూళ్ళ దుకాణాలు. ఇక ఆంధ్రాస్టైల్ అని పెట్టాక గోంగూర, ఆవకాయ ఉండాలి కదా. అవి ఒక రెండు డబ్బాలు పడేస్తారు. అవితింటే ఇక జన్మలో వాటి జోళికి వెళ్ళరు . ఇక అరిటాకులో వడ్డనలు స్టార్ట్. అంటె అన్ని అలా అని కాదు . కాని చాలా వరకు అంతే.
ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.
ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)
ఇలాంటి భోజనం ఇలా ఎగబడి ఎలా తింటారా అనుకునేవాణ్ణి. ఇక హోటల్లకి వారాంతంలో వెళ్ళామా అంతే సంగతి. తిరుపతి పంక్తులు దేనికి పనికిరావు. కాని అక్కడ తినేవారు సకుటుంబ సపరివార సమేతంగా వస్తారు. నలుగురికి తక్కువ కాకుండా, పిల్లలని వేసుకొని బయలు దేరతారు. ఇలాంటి బిజి జీవితంలో ఒకరితో ఒకరికి సమయం దొరకడమే తక్కువ. అలాంటి సమయంలో చక్కగా కలిసి వండుకు తింటే ఎంత సుఖం, ఆ నానా గడ్డి తినే బదులు.
మా శతమర్కటులకయితే తప్పదు మరి. వంటలు రావు వచ్చినా చేసుకునే సదుపాయాలు ఉండవు.
ఈ వేళ దాదాపు అరగంట వేచినాక సీటు దొరికింది. ఆ లైన్లొ బ్రహ్మచారుల్లాగా ఉన్నవాళ్ళు దాదాపుగా లేరు. దీని బట్టి నాకర్థమయ్యిందేంటంటే, బ్రహ్మచారులు ఎంచక్కా వంటలు చేస్తున్నారు. గృహస్థలు పూటకూళ్ళ దుకాణాలెమ్మట పడుతున్నట్టున్నారు. మా చిన్నప్పుడయితే ఎప్పుడు హోటల్ లో తిన్న జ్ఞాపకాలు లేవు. కాని ఇప్పుడు ప్రతి వారంలో కనీసం ఒక్కసారైనా బయటకి వెళ్ళాల్సిందే. ఇలా గృహస్థులు మాకు పోటి వస్తే మా పరిస్థితి ఏం కాను??? స్వతంత్ర భారతదేశంలో కనీసం ఇష్టం వచ్చినట్టు భొజనం చేసే హక్కు లేదా అని నిలదీస్తే నేనేమి చెయ్యలేను :)
11, జనవరి 2011, మంగళవారం
సంక్రాంతి శుభాకాంక్షలు
సంక్రాంతి చలి మంటలు,భోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,గంగిరెంద్దుల వారి మేళం,హరిదాసులు,గాలి పటాలు,ముగ్గులు,గొబ్బిళ్ళుభోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,సంక్రంతి రోజు పాయసాలు, క్రొత్త బట్టలు, ఒకటేమిటి. అన్నీ అన్నీ ఈ సారి పండుగకు చెయలనుకొన్నా ,కొన్ని చూడాలను కొన్నా. ఈసారి పని ఒత్తిడి వలన మా గ్రామమునకు వెళ్లుట సాద్య పడలేదు
25, డిసెంబర్ 2010, శనివారం
నూతన సంవత్సర శుభాకాంక్షలు
కొత్త ఆశయాలకు కొత్త భావాలకు
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2011 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2011లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.
పరికల్పనలు బంగారు కలలకు
కొన్ని సత్యాలకు, స్నేహ బంధాలకు
త్యాగాలకు రాగాలకు
ఆత్మీయానుబంధాలకు స్వాగతం! సుస్వాగతం!!
2011 నీకు ఘన స్వాగతం
పరిగెడుతున్న కాలం పురివిప్పింది నెమలిలా
వేయి వీణలను మీటి నవ వసంత, సలలిత రాగసుధా గానాన్ని
వినిపించి వీనుల విందు చేసింది
నవ జ్యోతులను వెలిగించింది
ప్రతి అణువు పులకించింది
ప్రతి గుండె ఆనందంతో పరవశించింది
జగతిన క్రొత్త సంవత్సరం మెరిసింది
విశ్వవేధికపై మధువసంతం మురిసింది
జీవితాలకు క్రొత్త ఊపిరి పోసింది
2011లోనైనా మానవతకు విలువ ఉంటుందని ఆశిద్దాం
జాతి, మత, భాషా ప్రాంతీయ భేదాలు విడనాడి
విశ్వశాంతికై ఐక్యతాగీతాన్ని పాడుకుందాం.
సంతోషకరమైన క్రిస్ఠ్మస్ !
ఏమండీ
మీరు ఏలా ఉన్నారు ?
చాలా కాలమైంది మిమ్మల్ని చూసి !
మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
మీకు సంతోషకరమైన క్రిస్ఠ్మస్
ధన్యవాదములు
మీరు ఏలా ఉన్నారు ?
చాలా కాలమైంది మిమ్మల్ని చూసి !
మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది
మీకు సంతోషకరమైన క్రిస్ఠ్మస్
ధన్యవాదములు
8, డిసెంబర్ 2010, బుధవారం
నా తొలి బుల్లి కవిత్వం – ఓ మనసు తత్వం !
మదిలొ మెదిలే ఆలొచనలకు మనసుని మాటలుగా, భావాన్ని అక్షరాలుగా మార్చాలనే పోరాట పటిమతొ “కవిత్వం” అనే సాగరం లొ ఒక చినుకుగా ప్రవహించాలని ఆశతొ ఈ నా తొలి బుల్లి కవిత్వం(?)
పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో
ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో
సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో
చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో
గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో
వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో
దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో
కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో
వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!
పెదవి పలకని మాటలెన్నో, మాటకు అందని మౌనాలెన్నో
ఊహకు అందని ఊసులెన్నో,బాషకు అందని భావాలెన్నో
సమయం సరిపోని స్వప్నాలెన్నో, తనువు గుర్తించని స్పర్శలెన్నో
చూపులకు తెలియని అందాలెన్నో, మంతనాలు సాగని రోజులెన్నో
గుండె దాటని తలపులెన్నొ,గుప్పిట్లొ దాచలేని వన్నెలెన్నో
వయసుకు అందని కోరికలెన్నొ, వర్ణనకు అందని సొగసులెన్నో
దాచకుండ ఉంచని తీపి గుర్తులెన్నో, పాటకు అందని రాగాలెన్నో
కలుపు ఎరుగని వలపులెన్నొ, పంచుకోలేని అనుభవాలెన్నో
వ్యక్తపరచని అనుభూతులెన్నో, ఎన్నెన్నో.. మరెన్నో…!!!
నారపరెడ్డి రామిరెడ్డి
ప్రతి చేయి నమస్కరిస్తుంది
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్ రెక్కల వలె”
అయితే ఆ మనస్సులలో
మనస్సులేదు
ఆ చేతులకది
అలవాటయిందీ
సిగ్నల్ రెక్కల వలె”
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
