రగులుతున్న ఆంధ్రావని ఎందరో త్యాగధనుల పుణ్యభూమి
నేడు రాజకీయాలకు బలై ఖండమై పోయింది
ముక్కలు చెక్కలై కుక్కలు చింపిన విస్తరిలా మారబోతుంది
అన్నదమ్ములు దాయాదులై తల్లిని పంచుకుంటారా
ఏది తెలంగానం ఏది ఆంధ్రరాజ్యం ఏది సీమరత్నం
కులాల చిచ్చు నేడు భాషకు కూడా పాకిందా..
పూర్ణ భోజనాన్ని చేతులారా కుక్కలపాలు చేస్తారా.
స్వార్థ రాజకీయాల కుతంత్ర యుక్తులకు బలై
వెర్రి ఆవేశాన్ని నింపుకొని సాగించే ఈ దహనకాండ
మారణ హోమం ఎవరి తృప్తి కోసం , ఎవరి మనుగడ కోసం
అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే
ఈ కరాళ నృత్యం, పైశాచిక ఆనందం, అఖండ భారతావని
భాషా చరిత్రలో మరో నికృష్ట అధ్యాయం .
సర్వ మానవాళి సిగ్గుతో తలవొంచుకునే దుర్దినం.
ఎవరి స్వార్థం కోసం ఈ అభినవ పద్మవ్యూహం
ఎందరో ఆభిమన్యులు కలి తంత్రాలకు బలై,
సొంత సోదరుల చేతిలో పతనమయ్యే ఈ
అభినవ భారత మహా సంగ్రామం, భాషా సంగ్రామం
ఆగేదేపుడు..దీనికి అంతమెపుడు..పగసేగలు చల్లారేదెపుడు
22, మార్చి 2011, మంగళవారం
తెలుగు తల్లి మరో మారు పురిటి నొప్పులు పడుతున్నది
వేల ఏళ్ళ చరిత మనది
ఘనమైన కీర్తి మనది
విశిష్ట సంస్కృతి మనది
విభిన్న పద్ధతి మనది.
కోటిలింగాల శాతవాహనులు
విజయపురి ఇక్ష్వాకులు
ఓరుగల్లు కాకతీయులు
వేంగి చాళుక్యులు
చోళులూ రాయలూ
ఎందరెందరో...
రెండు సహస్రాబ్దుల పాటు
తెలుగు వారిని ఆంద్ర జాతిని
ఒక్క త్రాటి పై నడిపి
ఒకే సంస్కృతి గా నిలిపి
భరత వర్ష మందు
ఆంధ్ర జాతి భళిరా
యని దేశ దేశముల యందు
మన కీర్తిని ప్రజ్వలింప జేసిరి.
వేదాల లో ఉపనిషత్ లలో
రామాయణ భారతం లో
మనమంతా ఒక్కటని
ఆంధ్ర జాతి మనదని
తెలుగు వారం మనమని
చదివి విని ఘర్వ పడే
తెలుగు వారలందరికీ
చెప్ప మనసు రాని గాయం చే
ఏర్పడిన ఐదు వందలేళ్ళ
ఎడబాటును అడ్డు చూపి
ఐదు దశాబ్దాల నుంచి
స్వార్ధ పరులు కొందరు
తెలంగాణ పేరిట
వేరు కుంపటి రేపుతుంటే...
తెలుగు తల్లి మరో మారు
పురిటి నొప్పులు పడుతున్నది
ఈ చీలిక తానోర్వ లేనని
భరత మాతకు మొరపెట్టుకుంటున్నది!
తెలుగు వీర లేవరా తెలంగాణ సోదరా
చీలిక పేరు చెప్పే నాయకుల
నాలుకలు చీల్చి చెండాడరా.
తెలుగు వారలందరం
ఎప్పటికీ ఒక్కటేననీ-
తెలుగు బాష మనదని
ఆంధ్ర జాతి మనదని
మనమంతా ఆంధ్రులమని
భరత మాత బిడ్డలమని-
దిక్కులు పిక్కటిల్లేలా
సమైఖ్యాంధ్ర నినాదాన్ని
యావదాంధ్ర జాతి లో
ఏకమై వినిపించరా.
ఘనమైన కీర్తి మనది
విశిష్ట సంస్కృతి మనది
విభిన్న పద్ధతి మనది.
కోటిలింగాల శాతవాహనులు
విజయపురి ఇక్ష్వాకులు
ఓరుగల్లు కాకతీయులు
వేంగి చాళుక్యులు
చోళులూ రాయలూ
ఎందరెందరో...
రెండు సహస్రాబ్దుల పాటు
తెలుగు వారిని ఆంద్ర జాతిని
ఒక్క త్రాటి పై నడిపి
ఒకే సంస్కృతి గా నిలిపి
భరత వర్ష మందు
ఆంధ్ర జాతి భళిరా
యని దేశ దేశముల యందు
మన కీర్తిని ప్రజ్వలింప జేసిరి.
వేదాల లో ఉపనిషత్ లలో
రామాయణ భారతం లో
మనమంతా ఒక్కటని
ఆంధ్ర జాతి మనదని
తెలుగు వారం మనమని
చదివి విని ఘర్వ పడే
తెలుగు వారలందరికీ
చెప్ప మనసు రాని గాయం చే
ఏర్పడిన ఐదు వందలేళ్ళ
ఎడబాటును అడ్డు చూపి
ఐదు దశాబ్దాల నుంచి
స్వార్ధ పరులు కొందరు
తెలంగాణ పేరిట
వేరు కుంపటి రేపుతుంటే...
తెలుగు తల్లి మరో మారు
పురిటి నొప్పులు పడుతున్నది
ఈ చీలిక తానోర్వ లేనని
భరత మాతకు మొరపెట్టుకుంటున్నది!
తెలుగు వీర లేవరా తెలంగాణ సోదరా
చీలిక పేరు చెప్పే నాయకుల
నాలుకలు చీల్చి చెండాడరా.
తెలుగు వారలందరం
ఎప్పటికీ ఒక్కటేననీ-
తెలుగు బాష మనదని
ఆంధ్ర జాతి మనదని
మనమంతా ఆంధ్రులమని
భరత మాత బిడ్డలమని-
దిక్కులు పిక్కటిల్లేలా
సమైఖ్యాంధ్ర నినాదాన్ని
యావదాంధ్ర జాతి లో
ఏకమై వినిపించరా.
21, మార్చి 2011, సోమవారం
కనుమరుగవుతున్న పల్లె జీవనం...
మారిపోయిన పల్లె జీవనం... కనుమరుగవుతున్న ఆ ఆత్మీయ జీవితం..ఎదుగుతున్న దేశంలో.... విదేశీ సంపద ఇబ్బడి ముబ్బడిగా వచ్చి వాలుతుంటే అందినంత అందుకోవాలనే ఆత్రంతో నగరానికిపరుగులు పెడుతున్న మన పల్లె వాసులు..నేను కేరింతలు కొట్టిన ఆ చెరువు గట్ట్లు..ఇప్పుడు అంబరాన్ని తాకే కాంక్రీటు ప్లాట్లు.నేను ఎక్కిన ఆ తియ్యటి జామ చెట్టు..నేను కోసిన ఆ అల్ల నేరేడు కొమ్మఇప్పుడు ఆ కాంక్రీటు గోడల మధ్య నీర్జీవంగా వేలాడే ఉయ్యాల దిమ్మ.సాయం సంధ్యల్లో ఆరుబయట కూర్చున్నప్పుడురివ్వున ఎగురుతూ తీతువు పిట్ట చేసే సరాగాలుఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతి తో వెలిసినబార్లో మనుషులు చేసే వికారాలు.యాంత్రిక జీవనంలో తాత్కాలికంగా..తార్కికంగా...తాంత్రికంగామాట్లాడే మనుషుల మధ్యకు వెళుతున్న ఓ పల్లె జీవులారామీరే మన సంస్కృతీ సౌరభాలకు ప్రతీకలు.మీరే నిష్కల్మషమైన మనసుకు దర్పణాలు.
రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీటి?
నాయకుల సంఖ్యకీ, కుర్చీల సంఖ్యకీ మధ్య సమన్వయం కుదర్చడం కోసం, ఏనాడో మరుగున పడిన మండలిని వెలికి తీసి పదవుల పందేరం మొదలు పెట్టారు. ఈ మండలి పుణ్యమా అని రాష్ట్రం కొత్తగా సాధించింది ఏమీ కనిపించక పోయినా, ఐదేళ్లకోసారి జరగాల్సిన ఎన్నికలని అడపాదడపా జరిపేసుకోడానికి బోల్డంత సాయం చేస్తోంది. దీంతో ఎన్నికలనేవి మరింత బహుళార్ధ సాధకంగా మారిపోయాయి. ఓ ఎన్నికల నోటిఫికేషన్ రావడం ఆలస్యం. సంబంధిత ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులూ మొదలు పెట్టక్కర్లేదు. ఈ మొదలు పెట్టకపోవడం అన్నది ఏ పద్దు కింద జరుగుతున్నప్పటికీ, ప్రజలు సహృదయంతో 'మోడల్ కోడ్' ఖాతాలో వేసేసుకుంటారు. అధికారులు, ఉద్యోగులకి కొంచం ఆటవిడుపు.ఆశావహులతో పార్టీ ఆఫీసులన్నీ కళకళలాడిపోతాయా? ఏ పుట్టలో ఏ పాముందో అనే భావంతో టిక్కెట్ ఆశించే వాళ్ళు పార్టీ ఆఫీసులో అందరితోనూ సత్సంభాదాలు నెరపుతారా? తమ నాయకుడికి టిక్కెట్ వచ్చేవరకూ, ఒకవేళ వస్తే ఎన్నికలయ్యే వరకూ అనుచరగణానికి అక్షరాలా పండుగేనా? స్వతహాగా కొంత, టీవీ చానళ్ళ పుణ్యమా అని మరికొంత వోటర్లు తెలివి మీరారు కాబట్టి, వాళ్లకి రావాల్సింది వాళ్ళు పోటీలో ఉన్న అందరినుంచీ నిక్కచ్చిగా రాబట్టుకుంటారా? ఇవన్నీ పైకి కనిపించే ప్రయోజనాలు. ఇంకా పెరిగే మద్యం అమ్మకాలు, ఒక్కసారిగా డబ్బు చెలామణి లోకి రావడంతో పెరిగే మార్కెట్ లావాదేవీలు... ఇలా ఒకటేమిటి? వెతికే కొద్దీ ప్రయోజనాలు కనిపిస్తూనే ఉంటాయి.
అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?
అసలు నన్నడిగితే, నల్లడబ్బు వెలికి తియ్యడం కోసం రకరకాల స్కీములు ఆలోచించడం, సభల్లో చర్చలు జరిపి సమయం వృధా చేయడం పూర్తిగా అనవసరం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలని ఐదేళ్లకోసారి కాక, ఏడాదికోసారిగా మారిస్తే దాచిన డబ్బంతా చెలామణి లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే, నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా, ఏ వ్యాపారాలు చేసే వాళ్లైనా చివరికి చేరేది రాజకీయాల్లోకే కదా. ఒకసారి వచ్చేసాక, ఐదేళ్ళ వరకూ డబ్బు సంపాదించడమే తప్ప, ఖర్చు చేద్దామన్నా చేసే అవుట్లెట్ ఉండడం లేదిక్కడ. దీంతో, డబ్బు మురిగిపోయి విదేశీ బ్యాంకులవైపు పరిగెత్తుతున్నారు మన నాయకులు. అదే, ఏడాదికోసారి ఎన్నికలైతే, ఎప్పటికప్పుడు లెక్క, జమ తేలిపోతూ ఉంటుంది. అందరికీ సమన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఓ ప్రభుత్వం పాతబడే లోగానే మరో కొత్త ప్రభుత్వం వచ్చేస్తుంది కాబట్టి, ఎవరికీ 'అసలు ప్రభుత్వం ఉందా?' లాంటి సందేహాలు కలగవు. ఆలోచించాల్సిన విషయమే కదూ?
20, మార్చి 2011, ఆదివారం
జీవితం ఒక నిరంతర పోరాటం
ప్రతి పనికి ఒకప్రారంభం.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.
ఆటో వాలా - బాడీ సైకాలజీ :)
హైదరాబాదు ఆటో లో ప్రయాణించే బ్లాగు స్నేహితులకి చిట్కాలు.
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.
ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.
ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.
ఆటో వాలా (45-55 వయసు)
వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.
ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .
ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.
మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.
ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.
చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.
ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.
ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.
ఆటో వాలా (45-55 వయసు)
వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.
ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .
ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.
మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.
ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.
చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము
ఒక్కసారిగా నమ్మకాలన్నీ చెరిగిపోయాయి
నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......
తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...
గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను
ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి
ఆర్టికల్ 19
ప్రజాస్వామ్యానికి ఈమద్య కాలంలో అర్దం మారుతున్నట్టుగా వుంది...కుల మత జాతి వర్ణ లింగ ప్రాంతీయ బాషా బేదాలు లేనిది నా భారతదేశం అని చెప్పటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే...... ఇప్పటి వరకు కులాలు మతాల పేరుతో కొట్టుకున్న మనం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేశాము అదే ప్రాంతీయత.... ప్రతీచోట పని లేని, పస లేని, అధికారంలో లేని పనికిమాలిన పార్టీలకు, చోటా మోట నాయకులకు ఇది ఒక AK 47 లాంటిది... పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రౌడి మూకను తయారు చేసి వాళ్ళకు బీరు, బిర్యాని ఇచ్చి ప్రాంతీయత పేరుతో అమాయకులయిన ఒక పదిమందిని కొట్టి పేపర్లో ఫొజులివ్వటం ఈమద్య కాలంలో ఒక అలవాటులా మారింది...
ఆంధ్రప్రదేశ్...
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......
ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...
ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".
ఆంధ్రప్రదేశ్...
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......
ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...
ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".
పిచ్చి వాడి చేతికి రాయి దొరికిందన్న మాట.
టీవీ నైన్ లో మళ్లీ తిరుమలపై సంవాదం అంటూ స్టోరీ ప్రసారం అయింది. కొంత విషయం కొత్తది అయినా, మొత్తం మ్యాటర్ పాతదే. తిరుమల కొండ మీద బోలెడంత అవినీతి జరిగిపోతోంది. అపచారం జరిగిపోతోంది. దేవుడి సన్నిధి లో జరిగేదంతా తప్పుల తడకే. ఒక్క టీవీ నైన్ అనే కాదు, చాలా చానెళ్లు ఈ మధ్య కాలంలో ఈ రూట్ లో తెగ ప్రచారం చేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతోంది. నిజంగానే తిరుమలలో పరిస్థితి అంత దిగజారిపోయిందా.. తిరుమల వైభవాన్ని దిగజార్చే పనులు ఎందుకు జరుగుతున్నాయి.
దీని వెనుక ఒక లాజిక్కు ఉంది. దీన్ని టీవీ భాషలో రేటింగ్ అంటారు. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను ఎంత మంది చదువుతున్నారు అనేది తెలుసుకోవాలంటే సర్క్యులేషన్ చూస్తాం. ఎన్ని కాపీలు ప్రచురిస్తున్నారు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయో చూస్తాం. దాన్ని బట్టి ఏ పత్రిక కు పాపులారిటీ ఉంది, ఏది టాప్ పేపర్ అన్నది చూస్తారు. దీని ఆధారంగా ఎడ్వర్టయిజ్ మెంట్ లు ఇస్తారు. టీవీ ఛానెళ్లు వచ్చే సరికి రేటింగ్ ఆధారంగా అడ్వర్టయిజ్ మెంట్లు ఇస్తారు. ఈ రేటింగ్ అన్నది - ప్రతీ అరగంట నిడివి లోనూ ఏ ఛానెల్ ఎంత మంది చూస్తున్నారు అనేది లెక్క గడతారు. ఈ దిక్కుమాలిన లెక్క ప్రకారం తిరుమల మీద వార్తలు ప్రసారం చేసిన ప్రతీసారి రేటింగ్ లు వస్తున్నాయన్న సంగతి ఛానెళ్లకు అర్థం అయింది. అంటే పిచ్చి వాడి చేతికి రాయి దొరికిందన్న మాట.
తిరుమల వేంకటేశ్వర స్వామిని కానీ, గుడిని కానీ తెర మీద చూపితే చాలు జనం బాగా చూస్తారు. మంచిగా స్వామి వైభవాన్ని , స్వామి మహిమల్ని చూపించవచ్చు. కానీ, మన మెదడంతా భ్రష్టు పడితే తప్ప టీవీ ఛానెళ్ల లో హెడ్ల స్థాయికి ఎదగరు. అందుచేత పుచ్చిపోయిన మెదడుతో ఆలోచించే ఈ హెడ్లు తిరుమలను కూడా అదే దృష్టి తో చూస్తారు. అందుకే తిరుమల మీద పదే పదే నెగటివ్ స్టోరీలు చేసి ప్రసారం చేస్తుంటారు. ఎటూ రేటింగ్ వస్తుంది కాబట్టి మేనేజిమెంట్ లు కూడా అదే పని గా ప్రోత్సహిస్తుంటాయి. ఏ చిన్న పొరపాటు దొర్లినా, తప్పిదం చోటు చేసుకొన్నా.. ఆకాశం విరిగి నేల మీద పడిపోతుంది అన్న రేంజ్లో ప్రచారం చేస్తుంటారు.
అంతమాత్రాన తిరుమల అంతా సవ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పలేం. కానీ, అంతకన్నా అవినీతి లో, ఘోరమైన వ్యవస్థలో కూరుకొని పోయిన వ్యవస్థ లు చాలా ఉన్నాయి. ముమైత్ ఖాన్ అయిటమ్ సాంగ్ పెడితే జనం చూస్తారని తెలిస్తే చాలు.. ప్రొడ్యూసర్లంతా గుడ్డలిప్పే డాన్స్ లు ఎందుకు పెట్టిస్తారో ఇది కూడా అంతే. తిరుమల మీద ఎంత నెగటివ్ చేస్తే, అంత రేటింగ్ అన్న మాట. దీనికి తోడు, వీటి మీద చర్చల్లో పాల్గొనేందుకు కొందరు ఆస్థాన పండితులు కూడా హైదరాబాద్ లో సిద్దంగా ఉంటారు. వీరికి తోడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంస్థలు ఉండనే ఉన్నాయి. భారతీయ సంస్కృతి మీద దాడి చేయటం మాత్రమే ఏకైక లక్ష్యంగా పని చేసే ఈ సంస్థ ల ప్రతినిధులకు భలే ప్రచారం కూడా దొరుకుతుంది.మమ్మల్ని క్షమించు వెంకన్నా.
దీని వెనుక ఒక లాజిక్కు ఉంది. దీన్ని టీవీ భాషలో రేటింగ్ అంటారు. న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లను ఎంత మంది చదువుతున్నారు అనేది తెలుసుకోవాలంటే సర్క్యులేషన్ చూస్తాం. ఎన్ని కాపీలు ప్రచురిస్తున్నారు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయో చూస్తాం. దాన్ని బట్టి ఏ పత్రిక కు పాపులారిటీ ఉంది, ఏది టాప్ పేపర్ అన్నది చూస్తారు. దీని ఆధారంగా ఎడ్వర్టయిజ్ మెంట్ లు ఇస్తారు. టీవీ ఛానెళ్లు వచ్చే సరికి రేటింగ్ ఆధారంగా అడ్వర్టయిజ్ మెంట్లు ఇస్తారు. ఈ రేటింగ్ అన్నది - ప్రతీ అరగంట నిడివి లోనూ ఏ ఛానెల్ ఎంత మంది చూస్తున్నారు అనేది లెక్క గడతారు. ఈ దిక్కుమాలిన లెక్క ప్రకారం తిరుమల మీద వార్తలు ప్రసారం చేసిన ప్రతీసారి రేటింగ్ లు వస్తున్నాయన్న సంగతి ఛానెళ్లకు అర్థం అయింది. అంటే పిచ్చి వాడి చేతికి రాయి దొరికిందన్న మాట.
తిరుమల వేంకటేశ్వర స్వామిని కానీ, గుడిని కానీ తెర మీద చూపితే చాలు జనం బాగా చూస్తారు. మంచిగా స్వామి వైభవాన్ని , స్వామి మహిమల్ని చూపించవచ్చు. కానీ, మన మెదడంతా భ్రష్టు పడితే తప్ప టీవీ ఛానెళ్ల లో హెడ్ల స్థాయికి ఎదగరు. అందుచేత పుచ్చిపోయిన మెదడుతో ఆలోచించే ఈ హెడ్లు తిరుమలను కూడా అదే దృష్టి తో చూస్తారు. అందుకే తిరుమల మీద పదే పదే నెగటివ్ స్టోరీలు చేసి ప్రసారం చేస్తుంటారు. ఎటూ రేటింగ్ వస్తుంది కాబట్టి మేనేజిమెంట్ లు కూడా అదే పని గా ప్రోత్సహిస్తుంటాయి. ఏ చిన్న పొరపాటు దొర్లినా, తప్పిదం చోటు చేసుకొన్నా.. ఆకాశం విరిగి నేల మీద పడిపోతుంది అన్న రేంజ్లో ప్రచారం చేస్తుంటారు.
అంతమాత్రాన తిరుమల అంతా సవ్యంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని చెప్పలేం. కానీ, అంతకన్నా అవినీతి లో, ఘోరమైన వ్యవస్థలో కూరుకొని పోయిన వ్యవస్థ లు చాలా ఉన్నాయి. ముమైత్ ఖాన్ అయిటమ్ సాంగ్ పెడితే జనం చూస్తారని తెలిస్తే చాలు.. ప్రొడ్యూసర్లంతా గుడ్డలిప్పే డాన్స్ లు ఎందుకు పెట్టిస్తారో ఇది కూడా అంతే. తిరుమల మీద ఎంత నెగటివ్ చేస్తే, అంత రేటింగ్ అన్న మాట. దీనికి తోడు, వీటి మీద చర్చల్లో పాల్గొనేందుకు కొందరు ఆస్థాన పండితులు కూడా హైదరాబాద్ లో సిద్దంగా ఉంటారు. వీరికి తోడు జన విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంస్థలు ఉండనే ఉన్నాయి. భారతీయ సంస్కృతి మీద దాడి చేయటం మాత్రమే ఏకైక లక్ష్యంగా పని చేసే ఈ సంస్థ ల ప్రతినిధులకు భలే ప్రచారం కూడా దొరుకుతుంది.మమ్మల్ని క్షమించు వెంకన్నా.
19, మార్చి 2011, శనివారం
అందరికీ హొలీ శుభాకాంక్షలు!
ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!
మరో చెర్నోబిల్ ఘటన!!!!!!!!!!!!!!!!!
* పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు
* అణు ధార్మికతతో పలు రకాల కాన్సర్ లు
* జపాన్ లో పుట్టబోయే పిల్లలకు ఇక అంగవైల్యమేనా?
* తుడిచి పెట్టుకుపోనున్న జపాన్ ?
* హిరోషిమా ఘటనకంటే తీవ్రంగా రేడియోషన్ ?
జపాన్ లో భూకంపం అనంతరం..అణు విద్యుత్ ప్లాంట్ ల నుంచి వెలువడే రేడియో యాక్టివేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రేడియో యాక్టివేషన్ కు గురైన ఆహారం, పదార్ధాలు తీసుకోవటం వల్ల పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు వచ్చి ..మొత్తం దేశం తుడిచి పెట్టుకు పోనుందా? ఈ ఆందోళన తో అక్కడి సైంటిస్టులు, డాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు.
టెక్నాలజీ లో అందరి కంటే ముందుండే ..జపాన్ ఈ కొత్త సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జపాన్ లో సంభవించిన భూకంపం తాలూకు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధతో సహా అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
భూకంపం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ లకు ముప్పు ఏర్పడి ద్వారా అణు ధార్మికత వెలువడటంతో అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిప్రభావంతో నీరు ,ఆహారం కలుషితమవటం ద్వారా పుట్టిన , పుట్టబోయే పిల్లలకు బోన్, లంగ్, లుకేమియా, ధైరాయిడ్ రావచ్చని , ప్రమాదకర స్ధాయిలో కాన్సర్ సంక్రమించే ప్రమాదం వుందని భయపడి చస్తున్నారు.
సముద్రంలో చోటు చేసుకునే రేడియోషన్ గుర్తించటానికి తగిన కొలమానాలు లేవని చైనాలోని పాధాలాజిస్టులు చెపుతున్నారు. గాలిలో కలిసిపోయే రేడియోషన్ వల్ల పంటలు , సముద్ర ఉత్పత్తులు ,తాగునీరు కలుషితం అవుతోందన్న భయం జపాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వల్ల మహిళలకు గర్భవిచ్ఛితి జరిగే ప్రమాదం వుందని డాక్టర్లు వర్రీగా వున్నారు. పురుషులైతే .పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోతారని .. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
హిరోషిమా ఘటనను తీసుకుంటే నాటి బాధితుల్లో ఎక్కువమంది రేడియోషన్ ప్రభావం వల్ల ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారని చికిత్స చేసిన డాక్టర్లు గుర్తుచేసుకుంటున్నారు. అణు ధార్మికతను ..కొలవటానికి తగిన ప్రామాణికత లేదని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసియాదేశాలైన ధాయ్ లాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు జపాన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఓ కన్నేశాయి.
చెర్నోబిల్ ఘటన దృష్ట్యా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. రేడియోషన్ తమ దేశాలకు విస్తరించి ప్రజలకు ముప్పుగా పరిణమించే అవకాశాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.
* అణు ధార్మికతతో పలు రకాల కాన్సర్ లు
* జపాన్ లో పుట్టబోయే పిల్లలకు ఇక అంగవైల్యమేనా?
* తుడిచి పెట్టుకుపోనున్న జపాన్ ?
* హిరోషిమా ఘటనకంటే తీవ్రంగా రేడియోషన్ ?
జపాన్ లో భూకంపం అనంతరం..అణు విద్యుత్ ప్లాంట్ ల నుంచి వెలువడే రేడియో యాక్టివేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రేడియో యాక్టివేషన్ కు గురైన ఆహారం, పదార్ధాలు తీసుకోవటం వల్ల పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు వచ్చి ..మొత్తం దేశం తుడిచి పెట్టుకు పోనుందా? ఈ ఆందోళన తో అక్కడి సైంటిస్టులు, డాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు.
టెక్నాలజీ లో అందరి కంటే ముందుండే ..జపాన్ ఈ కొత్త సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జపాన్ లో సంభవించిన భూకంపం తాలూకు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధతో సహా అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
భూకంపం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ లకు ముప్పు ఏర్పడి ద్వారా అణు ధార్మికత వెలువడటంతో అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిప్రభావంతో నీరు ,ఆహారం కలుషితమవటం ద్వారా పుట్టిన , పుట్టబోయే పిల్లలకు బోన్, లంగ్, లుకేమియా, ధైరాయిడ్ రావచ్చని , ప్రమాదకర స్ధాయిలో కాన్సర్ సంక్రమించే ప్రమాదం వుందని భయపడి చస్తున్నారు.
సముద్రంలో చోటు చేసుకునే రేడియోషన్ గుర్తించటానికి తగిన కొలమానాలు లేవని చైనాలోని పాధాలాజిస్టులు చెపుతున్నారు. గాలిలో కలిసిపోయే రేడియోషన్ వల్ల పంటలు , సముద్ర ఉత్పత్తులు ,తాగునీరు కలుషితం అవుతోందన్న భయం జపాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వల్ల మహిళలకు గర్భవిచ్ఛితి జరిగే ప్రమాదం వుందని డాక్టర్లు వర్రీగా వున్నారు. పురుషులైతే .పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోతారని .. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
హిరోషిమా ఘటనను తీసుకుంటే నాటి బాధితుల్లో ఎక్కువమంది రేడియోషన్ ప్రభావం వల్ల ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారని చికిత్స చేసిన డాక్టర్లు గుర్తుచేసుకుంటున్నారు. అణు ధార్మికతను ..కొలవటానికి తగిన ప్రామాణికత లేదని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసియాదేశాలైన ధాయ్ లాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు జపాన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఓ కన్నేశాయి.
చెర్నోబిల్ ఘటన దృష్ట్యా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. రేడియోషన్ తమ దేశాలకు విస్తరించి ప్రజలకు ముప్పుగా పరిణమించే అవకాశాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.
బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల
శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.
18, మార్చి 2011, శుక్రవారం
ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి..
నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....
గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......
నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....
కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....
గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....
గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....
రేపటి నా పయనం ఎటువైపని....
వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే
నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....
చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే
అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...
పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....
గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....
స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే
సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...
ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...
మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....
ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....
కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....
ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....
వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....
గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......
నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....
కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....
గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....
గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....
రేపటి నా పయనం ఎటువైపని....
వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే
నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....
చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే
అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...
పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....
గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....
స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే
సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...
ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...
మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....
ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....
కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....
ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....
వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....
17, మార్చి 2011, గురువారం
చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?
కదలని పగళ్ళూ..... కలత నిదురలు...
నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...
ఎన్నాళ్ళిలా....?
జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...
నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...
వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...
ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...
గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...
మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...
ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?
చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?
సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...
అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ నాని...
నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...
ఎన్నాళ్ళిలా....?
జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...
నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...
వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...
ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...
గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...
మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...
ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?
చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?
సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...
అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...
తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ నాని...
ఇదేనా మన దేశం
దక్షిణ భారతదేశంలో నోటుకు ఓటు పద్ధతి బాగా ఉందని చెప్పిన వికీలీక్స్ మరో సంచలనాన్ని బయటకు తెచ్చింది.
గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.
కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలు.
గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.
కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలు.
ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు !
అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !
అన్నట్లు అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.
ఏమని చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !
సరే... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.
నిజాం నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.
అయితే కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.
అప్పుడే...అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 60 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.
అన్నట్లు అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.
ఏమని చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !
సరే... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.
నిజాం నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.
అయితే కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.
అప్పుడే...అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 60 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.
తనను తాను పొగుడుకొనే మీడియా
పదో పరకో
ఉంటుందో లేదో
ప్రయత్నించి
పట్టుబడి
ఊచల మాటున పెట్టబడి
కొట్టబడి
ఉన్నవి లేనివి ఆపాదించబడి
అన్యాయంగా
జైలు పక్షి గా గడిపే జన్మకన్నా
కుర్చీలో వున్న నాన్నకు కొడుకై
కోరికైతే
తనను తాను పొగుడుకొనే మీడియా వచ్చేలా
జనాల సొమ్మును ఇనాముగా రాసిచ్చి రాజ సౌధాలు వచ్చిపడేలా
జనం సొమ్మునే ఖర్చుపెట్టి పోయిన నాన్నే సొంతంగా పెట్టినట్లు
దాన కర్ణుడి కొడుకైనట్లు
తనకు తప్ప వేరెవరికీ ఆ సింహాసనం దక్క కూడదన్నట్టు
దబాయించి కొత్త పార్టీ పెట్టే దొరలా మంచి బతుకు ఇవ్వు దేవుడా.
ఉంటుందో లేదో
ప్రయత్నించి
పట్టుబడి
ఊచల మాటున పెట్టబడి
కొట్టబడి
ఉన్నవి లేనివి ఆపాదించబడి
అన్యాయంగా
జైలు పక్షి గా గడిపే జన్మకన్నా
కుర్చీలో వున్న నాన్నకు కొడుకై
కోరికైతే
తనను తాను పొగుడుకొనే మీడియా వచ్చేలా
జనాల సొమ్మును ఇనాముగా రాసిచ్చి రాజ సౌధాలు వచ్చిపడేలా
జనం సొమ్మునే ఖర్చుపెట్టి పోయిన నాన్నే సొంతంగా పెట్టినట్లు
దాన కర్ణుడి కొడుకైనట్లు
తనకు తప్ప వేరెవరికీ ఆ సింహాసనం దక్క కూడదన్నట్టు
దబాయించి కొత్త పార్టీ పెట్టే దొరలా మంచి బతుకు ఇవ్వు దేవుడా.
16, మార్చి 2011, బుధవారం
కాలచక్రంలో శూన్యం నేర్చిన అక్షరం నక్షత్రాల
పలకబట్టి బయలుదేరితే
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.
కలుపు తీసిన పొలంలా
అమ్మ ముఖం విప్పారి మెరిసేది.
అ ఆ లు రాసిన పలక
అమ్మ వేళ్ళకు అందిస్తే
ఏరుకున్న అక్షరాల్ని వొళ్ళో దాచి మురిసేది
అమ్మ రూపం నా రూపానికి అద్ది మాసిపోయాక
పలకా బలపం లేని నా బాల్యం
బడికి స్వస్తి పలికింది.
పసివాడి నగ్నరూపం మొలతాడు కట్టి వేధికెళితే
మొలతాడు లేని మొలల మధ్య మొలతాడే మిన్న
అవయవాల్ని కప్పుతూ గోచి పెట్టినపుడు
గోచీలు లేని గోలీలాటలో గోచీదే ఆధిపత్యం
ఆరు తర్వాత ఎంతకూ గుర్తురాని అంకె కోసం
మోరెత్తిన బడిపిల్లవాడ్ని చూసి
ఇరవై గొడ్లను ఏకధాటిగా లెక్కించడం నా విజయగర్వం.
పుల్లతో పంటకాల్వ లోతు కొలిచి
పారబోయే పొలం లెక్కలు ఆశువుగా నా నోట దొర్లేవి
సూర్యగమనం చూసి గంటలు నిర్ధారించినపుడు
గతి తప్పిన గడియారం విస్మయ ద్రుశ్టులు పరిచేది.
కాళ్ళకు తగిలిన రాళ్ళను సమగ్రంగా పరిశీలించి
ఏ ఖనిజ సంపద నిక్షిప్తమో ఏకరువు పెట్టేవాడిని
కమ్మిన మబ్బు సాంద్రత బట్టి వర్షపాతపు అంచనాకు
కురవబోయే మేఘం అబ్బురపడేది.
రాతి మేద సుద్దగీతలు రాతలు కానేరవు
కాళ్ళూచేతుల వేళ్ళు లెక్కించడం లెక్కలు కానేకావు.
ఎక్కాల్సిన బస్సు చిరునామా ఎంతకూ చదవలేక
జార్చుకున్న కాలచక్రంలో శూన్యం
నేర్చిన అక్షరం నక్షత్రాల్ని కోసి తెస్తుందని
మరణించే వరకు మనిషి విద్యార్ధేనని
అఙ్ణాన తిమిరాన వెలుగు జల్లుతూ
అక్షరాస్యత శాస్త్రీయ ప్రతిమ అంటూంది.
ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి
మన దేశంలో అవినీతి రాజ్యమేలుతుందని అందరికి తెలుసు. కుంభకోణాలు, అక్రమాలు, విలువల్లేని రాజకీయాలు తప్ప ఇంకేమి లేని పరిస్థితిని ప్రస్తుతం చూస్తున్నాం. మరోవైపు ట్యునీషియాలో, ఈజిప్టులో , యెమెన్లో ప్రజలు అవినీతి ప్రభుత్వాల మీద సమరశంఖం పూరించి ప్రభుత్వాలనే కూలదోస్తున్నారు. కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. నియంతలను తమ దేశాలనుండి తరిమి తరిమి కొడుతున్నారు. కాని మనం మాత్రం మన ఇళ్లకో కార్యాలయాలకో పరిమితమై ఏమీ పట్టనట్లుగా మన మానాన మనం రోజులు వెళ్ళదీస్తున్నాం. ఎందుకీ నిర్లిప్తత? లక్షల రూపాయల అవినీతికే కేంద్ర మంత్రుల రాజీనామా చేసే పరిస్థితినుండి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నా ఏమీ పట్టని స్థితికి చేరుకున్నాం. ఎక్కడ చూసినా నల్ల డబ్బు గురించే చర్చ.. కాని ఇంకా ఎన్నాళ్ళు చర్చిస్తాం? మన నోళ్ళు విప్పనంతకాలం , కాళ్ళు కదపనంతకాలం ఈ కుళ్ళు రాజకీయం, ఈ అవినీతి సాగుతూనే ఉంటుంది. దేశం కోసం వీధుల్లోకి వచ్చి సత్యాగ్రహం చేసిన ప్రజలు, దేశం కోసం ఆయుధం పట్టి ఉరికంబానికేక్కిన ప్రజలు ఇప్పుడు ఇళ్ళలో టీవీలలో నేరాలు ఘోరాలు చూస్తూ కాలం వెల్లబోస్తున్నారు. ప్రపంచ స్వాతంత్ర్య పోరాటాలకే స్ఫూర్తినిచ్చే ఉద్యమాన్ని నిర్మించిన మనం, ప్రపంచ దేశాలలో సాగుతున్న ఉద్యమాలను చూసి కొంచెమైన చలించట్లేదు. ఎవరు ఏమైపోయినా అక్కర్లేదు, ఎక్కడ ఎం జరిగిన మనకి అవసరం లేదు.. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక ఉల్లి ధరలు మండినప్పుడు మాత్రమే మనకు ఈ ప్రభుత్వం గుర్తొస్తుంది. ఇంకెన్నాళ్ళు ఇలా బ్రతుకుతాం? ఛీ.. ఇదీ ఒక బ్రతుకేనా!
రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?
ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.
ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.
జై హింద్.
రాష్ట్రాన్ని, దేశాన్ని కొల్లగొట్టి వేలు లక్షల కోట్లు సంపాదించిన వారి కొడుకులు మనవళ్లు కొత్త పార్టీలు పెట్టి రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే.. మనకేం పట్టదు. మన దేశం ఎటు పోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? 23 ఏళ్లకే ఉరికంబం ఎక్కిన, ఆంగ్లేయుల బుల్లెట్లకి నేలకొరిగిన భగత్ సింగ్, అల్లూరి సీతారామారాజుల ఉద్యమ స్ఫూర్తి ఎక్కడుంది? పరాయి పాలనని త్రిప్పికొట్టడానికి ఒక సైన్యాన్నే నెలకొల్పిన సుభాష్ చంద్ర బోస్ జాతీయ స్ఫూర్తి ఇంకా ఎంతమందిలో మిగిలుంది? కులం, మతం, ప్రాంతం అని వేలాడే దుష్ట రాజకీయనాయకుల తొత్తులుగా మారి వాళ్ళు విదిల్చే నోట్లు, సారా పాకెట్లు తప్ప జనం పాట్లు అవసరం లేనంత హీనంగా మారుతున్నామా!?
ప్రజలు రూపొందించిన లోక్ పాల్ బిల్లుకి ప్రభుత్వం తూట్లు పొడిచి దాన్ని సమూలంగా మార్చి వేసింది. లోక్పాల్ బిల్లు యధాతధంగా అమలైతే అవినీతిని దాదాపు అంతమొందించడం సాధ్యపడుతుంది. ఇప్పటికే దేశంలో పేరుకుపోయిన నల్లడబ్బును పెద్ద నోట్లను నిషేదించడం ద్వారా వెలికి తీయవచ్చు. కేవలం రూ.500 మరియు ౧౦౦౦ నోట్లను నిషేదించడం ద్వారా దాదాపు సగానికి పైగానే నల్లడబ్బును బయటికి తీయగలం. కేంద్రం వద్ద స్విస్ బ్యాంకులలో నల్ల డబ్బు దాచిన వారి వివరాలు ఉన్నా బయటపెట్టలేని బలహీన హీన స్థితిలో ఉంది. ఇప్పటికైనా ఆయా దేశాలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుని నల్లడబ్బుని వెలికితీయాలి. ఈ రెండు పనులను చేయడం ద్వారా మన దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న మౌలిక సదుపాయాలూ, నిరక్షరాస్యత , పేదరికం, సాంఘిక రక్షణ, నిరుద్యోగం లాంటి సమస్యలను దాదాపు రూపు మాపోచ్చు.
ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి మన పాలకుల మీద ఒత్తిడి తేవాలి, ప్రజలు పూనుకుంటే ప్రభుత్వాలు కూలుతోన్న రోజులివి. మన ప్రభుత్వం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రజలలో చైతన్యం తీసుకురాగలిగితే ఇది అసాధ్యం కాకపోవచ్చు. దీనికి మనవంతుగా ప్రయత్నిద్దాం.
జై హింద్.
చాలించడి మీ దొంగనాటకాలు?
సోదరభావంతో తెలంగాణ కోసం శాంతియుతంగా పోరాడుతున్న గద్దర్ లాంటి వాళ్ళకి ఈ వ్యాసం వర్తించదు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ తెలంగాణ పేరుతో అనేక అరాచకాలకు తెగబడుతున్న మూర్ఖశిఖామణుల కోసమే ఈ వ్యాసం .
చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు.అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.
ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?
మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?
* పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
* ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్కాదా ?
* సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
* వాల్యూయేషన్కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ
సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం
కాదా ?
* సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
* సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
* సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?
సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?
చాలించడి మీ దొంగ ఏడుపులు పెడబొబ్బలు.
ఎన్నాళ్ళీ దొంగనాటకాలు?
అడిగేవాడు లేక మీ ఆగడాలకు అంతులేకుండా పోతోంది.
తెలుగుభాషా వికాసానికి, సంస్కృతికి ఎనలేని సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలు కూల్చెయ్యటానికి మీకు మనస్సెలా వచ్చింది? శాంతియుత ప్రదర్శన అంటూ మోసపూరిత వాగ్దానాలు చేసి మీరు సాధించిన ఘనకార్యం ఇదా? ఇలా చేస్తే తెలంగాణ వచ్చేస్తుందని ఏ అజ్ఞాని మీకు చెప్పింది.ప్రజల అంగీకారం ఉంటేనే ఏ ఉద్యమమైనా ఫలప్రదమవుతుంది.మీరు చేసిన పనికి తెలంగాణలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందే.దీన్ని ఎలా సమర్ధించుకుంటారు? మీరు చేసేది ఉద్యమమా దౌర్జన్యమా? అన్నమయ్య మిమ్మల్ని ఏం చేశాడు? మిమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూసి,మీ మానప్రాణాలతో ఆట్లాడుకొని,మిమ్మల్ని పిట్టల్ని కాల్చినట్లు కాల్చిచంపిన నైజాం నవాబు మీకు దైవ సమానుడా? మీ రక్త మాంసాలను పీల్చిపిప్పి చేసిన పటేల్ పట్వారి వ్యవస్థను ఒక్క కలంపోటుతో రద్దు చేసిన ఆంధ్రుడు NTR మీకు ఆగర్భశత్రువా? విగ్రహాలతో మాకు సమస్య లేదు,విగ్రహాలను పెట్టించినవాడితోనే సమస్య అని ఒక బ్లాగరు అన్నాడు.అదే NTR పెట్టించిన తెలంగాణా ప్రముఖుల విగ్రహాలు ఎందుకు వదిలేశారు ? అప్పుడు మీకు NTR ఆంధ్రత్వం గుర్తురాలేదా? మీకు చేతనైతే తెలంగాణ ఉద్యమాన్ని అమ్ముకొని సొమ్ముచేసుకున్న మర్రి చెన్నారెడ్డి విగ్రహాలని బ్రద్దలుకొట్టుకోండి కానీ తెలుగుజాతికి ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిన అమరజీవి పోట్టీశ్రీరాములు విగ్రహాలని కాదు. మీది తెలుగు భాష కాదా? ఈ మాటలనడానికి మీరు ఏ మాత్రం సిగ్గుపడటం లేదా? నిన్న మొన్న వచ్చిన నవాబుగిరీలు, ముల్కీలు మీకు ప్రియమైపోయాయి కానీ ఏనాడో శాతవాహనులు స్థాపించి, రుద్రమ్మదేవి ఏలిన అచ్చమైన తెలుగు భాష మీకు చేదైపోయిందా? అందుకేనా మూలాలు మరచిపోయి తెలుగుతల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసారు? ఆఖరికి దేవుళ్ళకు కూడా ప్రాంతీయ తత్వాన్ని(భధ్రాచలం,తిరుమల) ఆపాదించిన ఒక మూర్ఖుడి మాటలు మీకు శిరోధార్యమవుతున్నాయంటే మిమ్మల్ని చూసి మీరే జాలిపడాలి.
ఎవరయ్యా మీకు పాఠాలు చెప్పింది ?
ఏ విశ్వవిద్యాలయం మీకు పట్టాలిచ్చింది ?
మాట్లాడితే రెచ్చగోడుతున్నారు అంటున్నారు
ఎవరిని ఎవరిని రెచ్చగొడుతున్నారు ?
* పార్టీ పెట్టింది మొదలు అంధ్రులు దొంగలు దోపిడీదారులని ఆడిపోసుకున్నది కేసీయార్ కాదా ?
* ఆంధ్రావాళ్ళను తరిమికొడతాం అని చిందులు తొక్కింది కేసీయార్కాదా ?
* సీమాంధ్ర కళాశాలలు,వాణిజ్య సముదాయాల పై దాడులకు తెగబడింది మీరు కాదా?
* వాల్యూయేషన్కి వచ్చిన సీమాంధ్ర ఉపాధ్యాయులపై భౌతిక దాడులకి తెగబడింది మీ విద్యార్థులు కాదా? ఈ
సంఘటన జరిగిన తర్వాత సీమాంధ్ర విద్యార్థులు తెలంగాణ ఉపాధ్యాయులుకు శాలువాలతో సన్మానం చేసింది వాస్తవం
కాదా ?
* సీమాంధ్ర కళాకారుల మూవీ షూటింగ్స్ సెట్స్ ధ్వంసం చేసింది మీరు కాదా?
* సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఇళ్ళపై దాడికి దిగింది మీరు కాదా ?
* సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలు ధ్వంసం చేసింది మీరు కాదా ?
* సీమాంధ్ర నేతలు కేవలం తెలంగాణ రాదంటే రెచ్చగొడుతున్నారు అంటారు మరి మీరు చేసిన నిర్వాకాలని ఏమని అనాలి ?
సీమాంధ్రులు మిమ్మల్ని దోచుకుతిన్నారు అంటారు. శ్రీకృష్ణ కమిటీ ప్రకారం తెలంగాణ కంటే అన్ని రకాలుగా వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమ.కానీ మీరు దాన్ని విశ్వసించరు.కోదండరాం,కేసియార్ మాటలు మీకు వేదమంత్రాలతో సమానం. ఇంతకాలం మేం మిమ్మల్ని దోచుకుతిన్న మాట నిజమే అయితే మీరు ముందుగా తిరగబడాల్సింది ఇన్నేళ్ళుగా మీరెన్నుకున్న ప్రజాప్రతినిధుల పైన. వాళ్ళేమీ నోరూ వాయి లేని వాజమ్మలు కాదే.నోట్లో వేలు పెడితే చప్పరించడం కూడా రాని చంటి పిల్లలు కారే ? వేలు పెడితే వెన్నమూక వరకూ దిగమింగే రకం. సుబ్బరంగా సంపాదించుకుని కోట్లు గడించుకొన్నారు కదా? మీరెన్నుకున్న ఎంపీలు కేసియార్,విజయశాంతి నిన్న మొన్నటిదాకా ఎనాడైనా పార్లమెంటు మొహం చుశారా? రాత్రంతా తాగి, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయ్యటం తప్ప కేసియార్ ఎమైనా వెలగబెట్టాడా? ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడ్డాడా? రాజీనామా డ్రామాలు మొదలుపెట్టి ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎన్నికైతే 'తెలంగాణా వాదం యొక్క తీవ్రత ' అంటూ మీరు మురిసిపోయారు కానీ ఎప్పుడైనా ఇందులో మర్మం గ్రహించారా? ఎంతసేపూ విద్యార్థులే ఎందుకు త్యాగాలు చేసి తన్నులు తినాలి, మీరెందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి మీ నైతికత నిరూపించుకోరు అని ఎప్పుడైనా కోదండరాంను నిలదీశారా? ఆయన, ఆయనతో పాటు విద్యార్థులను రెచ్చగొడుతూ నెల తిరిగేసరికి సీమాంధ్రులు కూడా సక్రమంగా పన్నులు కడితే తప్ప విడుదలవ్వని జీతాలను పుచ్చుకుంటున్న ఇతర మేధావులు త్యాగాలకు అతీతులా ? క్లాసులు సక్రమంగా జరక్క విద్యార్థులు,వ్యాపారం జరక్క వ్యాపారస్తులు ,రోజు గడవక బడుగుజీవులు నాశనమైపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను వదలరా? నల్గొండ ఫ్లోరైడ్ సమస్య కావచ్చు,పాలమూరు సమస్య కావచ్చు, సమస్య ఏదైనా పోరాడి సాధించుకోవల్సింది మీరు మీ ప్రజాప్రతినిధులు.ఇంతకాలం ఈ మేధావులు, సంఘసంస్కర్తలు ఏం చేసారు? చోద్యం చూశారా లేక చేతకాక మిన్నకున్నారా? జయప్రకాష్ నారాయణ లాంటి బలహీనుల్ని కోట్టారు కాబట్టి సరిపోయింది కానీ అదే ఏ బలవంతుడైన నేత మీదో చెయ్యిపడుంటే ఆరోజే మీ సామర్థ్యం బయటపడేది. మీకు చేతనైతే, చిత్తశుద్ధి ఉంటే మీ దివాళాకోరు నాయాకులపై తిరగబడండి. ఆడలేనమ్మ మద్దెల మీద పడి ఏడ్చినట్లు మీలో ఇన్ని లోపాలు పెట్టుకొని సీమాంధ్రుల మీద ఏడిస్తే ఏమిటి ప్రయోజనం ?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
