19, మార్చి 2011, శనివారం

అందరికీ హొలీ శుభాకాంక్షలు!

ఈ రోజు హొలీ పండుగ. మన భారతదేశం వివిధరకాల ఆచారాలు,
సాంప్రదాయాలకు విలువ నిచ్చే దేశం. మన దేశంలో జరుపుకొనే
సరదా పండుగల్లో హొలీ ముఖ్యమైన పండుగ. ప్రధానంగా ఉత్తర
భారతదేశంలో ఈ పండుగని ఆనందోత్సహాలతో అన్ని వయసుల
వారు జరుపుకుంటారు వసంతకాలం రాకకు గుర్తుగా పకృతి అంతా
పచ్చపచ్చగా అగుపిస్తూ సుందరంగా కనులవిందు చేస్తుంది.
ఒకరిపై ఒకరు పిచికారీలతో రంగులు చిమ్ముకుంటూ సరదాగా
ఆడి పాడుకుంటారుమధుర,బృందావనంలలో
శ్రీకృష్ణుడు గోపికలతో రాసకేళి గడిపిన చోట శ్రీ కృష్ణుని విగ్రహాలపై రంగులు
పూసి హొలీ జరుపుకుంటారు.
అందరికీ హొలీ శుభాకాంక్షలు!

మరో చెర్నోబిల్ ఘటన!!!!!!!!!!!!!!!!!

* పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు
* అణు ధార్మికతతో పలు రకాల కాన్సర్ లు
* జపాన్ లో పుట్టబోయే పిల్లలకు ఇక అంగవైల్యమేనా?
* తుడిచి పెట్టుకుపోనున్న జపాన్ ?
* హిరోషిమా ఘటనకంటే తీవ్రంగా రేడియోషన్ ?

జపాన్ లో భూకంపం అనంతరం..అణు విద్యుత్ ప్లాంట్ ల నుంచి వెలువడే రేడియో యాక్టివేషన్ వల్ల కొత్త సమస్యలు తలెత్తున్నాయి. రేడియో యాక్టివేషన్ కు గురైన ఆహారం, పదార్ధాలు తీసుకోవటం వల్ల పుట్టిన , పుట్టబోయే పిల్లలకు కొత్త రోగాలు వచ్చి ..మొత్తం దేశం తుడిచి పెట్టుకు పోనుందా? ఈ ఆందోళన తో అక్కడి సైంటిస్టులు, డాక్టర్లు కొట్టుమిట్టాడుతున్నారు.

టెక్నాలజీ లో అందరి కంటే ముందుండే ..జపాన్ ఈ కొత్త సమస్యను ఏవిధంగా ఎదుర్కొంటుందో అని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జపాన్ లో సంభవించిన భూకంపం తాలూకు ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్ధతో సహా అక్కడి ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

భూకంపం వల్ల అణు విద్యుత్ ప్లాంట్ లకు ముప్పు ఏర్పడి ద్వారా అణు ధార్మికత వెలువడటంతో అక్కడి ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిప్రభావంతో నీరు ,ఆహారం కలుషితమవటం ద్వారా పుట్టిన , పుట్టబోయే పిల్లలకు బోన్, లంగ్, లుకేమియా, ధైరాయిడ్ రావచ్చని , ప్రమాదకర స్ధాయిలో కాన్సర్ సంక్రమించే ప్రమాదం వుందని భయపడి చస్తున్నారు.

సముద్రంలో చోటు చేసుకునే రేడియోషన్ గుర్తించటానికి తగిన కొలమానాలు లేవని చైనాలోని పాధాలాజిస్టులు చెపుతున్నారు. గాలిలో కలిసిపోయే రేడియోషన్ వల్ల పంటలు , సముద్ర ఉత్పత్తులు ,తాగునీరు కలుషితం అవుతోందన్న భయం జపాన్ వాసులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. దీని ప్రభావం వల్ల మహిళలకు గర్భవిచ్ఛితి జరిగే ప్రమాదం వుందని డాక్టర్లు వర్రీగా వున్నారు. పురుషులైతే .పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోతారని .. డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

హిరోషిమా ఘటనను తీసుకుంటే నాటి బాధితుల్లో ఎక్కువమంది రేడియోషన్ ప్రభావం వల్ల ఇప్పటికీ అంగవైకల్యంతో బాధపడుతున్నారని చికిత్స చేసిన డాక్టర్లు గుర్తుచేసుకుంటున్నారు. అణు ధార్మికతను ..కొలవటానికి తగిన ప్రామాణికత లేదని జపాన్ సైంటిస్టులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఆసియాదేశాలైన ధాయ్ లాండ్, దక్షిణ కొరియా, తదితర దేశాలు జపాన్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఓ కన్నేశాయి.

చెర్నోబిల్ ఘటన దృష్ట్యా తాము ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అక్కడి అధికారులు తెలిపారు. రేడియోషన్ తమ దేశాలకు విస్తరించి ప్రజలకు ముప్పుగా పరిణమించే అవకాశాలకు చెక్ పెట్టేందుకు అన్ని చర్యలు చేపట్టామని వివరించారు.

బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల

శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.