7, మే 2011, శనివారం

కొంతమంది వ్యక్తుల విశిష్టత వలనే వాళ్లు పుట్టిన గ్రామానికి ఎంతో పేరు వస్తుంది.

కొంతమంది వ్యక్తుల విశిష్టత వలనే వాళ్లు పుట్టిన గ్రామానికి ఎంతో పేరు వస్తుంది. ఉదా:3,500సంవత్సరాల క్రితం బుద్దుడు ‘లుంబిని’ అనే గ్రామంలోనే జన్మించారు. అందుకే ‘లుంబిని’అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచింది. ‘లుంబిని’ అనే గ్రామంలో జన్మించాడు కాబట్టే హైదరాబాద్ లో లుంబినీ పార్క్ అని పేరు పెట్టారు. సుభాష్ చంద్రబోస్, అల్లూరి శీతారామరాజు, ప్రకాశం పంతులు, భగత్ సింగ్ ఇలా ఎంతో మంది వ్యక్తుల ప్రాబల్యం వలన వాళ్లు పుట్టిన ప్రదేశాలకి వెలుగులోకి వచ్చాయి.

అలాగే మహానటుడు టిడిపి రూపకర్త, 9నెలల కాలంలోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారకరామారావు నిమ్మకూరు అనే గ్రామంలో పుట్టి, ఆగ్రామానికే ఒక ప్రాముఖ్యతను, విశిష్టతను కల్పించారు. అటువంటి, నిమ్మకూరులో ఎన్టీఆర్ వారసుడైన జూ ఎన్టీఆర్ తన శోభనాన్ని చేసుకోవాలని ఉవిళ్లూరుతున్నారని తెలుస్తోంది. నిమ్మకూరులో ఎన్టీఆర్ కుటుంబానికి అచ్చొచ్చిన పందిరి మంచాన్నే, జూ ఎన్టీఆర్ తన శోభనానికి ఉపయోగించుకోనున్నారిని సమాచారం. నందమూరి వంశ వృక్షానికి నిలువెత్తు సాక్షిగా ఉన్న ఆ మంచాన్ని, అతి జాగ్రత్తగా నందమూరి వారు కాపాడుకుంటున్నారు. ముత్తాతల నుండి వస్తున్న ఈ సాంప్రదాయాన్ని, జూ ఎన్టీఆర్ కూడా పాటించాలనీ పట్టుదలతో తన శోభనాన్ని నిమ్మకూరు గ్రామంలోనే జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది.

ఢీకొట్టడానికే సిద్ధపడ్డారు

తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ నాగం జనార్దన్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఢీకొట్టడానికే సిద్ధపడ్డారు. ఈ నెల 9వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలులో జరిగే తెలంగాణ బహిరంగ సభ దానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు. పార్టీ జెండా లేకుండా నడిచే ఈ బహిరంగ సభకు లభించే ప్రతిస్పందనను చూసి నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబుకు వ్యతిరేకంగా తన గొంతును మరింత పెంచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే, నాగం జనార్దన్ రెడ్డి చంద్రబాబును లెక్క చేయకుండా ప్రకటనలు చేస్తున్నారు.

నాగం జనార్దన్ రెడ్డి పార్టీలోని తెలంగాణ నాయకులు కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్ రెడ్డి, దయాకర్ రెడ్డి వంటి నాయకులు నాగం తీరును తప్పు పడుతున్నారు. అయినా, నాగం జనార్దన్ రెడ్డి లెక్క చేయడం లేదు. అయితే, నాగం జనార్దన్ రెడ్డికి పార్టీలోని ఓ వర్గం మద్దతు బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నాగర్ కర్నూలు బహిరంగ సభకు తెలంగాణ పార్టీ నాయకులంతా వస్తారని ఆశిస్తున్నట్లు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారు. కానీ అ పరిస్థితి కనిపించడం లేదు.

నాగం జనార్దన్ రెడ్డి వెంట హరీశ్వర్ రెడ్డి (రంగా రెడ్డి జిల్లా), వేణుగోపాలాచారి (ఆదిలాబాద్), విజయ రామారావు (హైదరాబాద్), ఉమా మాధవ రెడ్డి ( నల్లగొండ) వంటి నాయకులు నడిచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. వీరు నాగర్ కర్నూలు బహిరంగ సభకు హాజరయ్యే అవకాశాలున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. 9వ తేదీ బహిరంగ సభనే పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటున్నారు.

ఎవరికి ఓట్లు వేస్తారో

కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో నిలిచిన మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన తల్లి విజయమ్మ గెలుపు ఖాయమని ఐబి(ఇన్వెస్టిగేషన్ బ్యూరో) నిర్వహించిన సర్వేలో తేలినట్టు తెలుస్తోంది. కడప, పులివెందుల నియోజకవర్గంలోని పలువురు వ్యక్తులను ఐబి కలిసి వారు ఎవరికి ఓట్లు వేస్తారో కనుగొంది. అయితే సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది జగన్‌కే, విజయమ్మకే ఓటు వేస్తామని చెప్పారంట. అయితే జగన్ గెలుస్తాడని ఐబి నిర్వహించిన సర్వేకు సంబంధించిన సంక్షిప్త సందేశాలు(మెసేజ్‌) అలా అలా సెల్ ఫోన్‌లలో తిరగాడుతున్నాయంట.

కడప పార్లమెంటు పరిధిలో జగన్‌కు ఓటు వేస్తామని 54.45 శాతం మంది చెబితే, టిడిపికి ఓటు వేస్తామని 25 శాతం, కాంగ్రెసుకు ఓటు వేస్తామని 19.4 శాతం మంది చెప్పారంట. ఇక కడప పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ జగన్‌కే మెజార్టీ వస్తుందంట. ఏ నియోజవర్గంలోనూ కాంగ్రెసుగానీ, టిడిపిగానీ మెజార్టీ సాధించే పరిస్థితి లేదంట. ఇక పులివెందుల విషయానికి వస్తే విజయమ్మకు 56 శాతం, వైయస్ వివేకానందరెడ్డికి 25 శాతం, టిడిపికి 18 శాతం మంది ఓట్లు వేస్తారంట. జగన్ గెలుచినప్పటికీ విజయమ్మ ఓడిపోతుందనే వాదనలు వినిపించాయి. అయితే జగన్ కంటే విజయమ్మ 1.5 పర్సెంట్‌తో ముందుండటం విశేషం.

ఇక ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెసులో విలీనం చేయడంపై ఎక్కువ మంది అసంతృప్తి వ్యక్తం చేశారంట. అయితే ఐబి సర్వే చేసిన ప్రకారం ఫలితం ఉండదని కాంగ్రెసు, టిడిపి చెబుతోంది. ఆ సర్వే జగన్ రాజీనామా చేసిన ప్రత్యేక పరిస్థితిలో చేసిందని, అలాంటి సమయంలో సర్వే చేస్తే అలాగే ఉంటుందని కానీ ప్రస్తుత పరిస్థితులు జగన్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. ఈ మధ్యనే అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే చేసిన నిరాహార దీక్ష ప్రభావం కూడా పడుతుందని ఆ రెండు పార్టీలు భావిస్తున్నాయంట. అయితే రాయలసీమ ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లా కాకుండా అక్కడ పార్టీల కంటే వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం విశేషం. ఏదైమైనా ఐబి సర్వే జగన్ పార్టీలో ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది.

యువనేత ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పంపిణీ చేస్తారన్న???

ఎన్నికలకు రెండు రోజుల ముందు కడప జిల్లాలో యువనేతకు ఆయన వర్గంలోని ముఖ్యమైన ఎమ్మెల్యే షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో తన గెలుపు నల్లేరు మీద బండి నడకని భావిస్తున్న యువనేతకు గట్టి షాక్ తగిలినట్లయింది. సొంత పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన ఆయన వైఖరే ఆయనకు ఇబ్బందులు తెస్తోంది. తన మాటే చెల్లాలన్న యువనేత వైఖరి పట్ల ఆ పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా లెక్క విషయంలో అసంతృప్తితో ఉన్న ఒక కీలక ఎమ్మెల్యే మరీ ఇంత తక్కువైతే ఎలాగంటూ యువనేతపై ఫైర్ అయ్యారని సమాచారం. తాను ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిల్లోనూ ఇంత కంటే ఎక్కువ ఖర్చు పెట్టానంటూ నిలదీసినట్లు ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఇలాగైతే తన దారి తాను చూసుకుంటానని యువనేతను కూడా హెచ్చరించాడంట. నియోజకవర్గంలో తన మాటే చెల్లుబాటు చేసుకునే సామర్థ్యం కలిగిన ఆ నేత ఆగ్రహం వ్యక్తం చేయడంతో యువనేత కంగు తిన్నారని సమాచారం. అయితే తన మాట తప్ప వేరెవరి మాటనూ లక్ష్య పెట్టని యువనేత ఏ మాత్రం వెనక్కు తగ్గక పోవడంతో.. ఆ ఎమ్మెల్యే కినుక వహించినట్లు తెలుస్తోంది. రూ. లక్ష కోట్లకు అధిపతిగా బహుళ ప్రాచుర్యం పొందిన ఆ యువనేతకు ఇప్పుడు ఆ డబ్బే కట్లపామై కరిచేందుకు సన్నద్ధమైందని పలువురు భావిస్తున్నారు. ఉప ఎన్నికల బరిలో ఉన్న ఇతర రాజకీయ పార్టీలు ఓటుకు 200 నుంచి 500 వరకూ పంపిణీ చేస్తే యువనేత పార్టీ మాత్రం కేవలం 200 రూపాయలు మాత్రమే పంపిణీ చేయాలని నిర్ణయించారని సమాచారం. ఈ నిర్ణయం పట్ల నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది.

ఇప్పటివరకూ యువనేత ఓటుకు వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకూ పంపిణీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే అందుకు విరుద్ధంగా యువనేత మాత్రం సెంటిమెంట్ అస్త్రంతో తాను గెలవడం ఖాయమని ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరమే లేదని వాదిస్తున్నారట. అందరూ కోరుతున్నందున ఆ మాత్రం లెక్కయినా ఇచ్చానని ఇక ఏమాత్రం ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పినట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో ఆ ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచే అత్యధిక మెజారిటీ వస్తుందని ఆశించిన యువనేత షాక్ తిన్నారంటున్నారు. ఈ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేతలు దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే యత్నాలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికిప్పుడు తమ వైపునకు రాకున్నా రెండు రోజుల పాటు మౌనంగా ఉండాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది.