16, ఏప్రిల్ 2011, శనివారం

జగన్ ఆస్తుల విలువ కేవలం రూ.365 కోట్ల??!!@@##$$%%??

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉప ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఎంపీల జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. శుక్రవారం కడపలో ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సమయంలో ఆయన తన ఆస్తుల వివరాలను తన అఫిడవిట్‌లో వెల్లడించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న ప్రకారం జగన్ పేరు మీద ఉన్న ఆస్తి రూ.365 కోట్లుగా ఉంది. ఇక ఆయన భార్య భారతి పేరు మీద మరో 41.33 కోట్లు ఉన్నట్టుగా పేర్కొన్నారు. తనకు సొంత వాహనం లేదంటూ జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


తన ఆస్తి వివిధ రూపాలలో ఉందని అందులో పేర్కొన్నారు. షేర్ల రూపంలోనే 359 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలినది అంతా గోల్డు, అగ్రికల్చర్ లాండ్, నాన్ అగ్రికల్చర్ లాండ్ తదితర రూపాలలో ఉందని ఆయా విలువలు పేర్కొన్నారు. జగన్ పేరు మీదు ఉన్న ఆస్తులు 365 కోట్లు 68 లక్షల 58వేల రూపాయలు. కాగా అఫిడవిట్ సమర్పించిన సమయంలో ఎన్నికల గుర్తుగా తనకు సీలింగ్ ఫ్యాన్, బ్రెష్, మంచంలలో ఏదైనా కేటాయించాలని జగన్ కోరారు.

తనకు ఎన్నికలలో కాగా దివంగత ముఖ్యమంత్రి వైjavascript:void(0)యస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అంటే 2004కు ముందు జగన్ ఆస్తుల విలువ కేవలం 9.18 లక్షలు. ఆ తర్వాత 2009 ఎన్నికల వరకు జగన్ ఆస్తులు రూ.77.40 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత ఇప్పుడు తన అఫిడవిట్‌లో ఏకంగా కు పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు జగన్ ఉప పోరులో కడప నుండి గెలిస్తే దేశంలోనే అత్యంత కుబేరుడు అయిన ఎంపీలలో జగన్ మొదటి వాడు. రెండో స్థానంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు రెండో స్థానంలో ఉంటారు. ఆయన ఆస్తుల విలువ రూ. 173 కోట్లుగా ఉంది.

కాగా జగన్ ఆస్తులు వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అమాంతంగా పెరగడంపై విపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెసు పార్టీలోని వారు కూడా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆరోపించిన విషయం తెలిసిందే. వైయస్ ముఖ్యమంత్రి కాక ముందు ఇంటిని అమ్మకానికి పెట్టిన వైయస్ కుటుంబం ఇప్పుడు కోట్ల కొలది రూపాయలు ఎలా సంపాదించిందనే ఆరోపణలు చేశారు

అద్నన్ సమీకు చేదు అనుభవం ఎదురైంది కాదు అవమానించిన ఆస్టన్ మార్టిన్ డీలర్

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అద్నన్ సమీకు చేjavascript:void(0)దు అనుభవం ఎదురైంది. తాజాగా భారత్‌లోకి ప్రవేశించిన బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కంపెనీ భారత అధికారిక దిగమతిదారు అయిన ఇన్ఫినిటీ కార్స్ కంపెనీ సమీను అవమానించింది. భారత్‌లో ఆస్టన్ మార్టిన్ కార్లను విడుదల చేసేందుకు ఇన్ఫినిటీ కార్స్ అద్నన్ సమీను ఆహ్వానించింది. అందుకు సమీకు రూ. 13.5 లక్షల రూపాయల చెక్‌ను అందజేసింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ.. అద్నన్ సమీతో ఒప్పందాన్ని ఇన్ఫినిటీ కార్స్ రద్దు చేసుకుంది. అంతేకాకుండా... చెక్‌ను స్టాప్ పేమెంట్ చేసింది. ఇలా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ఇన్ఫినిటీ కార్స్ సమీ ఓ మాట కూడ చెప్పలేదట.

ఇదిలా ఉంటే జేమ్స్ బాండ్ సినిమాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కార్లు నేడు భారత మార్కెట్లోకి విడుదలయ్యాయి. భారత్‌లో మొత్తం 10 బ్రాండ్‌లను కంపెనీ అందిస్తుంది. ప్రారంభ దశలో భాగంగా ప్రస్తుతం భారత మార్కెట్లో ఆస్టన్ మార్టిన్ కార్లు పూర్తిగా దిగమతి చేసుకున్న రూపంలో లభిస్తాయి. దేశీయ మార్కెట్లో వీటి ధరలు రూ. 1.35 కోట్ల నుంచి రూ. 20 వరకూ ఉన్నాయి. భారత్‌లో సిగ్నంట్ మినహా బేసిక్ మోడల్ అయిన వీ వ్యాంటేజ్ నుంటి ఆల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు వన్-77 (రూ. 20 కోట్లు) మోడళ్లు లభిస్తాయని కంపెనీ వివరించింది.

అదేదో ఐఎస్ఐ బ్రాండ్ అన్నట్టు ఫీలైపోతున్నాడు..

మెగాస్టార్ అనేవాడే లేకపోతే ఇప్పుడు కేవలం ఒక కమెడియన్ కి మనవడిగా ఉండిపోయేవాడినన్న సంగతి మర్చిపోయి అల్లు శరిష్ రెచ్చిపోతున్నాడు. అక్కడికి తనేదో గీత ఆర్ట్స్ సంస్థకే తప్పమెగా హీరోలకీ, వారి సినిమాలకీ సంబంధంలేని వాడినన్నట్టు కలవరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ సినిమా అంటే ఖచ్చితంగా హిట్ అయి తీరుతుందన్నట్టు, అదేదో ఐఎస్ఐ బ్రాండ్ అన్నట్టు ఫీలైపోతున్నాడు..నిన్న విడుదలైన తీన్ మార్ పై ట్విట్టర్ లో అభిమానులేసే ప్రశ్నలకు తీన్ మార్ గురించి తనకేమీ తెలియదన్నట్టు మిస్టర్ ఫర్ ఫెక్ట్ డ్రామాలేస్తున్నాడు

బహుశా జల్సాకి ముందు కొన్నేళ్ల పాటు గీతా ఆర్ట్స్ ప్లాప్ గీత దాటి బయటికి రాలేక గిలగిల కొట్టుకుందని పాపం శిరిష్ కి తెలియదేమో. తమ కుంటుంబానికి చెందిన హీరోలు వేరే బ్యానర్లపై సినిమాలు చేస్తే వాటితో తనకేమీ సంబంధం లేనట్టు ఇతను తెగ రెచ్చిపోతున్నాడు. మొదటి రోజు నాలుగు వేల షోలు తీన్ మార్ కి పడుతున్నాయటఅని ఎవరో అభిమాని అడిగితే, గీతా ఆర్ట్స్ లో చేసి ఉంటే ఆరికార్డు ని బీట్ చేసుండేవాళ్లమంటూ ఇతని జవాబు. తీన్ మార్ గురించి ఒక్కమాటైనా చెప్పలేదంటని మరొకొక అభిమాని అడిగితే గణేష్ బాబు రిక్వెస్ట్ చేసుంటే హెల్ప్ చేసుండేవాళ్లమని అంటున్నాడు. హీరోలో లేకుండా గీతా ఆర్ట్స్ ఇంత దూరం వచ్చిందా?అసలు మెగా హీరోలు చేతిలో లేకపోతే ఈ సంస్థకి ఈ మాత్రం పేరైనా వచ్చుండేదా?చూస్తుంటే మెగాస్టార్ ని చేసిందే గీతా ఆర్ట్స్ అనే భ్రమలో బ్రతికేసేలా ఉన్నాడు