20, మార్చి 2011, ఆదివారం

జీవితం ఒక నిరంతర పోరాటం

ప్రతి పనికి ఒకప్రారంభం.
ఆ పనిని పుర్తి చేయడానికి కొంత ప్రయత్నం.
ఆ ప్రయత్నం ఫలించడానికి ఏకాగ్రత కావాలి.
ఏకాగ్రత కావలంటే విద్య కావాలి.
విద్య కన్నా శ్రద్ధ ముఖ్యమైంది.
శ్రద్ధ లేని విద్య నిష్ప్రయోజనం.
కర్మ శరీరం నుండి,
తెలివి బుద్ధి నుండి,
శ్రద్ధ హృదయం నుండి ఉత్పన్నమవుతాయి.
శ్రద్ధ ఉంటే ఏ రంగమైన విజయం లభిస్తుంది.
జీవితం ఒక నిరంతర పోరాటం ,గెలుపుకు బానిసలు కాకుండా ఓటమికి బాధపడకుండా ముందుకు ఏకాగ్రతతో సాగిపోవాలి.శ్రీకృష్ణుడు భగవద్గీతలో చేయాల్సింది శత్రు సంహారమైనా ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయాలంటాదు.

ఆటో వాలా - బాడీ సైకాలజీ :)

హైదరాబాదు ఆటో లో ప్రయాణించే బ్లాగు స్నేహితులకి చిట్కాలు.
ముందు ఆటో వాలా బాడీ సైకాలజీ గురించి తెలుసు కుందాము.
ఆటో వాలా (16-25 వయసు)
ఆటో ఎక్ష్త్రా డబ్బులు ఇవ్వాలి, కానీ ఎఫ్.ఎం రేడియో లేదా కొత్త పాటలు ఫ్రీగా వినవచ్చు. కళ్లు మూసి తెరిచే లోపు చేరుకోవచ్చు.

ఆటో వాలా (25-35 వయసు)
అతను ఎక్కడకు వెళ్ళాలనుకుంటాడో అక్కడకు మాత్రమే వస్తాడు, నెక్స్ట్ స్టాపు అయిన రాడు, సో మీ ఇల్లు అతని ఇంటి పక్కనో, వాళ్ల మామ ఇంటి పక్కనో ఉండేటట్టు చూసుకోండి.

ఆటో వాలా (35-45 వయసు)
వీరి ఆటో లో మీరు ఎక్కాలంటే మీకు కొంచం కరంట్ ఎఫయైర్ మీకు తెలిసి ఉండాలి, లేదా రోజు ఆపీసులో పేపర్లు తిరగవేయాలి, ఎందుకంటే వీరు మీరు ఆటో ఎక్కిన కొద్ది సేపటికి ఏదో ఒక విషయం మీద చర్చ లేవ దీస్తారు. మీరు కూడా కొంచం వంత పాడారు అనుకోండి, మీకు ఇంటిదాకా ఆటో లో ఎక్ష్త్రా గొనక్కుండా వస్తారు.

ఆటో వాలా (45-55 వయసు)
వీరి ఆటో సేఫ్ మనకు, కాని సినమా కి ౧౦ నిమిషాలు ఉందనగా ఎక్కకు అనుకోండి మినిమం ఇంటెర్వల్ కి చేరుకుంటారు. స్లోగా, స్పీడు బ్రేకర్లకు దెబ్బ తగలకుండా వెళ్తారు అన్నమాట.

ఎలాంటి ఆటో ఎక్కాలి .
ఆటోని మీరు పంజాగుట్ట కి వస్తావా అని అడిగారు, పంజాగుట్ట లో ఎక్కడ అని అడిగాడు అనుకోండి, సో మీటరు వేయడు అని అర్థం .

ఆటోవాలా స్లోగా రోడ్డు ఒక పక్కకు వస్తూ మీ వైపుకు వస్తూ ఉంటే పర్లేదు, మీరు ఎక్కడకు రమ్మనా వస్తాడు. ఎందుకంటే అది డెస్పరేట్ శిచివేషన్ అన్నమాట.

మీటరుకు షర్టు చుట్టాదనుకోండి ఇంక మనవాడి ఇష్టం వాట్, టాక్స్ అన్నే మీ మెడ వేస్తాడు అని అర్థం.

ఎలా వెళ్దాం అని అంటే మీ ఇష్టం అంటే, ఇక మీకు ameerpet to Punjagutta పంజాగుట్ట వయా kukatpalli గతి, సో ఎలా వెళ్దాం అంటే లెఫ్ట్ లో అని చెప్పండి. ఎందుకంటే హైదరాబాదు లో చాలామటుకు ఫ్రీ లెఫ్తులు ఉంటాయి.

చివరగా
ఆటో ఎక్కడం మాత్రమే నీవు చెయ్, మీటరు ఆ ఆటోవాలా కి వదిలేయ్.
మీటరు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య
మీటరు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము

ఒక్కసారిగా నమ్మకాలన్నీ చెరిగిపోయాయి

నావని గర్వం గా చెప్పుకున్నవి
ఇప్పుడు నన్నే కొత్తగా చూస్తుంటే,
నువ్వెవరని ప్రశ్నిస్తుంటే......


తలచుకుని తలచుకుని మురిసిన జ్ఞాపకాలు,
ఉద్వేగపు క్షణాలు...అన్నీ
నాది పిచ్చితనమంటూ గేలిచేస్తుంటే...


గతపు ఆనవాళ్ళు గుండెల్లో మాత్రం మిగుల్చుకుని
అలవాటయినచోట అపరిచితురాలిలా నిలుచున్నాను

ఈక్షణంతో అందమయిన జ్ఞాపకాలన్నీ
ఒక్కసారిగా చెరిగిపోయాయి
నమ్మకాలన్నీ భ్రమలుగా మిగిలిపోయాయి

ఆర్టికల్ 19

ప్రజాస్వామ్యానికి ఈమద్య కాలంలో అర్దం మారుతున్నట్టుగా వుంది...కుల మత జాతి వర్ణ లింగ ప్రాంతీయ బాషా బేదాలు లేనిది నా భారతదేశం అని చెప్పటం అంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్లే...... ఇప్పటి వరకు కులాలు మతాల పేరుతో కొట్టుకున్న మనం ఇప్పుడు ఒక్క అడుగు ముందుకేశాము అదే ప్రాంతీయత.... ప్రతీచోట పని లేని, పస లేని, అధికారంలో లేని పనికిమాలిన పార్టీలకు, చోటా మోట నాయకులకు ఇది ఒక AK 47 లాంటిది... పార్టీ కార్యకర్తలు అంటూ ఒక రౌడి మూకను తయారు చేసి వాళ్ళకు బీరు, బిర్యాని ఇచ్చి ప్రాంతీయత పేరుతో అమాయకులయిన ఒక పదిమందిని కొట్టి పేపర్లో ఫొజులివ్వటం ఈమద్య కాలంలో ఒక అలవాటులా మారింది...

ఆంధ్రప్రదేశ్...

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని కలిసి పోరాడిన రోజులు చరిత్ర పుస్తకాలకు పరిమితమయ్యేలా వున్నాయి......నా తెలంగాణా కోటి రతణాల వీణ అన్న పలుకులు ప్రాంతీయత చిచ్చులో అపస్వరాలు పలుకుతున్నాయి.... కుటుంబ పెద్ద అనేవాడు ఎప్పుడు తన కుటుంబం కలిసి వుండాలి అనుకుంటాడు కాని ప్రజా కుటుంబానికి పెద్దలం అని చెప్పుకుతిరిగే ప్రజానాయకులు మాత్రం ఎప్పుడు వీల్లని విడగొడదామా అని చూస్తున్నారు....నా తెలంగాణ.... నా తెలంగాణ అని అరిచే నాయకుల కొడుకులు మాత్రం పక్క దేశంలో ఉద్యోగాలు, వ్యాపారాలు చేయొచ్చు కాని అదే రాష్ట్రంలో పుట్టిన మనకు మాత్రం వాళ్ళ ప్రాంతంలో వ్యాపారాలు చేయకూడదు. నాకు తెలిసి టి.ఆర్.యెస్ వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం అంటుంది కేవలం ఆంధ్ర నుంచి తెలంగాణ రావటానికి, పోవటానికి కూడ ప్రత్యేక వీసాలు పెట్టాలి అని... ఎందుకంటే ఈ పార్టీలో నాయకులకు బాగా తెలిసిన వ్యాపారం దొంగ వీసాలతో పక్క దేశాలకు పంపటం...కాని కష్టంస్ వాళ్ళకు దొరికినప్పటినుంచి ఈ బిజినెస్ బాగా దెబ్బతింది దానితో ఆదాయం కూడా తగ్గింది ఇలా రాష్ట్రాన్ని విడగొడితే వీళ్ళు టాటా, బిర్లా, అంబానీలతో చాలా సులువుగా పోటీపడచ్చు.... కుటుంబంతో పాటు దొంగ వీసాలతో అమెరికా వెళ్ళాడు అని ఆరోపణలు ఉన్న ఒక అధికార పార్టీ నాయకుడు కూడా ప్రాంతీయత, ప్రత్యేక రాష్ట్రం అంటూ అరవటం చూస్తుంటే దొంగే ...దొంగా దొంగా అని అరవటంలాగ ఉంది. మొన్నటికి మొన్న తెలుగు మాజీ హీరోయిన్ పార్టీ పెట్టి ప్రజలకు కనిపించటం మానేసింది......కేవలం రెండు ఎమెల్యే సీట్లు ఉన్న బీజేపీ కూడ ప్రత్యేక రాష్ట్రం అంటుంది పాపం ఈసారి ఆ రెండు సీట్లు కూడ మిగలవని గ్రహిస్తే మంచిది.... కలిసుంటే కలదు బలం ఎదురురాదు ఏ అపజయం అన్న సంగతి గ్రహిస్తే మంచిది. ఈ ప్రాంతీయత అనే జబ్బు కేవలం ఎదో ఒక రాష్ట్రనికే పట్టలేదు మన పక్కన ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా దేశమంతా అంటువ్యాదిలా వేగంగా పాకుతుంది...... దీనికి ప్రజలు అనే వైద్యులు ఓటు అనే వేక్సిన్ తో చంపాలి......

ఈ నాయకులందరు ఒక్కసారి భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 19 చదివితే బాగుంటుంది.... దళితులు మాకు దేవుళ్ళు అనే ఈ పార్టీలు నాయకులు కేవలం అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు చేయటం, పూల దండలు వేయటమేకాదు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కూడా పాటించాలని తెలుసుకుంటే మంచిది...

ఆర్టికల్ 19: " ప్రతీ పౌరుడు భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్చగా తిరగటానికి, నివశించటానికి అధికారం ఉంది ".

పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.

టీవీ నైన్ లో మ‌ళ్లీ తిరుమ‌ల‌పై సంవాదం అంటూ స్టోరీ ప్ర‌సారం అయింది. కొంత విష‌యం కొత్త‌ది అయినా, మొత్తం మ్యాట‌ర్ పాత‌దే. తిరుమ‌ల కొండ మీద బోలెడంత అవినీతి జ‌రిగిపోతోంది. అప‌చారం జ‌రిగిపోతోంది. దేవుడి స‌న్నిధి లో జ‌రిగేదంతా త‌ప్పుల త‌డ‌కే. ఒక్క టీవీ నైన్ అనే కాదు, చాలా చానెళ్లు ఈ మ‌ధ్య కాలంలో ఈ రూట్ లో తెగ ప్ర‌చారం చేస్తున్నాయి. ఎందుకు ఇలా జ‌రుగుతోంది. నిజంగానే తిరుమ‌లలో ప‌రిస్థితి అంత దిగ‌జారిపోయిందా.. తిరుమ‌ల వైభ‌వాన్ని దిగ‌జార్చే ప‌నులు ఎందుకు జ‌రుగుతున్నాయి.
దీని వెనుక ఒక లాజిక్కు ఉంది. దీన్ని టీవీ భాష‌లో రేటింగ్ అంటారు. న్యూస్ పేప‌ర్లు, మ్యాగ‌జైన్ల‌ను ఎంత మంది చదువుతున్నారు అనేది తెలుసుకోవాలంటే స‌ర్క్యులేషన్ చూస్తాం. ఎన్ని కాపీలు ప్ర‌చురిస్తున్నారు, ఎన్ని కాపీలు అమ్ముడుపోతున్నాయో చూస్తాం. దాన్ని బ‌ట్టి ఏ ప‌త్రిక కు పాపులారిటీ ఉంది, ఏది టాప్ పేప‌ర్ అన్న‌ది చూస్తారు. దీని ఆధారంగా ఎడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ లు ఇస్తారు. టీవీ ఛానెళ్లు వ‌చ్చే స‌రికి రేటింగ్ ఆధారంగా అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్లు ఇస్తారు. ఈ రేటింగ్ అన్న‌ది - ప్ర‌తీ అర‌గంట నిడివి లోనూ ఏ ఛానెల్ ఎంత మంది చూస్తున్నారు అనేది లెక్క గ‌డ‌తారు. ఈ దిక్కుమాలిన లెక్క ప్ర‌కారం తిరుమ‌ల మీద వార్త‌లు ప్ర‌సారం చేసిన ప్ర‌తీసారి రేటింగ్ లు వ‌స్తున్నాయ‌న్న సంగ‌తి ఛానెళ్ల‌కు అర్థం అయింది. అంటే పిచ్చి వాడి చేతికి రాయి దొరికింద‌న్న మాట‌.
తిరుమ‌ల వేంక‌టేశ్వ‌ర స్వామిని కానీ, గుడిని కానీ తెర మీద చూపితే చాలు జ‌నం బాగా చూస్తారు. మంచిగా స్వామి వైభ‌వాన్ని , స్వామి మ‌హిమ‌ల్ని చూపించ‌వచ్చు. కానీ, మ‌న మెదడంతా భ్ర‌ష్టు ప‌డితే త‌ప్ప టీవీ ఛానెళ్ల లో హెడ్‌ల స్థాయికి ఎద‌గ‌రు. అందుచేత పుచ్చిపోయిన మెద‌డుతో ఆలోచించే ఈ హెడ్‌లు తిరుమ‌లను కూడా అదే దృష్టి తో చూస్తారు. అందుకే తిరుమ‌ల మీద ప‌దే ప‌దే నెగ‌టివ్ స్టోరీలు చేసి ప్ర‌సారం చేస్తుంటారు. ఎటూ రేటింగ్ వ‌స్తుంది కాబ‌ట్టి మేనేజిమెంట్ లు కూడా అదే ప‌ని గా ప్రోత్స‌హిస్తుంటాయి. ఏ చిన్న పొర‌పాటు దొర్లినా, తప్పిదం చోటు చేసుకొన్నా.. ఆకాశం విరిగి నేల మీద ప‌డిపోతుంది అన్న రేంజ్‌లో ప్ర‌చారం చేస్తుంటారు.
అంత‌మాత్రాన తిరుమ‌ల అంతా స‌వ్యంగా ఉంది, బ్ర‌హ్మాండంగా ఉంది అని చెప్ప‌లేం. కానీ, అంత‌క‌న్నా అవినీతి లో, ఘోరమైన వ్య‌వ‌స్థ‌లో కూరుకొని పోయిన వ్య‌వ‌స్థ లు చాలా ఉన్నాయి. ముమైత్ ఖాన్ అయిట‌మ్ సాంగ్ పెడితే జ‌నం చూస్తార‌ని తెలిస్తే చాలు.. ప్రొడ్యూస‌ర్లంతా గుడ్డ‌లిప్పే డాన్స్ లు ఎందుకు పెట్టిస్తారో ఇది కూడా అంతే. తిరుమ‌ల మీద ఎంత నెగ‌టివ్ చేస్తే, అంత రేటింగ్ అన్న మాట‌. దీనికి తోడు, వీటి మీద చ‌ర్చ‌ల్లో పాల్గొనేందుకు కొంద‌రు ఆస్థాన పండితులు కూడా హైద‌రాబాద్ లో సిద్దంగా ఉంటారు. వీరికి తోడు జ‌న విజ్ఞాన వేదిక వంటి హేతువాద సంస్థ‌లు ఉండ‌నే ఉన్నాయి. భార‌తీయ సంస్కృతి మీద దాడి చేయటం మాత్ర‌మే ఏకైక ల‌క్ష్యంగా ప‌ని చేసే ఈ సంస్థ ల ప్ర‌తినిధుల‌కు భ‌లే ప్ర‌చారం కూడా దొరుకుతుంది.మ‌మ్మ‌ల్ని క్ష‌మించు వెంక‌న్నా.