30, నవంబర్ 2011, బుధవారం

అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్

ఓ పెద్ద ఊర్లో ఒక సమావేశం జరుగుతోంది. దానికి దేశదేశాలనుంచి ఓ వంద మంది గొప్ప గొప్ప వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులున్న పెద్దమనుష్యులు, అధ్యాపకులు, రాజకీయవేత్తలు, శాస్త్రవేత్తలు, పండితులు, మతాధిపతులు, పీఠాధిపతులు, వేంచేసి యున్నారు. ఇంతకీ అక్కడ సమావేశంలో చర్చించే విషయం అత్యున్నత జీవనశైలి (ఐడియల్ లైఫ్ స్టైల్) గురించి.ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, వారి వారి జీవితానుభవాలనుంచీ, వారు చదివిన పుస్తకాలు, మత గ్రంధాలు, శాస్త్ర గ్రంధాలనుండీ ఉదాహరణలు ఉటంకిస్తూ వారివారి అభిప్రాయాలను వెలి బుచ్చుతున్నారు. ఇష్టమున్నవాళ్ళు, ఆ అభిప్రాయలతో ఏకీభవించిన వాళ్ళు చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూంటే, నచ్చనివాళ్ళూ, ఇష్టం లేనివాళ్ళూ వ్యతిరేకిస్తూ అడ్డుపడుతున్నారు.కొందరు ధనముంటే చాలంటే, మరికొందరు జ్ఞానవంతమైన జీవనానికి అనుకూలంగా వున్నారు. ఇంకొందరు దైవభక్తి, పాపభీతికి తలొగ్గితే, మరికొందరు అంగబలమూ, అధికారానికి పెద్దపీఠవేశారు. సాంకేతికంగా వృద్ధి చెందిన జీవనశైలే పరమావధిగా కొందరు భావిస్తే, ప్రశాంత మైన పల్లెజీవనానికి మించినదిలేదనేవారింకొందరు. ఈవిధంగా చాలా వేడి వేడిగా చర్చలు ఆరు రోజులుగా నడుస్తున్నా, ఇంతవరకూ ఒక ఏకాభిప్రాయానికి రాలేదు. ఏకాభిప్రాయానికి రావటానికి ఇంకొక్కరోజు మాత్రమే గడువుండటంతో చివరకు నిర్వాహకులు ఓటింగ్ పద్ధతిని అనుసరించడానికి నిర్ణయించారు. ఓటింగ్ ప్రక్రియ మొదలయ్యింది. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా ప్రక్కవాళ్ళతో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలలోని పసను ప్రక్కవాళ్ళకు వినిపిస్తున్నారు. ఏదో ఒక విధంగా ప్రక్క వాళ్ళను ప్రభావితం చేసి ఇంకొన్ని ఓట్లను పొందుదామని తాపత్రయం. ఇలా అందరూ హడావుడిగా వుంటే, సాదా సీదాగా వున్న ఓ మధ్యవయసు వ్యక్తి ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓటింగ్ కార్యక్రమం పూర్తయ్యింది. లెక్కించేందుకు ముందు చివరిసారిగా నిర్వాహకులు అందరూ ఓటువేశారా అని కనుక్కుంటున్నారు. నిర్వాహకుల్లో కొద్దిగా ఆలోచన కలిగిన ఓ చురుకైన వ్యక్తి, ముఖ్య నిర్వాహకుడు - మొదలునుంచీ ఎటువంటి హడావుడీ లేకుండా ప్రశాంతంగా వున్న మధ్య వయసు వ్యక్తిని గమనిస్తూవున్నాడు. అతనెప్పుడూ ఏ వ్యక్తితోనూ, ఎవరి అభిప్రాయంతోనూ ఏకీభవించడంగానీ, వ్యతిరేకించడంగానీ చేయలేదు. అసలు అతను అతని అభిప్రాయాన్ని కూడా ఎవరితోనూ పంచుకున్నట్లు కనబడనూలేదు. ఇప్పుడూ అలానే ప్రశాతంగా ఓ మూల కూర్చొని ఉన్నాడు. ఇదంతా చూసిన ఆ నిర్వాహకుడికి అతనికి కూడా ఓ అవకాశం ఇస్తే బాగుంటుందనిపించింది. ఇంతలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందరూ ఎవరికి వారే తమ అభిప్రాయమే గెలుస్తున్న అభిప్రాయంలో వున్నారు. ఫలితం ప్రకటించేందుకు ఆ చురుకైన నిర్వాహకుడు ఫలితాల కాగితంతో మైకు ముందుకు వచ్చాడు. అందరికీ ఉత్సాహంగా పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. వచ్చిన అందరికీ తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చే అవకాశం వచ్చినా, ఒకవ్యక్తి మాత్రం తన అభిప్రాయాలను చెప్పలేకపోయాడనీ, చివరిగా అతనికీ ఓ అవకాశం ఇస్తున్నామనీ, దయచేసి అందర్నీ నిశ్శబ్ధంగా వుండమని ప్రార్థించాడు. మధ్యవయసు వ్యక్తి దగ్గరకు వచ్చి అతన్ని స్టేజ్ మీదకు మాట్లాడడానికి ఆహ్వానించాడు. ఆ మధ్యవయసు వ్యక్తి తన గురించి పరిచయం చేసుకుంటూ ఇలా అన్నాడు. "నేను భారత దేశం లోని ఓ సాధారణమైన చిన్న పట్టణం నుంచి వచ్చాను. నాకు ముగ్గురు పిల్లలు. నాలుగెకరాలు కూరగాయలు పండించే పొలం, గ్రామ సభలో అకౌంటెంటు ఉద్యోగం." ఈ మాటలు పూర్తయ్యీ కాకమునుపే సభలో మిగిలిన వారి ముఖాల్లో తేలికభావం, అసలెవరతన్ని ఈ సభకాహ్వానించారని గుసగుసలూ మొదలయ్యాయి. నిర్వాహకుడు వారించాక కొద్దిగా సద్దుమణిగారు. తిరిగి అతను మొదలు పెట్టాడు. "నేనేమీ ఈ సమావేశానికి వెళతాననలేదు, కానీ మా పట్టణ ప్రజలు, పెద్దల బలవంతం మీద వచ్చాను. కానీ ఇక్కడ మీలాంటి పెద్దల్నీ, పండితులనీ చూశాక నాలాంటి వాడు చెప్పేదేముంటుందని వూరకున్నాను." ఇంతలో సభలోంచి ఎవరో నీ వెవరి అభిప్రాయానికి ఓటేసావన్నారు. "మీ రెవరి అభిప్రాయంతోనూ నేనేకీభవించలేక పోయాను కనుక ఓటే వెయ్యలేదు" అన్నాడతను."మీరెవరి అభిప్రాయంతోనూ ఏకీభవించలేక పోయానన్నారు. బాగుంది. అయితే మీ అభిప్రాయంకూడా చెప్పండి" అన్నాడు నిర్వాహకుడు."మీరింతవరకూ చెప్పిన అభిప్రాయాలన్నీ మనిషి సుఖజీవితానికి తోడ్పడతాయి తప్ప అర్థవంతమైన జీవనానికి కాదు. అర్థవంతమైన జీవితమంటే ఏమిటో మీకు తెలియనిదేమీ కాదు. ఏ శ్రమా, కష్టం లేకుండా గడిపే సుఖవంతమైన జీవితానికీ, భూమిలోపల ఆరడుగుల గోతిలోని జీవితానికీ తేడా ఏముంది? ఇబ్బందులనధిగమిస్తూ, కష్టాలనెదుర్కొంటూ, అసహాయులకు ఆసరా అందిస్తూ సాగే జీవనమే సామాజిక, దేశ పురోభివృద్ధికి మూలం. అదే అసలైన ఐడియల్ లైఫ్ స్టైల్" అంటూ ముగించాడు. సభలో ఏ ఒక్కరూ ఏమీ మాట్లాడలేదు. నిర్వాహకుడు మైకు ముందుకు వచ్చి ఈ వ్యక్తి వెలిబుచ్చిన అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఎవరికైనా వుంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. తన చేతిలోని ఫలితాల కాగితాన్ని తెరవకుండానే చించేసి, ఆ మధ్య వయసు వ్యక్తికి ధన్యవాదాలతో సభను ముగించాడు.

ఎప్పుడైనా ఆలోచించారా !!!!!!!!!!!!!!!!!!!!!!

మనం కొంపలు మునిగిపోయినట్లుగా అర్జంటుగా ఆపకుండానే కారు తోలుతూనో లేదా బైక్ నడుపుతూనో మొబైల్ లో మాట్లాడుతుండటం సహజం. కానీ దీని వల్ల ఇతరులు ఏవిధంగా ఇబ్బంది పడతారో ఎప్పుడైనా ఆలోచించారా. పోనీ మీరెప్పుడైనా అటువంటి ఇబ్బందులకు గురైయ్యారా. నావరకు రెండూ అయ్యాయి.

మాట్లాడుతూ వాహనం నడిపితే ఎంత హాని కలుగుతుందో అని గవర్నమెంటు - ట్రాఫిక్ వాళ్లు ఎంత ప్రయత్నించినా ఎవరూ అర్థం చేసుకోవటంలేదట. చివరకి ఫైన్లు వడ్డించినా పట్టించు కోవడం లేదట - ఎంత రుచిగా వుందో పాపం.

మిగిలిన వాహనాలు వెళ్ళే వేగంతో కాకుండా, నెమ్మదిగానో, లేకపోతే ఆగి ఆగి వెళ్ళడమో చేస్తాం. మన ఏకాగ్రత సరిగా వుండదు. చూపులు రోడ్డుమీదున్నా, చెవులు ఫోన్లోని మాటలమీద, మనసు ఆ మాటల గురించి ఆలోచిస్తూంటూంది.

మనం ట్రాఫిక్ నడిచే వేగం కన్నా మెల్లగా వెళడంతో వెనక వచ్చే వాహనాల కెంత చిరాకు కలిగింస్తుందో చెప్పనవసరంలేదు - హారన్లతో మోతెక్కిపోతుంటూంది
అంటే ఎదుటి వాహనం అకస్మాత్తుగా ఆగితే, దానికి ప్రతిస్పందించడం ఆలస్యం అవుతుంది - ఫలితం - ఢాం

ప్రక్కనో, వెనుకో హారన్ మోగినా వినటానికి చెవులు ఖాళీగా లేకపోవడంతో ఎవణ్ణో ఒకణ్ణి రుద్దో, గుద్దో తిట్లు లేదా తన్నులు తింటాం - హీనపక్షం గీతలూ, సొట్టలూనూ

కనిపించనిదింకొకటుంది - వేగంమీద కంట్రోలు లేకపోవటంతో, మూడునాలుగు గేర్ల బదులు రెండూమూడు గేర్లు వాడతాం - అంటే చమురు వదిలించుకోవడంతో పాటూ ఇంజను పెర్ఫార్మెన్సూ మందగిస్తుంది

ముఖ్యమైంది - ప్రక్కన కుర్చునేవారికి ఎంత ఇర్రిటేటింగా వుంటుందో ఎప్పుడైనా ఆలోచించారా

మోహం, చపలత్వాల భ్రమ, భ్రాంతి

ఓ గురుకులంలో శిష్య పరమాణువు లందరూ విశ్రాంతి సమయంలో గుమిగూడి వాడి వేడిగా చర్చించుకుంటూ, తర్కించుకుంటూ, వాదించుకుంటూవున్నారు. ఆ వాదించుకునే విషయమేమిటంటే ప్రపంచంలోని ఈతి బాధలకు కారణమేమిటా అని.

కొందరు మనిషిలో స్వార్థం అన్నారు.
ఇంకొందరు భ్రమ, భ్రాంతి అంటున్నారు.
వేరొకరు మోహం, చపలత్వాల గురించి చెబుతున్నారు.
మరికొందరు సత్తుకీ అసత్తుకీ తేడా తెలియకుండా పోవడమే అని వివరిస్తున్నారు.

వారిలో వారు గుంపులుగా తయారయ్యి ఎవరికి నచ్చిన వాదనను బలపరుస్తూ మాట్లాడుతున్నారు.

చివరికి ఎటూ తేలక, ఏకాభిప్రాయానికి రాలేక గురువుగారికి విన్నవించారు. అందరి వాదనలూ ప్రశాంతంగా విన్న గురువు గారు ఇలా తేల్చారు.

" అన్ని బాధలకు మూల కారణం మనిషి కదలకుండా ప్రశాంతంగా మౌనంగా వుండలేకపోవడమే "

హద్దులు ఉంటాయి

జీవితం చిన్న చిన్న విషయాలలోనే వికసిస్తుంది, ఆదమరిస్తే హరిస్తుంది కూడా...
చిన్నవి అనేవాటికి హద్దులు ఉంటాయి. ఉండాలి! అందుకే అవి చిన్నవి. ఆ హద్దులు మనం గ్రహించం. అంతే!
పొరపాటున ఎవరైనా గుర్తు చేసినా ఒప్పుకోం, నచ్చదు. మాయ అందించే ఆనందం అలాంటిది మరి!,

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.

నన్ను నాకు నగ్నంగా చూపే పగటి వెలుగుకంటే
నన్ను నాలా ఉండనిస్తూ భద్రతనిచ్చే చిక్కటి చీకటి నాకు నచ్చుతుంది.

నాలో ఘోషని నిర్లక్ష్యం చేసే వెలుగుకు ఏ కొసైనా నా చింత లేదు.
తన నిశ్శబ్దంలో నన్ను ఐక్యం చేసుకునే చీకటి నిశ్చింతలో నాకు స్వాంతన దొరుకుతుంది.

తన కపట మాటలతో చేతలతో మభ్యపెట్టే, రోజు ఆడంబరంకంటే
చంటిపాపలా నన్ను లాలించే రేయిలోని ఆప్యాయత నన్ను నెగ్గుతుంది.

రెండు నిమిషాలు కూడా కుదురుండనివ్వని పగటి ఆర్భాటంకంటే
శాంతం కూర్చుని నా గాధలన్నీ ఓపికగా వినే యామిని స్నేహం ఆహ్లాదంగా ఉంది.

కాదని, కుదరదని, జరగదని అపహాస్యం చేసే వెలుగు రంగులకంటే
'నీకు నచ్చిన రంగులతో నన్ను నింపుకో' అని చీకటిచ్చే చనువు నన్ను కదిలిస్తుంది.

నా చావుకు నన్నొదిలేసి, నా గొయ్యి లోతును కొలిచే పనికి రోజు పూనుకుంటుంది.
జారిపోతున్న నాకు ఊతం అందించి, ఒడి పరిచి బడలిక తీరుస్తుంది రాత్రి.

పగటి వెలుగులో చీకట్లు ముసిరేస్తున్నాయి. చీకట్లో వెలుగు రేఖలు విచ్చుకుంటున్నాయి.
రేయి పాడిన పాటలలోని రాగాలు, ఉషోదయంతో కూనిరాగలై మాయమైపోతున్నాయి.

రణగొణగా అట్టహాసంగా సాగుతూ, ఎన్ని అపహాస్యాలు చేసి ఎంత కౄరంగా హింసించినా
ఎదిగే ప్రతి పొద్దును ఊపిరి బిగపట్టి ఓర్పుతో దాటేస్తున్నది ఎందుకంటే......
నిరాడంబరమైన నిశి పరిచే చల్లని ఒడిలో వెచ్చని ఊహలతో
నిశ్చింతగా నిదురించే సమయం తిరిగి నాదౌతుందన్న నమ్మకంతో......

29, నవంబర్ 2011, మంగళవారం

గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ

నేను ప్రతిపక్షంలోకి వచ్చి ఎనిమిదేళ్ళు కావొస్తోంది. ఇన్నాళ్ల తర్వాత కూడా ఇంకా కేసులు, విచారణల పేరుతో వేధించడం న్యాయమేనా? నేను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు పాతికకు పైగా కేసులు వేశారు. వాటిన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి. అనేక విచారణలు చేయించారు. ఎక్కడా తప్పులు పట్టుకోలేకపోయారు. ఇదంతా అయ్యాక మళ్ళీ బురద చల్లుతున్నారు. ఇలా వేధించడం ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా?' అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు మీడియా తో మాట్లాడుతూ తనపై విచారణ విషయం ప్రస్తావనకు రాగా, ఒకింత ఆవేదనతో- కేసులు, విచారణల పేరుతో తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిణామాలన్నింటి వెనుకా కాంగ్రెస్ హస్తం ఉందని, భవిష్యత్తులో అన్నీ బయటకువస్తాయని పేర్కొన్నారు. 'అన్ని పార్టీలు కాంగ్రెస్కు లొంగిపోతున్నా మేం మాత్రమే పోరాడుతున్నాం. అందుకే ఈ వేధింపులు. కిరణ్బేడీ, రాందేవ్బాబా వంటివారిపై ఏనాటివో సాంకేతిక అంశాలను తోడి కేసులు పెడుతున్నారు. నేరుగా పోరాడటం చేతకాక దొంగ దెబ్బకు యత్నిస్తున్నారు' అని చెప్పారు.
'రాష్ట్రంకోసం గొడ్డు చాకిరీ చేశాను. చివరకు కుటుంబాన్ని కూడా విస్మరించాను. నేను అధికారంలో ఉండగా నా భార్య, కొడుకు ఏనాడైనా బయటకు వచ్చారా? నా అధికారాన్ని దుర్వినియోగం చేశారా? వారిపైనా కేసులు పెట్టారు. ఇదేం న్యాయం?' అని ప్రశ్నించారు. ఇరవై ఏళ్ళుగా తన భార్య ఇల్లు...కంపెనీ పని తప్ప మరోదానిలో తలదూర్చలేదని ఆయన పేర్కొన్నారు.
'నా కొడుకు లోకేశ్ అమెరికాలో చదువుకుంటే ఆ ఖర్చు రామలింగరాజు భరించారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు. స్టాన్ఫోర్డ్ వంటి విశ్వవిద్యాలయాల్లో సీట్లు విక్రయించరు. ఆరోపణలు చేసినవారికి అది కూడా తెలియదు. ఆ ఖర్చు కూడా భరించే స్థితిలో మేం లేమా?' అని విస్మయం వ్యక్తం చేశారు.
తాను స్కూల్లో చదువుతున్నప్పుడే వ్యాపారం చేస్తున్న రామోజీరావు తన బినామీ అంటే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదన్నారు. 'హైటెక్సిటీ పక్కన భూమి ఉంది కాబట్టి సినీనటుడు మురళీమోహన్ నా బినామీ అంటున్నారు. అంటే మాదాపూర్, శంషాబాద్ల్లో భూములున్నవారంతా నా బినామీలేనా? సింగపూర్లో నాకు హోటల్ ఉందని ఫొటో పెట్టారు. అదెవరిదో తెలపాలని సింగపూర్ హైకమిషనర్కు లేఖ రాశాను. దాని యాజమాన్యం బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్లో ఉందని జవాబు వచ్చింది.
అక్కడ పన్ను చట్టాలు లేవు కనుక వివరాలు బయటకు రావు. అందువల్ల నాపై బురద చల్లుతూనే ఉండవచ్చన్నది ప్రయత్నం' అన్నారు. డబ్బు పిచ్చితో వేల కోట్లు అక్రమంగా గడించినవారితో నన్ను పోల్చి గాడిదను... గుర్రాన్ని ఒకే గాటన కడుతున్నారన్నదే నా బాధ' అని వాపోయారు. కాగా.. తనకు సీబీఐ నుంచిగానీ, మరే దర్యాప్తు సంస్థ నుంచి గానీ ఎలాంటి నోటీసులూ అందలేదని చంద్రబాబు చెప్పారు. అయితే.. తన కుమారుడు లోకేశ్కు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి నోటీసులు వచ్చాయని తెలిపారు.
ఇదిలా వుంటే వైఎస్ విజయ వేసిన పిటిషన్ మేరకు తనతోపాటు మరికొందరి ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సోమవారం వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. "నాపై విజయ వేసిన పిటిషన్లో.. మా వాదనలు వినకుండా హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకపక్షంగా (ఎక్స్పార్టీ) ఆదేశాలు ఇచ్చింది. వాటికి మీడియా విస్తృత ప్రచారం కల్పించింది. ఫలితంగా నా పరువుప్రతిష్ఠలకు తీవ్రనష్టం కలిగింది. ఇటువంటి ఆదేశాలు సహజ న్యాయసూత్రాలకు విరు ద్ధం. అంతేకాదు... రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగకరం'' అని ఆ పిటిషన్లో చంద్రబాబు పేర్కొన్నారు.

28, నవంబర్ 2011, సోమవారం

దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం

ఇడుపలేసుని మహిమలతో
ఈశాన్య రాష్ట్రాలలో కూడా
దేవుడి బిడ్డ అడ్డాలు బహిర్గతం కావడం
దేవుడి బిడ్డకే కాదు
ఆంధ్రులందరికీ గర్వకారణం.

సోమాలియా దొంగల కథ

ఒక డాక్టర్ గారు
తీరిక లేకుండా
రాష్ట్రానికి ఆపరేషను చేసి
సహజవనరులను వెలికి తీసి
కొడుకును కొండెక్కిస్తుంటే
ఎరువులు కావాలని రోడ్డెక్కిన రైతులకు
సోమాలియా దొంగల కథ చెప్పి
సమాధాన పరిచి
రైతు శాస్త్రవేత్తలుగా
పార్టీ కార్య కర్తలను పెట్టించి
మేఘమధనం పేరు చెప్పి ధన మధనం చేసి
రైతులకు ఆదాయం ఎక్కువజేసి
పంట విరామం చేయించిలా కృషి సల్పి
డాక్టర్ గారు చెప్పినట్లు
వ్యవసాయాన్ని పండగజేసినందుకు
ప్రక్క రాష్ట్రపు విద్యాలయం
పట్టండి మహా ప్రభో అని డాక్టరేట్ ఇస్తుంటే
పట్టరాని ఆనందం వచ్చింది
తీసుకొన్నందుకు మీకు లేని సిగ్గు
అభినందించడానికి మాకు ఎందుకు
అందుకే అందుకోండి శుభాకాంక్షలు.

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై ప్రభుత్వం దగ్గరికి తమ ప్రతినిధులకు దారిచూపి

ప్రభుత్వం మైనార్టీలో పడింది
రక్షిస్తోంది ప్రతిపక్షమే అని
అవిశ్వాసం పెడితే
మేము పడగొట్టేస్తామని
ప్రగర్భాలు పలికి
ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
ప్రభుత్వం దగ్గరికి
తమ ప్రతినిధులకు దారిచూపి

రైతు సమస్యలపై
అవిశ్వాసం పెడతాము
అని చెబుతున్న ప్రతిపక్షపు పల్లవిపై
పలుకే బంగారం చేసి బాబాయితో
రాయభారాలు నడుపుతున్నది ఎవరు?

వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి....................

సామాజిక న్యాయం అని
పడగొడితే నిలబెడతా అని
తనకు న్యాయం చేసుకోడానికి
అమ్మగారి దర్శనం చేసుకొంటూ
పార్టీ పెట్టినప్పటి నుండి అయోమయాన్ని దూరం చేసుకోకున్నా
అమాత్య పదవన్నా వస్తుంది అని
ఆశల పల్లకిలో ఒకరు

నాన్న అధికార మంత్రదండంతో
వాయు వేగాన వ్యాపారి అయి
అయ్య స్థానం కోసం అంగలార్చి
అలిగి
తోసేస్తానని
తోక జాడించి
ముసురుకొన్న కేసులతో
మద్దతు దారులు ‘దారులు’ వెతుక్కొంటుంటే
వెంగలప్పలా పచ్చి వెలక్కాయ మింగి
అమాత్య పదవన్నా వచ్చి వుండేదని
అంతులేని ఓదార్పు లో నిర్వేదపడుతూ
ఆటలో అరటి పండైనా ఓ అర్ధం వుండేది
అడ్డంగా కేసుల్లో ఇరుక్కొన్నామే అని ఇంకొకరు

నాన్నది తప్పా? అమ్మది తప్పా?

ఏభై శాతం మార్కులతో
అమెరికాలోని యూనివర్సిటీలలో
కొడిక్కి ఇరవై ఐదు కోట్ల డొనేషనుకట్టి
చదివించి అది చూపించుకోని
నాన్నది తప్పా?

ప్రజా సంపదను
పరుల దోసిట పట్టించి
కొడికి కంపెనీలలోకి
పెట్టుబడులు రప్పించి
కొడుకును పెద్ద వ్యాపార వేత్తగా
చూపించిన
నాన్నది తప్పా?

కొడుక్కోసం పాల వ్యాపారం చేస్తున్న
అమ్మది తప్పా?

కొడుకు రాజకీయ పదవి కోసం
అన్ని ఆరోపణలకు వెనకేసుకొని వస్తూ
రాజకీయ ప్రత్యర్ధులను వేధించడం మొదలెట్టిన
అమ్మది తప్పా?

21, నవంబర్ 2011, సోమవారం

ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

సత్తు పళ్ళెం లో చప్పిడి తిండెట్టుకొని
ఏలగట్టిన కోడిని చూస్తూ
లొట్టలు వేసుకొని తినే
పింజారీ లు పైరసీలో చూసి
ఆనందిస్తాము అంటే
ఆడి బ్రతుకులో
ఆనందించడం
తెలుగు వాడిగా గర్వపడడం లాంటి పదాలు తెలియక
బురదలో బతికేసే రకం అని వదిలేయండి.
ఆ రాముడు
తారక రాముని దేహం లో
ఆవాహనం అయ్యి
ఆంధ్రాలో అయోధ్య లేని లోటును తీర్చాడు

చందాలతో భద్రాచల గుడి నిర్మించిన రామదాసు
నడయాడిన ఆంధ్రాలో
సయోధ్య కరువవ్వడం చూసి
ఆ రాముడు మరో సారి
బాలయ్య లో ఆవాహనం అయ్యి
ఆనంద భరితులను చేయ సంకల్పించాడు.

చరిత్ర సృస్టించాలన్నా .........అలా అనడం తప్పా????

గతంలో బాలయ్య గర్జిస్తే
ఆవేశం తో అంటున్నాడని ఆడిపోసుకొన్న వాళ్ళు
శ్రీ రామ రాజ్యంలో బాలయ్య విశ్వరూపం చూసి
సమాధాన పడ్డారా లేదా?
మొదట సింహమై గర్జిస్తూ
చరిత్ర సృస్టించాలన్నా .........అన్నప్పుడు
అవివేకంతో ఆడిపోసుకొన్న వారికి
దశాబ్దాల తరువాత
తెలుగు వాడికి మళ్ళీ రమ్యమైన రాముడి రూపం
చూపింది ఆ వంశమే కదా?
అలా అనడం తప్పా????
ఇక దర్శకుల గురించి
ఎవడినో ఉదహరిస్తూ
పళ్ళు రాలగొడతాను మన పరిశ్రమలో లేదంటే
అని ఆవేశ పడితే
అదును చూసి ఊదరగొట్టి
ఆ ఆవేశాన్ని పదే పదే ప్రశ్నించిన వాళ్లకు
అలనాటి లవ కుశ మాయా బజార్
సరసన నిలిపే
ఈనాటి శ్రీ రామ రాజ్యం దృశ్య కావ్యం
చూస్తే కనువిప్పు కలుగదూ??

11, నవంబర్ 2011, శుక్రవారం

మన పూర్వ జన్మ సుకృతం.

తన మన ను కూడా దూరం చేసుకొంటూ
రోజు రోజు కూ స్వార్థం పెంచుకొంటూ
సద్గుణాల గురించి తెలుసుకోలేనంత
కంగారు జీవితాలు వెలగబెడుతూ
జనం సొమ్ము తిన్నోల్లను
కథానాయకులుగా తాత్కాలిక బ్రాంతి చెందుతూ
ఆదర్శంగా చేసుకొని
అడ్డగోలు సంపాదనకు ఆత్రపడుతున్న
మన జీవితాలకు
అడపా దడపా అడ్డేసి
కామ క్రోధ మధ మాత్సర్యాలు
కట్టలు తెగితే ఏమవుతోందో తెలిపి
తప్పులను తెలుసుకొనే
తెప్పలు మన ఒడ్డుకు
అడపా దడపా వస్తాయి
అందులోనూ ఆంద్రులను మురిపించ
నందమూరి అందగాల్లనుండే వస్తాయి
మనలను మెప్పించే అభినయం
వారికి మాత్రమే అబ్భిన అదృష్టం
ఆ అదృష్ట వంతులకు అభిమానులుగా వుండడం
మన పూర్వ జన్మ సుకృతం.

గమనిక:

ఇక్కడ పూర్వ జన్మ సుకృతం అని వాడడం
మీరు అతిశయోక్తిగా అనుకోకండి
సంస్కృతి సంస్కారం నేర్చుకొనే
సినీ సాంగత్యం
అభిమానం రూపం లో మనలను
కట్టి పడేయడం ఖశ్చితంగా మన పూర్వ జన్మ సుకృతమే.

10, నవంబర్ 2011, గురువారం

ఇప్పుడు సత్యం డొల్ల సాక్షికి బల్లెం అయ్యింది

నాణేనికి రెండో ప్రక్క అంటూ
జనాలకు సాక్ష్యం చెప్పడానికి వస్తే
పుట్టుకనే ప్రశ్నించాయి
పత్రికలు ప్రతిపక్షం

అంతే అధికారం మత్తుతో
నేనే ఆణిముత్యం అంటూ
ప్రభువు ప్రార్ధనలు చేస్తూ
అంతెత్తున ఎగిరి
అందరినీ పచ్చ పత్రికలు అంటూ
ఎదురు దాడి మొదలెట్టింది

పాపం పండి కోతలు మొదలయ్యే సరికి
అధికారం అప్పుడు అంటకాగిన వాళ్ళు
అడ్డం తిరగగా
వెలక్కాయ పడి
శాపనార్ధాలు పెడుతూ
కామెర్ల రోగికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు
ప్రపంచం లో శానా మంది ఇంతకంటే ఘోరం అంటూ
గిల గిల లాడుతూ
అమ్మగారితో గిల్లీ కాజాలు ఆడిస్తూ
ప్రత్యారోపణలతో ఆరున్నరొక్క రాగం వినిపిస్తోండగా

ఇన్నాళ్ళూ స్వాతి ముత్యం అంటూ మురిపించినా
ఇప్పుడు సత్యం డొల్ల సాక్షికి బల్లెం అయ్యింది
విలువ కట్టిన వాడితోనే
కటకటాల వెనుక పంపే పని చేయిస్తుండగా
చేష్టలుడిగింది సాక్షికి

9, నవంబర్ 2011, బుధవారం

మానవ జన్మ దుర్లభమని అర్ధము

ఈ సృష్టి ఒక్క సమయము అను మహా కాల ప్రవాహమునకు పోల్చి చూచినచో మానవ జీవితము ఒక్క నిమిషము మాత్రమే అగును. అనగా 100 సంవత్సరములు బ్రతికిన వాడు ఒక్క నిమిషము బ్రతికిన కీటకముతో సమానము. 50 సంవత్సరముల వయస్సులో పోయినవాడు అర నిమిషము బ్రతికినవాడు. 25 సంవత్సరముల వయస్సులో పోయినవాడు పావు నిమిషము బ్రతికినవాడు. మనము చూచు చుండగనే మన కంటి ఎదుట ఒక కీటకము ఒక నిమిష కాలము బ్రతికినది. మరియొక కీటకము పావు నిమిషమే బ్రతికినది. మొదటి కీటకము ఎట్టి వేదనయు లేక మరణించినది. రెండవ కీటకము పావు నిమిషము బ్రతికి చివరిలో ఒక క్షణకాలము హింసను అనుభవించి మరణించినది. మొదటి కీటకము నిమిషము బ్రతికినను ఎట్టి హింసయు లేక మరణించినను మరణానంతరము కోట్ల సంవత్సరములు హింసకు గురియైనది. రెండవ కీటకము పావు నిమిషమే బ్రతికినను ఒక క్షణకాలము హింసననుభవించినను, మరణానంతరము కోట్ల సంవత్సరములు ఆనందముతో తేలియాడినది. ఈ రెండు కీటకములలో ఏ కీటకమును గురించి నీవు దుఃఖించవలెను? మొదటి కీటకము గురించియే "అయ్యో! పాపము" అనవలెను. రెండవ కీటకమును గురించి కాదు. కావున 32 సంవత్సరములు మాత్రమే బ్రతికి చిట్ట చివరిలో 4 రోజులు భగందర వ్యాధితో బాధపడి మరణించి, తరువాత సృష్టి ఉన్నంతకాలము శివ సాయుజ్యమును పొందిన ఆది శంకరుల యొక్క అల్పాయుర్ధాయమును గురించికాని, ఆయన అనుభవించిన రోగబాధను కాని చింతించి సానుభూతి చూపనవసరము లేదు. మరియొకడు కాకి వలె నూరేండ్లు జీవించి పెద్ద వైద్యాలయములో మరణించి తరువాత సృష్టి ఉన్నంతకాలము నరకమున పడినాడు. ఈ రెండవ వాని గురించియే ఏడ్చి సానుభూతి చూపవలెను. భగవంతుని దృష్టిలో మొదటివాడు 100 క్షణములు, జీవించినాడు. రెండవ వాడు 32 క్షణములే జీవించినాడు. ఈ క్షణకాలములో ఒకనికి ఓరిగినది లేదు మరియొకడు నష్టపడినది లేదు. ఈ క్షణకాలము తరువాత జీవుడు పొందు నిత్య శాశ్వత ఫలమును గురించిన ప్రయత్నము చేసుకొనుట ఎంతో వివేకమైయున్నది. ఈ క్షణకాల సుఖములలోపడి ఈ క్షణకాలము మాత్రమే ఉండు పతి, పుత్ర, ధన, దారా బంధముల వ్యామోహములలోపడి నిత్య ఫలమును నాశము చేసుకున్నవాడు ఎంతో అవివేకి. ఈ అవివేకమునకు కారణము కాలము యొక్క జ్ఞానము లేకపోవుటయే కావున కాలజ్ఞానము గల యోగి శాశ్వత ఆనందమును సంపాదించు కొనుటకై ఈ క్షణకాలమును సాధనతో సద్వినియోగము చేసుకొనును. కావున ఈ జీవుడు మరణమును గురించి కాని, మరణవేదనను గురించికాని, ఈ క్షణ జీవితకాలములో జరుగు కష్టనష్టముల గురించి కాని ఆలోచింప పనిలేదు. ఒకరి జీవితము బాగున్నది. నా జీవితము బాగా లేదని చింతింప పనిలేదు. అట్లే ఒకడు అల్పాయుర్దాయుడు, మరియొకడు పూర్ణాయుర్దాయుడని పలుక పనిలేదు. ఇవి యన్నియును ఒక్క క్షణకాలము లోని బేధములే. మరణానంతరము పొందు ఫలము అనంత కాలము ఉండునది. అట్టి నిత్య ఫలమును గురించి భగవంతుని ప్రార్ధించవలయునే కాని, అసత్యములు క్షణికములైన వాటిని గురించి, వారిని గురించి పరమాత్మను అర్ధింపనేల? అంతే కాదు ఈ ఒక్క క్షణకాలము ముగియగనే నీ శరీరము కూడ నశించి పంచభూతములలో కలసిపోవుచున్నది. అట్టి క్షణికమైన నీ శరీరము యొక్క రోగబాధలను గురించి భగవంతుని యాచింపనేల? నీవు అడగ తలచుకున్నచో మరణానంతరము సిద్ధించు ఆ నిత్య ఫలమును గురించియే అర్ధించవలెను. కావున కాలజ్ఞానము తెలిసిన వారు ఎంతో వివేకముతో ఈ క్షణకాల జీవితములో చేసిన సాధన ద్వారా శాశ్వతమైన బ్రహ్మ సాయుజ్యమను అమృతఫలమును పొందుచున్నారు. ఇదియే నిజమైన కాలజ్ఞానము. అంతే కాని భవిష్యత్కాలములో జరగబోవు లౌకిక విషయముల గురించి తెలుసుకొనుట కానేకాదు.

ఇప్పుడున్న లౌకిక విషయములే నిన్ను సర్వనాశనము చేయుటకు చాలును. నిన్ను ఒక్క క్షణకాలములో భస్మము చేయుగల హాలాహల విషము నీ చేతిలో ఉండగా, అది చాలక ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, టి.వి, సినిమాలు, నవలలు, కధలు ఇంకనూ భవిష్యత్పురాణము, కాలజ్ఞానము అను కుండలు కుండలు విషము కొరకు పరుగిడు చున్నావు. నీ యొక్క అవివేకమును చూచి పరమాత్మ కన్నీరు కార్చుచున్నాడు. అట్టి నీవు అల్పాయుష్కులైన శంకరుల గురించి ఆయన పడిన నాలుగు రోజుల బాధను గురించి "అయ్యో పాపము " అనుచున్నావు. కాని నిత్య నరకములో పడిన నీ వెనుకటి తరముల వారి గురించియు, మరియు నీ గురించియు, మరియు నీ యొక్క రాబోవు తరముల గురించియు "అయ్యో! పాపము" అని పరమాత్మ కోటిసార్లు పలుకుచున్నాడు. క్రీస్తు మహాత్ముడు 34 సంవత్సరములు బ్రతికినాడు. నాలుగు గంటలు హింసను అనుభవించినాడు. ఆయన శిలువను మోసుకొని పోవుచుండగా చూచు చున్నవారు ఆయనకు వచ్చిన కష్టమును చూచి సానుభూతితో ఏడ్చినారు. లక్ష కొరడా దెబ్బలు తినబోవు వాడు నాలుగు కొరడా దెబ్బలు తినువాని చూచి ఏడ్చినట్లున్నది. వెంటనే ఆ మహాత్ముడు ఆగి వారి వైపు చూచి "మీరు నా కోసము ఏడవ వద్దు. మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి" అని చెప్పి ముందుకు సాగినాడు. కావున ఈ క్షణ జీవిత కాలములో క్షణికములగు ఐహికముల కొరకు గాని, ఆయురారోగ్యముల కొరకు గాని, మృత్యువును గురించి కాని చింతించు మూర్ఖుడు మరియొకడు ఉండడు. క్షణకాలములోని బాధలను అవివేకముతో చింతించుచున్నాడే తప్ప, తర్వాత వచ్చు శాశ్వత బాధల గురించి తెలుసుకొనుట లేదు. క్రైస్తవ మతము ప్రకారముగా జీవునకు మరల మానవ జన్మ ముగియగనే తుది తీర్పు ఉండును. ముక్తులు శాశ్వతముగ పరమాత్మ వద్దకు చేరుదురు. బద్ధులు శాశ్వతముగ నరకమున పడుదురు. హిందుమత సిద్ధాంతము కూడా ఇదే చెప్పుచున్నది. "జంతూనాం నర జన్మ దుర్లభమిదమ్" అని హిందూమత సంప్రదాయము చెప్పుచున్నది. అనగా మానవ జన్మ దుర్లభమని అర్ధము. ఎడారిలో మంచినీరు దుర్లభమనగా అర్ధమేమి? ఎడారిలో మంచి నీరు లభించదు అనియే గదా. కావున ఇదం నరజన్మ= ఈ మనుష్య జన్మ, జంతూనాం = జంతువులకు, దుర్లభం = మరల లభించదు. కావున ఏ మతము చెప్పినను, సత్యము సత్యమే. అమెరికాలో దొరికినను, ఇండియాలో దొరికినను వజ్రము వజ్రమే. గులక రాయి గులకరాయే. ఐతే ఇచ్చట మరియొక సత్యమున్నది. ఈ సత్యము ముందు చెప్పిన సత్యమునకు విరుద్ధము కాదు. అది ఏమనగా పరమాత్మ వద్దకు చేరిన ముక్త జీవులు మానవులను ఉద్ధరించుటకు, పరమాత్మతో పాటు మానవ జన్మలను పొందుదురు. అంతే కాని నిత్య నరకమున పడిన బద్ధ జీవులకు మరల మనుష్య జన్మలేదు

ఆ యాదవులు సామాన్య జీవులు

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్ సాంగ్లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను

లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగాలు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము, ద్రోణి రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నేడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్టసుఝములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించ వచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును. అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహిని జ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. "నప్రహృ ష్వేత్ ప్రియం ప్రాస్యా నోద్విజేత్ పాప్య్రాచా అప్రియం" కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్ధిత ప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది. పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవర్ధమైన వాడు ఇహము నందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడు సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టుత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించు చున్నాడు. ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో "అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందు వలన సీత కనపడదు. మరియు ఏడుపు వలనన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు. యోగము అను శబ్ధము "యుజ్" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్" ఏకీకరణ అని అర్ధము. అనగా అన్నింటిని కలుపుట అని యోగ శబ్ధమునకు అర్ధము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయిటకు కారుపోవుచున్నవి. అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములలో వ్యర్ధముగా బయిటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము.

యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరనను ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీ కృష్ణుడు శాంతసముద్రునిగా మందహాముతో రధమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు ఆశీభూతమై లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయిటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆశక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పనని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము. భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరముచేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సర్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్ధము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము. భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగము దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్ధకమే కాని వ్యర్ధము కాదు. రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను శ్రుతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు. కావున లోక చింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.

ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు

ఏ ఆరోపణలు వచ్చినా
ఎల్లో మీడియా ఏడుపు అనే జె గ్యాంగు
ఇప్పుడు తీస్తా అంటూ సిక్కిం లో తీస్తున్న పవరు గురించి
వ్రాసిన అస్సాం ట్రిబూన్ ఆన్ లైన్ ని కూడా
ఎల్లో మీడియా అంటుందేమో మరి.

8, నవంబర్ 2011, మంగళవారం

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న ధర్మ ప్రభువులు

మా తాతల కాలం నుండి దొరలము
పన్నులు కట్టిన సంపన్నులము అని
సంకలు గుద్దుకుంటూ
చోర కళ తో సంపాదించిన
కరపత్రాలతో
రాష్ట్రంలో రాద్దాంతం చేస్తూ

కోటల్లోకి
వ్యాపార సామ్రాజ్యాల్లోకి
న్యాయ దేవత వడి వడి గా వస్తుంటే
ఆపడానికి

ఓ ప్రక్క ధర్మ యుద్ధం పేరుతో
బెదిరించ చూసి భంగపడి

మరో ప్రక్క అవినీతి ధనంతో
అత్యంత ఖరీదైన న్యాయ వాదులతో
సుప్రీం లో వాదించి
న్యాయ దేవత అడుగులను నిలువరించ చూస్తే

ఆ దేవత కూడా ‘దేవుడి’ బిడ్డను చిన్న చూపే చూసింది

ధనం కోసం ధర్మ యుద్ధం చేస్తున్న
ధర్మ ప్రభువులు

తమను ఎన్నుకొన్న ప్రజలు
తమ రాజకీయ జీవితాలకు
పాతరలు వేయక ముందే
మేల్కోండి

ప్రాణం అంటే పూచిక పుల్లలా తీసేస్తూ
అవినీతి పై ప్రభువులను
పరుగులు పెట్టిస్తున్న
పండుటాకులను చూసైనా
ప్రజల సొమ్ము కాపాడ
కలసి రండి

ధర్మ యుద్ధమని చేస్తున్న
ధన యుద్ధంలో
గెలుపు దక్కదని తెలుసుకోండి.

ఎలా పోయినా ఆర్థికంగా ఆదుకొంటారు.

అయితే నిత్య ఓదార్పు సభ్యులకు
నిమిషాల్లో సమాచారాన్ని చేరవేయండి.

మీ వాళ్ళు వాళ్ళపై జరుగుతున్న దాడులకు
గుండె పగిలి పోయారని
వాళ్ళు మీడియా కవరేజి ఇచ్చి
ఏదో ఓ రోజు మళ్ళీ
మందీ మార్బలంతో మీవాళ్ళ ఇంటికి వచ్చి
ఓదార్చి పోతారు.

ఎలా పోయినా
పోయిన దేవుడి భక్తులని
ఆర్థికంగా ఆదుకొంటారు.

సత్యం రాజు లా నిజాయితీ చూపారు......................

దొరికే వరకు దొంగ కూడా దొరే
చిక్కాక
చికాకు ప్రశ్నలకు
పట్టుబడుతారు

ఇవన్నీ జరగక ముందే
అనుమానపు చూపులు నిలిచినపుడు
ఎవరూ నేను దోషి అని
సత్యం రాజు లా నిజాయితీ చూపారు

ప్రతి వాడు ఇంకోడు జాతీ గా లేదు
అని జారుకోవాలనే చూస్తారు
తను జాతీ గా లేను అని
జన్మలో ఒప్పుకోరు
ప్రశ్నల జడివానతో జడిపిస్తే తప్ప

దొర దొంగయ్యే సమయం దరిదాపుల్లోకి వచ్చింది
అందుకే దడ మొదలయ్యింది
రాజకీయాలు విరక్తిగా కనిపిస్తోంది
ఒప్పుకోవడంలో నిజాయితీ చూపిస్తే
కనీస సానుభూతి దొరుకుతుంది

ఎవడూ జాతీగా లేదు
నన్ను మాత్రం జప్తెందుకు చేస్తారు అని
ఎదురు ప్రశ్నలతో జవాబును సానుభూతి రూపంలో
పొందాలని చూస్తే
చూసే వాళ్లకు చులకనవ్వడం తప్ప
చస్తే సానుభూతి దక్కదు.

7, నవంబర్ 2011, సోమవారం

ఒకరకంగా నక్సలైట్లే మేలు.............

వేరు పడితే మళ్ళీ
నక్సలిజం పెరుగుతుంది అని
కలిసి వుండాలని కోరుకునే వాళ్ళు చేసే
ఆరోపణలలో నిజం లేదని
మొత్తుకొంటున్న
వేర్పాటు వాదులూ….

వేరుపడకనే
ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమం
నడపడం చేతగాక
రైల్వే ట్రాకుల క్లిప్పులు తొలగించడం
బస్సుల పై దాడులు
లాంటి చర్యలను ఏమంటారు?

ఒకరకంగా నక్సలైట్లే మేలు
బలవంతంగా బడులు మూయించడం
విద్యుత్తు కొరతతో పంటలు ఎండబెట్టడం
లాంటి చర్యలకు పాల్పడేవారు కారు.

బక్క గాడిద ఎక్కడ బావురు మంటుందో ..............

గాడిదలకు గడ్డి పెట్టి
పశువుల దగ్గర పాలు పితికే
అమాయకులు కాబట్టే

అమాత్య పదవి దొరకనంత వరకు
ఓండ్ర పెట్టకుండా
దక్కదని తెలిసిన క్షణం నుంచి
ఓండ్ర మొదలెట్టిన
గాడిద నాయకత్వంలో
విడిపోతామని పగటి కలలు కంటూ
పనులు ఎగ్గొట్టమంటే
ఎగ్గొట్టి గాడిద వెనుక వెళుతున్నారు

మొరాయించే గాడిదలకు
మోయించే చాకలి దొరికితే
ఓండ్ర పెట్టినా వదలకుండా
కొట్టుకొంటూ రేవు దగ్గరకి తోలుతాడు

ఇప్పటి పరిస్థితులలో
ఆ చాకలి పదవి
తీసుకొనే సాహసం ఎవరూ చేయరు
కలిసి ఉండాలనే వారి సహనం
నశించిన రోజు
అందరూ తలో చెయ్యి వేస్తారు
బక్క గాడిద ఎక్కడ బావురు మంటుందో అనే
సంకోచమే ఇప్పుడు ఆ గాడిదకు రక్ష.

మన రాష్ట్రం లో దేవుడని చెప్పుకొని ..........

రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్ముతో
పట్టణాలలో ప్యాలస్ లు
లోటస్ ప్యాండ్ లు
అని ప్రశ్నిస్తున్నారు?

రాముడి భక్తుడు రామదాసు
కృష్ణ దేవరాయలు లాంటి వాళ్ళు
అనంత పద్మనాభ స్వామీ కి
కేరళ రాజులు
సత్య సాయి బాబా కు
వారి వారి భక్తులు

తమ దేవుళ్ళకు
గుళ్ళూ గోపురాలు
నగా నట్రా వజ్ర వైడూర్యాలు లాంటి
అనంత సంపదను
ఆయా దేవుళ్ళు
అడగ కుండా
భక్తులు ఇచ్చారు

మన రాష్ట్రం లో
దేవుడని చెప్పుకొని
కొడుకు ప్రచార మాధ్యమాలతో
వాన రాక పోక లతో సహా
దేవుడే అని నిరూపిస్తూ
చెవినిల్లు కట్టుకొని చెప్పినా

ఒక్క భక్తుడైనా
గుడి గోపురం
అడగకుండా అనంత పద్మనాభ స్వామికి ఇచ్చినట్టు
సంపదలు సమర్పించారా

అందుకే కలియుగ దైవం
కన్నుమూయక ముందే
కన్న కొడిక్కి
తనకు ఇష్టం వచ్చినట్లు
కావాల్సినంత కానుకలు
ఇచ్చి వెళ్ళాడు

కానుకల స్వీకారం మొదలెట్టి
పోగేసే సమయం నుండి
పోయే దాక
పోయినాక కూడా
చంద్రబాబుది ఒకటే పోరు
ఈయనది ఏదో పోయినట్టు

కడుపు మంట కాక పోతే
రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్మని అడగడం
ఎబ్బెట్టుగా లేదూ.

మతం వారిగా మడతపేచీలు పెట్టి ప్రాంతాల వారిగా పాడెలు కట్టి శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

తెలుగు తల్లి ఒడిలో
బురద పద్మాన్ని
పెట్టనివ్వని
తెలుగోడు
మొట్ట మొదట
అదే పద్మాన్ని
హస్తిన కుర్చీ ఎక్కించి
ఏమి కావాలన్నది
ఇక్కడ నుండే
శాసించి మరీ రాబట్టుకొన్నాడు

అటువంటి ఆంద్ర ప్రదేశ్ లో
ఎన్నేళ్ళు పడిగాపులు గాసినా
పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉన్నట్టు వుంది

అందుకే ఆంగ్లేయులకు మల్లే
ఆంధ్రులను విడదీసి
సందులో దూరి సడేమియా అంటాము
తరువాత పాగా వేసి పాలిస్తాము

అలనాడు ఆంగ్లే యులను
ఆదరించిన దేశ ద్రోహులకు మల్లే
ఆంధ్రా లో ఉన్న అంధులు కొందరు
దగ్గరికి రానిస్తున్నారు

హస్తిన కుర్చీ ఎక్కిన క్షణం
చీల్చడానికి వెరవం
మీరు ఛీ కొట్టినా సరే

మతం వారిగా మడతపేచీలు పెట్టి
ప్రాంతాల వారిగా పాడెలు కట్టి
శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

అన్నను చూసి తనే దేవుడని డప్పేసుకొన్నాయనను

గజన్ పై ఆరోపణల గురించి
గంటల కొద్దీ సోదించి
రక్షించినానన్న కిరణ్
కుర్చీ ఎక్కినప్పటి నుండి
ఎవరూ పట్టించుకోవడం లేదు
దించేస్తామనే గజన్ తప్ప.

సభాద్యక్షుడుగా
పాలకుల పాపాలను
కడగనీకుండా
కష్టపడ్డ వ్యక్తి
కొత్తగా మనకు
ఏమి ఒరగబెడుతాడులే అని
నిరూపితమైన నిజం చవిచూసిన
జనం ఒకింత నిరుత్సాహం చూపారు.

పాడెక్కిన పావలాను మరిచిన జనాలకు
పావలా వడ్డీకి కోట్ల కేటాయింపు అన్నాడు
చీమ కుట్టినట్టు కూడా లేదు

లక్షల కొలువులన్నాడు
కొంపదీసి ఇచ్చేస్తాడా ఏమిటి అని
వ్యంగంగా అన్నోడు కూడా
ఆంధ్రా లో కనిపించలేదు

ఆరు నెలలకో పధకం అన్నాడు
ఆరు నెలలైనా కుర్చీలో
ప్రశాంతంగా కూర్చోలేని వాడనుకొని
ప్రజలు పట్టించుకోలేదు

అన్నను చూసి
తనే దేవుడని కొడికి చేత
డప్పేసుకొన్నాయనను
అధిగమించేద్దామని
ఏకంగా
పాడెక్కిన పావలా
అర ప్రాణంతో ఉన్న అర్ధ రూపాయి ని విడిచి
కొనడానికి చెల్లుబాటు కాక
కోమాలో ఉన్న రూపాయికి
కిలో బియ్యం ఇస్తామని
తన ఓట్ల బొచ్చతో
తన బుద్ది చూపాడు.

4, నవంబర్ 2011, శుక్రవారం

చరిత్రను పునరావృత్తం చేయవచ్చు

చైతన్యం వస్తోంది
చదువు సంధ్యలు ఎక్కువ అయ్యాయి
కలిసి ఉంటే కష్టం
మిగిలిన ప్రదేశాల్లో లా
మన దగ్గర ఎందుకు అభివృద్ధి జరగలేదని
నిలదీస్తారు

విడదీస్తే
మళ్ళీ మనమే బాంచన్ దొర అని చెప్పించుకొంటూ క్రింది చరిత్రను పునరావృత్తం చేయవచ్చు.

“చెరువుల్లో నీరు మొదట భూస్వాముల పొలాలు సాగు అయిన తరువాతనే ఇతర రైతులు తీసుకోవాలి. వ్యవసాయ కూలీలు మొదట భూ స్వాముల నాట్లు వేసిన తరువాతే ఇతరులవి వేయాలి. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ ముందు చాకలి వారు నిత్యం నూరు బిందెల సానిపి చల్లాలి. వారి దున్నపోతులకు క్షురకులు క్షవరాలు చేయాలి. కచ్చడాల ముందు ఉరకాలి. మూటలు మోయాలి. పక్కలు వేయాలి. పచ్చి బాలింతలను కూడా పాలు పిండి చూపితే తప్ప పనుల నుండి వదిలేవారు కాదు. గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు, జాగీరు ఉద్యోగులు వచ్చినప్పుడు ఆ గ్రామంలోని చిల్లర దుకాణదారులు అధికారులకు కావలిసిన సన్న బియ్యం, మాలు, మసాలా, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, సబ్బులు తదితర వస్తు సామాగ్రినంతా ఉచితంగా సరఫరా చేయాలి. గొర్రెలు, మేకలు, కల్లు, కోళ్ళు, పందులు, చేతివృత్తుల ఉత్పత్తులతో సహా బలవంతంగా అధికారులు గుంజుకునేవాళ్ళు. ఈ విధంగా జనాన్ని బానిసల కన్నా హీనంగా చూసేవారు. ఈ బాధలు భరించలేక ఎవరైనా ఎదిరించినా, నిలదీసినా సహించేవారు కాదు. వారిని నిర్బంధించి క్రూరంగా హింసించేవారు. హత్య చేసి తమ గడీలలోనే పాతిపెట్టేసేవారు”.

చచ్చే వరకు ఎదురు చూస్తున్నా కొడుకు

చచ్చే వరకు
సంపాదనపై చర్చ పెట్టక
ఎదుటోళ్ళ పై రచ్చ చేస్తూ
కొడుక్కోసం మడమ తిప్పలేదు
నాన్న

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
నాన్న కోసం బొంతపడిన వారంటూ
అంతులేని ఓదార్పు
మడమ తిప్పకుండా చేస్తూ
‘చెయ్యి’ ఎప్పుడు కలుగులోకి తోసి
బొచ్చ చేతికి ఇస్తుందో నని
ఎదురు చూస్తున్నాడు
కొడుకు

ఈ రోజు దొడ్డి దారిలో సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

నాన్న జమానాలో
వాయు వేగంతో వ్యాపారవేత్త అయిపోయి
నాన్న పోతూనే
అదే వేగంతో పాలక పగ్గాలు కావాలని
వేసిన పాచికలు పారక
తిరగబడితే

పరిస్థితులు ఎదురు తిరగబడి
వాయు వేగపు సంపాదనలో
ముద్దాయిగా ఆరోపణలు ముసురుకొని
దానిపై విచారణ ఒకింత నెమ్మదిగా పోతోంది

ఇంకో ఘనుల గాలి వాటపు సంపాదనలోని
వాటా లు
ఈ వాయు వేగపు సంపాదనకు
తోడయ్యాయేమో
అనే అనుమానంతో పిలిపిస్తే
లేదు నన్ను పిలిచింది సాక్షిగా నే
అని సంబరపడిపోవడం చూస్తుంటే
చిన్నపిల్లాడి మనస్తత్వం గోచరిస్తోంది

అక్కడ అడిగిన ప్రశ్నలు ఏవో చెప్పక
నాన్న ఇచ్చిన సహకారంతో
రెచ్చిపోయి మరో కేసు విషయమై బోనులో ఉన్న
కోనేరు కు మొదటి స్నేహితుడు
బాబే ఆయననూ పిలవండి పేరంటానికి అని
పెంకి దాడులు మొదలెట్టడం విచిత్రమే

ఒక వేళ బాబు తన జమానాలో పిలిచినా
తరువాత ప్రభువుగా ఉన్న నాన్న
నానా గడ్డి కరుస్తున్న కోనేరు ను ఆపక
ఆయన వేసిన గడ్డిని తిన్నాడా?
అనే విషయం పై సాక్షికి నోరు పెగలదు ఎందుకో?
ఎదుటోడికి నైతిక విలువలు చెప్పే ముందు
తను ఏ తానులో ఉన్నాడో రుజువు చేసుకోవాలి కదా?

మాట్టాడితే మడమ తిప్పను అని
మతిలేని మాటలు చెబుతారు
ఈ రోజు దొడ్డి దారిలో
సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

3, నవంబర్ 2011, గురువారం

కాంగ్రెసు నిరీక్షణలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి

కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత ఏం చేయాలో తెలియక చిరంజీవి దిగి వస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. తిరుపతిలో ఆయన బుధవారం మాట్లాడిన మాటలు ఆ అనుమానాలకు తావిస్తున్నాయి. తనకు ఎప్పుడు పదవి ఇస్తారో, ఎంత వరకు తాను వేచి ఉండాలో తెలియక చిరంజీవి సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో గానీ రాష్ట్రంలో గానీ మంత్రి పదవి ఇస్తే చాలునని, పదవి ఏదైనా ఉంటే సేవ చేయడానికి ఓ ఆదరవు దొరుకుతుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి తనను ఇలా నిరీక్షణలో పెట్టకుండా ఏదైనా పదవి ఇవ్వాలనే విజ్ఞప్తి ఆ ప్రకటనలో ఉందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాజకీయాల్లోకి దిగి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కాంగ్రెసులో చేరిన తర్వాత రాష్ట్రంలో మంత్రి పదవి ఇచ్చినా సంతృప్తి పడే స్థితికి వచ్చారని అంటున్నారు.

కాగా, అనూహ్యంగా పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కాంగ్రెసు అధిష్టానం తెర మీదికి తేవడంతో చిరంజీవిలో ఆందోళన ప్రారంభమైనట్లు చెబుతున్నారు. తనకు దక్కాల్సిన హోదా, పదవి శ్రీనివాస్ ఎగరేసుకు పోతారని చిరంజీవి ఆందోళనకు గురవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో తనకు ఏ పదవి ఇచ్చిన ప్రస్తుతానికి సంతృప్తి చెందాలనే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తీవ్రమైన అనిశ్చితికి చేరుకోవడంతో కూడా చిరంజీవికి బాధ్యతలు అప్పగించే విషయంలో అధిష్టానం జాప్యం చేస్తోందనే మాట వినిపిస్తోంది.

అగ్ర సింహాసనం వేసేది.

తెరమీద మీసం మెలిపెట్టేసి
నిజ జీవితం లో
మీడియా తో లౌక్యంగా మాట్టాడ్డం
పౌరుషం కాదు
తెలుగు వాడిని కించ పరిచి మాట్టాడితే
పళ్ళు రాల గొడతాననడం
పౌరషం అంటే
అందుకే తానా లాంటి సంఘాలు
ఈ తెలుగు సింహానికి
ఆహ్వానితుల జాబితాలో
అగ్ర సింహాసనం వేసేది.

2, నవంబర్ 2011, బుధవారం

అన్నదాతల గుండెకోత ఎవరికి తెలుసు ????

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రభావాన్ని మన రైతు చవిచూస్తున్నాడు. వీటివల్ల దేశంలో సంపద అనూహ్యంగా పెరిగింది. ఉత్పత్తులు కూడా పెరిగాయి. వాటికి మార్కెటింగ్‌ సౌలభ్యం వృద్ధిచెందింది. అదే సమయంలో ఈ దేశంలో రైతు మాత్రం నీరుగారిపోయాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అప్పులపాలైంది. వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఆదేశాలే. వీటిమేరకు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల్ని తగ్గించింది. అంచెలంచెలుగా మొత్తం తొలగిస్తోంది

ఒక్క మాటలో చెప్పగలనా !!!!!

విల్లు పట్టి నిలుచున్నది
అన్నా
లేక
రాముడు గా మారిన బాల కృష్ణుడా
అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే

నందమూరి నుండి
మరొకరు రాముడు గా
వచ్చి
విల్లు పట్టిన విధం చూసి
నిలువెల్లా పులకరిస్తూ

ఆ రౌద్రం చూసి
రోమాంచిత ఉద్వేగం కలగగా

అన్నగారి తరం లో
తెలుగు వాడిగా పుట్టినందుకు
మరో సారి వారి వారసుల తరంలో
రాముడిని చూసి తరిస్తున్నందుకు
నా జన్మే అదృష్టం
అని ఒక్క మాటలో చెప్పగలను

అరకొర జ్ఞానంతో

అరకొర జ్ఞానంతో
తెలుగు గడ్డపై
దర్శకుల కొదవ అన్న వారు
అప్పుడప్పుడూ తాము
మద్రాసులో ఉండగా
అబ్భిన అరవ పాండిత్యాన్ని కూడా
పదే పదే చెప్పుకొనే వారు
తాము పుట్టక ముందు
అదే అరవ మద్రాసులో
తెలుగు శంకరాభరణం
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
ప్రేమాభిషేకం కూడా
సంవత్సరం పైగా ఆడింది అని తెలుసుకోవాలి
వాటి దర్శకులు కూడా
మన తెలుగు వారే అని గర్వపడండి
జాతి ని తక్కువ చేసి మాట్టాడే ముందు
ముందూ వెనుకా చూసుకొని మాట్టాడండి

స్వాతి ముత్యం అనుకొని ఇన్నాల్లో మురిసిన వారు

ఇడుపలేసుని పైన
ఈగ వాలినా
వారసుల గురించి
వివాదస్పద వాక్యాలు
ఎక్కడ వినిపించినా
ఇడుపలేసుని ఇచ్చ బంటులా
తక్షణం అక్కడ వాలి
అలా మాట్టాడే వారిని
బంతాడుతుంటే
ఇడుపలేసుని భక్తుల ఆనందం
అంబరాన్ని అంటేది.

ఇడుపలేసుని బంటుగా
భరితెగించి ప్రజల ఆస్తులు
స్వామికి సమర్పిస్తున్నా
ఎదురు దాడితో
అదే బంటుతో
దడ దడ లాడించే వారు.

ఓ ప్రక్క ఇడుపలేసుని వారసుడు
అక్కా చెల్లీ తల్లీ అంటూ
చెంతకు వచ్చిన వారి
చెక్కిళ్ళు నిమిరి
ఓదార్చుతుంటే
ఇక్కడ బంటు
“చెప్పు సంజనా టెల్ మీ ” అంటూ
ఆడవారి వారి పైన చూపిన
గౌరవ మర్యాదల
గుట్టు రట్టు అయిన వేళ
ఇడుపలేసుని భక్తుల గొంతులో
పచ్చి వెలక్కాయ పడింది.

బంటు గారి బరితెగింపు
హాస్కీ వాయిస్ తో
అలరిస్తుంటే అవాక్కాయి
ఎలా ఎదురు దాడి చేస్తారా అనే
ఆసక్తి అందరిలోనూ ప్రభలుతోంది.

ఇడుపలేసుని వారసుని
స్వాతి ముత్యం అనుకొని
ఇన్నాల్లో మురిసిన వారు
ఆ ముత్యం పై ముసురుకొంటున్న
ఆస్తుల కేసులతో
అసలు రంగు ఇప్పుడిప్పుడే అవగతం చేసుకొంటుంటే
ఇన్నాళ్ళూ ఆణిముత్యం లాంటి వాడనుకొన్న
బంటు లీలలు బయటపడడం
తప్పక మరింత బాధిస్తాయి.

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని ఎదురు చూసే సముద్ర నాయకులకు అర్థం అవుతుందంటారా?

చేతిలో సెయ్యిట్టిన సన్నివేష సంబడాన్ని
అంబరాన్ని అంటేలా చేద్దామనుకొంటే
సముద్రం లోని నాయక తిమింగలాలు తీరనివ్వలేదు
సరే సర్దుకు పోదాం అని
దిగమింగుకొని సర్దుకు పోతున్నా
కరేపాకుకు ఇచ్చిన విలువ కూడా ఇవ్వకుండా
ఆటలో అరటిపండు అనే మాటలకు తెరదించకుండా
ఇంకో సినిమాకు కథలు వింటూ భారంగా కాలం వెళ్లదీసే వేళ
అవిశ్వాస తీర్మానం అనే పదం
‘ఆటలో అరటిపండు’లో ఆశను రేపింది

అరటిపండు అవసరం వచ్చే రోజు
ఆసన్నమయ్యింది అని గుర్తుకు తెచ్చేలా
సముద్రం లోని తిమింగల నాయకులకు
ఓ విందు పెట్టి గుర్తు పెట్టుకోమనింది

ప్రక్కనోడిని ఎప్పుడు తినేద్దామా అని
ఎదురు చూసే సముద్ర నాయకులకు
ఈ అరటి పండు పడే ఆరాటం
అర్థం అవుతుందంటారా?
లేదా ఇదీ ఒక ‘ఆటలో అరటిపండు’ ఆర్భాటమే అని
అపార్థం చేసుకొంటారా?

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)

వ్యవసాయం దండగని అని
అన్నావో లేదో తెలియదు కాని
తేల్చమని నువ్వు చెప్పినా
ఎవరూ రాకున్నా

ప్రచార కర్త వారసులు (రక్త & రాజకీయ వారసులు)
మాత్రం నిన్ను వదలడం లేదు
వారి పెద్ద వ్యవసాయానికి చేసిన పండగ గురించి
నోరు పెగల్చడం లేదు

అయినా వ్యవసాయం పండగో దండగో
అది ప్రక్కన బెడితే
మీ వృత్తి
అదే రాజకీయాలు
భ్రస్టుపట్టి పోతూ
దండగ అయిపోయే సమయం
ఆసన్నమయ్యిందని
వేర్పాటు వాదులు
ఓదార్పు వీరులు
ఒకింత ముందుగానే గ్రహించినట్టు ఉంది

అందుకే రాజకీయాలు పండగ చెయ్యాలని
ప్రబుత్వాన్ని పడగొట్టండి
అవిశ్వాసం పెట్టండి అని
ఆత్రం గా అడుగుతున్నారు

ఆలకించండి మరి
ప్రభుత్వం పడినా పడక పోయినా
పాలకుల బేరసారాలతో
రాజకీయాలు పండగ చెయ్యాలని
ఉవ్వీళ్ళూరే వీరి
బేరసారాలకు
బేషజాలకు పోకుండా
బేరాలు చేసుకోనివ్వండి.

గో ధూళిని లేపే వారు లేరు

వృద్దుల చే సుద్దులు చెప్పించుకోవాల్సిన
భావి తరం ఎండమావుల వెంట వెళ్ళిపోగా
పండిన వృద్దులే ఇప్పుడు దాని సంతోషం

గో ధూళిని లేపే వారు లేరు
పాలిచ్చే ఆవులను మాత్రం ఆశగా చూసుకొనే వారు మాత్రం
అక్కడక్కడా అగుపిస్తుంటే

కూలీలు దొరక్క
కరెంటు తో దాగుడు మూతలు ఆడలేక
గిట్టు బాటు గాక
ప్రతిసారి అదృష్టం పరీక్షించుకోలేక
సరైన పోషకాహారం దొరక్క
నీరసపడి
బీడుల చూస్తూ

అందులో పూర్వం పండించిన బంగారాన్ని తలచుకొని
నెమరేసుకొంటూ
ఇవి ఇలాగే ఉంటే
భావి తరాలు ఏమి తిని బతుకుతారో
అని బాధ పడుతూ

ఆశలు రేపిన
జల యజ్ఞం
జనాల స్వేదం
ధనంగా
పాలకుల పంటలు పండిస్తుంటే
పల్లె లో మొలకెత్తే ఆశలు కూడా
అక్కడే అడుగంటి పోతున్నాయి.

కాకి పిల్ల కాకికి ముద్దు

అవినీతో
అధికార దుర్వినియోగామో
నాన్న అన్నీ ఇచ్చి వెళ్ళాడు
కూర్చునే కుర్చీ తప్ప

ఆ కుర్చీ వుంటే తప్ప
వెనకేసిన కుప్పను కప్పలేము

దానికి దిష్టిబొమ్మ లా కుర్చీ కావాల్సిందే
నలుగురి దిష్టి పడితే కుప్ప వెనకాల ఉన్న
అవినీతి కృషి బయటపడుతుంది

ఇప్పుడు అదే జరిగింది
కుర్చీ లేని సమయం చూసి
ఆ అవినీతి కుప్ప రగులుకుంది
చూస్తుంటే ఆ కుప్ప బొచ్చె ఇచ్చి కారాగారంలో గాలితో కూడా కూర్చోపెట్టేట్టు వుంది

అందుకే అమ్మా
గుడ్డు మీద నాన్న పీకలేని ఈకలు
నీ బాబు కోసం
బాబు జుట్టు మళ్ళీ పట్టుకో

జుట్టు రాకపోయినా పరవాలేదు పాత జట్టు నాయకురాలిని ప్రాధేయపడి
మన పట్టు గురించి పసందుగా చెప్పి
జైలులో మంచి భోజనాలు పెట్టించమని చెప్పొచ్చు
అలాగే బరితెగించిన మన బంటు నిర్వాకం బూడిద అవుతుంది

కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఒకటి మరో సారి సమైక్యాంధ్రకు సాటి
ఎట్టన్నా నాన్న మంత్రదండంతో మదించి వచ్చిన
అవినీతి సాక్షులతో సహా అన్నీ
పదికాలాల పాటు
పదిలంగా వుండేలా చూడమ్మా
అత్యవసరంగా ఆ అవినీతి కుప్పను ఆర్పమ్మా.

ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు

ప్రకృతికి చెందిన పంచభూతాలను వంచనతో ద్రుతరాస్ట్రుడికి మల్లే దురాశపడిన కొడిక్కి దోచి ఇచ్చిన దొర పై ఓపిక నశించిన ప్రకృతే పగబట్టి విజయం సాధిస్తే ఇంకా ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు వీక్షకుల ముందు వచ్చి విశ్లేషణలు గావిస్తుంటే శకుని శత్రు శిబిరం నుండి సంకేతాలు పంపుతుంటే సమరంలో నిలిచిన కొడికి పక్షాన ప్రజల కళ్లకు గంతలు గడుతూ స్వయంగా తల్లే తలపడుతోంది పంచభూతాల పగకు పతి ప్రాణాలు పణంగా పెట్టినా పసి వాడి పాడు బుద్ధికి సుద్దులు చెప్పడం మరిచి మళ్ళీ తలపడడం మనందరికీ ఆశ్చర్యం కలిగించి నాది అక్షర సత్యం మహా భారతం మళ్ళీ నడుస్తోంది

ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు

ఆ పిల్లోడిని చూడు
వాడికి ఏం కావాలన్నా ఇవ్వడానికి
వాళ్ళ అమ్మ దగ్గర అన్నీ వున్నాయి
అయినా వాడు నీలా
యాగీ చెయ్యడు చూసి నేర్చుకో
వాళ్ళ అమ్మ మన తాతకు ఇచ్చిన
కుర్చీనే కావాలని
ఏడుస్తావెందుకు
మాటి మాటికీ
వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి
మన తాత కుర్చీలో కూర్చుంటానని
మారాం చేస్తున్నావంట
నీకు బుద్ది రావాలనే
ఆ పిల్లోడిని వాళ్ళ అమ్మ
మన ఇంటికో సారి పంపి
నన్ను ఎక్కువ మర్యాద చెయ్యకండి
నేను మా ఇంట్లో గెడ్డం తాత కూర్చొనే కుర్చీ అడగడం లేదు
అని సెప్పి పంపింది వాడు అలాగే సేత్తున్నాడు
ఇంకైనా కొంచెం ఇజ్జత్ తెచ్చుకో
భాగ్యనగర పండక్కు
నువ్వేమీ ఎగేసుకొని ఎల్లకున్నా
ఎదురుచూసే వాళ్ళు లేరు
వెళ్లాలనుకొంటే వెళ్లి ఏడువు
నువ్వు అడిగే కుర్చీలో నుండి తాత లేవలేదని
తాతను ఎవన్నా అన్నావో
ఆ పిల్లోడోల అమ్మ ఊరుకోదు
నీకు నీ డోలుకు వీపు విమానం మోతే
దాంతో పాటు నిన్ను పాలేరు చేసి
సిన్మాల్లో నటించే ఆ మొద్దబ్బాయిని
దత్తత చేసుకోమంటోంది, జాగ్రత్త.

15, జులై 2011, శుక్రవారం

ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే.

ఓ శుభవార్త తెలియగానే ఆనందం, ఆలోచనలు భవిష్యత్ వైపు సాగినప్పుడు తెలీని దిగులూ, మనసు గాయపడిన క్షణం ఆక్రోషం.. ఇలా ప్రతీ భావోద్వేగమూ మనసులోనే సిద్ధంగా ఉంటుంది. తటస్థించే అనుభవానికి తగ్గ భావోద్వేగం మనలో వెన్వెంటనే పెల్లుబుకుతూ కొంతసేపు ఉక్కిరిబిక్కిరి చేసి గమ్మున సర్దుకుంటుంది. మంచిదైనా, చెడ్డదైనా ఓ సంఘటన జరిగిన వెంటనే మదిలొ వేగంగా జరిగే సంఘర్షణ తాలూకు వ్యక్తీకరణలే మన భావోద్వేగాలు. ప్రతీ భావోద్వేగమూ దాని తీవ్రత కొనసాగినంత సేపూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. పనిలో పనిగా మనసులో ఏ మూలనో ఆ సంఘటన తాలూకు గాఢతని మరువలేని జ్ఞాపకంగా నమోదు చేసి.. తీవ్రత తగ్గిన వెంటనే దూదిపింజెలా ఎగిరిపోతుంది. భావోద్వేగాల మర్మాన్ని గ్రహిస్తే అవి మనపై స్వారీ చేసే ముందే వాటి తీవ్రతని కట్టడి చేసుకోగల విజ్ఞత అలవడుతుంది. ఏ ఆనందానికైనా, ఆవేశానికైనా, విచారానికైనా కల్లోలితం అయ్యే ఆలొచనా ప్రవాహమే మూలం. వాటిని వీలైనంత వేగంగా స్థిరత్వం వైపు మళ్లిస్తే ఆ భావోద్వేగపు గాఢత క్షీణించిపోతుంది. మిన్ను విరిగి మీదపడ్డా మౌన ప్రేక్షకుల్లా చూస్తుండిపోయే నైపుణ్యత అలవడుతుంది. మన ఆలోచనలు నిరంతరం జరిగిపోయిన జీవితాన్నీ, ముందు భవిష్యత్తునీ, వర్తమానపు అనుభవాలనూ, బలంగా నాటుకుపోయిన జ్ఞాపకాలనూ మనసు పొరల్లోంచి వెలికి తీసి వాటిని చిక్కుముళ్ల్లుగా పెనవేసి కుదురుగా ఉన్న మనసుని కూడా ఆందోళనపరుస్తుంటాయి.
ప్రతీ భావోద్వేగమూ తాత్కాలికమే. అవసరం అయిన దానికన్నా దాన్ని మరింత విశ్లేషించి, సంఘటనలు, ఆలోచనల్ని క్లిష్టతరం చేసుకుని ఆ ఉద్వేగాన్ని సులభంగా వదిలిపెట్టకుండా మనసుని కుళ్లబెట్టుకుంటూ ఉంటాం. ఈ క్షణం మన మానసిక స్థితి అస్థిరంగా ఉంటే దాన్ని స్థిరపరుచుకోవడం మన చేతుల్లో ఉన్న పని. కానీ ఆ కిటుకుని గ్రహించలేక పాటించలేకపోతున్నాం. సమస్యల్లో ఉన్న స్థితిలో మనమూ సమస్యలో కూరుకుపోయి బయటపడే మార్గాన్ని ఆలోచించడం మనేసి సమస్యని పెద్దది చేసుకుంటూ ఉంటాం. అలాగే ఆవేశం కట్టలు తెంచుకుంటే దానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించి, మరోసారి ఆ పరిస్థితి తలెత్తకుండా తీసుకోవలసిన జాగ్రత్తల వైపు దృష్టిని నిమగ్నం చేయకుండా వీలైనంత ఆవేశాన్ని వెళ్లగక్కుతుంటాం. ఇలా భావోద్వేగం యొక్క మూలాల్ని గుర్తించి వాటిని సరిచేసుకునే మార్గం ఒకటుంటే.. ఏకంగా భావోద్వేగం మనపై స్వారీ చేస్తున్నప్పుడు దాని నుండి బయటపడడానికి మరెన్నో మార్గాలున్నాయి.
ఒక భావోద్వేగాన్ని పరిసరాలపై వెదజల్లడం మన ఉనికిని, మనం ఆశిస్తున్న గమనింపుని పొందడానికి సులువైన మార్గం అనే దురభిప్రాయం బాల్యం నుండి మనకు ఉగ్గుపాలతో అలవర్చబడింది. ఉదా. కు.. మనం ప్రదర్శించిన ఆవేశానికి ఆశించిన స్థాయి స్పందన దాన్ని ఎవరిపై ప్రదర్శించామో వారి నుండి లభిస్తే మన అహం సంతృప్తిపడుతుంది. ఎంత ఆవేశపడినా దాన్ని పట్టించుకునేవారు లేనప్పుడు కాసేపు మనసు రగిలిపోతుంది. మెల్లగా నిస్సహాయత ఆవరిస్తుంది. దిగులు మొదలవుతుంది. చివరకు బేలగా మారిపోతాం. ఇది ఒక ఆవేశమనే భావోద్వేగపు పరిణామక్రమమే. ఇలా ప్రతీ భావోద్వేగానికీ కొన్ని బలమైన కారణాలు, అంచనాలూ, పర్యవసనాలూ ఉంటాయి. వాటన్నింటినీ విశ్లేషించి మన చిత్తం చేసే చిత్రాల్లో ఎంత విచిత్రం దాగుందో అర్ధం చేసుకోగలిగితే ఆ మాయ నుండి అవలీలగా బయటపడగలం !

అమ్మ నాదే...

అంబరాన పూసిన తారలు కోసి
మాలచేసి నీ జడలొ తురుముతానంటే
మురిసిపోయింది అమ్మ ముసిముసి నవ్వులతో

హరివిల్లుని పట్టి తెచ్చి నీకు ఊయలకట్టి ఊపుతానంటే
చిరునవ్వుతో నా తల్లీ అంటూ ముద్దులాడింది

సఖులతో చేరి ఆటలాడగా
బుజ్జగించి, ఊసులెన్నో చెప్పి బొజ్జ నింపింది

నిదురమ్మ రానని మొరాయిస్తుంటే
చందమామని చూపి లాలిపాడి జోకొట్టింది

సూరీడు తాపం చురుక్కుమంటూ బాధిస్తుంటే
తన కొంగునే గొడుగుగా కప్పి పొదుముకుంది

వానజల్లులో తడిసి, మెరుపు గర్జనలకు ఉలిక్కిపడితే
నేనున్నానురా అంటూ వెన్ను తట్టింది లాలనగా

ఆటలలో చిన్ని గాయమై కంటతడిపెడితే
తన గుండెల్లో దిగిన బాకులా విలవిలలాడింది

అమ్మ ఆప్యాయతను ఆలంబనగా చేసుకొని
అందరికంటే ఉన్నతంగా ఎదిగినప్పుడు
అక్కున చేర్చుకుంది అశ్రునయనాలతో...

మరచిపోగలమా? తీర్చుకోగలమా?
అమ్మను. ఆమె ప్రేమని.. నేర్పిన పాఠాలను
అందుకే అమ్మ నాదే...

అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు....

అసలు టైటిల్ విషయానికొస్తే, పాండవ వనవాసం సినిమా చూసినప్పుడు విన్న డవిలాగు అది. సావిత్రి బాగా బాధ పడుతూ చెప్పిన డయిలాగు. ద్రౌపదిని( అదే సావిత్రే లెండి) తీసుకురమ్మని ప్రాతిగామిని పంపిస్తాడు రారాజు. అప్పుడు ఈ విషయం కనుక్కురమ్మని సావిత్రమ్మ చెప్పే డయిలాగు ఇది.
" నా స్వామి తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా,".
ఈ డయిలాగు విన్నప్పుడు నేను, ధుర్యోధనుడు( అదే మన ఎస్ వీ ఆర్) ఒకలాగే ఆలోచించాము. ఎలా అయితే ఎంటి మొత్తానికి ఓడారా లేదా. అంతా టైం వేస్టింగ్ టాక్టిక్స్.
కాని రెండిటికి ఏంత తెడా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. అంటె ధర్మరాజు తను ఓడిపోవడం వల్ల ద్రౌపది ఆటోమేటిక్ గా రారాజుది అవుతుంది. అలాంటప్పుడు ధర్మవిధిత(lawful bid). కాని, ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పెట్టి ఓడిపోతే, అసలు ధర్మ రాజుకు ద్రౌపదిని పెట్టే హక్కు ఎక్కడిది. ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదే, కాబట్టి తను అధర్మవిధిత( unlawful bid). ఇది వికర్ణుడు చెప్పే వాదం. ఏదేమయితేనేం ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది. అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు

మరుసటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న ఈ మనసు ఏమిటో...

అప్పట్లొ కళ్ళ్లోలో స్వప్న మాలికలు,
ఈ గుప్పెడు మనసులో భావకత్వపు డోలికలు,
బ్రతుకొక పాటగా,క్షణమొక కవితగా సాగిపోయేది.....
ఎన్ని కోరికలు,ఎన్ని కలలు,
ఎన్నెన్ని ఆశయాలు, ఎన్నొ ఎన్నొ ఆదర్శాలు....
ఆదర్శాల,ఆశయాల,కోరికల వేటలో
ఇహం కోసం,అహం కోసం అస్తిత్వాన్ని కోల్పోతున్నాను,
అందమైన,నిర్మలమైన ఆ నవ్వుల్ని కొల్పోతున్నాను,
స్వేచ్హ సౌఖ్యం మరచి భాగ్యాన్వేశనలో పడ్డాను,
ఉషోదయం తో ప్రారంభం అయ్యే ఉరుకుల్ని,
నిశార్దం దాకా కొనసాగిస్తున్నాను।
తియ్యనైన ఈ భాదకు, ఉప్పు నీరు ఈ కంట ఎందుకో...
గుప్పడంత ఈ మనసుకు ఇన్ని శిక్షలెందుకో....
చెప్పలేని ఈ భాదకు గుప్పెడంత ఈ గుండె ఏమిటో...
భవ,భావాలు లేని ఈ భాష ఏమిటో....
మది తలుపులకు తాళం వేసి,
మరుసటి ఉదయం కోసం ఎదురుచూస్తున్న ఈ మనసు ఏమిటో...

18, జూన్ 2011, శనివారం

మెనూ ఇలా ఉంటే...!

హెల్తీఫుడ్ అంటే ఏది? ఈ సందేహం చాలా మందికి ఉంటుంది. రోజూ ఏ డైట్ తీసుకోవాలి? వారంలో ఎన్ని రోజులు మాంసాహారం తీసుకోవచ్చు? ఇలాంటి సందేహాలను తీర్చడానికే హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించి ఏమేం తినాలో వెల్లడించారు.

* తాజా కూరగాయల్లోనూ, పండ్లలోనూ యాంటీ అక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు తీసుకోండి. ముఖ్యంగా పళ్లలో మెదడును రక్షించే యాంటీఅక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రొక్కోలి, క్యాలీఫ్లవర్‌లలో ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడానికి అంతగా ఇష్టపడని మహిళల్లో మెదడు వారి వయస్సుకంటే ఒకటి రెండెళ్లు తక్కువగా ఉంటుంది. యాపిల్స్, గ్రేప్స్, ఆనియన్స్, వైన్, టీ, డార్క్ చాక్‌లెట్‌లలో కూడా యాంటీఅక్సిడెంటు ్ల ఉంటాయి. వారంలో ఐదు రోజులు వీటిని తీసుకుంటే యాంటీ అక్సిడెంట్లకు కొదవే ఉండదు.

* ఆలివ్ఆయిల్, నట్స్, సన్‌ఫ్లవర్‌సీడ్స్, అవొకొడస్‌లో యాంటీ అక్సిడెంట్‌గా పనిచేసే ఇ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధికి బాగా పనిచేస్తుంది. తరచుగా వీటిని తీసుకునేవారిలో అల్జీమర్ వ్యాధి బారిన పడే అవకాశం 67శాతానికి తగ్గిపోతుంది. కాబట్టి వీటిని వారంలో ఒకరోజైనా మీ మెనూలో ఉండేలా చూసుకోండి.

*వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. కాబట్టి వారంలో రెండు రోజులు చేపలు తినండి.

17, జూన్ 2011, శుక్రవారం

నీవొస్తావని... నా కలలను నిజం చేస్తావని ఎదురు చూస్తూ ఉండే నీ

ఏ జన్మ బంధమో తెలియదుగానీ నిను చూచిన ఆ మొదటి క్షణం పోగొట్టుకున్న నిధిని మళ్లీ
సొంతం చేసుకున్నట్టు నా మనసు పొంగిపోయింది. నా మనసెందుకు నిను మెచ్చిందో
తెలియదుగానీ మంత్రం వేసినట్టు నా మది నీ తలపులతో నిండిపోయింది. కలనైనా నిను
ఎరగని నేను ఆశ్చర్యంగా నీవే నా ఆశ, శ్వాస అనేంతగా మారిపోయానంటే ఆశ్చర్యంకాక
మరేమిటి.

ప్రేమంటే అర్థమైనా తెలియని నేను ఇప్పుడు నీపేరే జపిస్తున్నానంటే నాకు సైతం
వింతగానే అనిపిస్తుంది. ఇన్నాళ్లూ ఒంటరిగా గడిచిపోయిన నాలోకంలోకి నీవొచ్చావని
కాబోలు అప్పుడప్పుడూ మాత్రమే అందంగా కనిపించే ఈ లోకం నాకిప్పుడు నిత్య
శోభాయమానంగా గోచరిస్తోంది.

చెట్టు, పుట్ట, రాయి, రప్ప ఒకటేమిటి ప్రతీదానిలో నీవే కనిపిస్తుంటే ఇన్నాళ్లూ
నేను కోల్పోయిందేమిటో కొంచెం కొంచెంగా తెలిసొస్తోంది. నాకూ మనసుందని, దానిలోనూ
స్పందనుందని నాకు తెలిసిందంటే అది నిను చూశాకే అని నే చెప్పే మాటలు పొగడ్తలుగా
నీకు అనిపించినా అవి నిజంగా నిజాలే సుమా.


స్త్రీలో ఆకర్షణ మాత్రమే ఉంటుందనుకున్న నాకు ఆ ఆకర్షణకు మించిందేదో ఉందని
తెలిసిందంటే దానికి కారణం నీవే. కట్టిపడేసే నీ చూపులు చాలు నా జీవితాంతం నీ
బంధీగానైనా ఉండిపోవాలనిపిస్తుంది. స్వర్గతుల్యమైన నీ సానిహిత్యం చాలు యుగాలు
సైతం గడిపేయొచ్చనిపిస్తుంది. అమృతమై వర్షించే నీ మాటలు చాలు సప్త స్వరాలూ
వద్దనిపిస్తుంది.

పండు వెన్నెలలాంటి నీ నీడలో నేనూ నా జీవితం గడిచిపోతే చాలనిపిస్తుంది....
ఇవన్నీ ప్రేమ లక్షణాలైతే నేస్తం నీ మీద నాకున్నది తప్పకుండా ప్రేమే...... కానీ
నా ప్రేమను అంగీకరించి నీవొస్తావన్న ఆశతో నీకోసం ఎంత కాలమైనా ఎదురు
చూస్తుంటాను... కరుణించి వరమిచ్చినా... కాదంటూ నన్ను శపించినా నీపై నాలో మొగ్గ
తొడిగిన ప్రేమ నిత్యం పెరిగి వికసిస్తుందే తప్ప అది ఎప్పటికీ వాడిపోదు.

నీవొస్తావని... నా కలలను నిజం చేస్తావని ఎదురు చూస్తూ ఉండే నీ

ప్రతిరోజూ ఒక మంచి మాట

రాజకీయాలు అంత అప్రతిష్టపాలైన వ్యాపారం కానే కాదు. కానీ ప్రతిష్టలేని వ్యక్తులే దాన్ని అలా తయారు చేస్తారు.

ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా.


మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు, మీరే కాలానికి అనుకూలంగా మెలగండి.

16, జూన్ 2011, గురువారం

కాఫీ మేలు కూడా చేస్తుంది..!

కాఫీ ప్రియులకు ఓ శుభవార్త. కాఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలడం విశేషం. ఇప్పటివరకు కాఫీ సేవనం అనారోగ్య వ్యసనంగా భావిస్తుండగా ఈ వార్త కాఫీ ప్రియులను మరింత ఉత్సాహపరుస్తుంది. ప్రతిరోజు నాలుగు, అయిదు సార్లయినా కాఫీ తాగనిదే ఉండలేరు కొందరు కాఫీ ప్రియులు. కాఫీ తాగకుంటే నీరసంగా అనిపిస్తోందని భావిస్తూ దీన్ని సేవిస్తారు. చివరికి కాఫీ వారికి వ్యసనంగా మారుతుంది. ఈ వ్యసనం నుంచి ఎలా బయటపడాలా అని కొందరు ఆలోచిస్తుం టారు. కానీ కాఫీ మరీ అనారోగ్యకరమైన వ్యసనమేమి కాదని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. కాఉత్సాహపరుస్తుంది. ఫీతో కొన్ని ఆరోగ్యకరమైన లాభాలు కూడా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది.

టైప్‌ 2 డయాబెటిస్‌, గుండె సంబంధింత వ్యాధులు, సమస్యలతో బాధపడేవారికి కాఫీ మేలు చేస్తుందని తెలిసింది. కానీ దీంఓ కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌లు కూడా ఉన్నాయని తేలింది. కాఫీలోని కెఫీన్‌ మూలంగా శరీరంలో ఒకరకమైన వ్యాధి నిరోధక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. ఫలితంగా ఈ శక్తి కార్డియోవాస్క్యులర్‌ వ్యాధులు, క్యాన్సర్‌, టైప్‌2 డయాబెటిస్‌ సమస్యలను నివారిస్తుంది. కాఫీలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. కప్పు కాఫీలో 6 కేలరీలు ఉంటే అందులో కలిపే చక్కెరలో 23 నుంచి 27 కేలరీలు ఉంటాయి. కాఫీలో చక్కెర కలపకుంటే కేలరీలు పెరిగే సమస్యే ఉండదు.

లో బ్లడ్‌ ప్రెషర్‌తో బాధపడే వారికి కాఫీ ఎంతో మేలు చేస్తుంది. దీన్ని సేవిస్తే బ్లడ్‌ ప్రెషర్‌ లెవెల్స్‌ క్రమ,క్రమంగా పెరుగుతాయి. కానీ ఎక్కువగా కాఫీ తీసుకుంటే శరీరంలో యాంటిఆక్సిడెంట్స్‌ పెరుగుతాయి. ఫలితంగా గుండెలో మండినట్టవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా ఏర్పడతాయి. కాఫీ ఎక్కువగా తీసుకుంటే ‘కాఫీ జిట్టర్స్‌’ అనే స్థితికి చేరుకుంటారు. కెఫీన్‌ ఎక్కువగా శరీరంలో చేరడం వల్ల యాంగ్టిటీతో పాటు నిద్రలేమి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువగా దీన్ని సేవిస్తే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాఫీని అవసరమైన మేరకు సేవిస్తేనే మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

13, జూన్ 2011, సోమవారం

ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు.

సహజ కవి, నిర్మాత మల్లెమాల అలియాస్ ఎంఎస్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్‌నే కాదు, సీనియర్ ఎన్టీఆర్‌ను కూడా ఉతికి ఆరేశారు. టాలీవుడ్ సినీ ప్రముఖులపై తన వ్యాఖ్యలతో దుమ్మురేపాడు. ఇదీ నా కథ పేర ఆయన తన అనుభవాలను పుస్తక రూపంలో తెచ్చారు. ఈ పుస్తకంలో సినీ ప్రముఖలతో తన అనుభవాలను రాశారు. జూనియర్ ఎన్టీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలరామాయణం సినిమాలో దర్శకుడు గుణశేఖర్ వద్దంటున్నా జూనియర్ ఎన్టీఆర్‌కు రాముడి పాత్ర ఇచ్చానని, తాను ఓసారి వెళ్తే తనను బయట నిలబెట్టారని, దాంతో తాను వెనక్కి తిరిగి వచ్చానని ఆయన చెప్పుకున్నారు. గుణశేఖర్‌పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలో తాను రాసిన పాటను తీసేసి, తల పొగురు సమాధానం ఇచ్చారని, బడ్జెట్ పెంచేసి తనను కష్టాల పాలు చేశారని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ విజయం సినిమాలో సీనియర్ ఎన్టీ రామారావు తాను వేసిన కృష్ణుడి వేషంలో పౌండ్రక వాసుదేవుడిగా నాగభూషణం గెటప్ చూసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఆ పాత్ర అలాగే ఉంటుందని - సినిమాలో నటిస్తే నటించండి, లేకుంటే మానుకోండి అని చెప్పానని, దాంతో ఆయన మారు మాట్లాడకుండా నటించారని ఆయన చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడితో తన కూతురు భువనేశ్వరి పెళ్లి సందర్భంలో తనను గదులు బుక్ చేయాలని ఎన్టీఆర్ అడిగారని, వాటిని బుక్ చేసి బిల్లులు పంపితే ఆ డబ్బులు ఇవ్వలేదని ఆయన చెప్పారు. అలాంటిదే మరో సంఘటనను కూడా ఆయన వివరించారు. ఈ చేదు అనుభవాలతో తాను ఎన్టీ రామారావుతో సినిమాలు తీయడమే మానేశానని ఆయన చెప్పుకున్నారు.

ప్రజారాజ్యం పార్టీ నేత, చిరంజీవిపై కూడా ఆయన తన చేదు అనుభవాన్ని రాశారు. ప్రముఖ సినీ నటుడు స్వర్గీయ అల్లు రామలింగయ్య తన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే సురేఖను చిరంజీవికిచ్చి పెళ్లి చేశారని ఆయన చెప్పారు. తాతయ్య ప్రేమలీలలు సినిమాతో తాను నష్టపోయానని, ఆ సమయంలో చిరంజీవితో సినిమా తీసి నష్టం పూడ్చుకోవాలని అల్లు రామలింగయ్య సూచించారని, చిరంజీవికి అల్లు రామలింగయ్య చెప్పారని, అయినా చిరంజీవి తనకు సమయం కేటాయించలేదని, ఆ విషయం అడగడానికి వెళ్తే మొహం చాటేశారని ఆయన రాసుకున్నారు. శోభన్‌బాబుకు, జమునకు తాను షాక్ ఇచ్చిన విషయాలను కూడా ఆయన రాశారు. రాజశేఖర్‌తో సినిమా తీస్తే అడుక్కు తినాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

ఇలా మల్లెమాల సినీ ప్రముఖులతో తనకు సంబంధాలపై ఆ పుస్తకంలో రాశారు. జయసుధను మాత్రం ఆయన మెచ్చుకున్నారు. ఈ పుస్తకంలోని రాతలపై సినీ ప్రముఖులు ఎవరు కూడా నోరు మెదపడం లేదు. కొన్ని విషయాలపై మౌనం వహించడమే మంచిదని, దానివల్ల విషయాలు మరుగున పడిపోతాయని మన పెద్దలకు తెలిసినంతగా మరెవరికీ తెలియకపోవచ్చు.

8, జూన్ 2011, బుధవారం

ఈ జోడీ చాలా హాట్‌ గురూ !

రాష్ర్టంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా..! ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌కు, పీసీసీ కొత్త నేత బొత్స సత్యనారాయణకు మధ్య రాజకీయ కురుక్షేత్రానికి బీజాలు పడ్డాయా..! విరుద్ధ వాతావరణాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానమే ఏరి కోరి వాంఛిస్తున్నదా..! అందులో భాగంగానే ఈ సర...ికొత్త సమీకరణాలకు తెర తీసిందా..! ఇప్పటిేక వైరంతో... రాజకీయ విభేదాలతో... అంటీ ముట్టనట్టున్న ఇద్దరు నేతలను కీలక పదవులతో దరి చేర్చే వ్యూహంలోని పరమార్థం అర్థంకాక కాంగ్రెస్‌ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారుు. మెుత్తం మీద ఇది కాంగ్రెస్‌లో రెండు ప్రధాన కులాల మధ్య సం‘కుల’ సమరంగా మారబోతు న్నదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నారుు..!

రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న అస్తవ్యస్థ పరిస్థితిని యుద్ధప్రాతిపదికన చ క్కదిద్ది, అన్ని ఖాళీలూ భర్తీ చేసిన పార్టీ నాయకత్వం ఇద్దరు ప్రముఖుల మధ్య పెట్టిన పోటీ ఆసక్తి కలిగిస్తోంది. సీఎం కిరణ్‌ వ్యతిరేకించే బొత్స సత్యనారాయణకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంతో మళ్లీ చాలా ఏళ్ల తర్వాత విభజించిపాలించే రాజనీతికి తెర లేచిన ట్టయింది. వైఎస్‌ అనుభవాన్ని దృష్టిలో ఉంచు కున్న నాయకత్వం ఆంధ్రలో మళ్లీ అలాంటి చేదు ఫలితాలు ఎదురుకాకుండా ఇప్పటినుంచే విభ జించి పాలించే సూత్రాన్ని అమలుచేస్తుండటం చర్చనీ యాంశమయింది. సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న స్పీకర్‌-డిప్యూటీ స్పీకర్‌- మండలి చైర్మన్‌-వైస్‌ చైర్మన్‌ పదవులను చకచకా భర్తీ చేసిన నాయకత్వం అదే ఊపులో పీసీసీ అధ్యక్ష పదవి కూడా భర్తీ చేసి, పార్టీకి సంబంధించిన అనిశ్చితిని పూర్తిగా తొలగిం చింది.

అయి తే... ఎవరూ ఊహించని విధంగా ఉత్త రాంధ్రకు చెందిన బొత్సకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమయింది. ఎవరూ ఊ హించని విధంగా తెలంగాణ కోటా కాదని, ఆ స్థానంలో పీసీసీ పగ్గాలు అందు కున్న బొత్స, సీఎం కిరణ్‌కు చెక్‌ పెడతారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో బాహాటంగానే జరుగుతోంది. కిరణ్‌పై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనప్పటికీ... సీని యర్‌ అయినా ఆయనకు ఇతరులతో చొరవ తీసుకునే లక్షణం గానీ, అందరినీ సమన్వయం చేసుకునే శైలిగానీ లేవు. ఫలితంగా పార్టీకి- ప్రభుత్వానికి దూరం పెరుగు తోంది.

సీనియర్‌ మంత్రులు కిరణ్‌ను మానసికంగా సీఎంగా అంగీకరించడం లేదు. అసలు బొత్సకు పీసీసీ ఇవ్వడం సీఎంకు సుతరాము ఇష్టం లేదన్నది బహిరంగ రహస్యం. దూకుడుగా వెళ్లడం, చొర వ తీసుకుని అన్ని వర్గాలను దగ్గరకు తీసే నైజం ఉన్న బొత్సకు పీసీసీ పగ్గాలు ఇస్తే తనకు ఏకుమేకవుతారన్న భయం కిరణ్‌లో లేకపోలేదంటున్నారు. అందుకే బొత్సకు అవకాశాలు రాకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. మొన్నటి వరకూ పీసీసీ చీఫ్‌గా పనిచేసిన డీఎస్‌కు మండలి సభ్యత్వం దక్కకుండా చూడటంలో విజయం సాధించిన కిరణ్‌, ఈసారి బొత్స విషయంలో మాత్రం సఫలం కాలేకపోయారు.

స్పీకర్‌గా నాదెండ్ల మనోహర్‌, మండలి చైర్మన్‌ చక్రపాణికి ఆ పదవులు రాకుండా కిరణ్‌ అడ్డుపడినప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చక్రం తిప్పడంతో వారిద్దరికీ ఆ పదవులు దక్కాయన్నది బహిరంగ రహస్యం. అదే సమయంలో బొత్స విషయంలో కూడా రోశయ్య సిఫారసు పనిచేసిందని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. అసలు రాష్ట్రంలో పార్టీ-ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల జరిగిన ఏ ఒక్క నియామకం కూడా కిరణ్‌కు ముందస్తు సమాచారం కూడా లేదన్న ప్రచారం జరుగుతోంది.
బొత్స పీసీసీ సారథిగా రావడంతో కిరణ్‌కు కష్టాలు తప్పవంటున్నారు.

అన్ని వర్గాలతో సన్నిహితంగా వ్యవహరించే బొత్స పార్టీ నేతలందరినీ ఒక్కతాటిపైకి తీసుకువచ్చి, సమాంతర పాలన సాగిస్తే కొత్త సమస్యలొస్తాయన్న ఆందోళన కూడా లేకపోలేదంటున్నారు. మంత్రులు-ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటే భవిష్యత్తులో తనకు ప్రమాదమేనన్న ఆందోళన కూడా కిరణ్‌కు ఉందని చెబుతున్నారు.ప్రభుత్వంతో పార్టీని సమాంతరంగా నడిపిస్తే కిరణ్‌ ఇమేజ్‌ కంటే, బొత్స ఇమేజే సహజంగా ఎక్కువ పెరుగుతుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గతంలో వైఎస్‌ ఉన్నప్పుడు డీఎస్‌ పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పటికీ, ఆయన డీఎస్‌ను ఏ విషయంలోనూ జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చేవారు కాదు. అధిష్ఠానం వద్ద వైఎస్‌కు ఉన్న పలుకుబడి గ్రహించిన డీఎస్‌ మౌనంగానే ఉండేవారు. దానితో పార్టీ వైఎస్‌ చుట్టూ తిరిగి, చివరకు కాంగ్రెస్‌ను ఓ ప్రాంతీయపార్టీగా మారింది. వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌ ముక్కలయిపోవడంతో పార్టీకి తాను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది.

బొత్స నియామకం బట్టి... వైఎస్‌ మాదిరిగా కిరణ్‌ ఎదగకుండా, ఆయనకు చెక్‌ పెట్టి రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలన్న వ్యూహమే నాయకత్వ నిర్ణయాన్ని చాటుతో ంది. బొత్స సహజ మనస్తత్వ ప్రకారం.. డీఎస్‌లా మౌనంగా, అన్నిటికీ సర్దుకుని పోయే నైజం కాదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని పటిష్టం చేసే క్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌ నుంచి ఇతర నామినేటెడ్‌ పదవుల పంపిణీ వరకూ పార్టీ నేతలకు వాటా కల్పించాలని బొత్స పట్టుపట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.పీసీసీ అధ్యక్షుడిగా తనను తాను నిరూపించుకున్న తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్నది బొత్స అసలు లక్ష్యం. ఆ లక్ష్యసాధన కోసమయినా బొత్స అహర్నిశలు పార్టీ కోసం కష్టపడటం ఖాయం. ఈ క్రమంలో కిరణ్‌-బొత్స మధ్య దూరం పెరగడం అనివార్యమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సీజన్‌లో బెస్ట్

ఎండలు తగ్గాయ్. చిరుజల్లులు మొదలయ్యాయి. ఒక్కసారిగా సీజన్ మారేసరికి మన శరీరం వెంటనే అడ్జస్ట్ కాలేదు. అందుకే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇలా సీజన్ మారినప్పుడల్లా ఇబ్బంది పెట్టే ఇలాంటి సమస్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో సూచిస్తున్నారు నిపుణులు.

* శరీరం ఫిట్‌గా ఉండాలంటే వ్యాధినిరోధక సామర్థ్యం బావుండాలి. ఇది మనం తీసుకునే ఆహారం నుంచే డెవలప్ అవుతుంది.
* ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ మంచి పోషకాలను అందించడమే కాదు.. వ్యాధినిరోధక శక్తిని కూడా పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
* ఎండాకాలంలో చల్లదనాన్ని పెంచే నిమ్మ చల్లని వాతవరణంలో తీసుకోవద్దని అనుకుంటారు. దానివల్ల జలుబు చేస్తుందన్న అపోహ కూడా చాలామందిలో ఉంది.

నిజానికి నిమ్మ వల్ల శరీరం చైతన్యవంతం అవుతుంది. వ్యాధి నిరోధక వ్యవస్థ పునరుత్తేజితం అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి తరచుగా నిమ్మరసం తీసుకుంటే జలుబు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి కూడా.

5, జూన్ 2011, ఆదివారం

నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి.

వండుకుని తినేందుకు టైం ఉండడం లేదంటూ ఫాస్ట్‌ఫుడ్ మీద ఆధారపడుతున్నారు ఎక్కువమంది. టైం వృథా కాకుండా ఉంటుంది. అంతవరకు ఒకె. కాని ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఫాస్ట్‌ఫుడ్‌ను రోజూ తింటే ఎముకల పైన ఉండే త్వచం పలుచబడడమే కాకుండా ఎముకల సాంద్రత కూడా తగ్గిపోతుంది. మొత్తం మీద ఎముకలు బలహీనంగా తయారవుతాయన్నమాట. అది సరే కాని ఫాస్ట్‌ఫుడ్‌కి దీనికి సంబంధం ఏముందనిపిస్తోందా? ఫాస్ట్‌ఫుడ్ నిల్వ ఉండడం కోసం ఎక్కువ ఉప్పు వినియోగిస్తుంటారు. దాంతో శరీరంలోకి ఎక్కువ ఉప్పు చేరిపోయి కాల్షియం బయటకు పంపబడుతుంది. అందుకనే ఉప్పు తక్కువగా తినమనేది. ముఖ్యంగా ఆడవాళ్లు తక్కువ ఉప్పు తీసుకోవాలి. లేకపోతే నెలసరికి వారం ముందు శరీరంలోకి నీరు చేరి ఉబ్బినట్టు తయారవుతారు. అందుకే ఆహారంలో ఉప్పు మోతాదును తగ్గించాలి.

- ప్యాకేజి ఆహారాన్ని కొనేప్పుడు ప్యాకెట్ పైన రాసి ఉన్న పోషకవిలువల సమాచారాన్ని చదవాలి. తక్కువ ఉప్పు ఉన్న పదార్ధాలనే కొనాలి.

-వంటల్లో ఉప్పు తగ్గించేయాలి. తినేటప్పుడు ఉప్పును ఆహారపదార్ధాలపైన చల్లుకునే అలవాటును మానుకోవాలి.

-బంగాళాదుంపల చిప్స్ వంటి స్నాక్స్ మానేయాలి. అలాగే చీజ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రెడీ ఈట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

-వంట సాస్ వాడకం తగ్గించాలి. సీజనింగ్ కోసం వాడే సాయ్, చిల్లీ, సలాడ్ డ్రస్సింగ్, మస్టర్డ్ సాస్ వంటి వాటిలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వాటిని వంట గదికి దూరంగా ఉంచాలి.

-పళ్లు, కాయగూరలు వంటి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి. అరటిపండ్లు, పాలకూర, గెనుసుగడ్డ (స్వీట్ పొటాటో), పప్పు ధాన్యాలు, సోయా, చిక్కుడు గింజలు, రాజ్మా వంటివి ఆహారంలో చేర్చితే సోడియం వల్ల కలిగే రక్తపీడన లోపాన్ని అధిగమించవచ్చు.

ఏమీ తినకుండా మూతికట్టుకు కూర్చుంటే ఎలా? బతికిన కొన్నాళ్లు జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేం దొరికిందంతా తింటాం. మాకివన్నీ చెప్పొద్దు అనే వాళ్లు కూడా శరీరంలోకి అధికంగా చేరే సోడియంను తగ్గించుకోవచ్చు. పచ్చళ్లు, పాపడ్లు, చట్నీలు తినకుండా ఉండలేం అనే వాళ్లు కూడా ఉప్పును దూరంగా ఉంచొచ్చు. అందుకు ఏం చేయాలంటే...

- ఒక్కో మీల్‌కి నాలుగు నుంచి ఆరు గంటల ఖాళీ ఉండాలి.

- ఆ ఖాళీ సమయంలో నాలుగు నుంచి ఆరు గ్లాసుల నీళ్లు, రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు లేదా ఒక గ్లాసు టొమాటో రసం తాగాలి. టొమాటో రసంలో ఉప్పు వేయకూడదు. ఇలా చేస్తే శరీరంలోకి చేరిన అదనపు సోడియంను వేరు చేసే అవకాశం ఉంటుంది.

-రోజూ 30 నిమిషాల బ్రిస్క్ వాక్ చేయాలి. ఇలాచేస్తే శరీరంలో అదనంగా ఉన్న సోడియం స్వేదం రూపంలో బయటకుపోతుంది.

- ఉప్పు ఎక్కువగా ఉన్న ఒక మీల్ తరువాత తీసుకునే రెండవ మీల్‌లో కీరదోసకాయ ముక్కలు, టొమాటోలు, అర చెక్క యాపిల్, కారెట్ తురుము, దానిమ్మ గింజలు సగం వేసిన సలాడ్‌ను లాగించండి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సలాడ్‌లో కూడా ఉప్పు కలపొద్దు.

- ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదినెమ్మదిగా ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ఉప్పు తగ్గించిన పదార్ధాలను తినేందుకు రెండు నుంచి మూడు వారాలు రుచిమొగ్గలు అలవాటుపడేందుకు టైం పడుతుంది. ఆ తరువాత నుంచి తక్కువ ఉప్పు ఉన్న ఆహారపు రుచిని ఎంజాయ్ చేయడం మొదలుపెడతారు.

4, జూన్ 2011, శనివారం

ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి గురి చూసి కొట్టిన బంతి తిరిగి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోర్టులోనే పడింది. ఇప్పుడు పరీక్ష వైయస్ జగన్‌కే గానీ, చంద్రబాబు నాయుడికో, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికో కాదు. కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదించడం లేదని వైయస్ జగన్ పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. చంద్రబాబు అవిశ్వాసం ప్రతిపాదిస్తే తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాల్ చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రతిపాదించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెబుతూ వచ్చారు. మధ్యంతర ఎన్నికలకు భయపడి చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోరని ఆయన అనుకుని ఆ రకంగా మాట్లాడుతూ వచ్చి ఉంటారు. కానీ, చంద్రబాబు కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేశారు.

అనూహ్యంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనను ముందుకు తెచ్చి వైయస్ జగన్‌కు పరీక్ష పెట్టారు. ఇప్పుడు జగన్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన అనివార్యతలో పడ్డారు. తమకు మ్యాజిక్ ఫిగర్ కన్నా ఒక ఎమ్మెల్యే ఎక్కువే ఉన్నారని అంటూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అసలు పరీక్ష ఎదురవుతోంది. చంద్రబాబు అవిశ్వాస తీర్మాన అస్త్రాన్ని వెలికి తీయడంతో జగన్ తన జెరూసలేం పర్యటనను రద్దు చేసుకున్నారు. తమ పార్టీ ముఖ్య నేతలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసుకోవడంలో ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే జగన్‌కు కనీసం 40 మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కావాల్సి ఉంటుంది. అంత మంది శాసనసభ్యులను జగన్ చీల్చగలుగుతారా అనేది అనుమానమే.

పార్టీ నిర్మాణంపై, సంస్థాగత వ్యవహారాలపై జగన్ దృష్టి పెట్టిన సందర్భంలో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి దృష్టి మళ్లించారు. వైయస్ జగన్ వెంట 27 మంది శానససభ్యుల దాకా ఉన్నట్లు ఇప్పటి వరకు అంచనాలు సాగుతూ వచ్చాయి. వీరిలో 25 మంది దాకా కాంగ్రెసు ఎమ్మెలున్నారని చెబుతూ వచ్చారు. కానీ, ఆ బలం కూడా ఉంటుందా, ఉండదా అనేది ఇప్పుడు అనుమానంగా మారింది. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 10 మది శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ పది మంది కచ్చితంగా జగన్ వైపు ఉండే అవకాశాలున్నాయని అనుకోవచ్చు.

తమకు సరైన బలం లేదని గ్రహించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఇప్పుడు ఆత్మప్రబోధానుసారం ఓటేయాలనే అంశాన్ని ముందుకు తెచ్చారు. ఆత్మప్రబోధానుసారం ఓటు చేసి ప్రభుత్వాన్ని కూల్చాలని వారు కాంగ్రెసు శాసనసభ్యులకు పిలుపునిస్తున్నారు. ఇంకా మూడేళ్ల కాలవ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి ముందుకు వస్తారా అనేది అనుమానమే. తన దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తాను కన్నెర్ర చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెబుతూ వచ్చిన వైయస్ జగన్‌కు ఇది అసలు సిసలైన పరీక్ష అనడంలో సందేహం లేదు.

వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వెంట 34 మంది శానససభ్యులున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో ఆరుగురిని కూడగడితే ప్రభుత్వాన్ని కూల్చడం సాధ్యమవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, వైయస్ జగన్ శుక్రవారం సాయంత్రం ముఖ్య నేతలతో ఏర్పాటు చేసిన సమావేశానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కాకుండా 22 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. కుంజా సత్యవతి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, సుచరిత, రామచంద్రా రెడ్డి, రవి, ఆదినారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కొండా సురేఖ, శేషారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, ప్రసాద రాజు, బాలరాజు, కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్, బాబూరావు, శ్రీనివాసులు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, జయసుధ, శోభానాగి రెడ్డి, అమర్నాథ్ రెడ్డి శుక్రవారంనాటి సమావేశానికి హాజరయ్యారు.

నిక్కచ్చిగా జగన్ వెంట నడిచే బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ సమావేశానికి రాలేదు. వీరిద్దరు జగన్ వెంటే ఉంటారని కచ్చితంగా చెప్పవచ్చు. ఆళ్ల నాని, జోగి రమేష్ వంటి శాసనసభ్యులు కూడా జగన్ వెంట ఉంటారని భావిస్తున్నారు. పలువురు శాసనసభ్యులతో జగన్ ఫోన్‌లో మాట్లాడినట్లు చెబుతున్నారు. శాసనసభ్యురాలిగా వైయస్ విజయమ్మ ప్రమాణ స్వీకారానికి శుక్రవారం ఉదయం 13 మంది శాసనసభ్యులు వచ్చారు. సాయంత్రానికి ఆ సంఖ్య 22కి పెరిగింది. స్పీకర్ ఎన్నిక విషయంలో, అవిశ్వాస తీర్మానం విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ శానససభ్యులతో విడివిడిగా మాట్లాడుతున్నట్లు సమాచారం. ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన సంఖ్యను కూడగట్టేందుకు జగన్ తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యనేతల సమావేశానికి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కొండా మురళి, జూపూడి ప్రభాకర రావు, పుల్లా పద్మావతి కూడా హాజరయ్యారు. ప్రస్తుత స్థితిని బట్టి అవిశ్వాస తీర్మానం రాజకీయం రసకందాయంలో పడిందనే చెప్పాలి.

3, జూన్ 2011, శుక్రవారం

బలం లేక పోయినా బాబుగారు బకరా అవడానికా

మేడం చెప్పిన సభాపతుల ను
ఎన్నుకొనే సంబరానికి పాలకులు
సన్నద్దమవుతుంటే
సందట్లో సడేమియాలా
బాబు గారు తన పార్టీ నుండి
పోటీకి పెడుతున్నాడు.

బలం లేక పోయినా
బకరా అవడానికా అనే సందేహం
అందరికీ వస్తుంది.

ఇటీవల ఏ పార్టీని కదిపినా
ఎదుటి పార్టీలు రెండూ
మ్యాచ్ ఫిక్సింగు చేసుకొన్నాయి అని
మాటల తూటాలు పేల్చుతున్నారు.

బాబు గారు తమ్ముళ్ళ తరుపున పోటీ తో
తుపాకీ పేల్చుతున్నారు.

ఇక్కడ జగన్ గ్యాంగు సాహసం చేస్తే
అనర్హత వేటు పడుతుంది.

సాహసం చేయక పొతే
గురి తప్పి తుస్స్ మంటుంది అని అనుకొంటే పొరబాటే.

తూచ్ మీరిద్దరే మ్యాచ్ ఫిక్సింగు చేసుకొన్నారు అని
అనడానికి పనికి వస్తుంది.

పనిలో పనిగా తెలుగు తమ్ముల్లలో తెలంగాణా వారిని పెడితే
మొత్తం తెలంగాణా ప్రజా ప్రతినిధులు
నానా పాట్లు పడి గింజుకొంటారు.

తిరుపతి ప్రజాపతినిది పత్తాలేడు

రాజ్యం నేత
తమ ప్రజా ప్రతినిధి
కనిపించడం లేదని
తిరుపతి వెటర్నరీ విద్యార్థులు
వాల్ పోస్టర్లు వేసి నిరసన తెలుపుతున్నారు
పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసారు.

సినిమాల్లో నటించక తన బొమ్మ ఉన్న పోస్టర్ ను
చూసుకోక చాన్నాల్లైందని
ఇలాగైనా నా బొమ్మ కనిపించదని మురుసిపోతాడో
లేక సామాజిక న్యాయం పై
సోనియా ఇంట్లో జరగబోయే చర్చల్లో
మునిగి తేలుతున్నానని
బదులు ఇచ్చి బడాయి పోతాడో చూడాలి.

ఆ అరవోడు ఎవరు

ఆ అరవోడు ఎవరు మాకు చెప్పడానికి
అని మన రాష్ట్ర పార్టీలు అరిచి చెప్పినా
అన్నీ తెలిసిన ఆయన గారు మాత్రం
తెలంగాణా పై తన గానాన్ని వినిపిస్తూ
అన్ని పార్టీలు ఒప్పుకొంటే
అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి
ఏకాభిప్రాయానికి కృషి చేసి
తెలంగాణా పై తేల్చేస్తామని
మరో సారి మన తెలంగాణా వాదులను
తెల్లబోయేట్టు చేసారు.

అవతల తెలంగాణా ఆచార్యులు మాత్రం
కారు అద్దాలు దించకుండా ప్రయాణిస్తూ
కమలం కనిపిస్తే మాత్రం కరచాలనం చేసి వస్తున్నారు.

జెండాలన్నీ పక్కన బెట్టి
అందరినీ కలుపుకుని
ఉద్యమించే విషయంలో
ఎవరూ ఎలాంటి చొరవా చూపించక పోవడం చూస్తుంటే
ఎవరికీ తెలంగాణా రావడం ఇష్టం లేనట్టు ఉంది.

ఉస్మానియా విద్యార్థుల జాక్ కూడా
హైజాక్ కాబడినట్లే కనిపిస్తోంది.
వాళ్ళు కూడా ఈ విషయంలో
వింతగా ప్రవర్తిస్తున్నారు.

మొత్తానికి అందరూ కలిసి
ఆశలు పెట్టుకొన్న
అమాయక జీవికి
తమకు తెలంగాణా దక్కదు
కానీ మేమూ పోరాడాము అని
చెప్పుకొనే దిశ గా
ఉద్యమం దిక్కులు చూసేలా చేస్తున్నారు.

టీ ఆర్ పీ రేటింగుల కోసం ఉపయోగించబడే కుక్కల గోల తప్ప.

పంచ కట్టాడు
ప్రతిపక్షంగా విశ్వాస పరీక్ష పెట్టిస్తా అని అంటున్నాడు

ఒక్క ఎం ఎల్ ఏ తో ఉన్నాయన
మాజిక్ ఫిగరు కన్నా ఎక్కువ
బలముందని దింపే వరకు
మడమ తిప్పేది లేదు అని అంటున్నాడు

గతంలో పంచలూడ గొట్టండి అని అన్నా
ఇప్పుడు నాలుక కరుచుకొని
పడగొడితే నిలబెడుతా అని అంటున్నాడు మరొకాయన

వేర్పాటు వాద పార్టీ
అవిశ్వాసం పెట్టండి
మేము మద్దతు ఇస్తాము అని అంటున్నారు

నిజ్జంగా విశ్వాస పరీక్ష జరిగి
ప్రభుత్వం పడితే వెంటనే ఏమౌతుంది
పడక పొతే ఏమౌతుంది?

రైతుల కష్టాల పేరుతో పెట్టే పరీక్షా ఫలితం
గోనే పట్టలు సిద్దం చేస్తుందా?
కరిచే కుక్కలను కరవకుండా చేస్తుందా?
టీ ఆర్ పీ రేటింగుల కోసం
ఉపయోగించబడే కుక్కల గోల తప్ప.

‘చేతి’ డబ్బు సంచులు మొత్తం స్విస్ బ్యాంకు లోనే ఉన్నట్టు ఉంది

యోగా బాబా రాం దేవ్ సత్యాగ్రహం అంటూ
హస్తిన అడుగిడిన మరుక్షణం
అమ్మగారి సేనా పతులు
ప్రణభ్, సిబాల్, బన్సాల్
విమానాశ్రయానికి వచ్చి మరీ
స్వాగతం చెప్పి మంతనాలు జరుపుతున్నారంట
చూస్తుంటే ప్రభుత్వానికి చెమటలు పడుతున్నట్టు ఉంది
నల్ల దానం వెలికితీయడానికి వెనుకాడడం చూస్తుంటే
‘చేతి’ డబ్బు సంచులు మొత్తం స్విస్ బ్యాంకు లోనే ఉన్నట్టు ఉంద.

తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది

బురదలో వికసించడానికి బదులు
కూరుకు పోతున్న తామరను
కర్ణాటక కుర్చీ పై పెట్టాలని
ఘనుల దోపిడీదారులను దోసిట పట్టి
వారి పుణ్యాన పాలకులుగా పులకరిస్తూ
ఇప్పుడు వాళ్ళు పాపాత్ములుగా తేలుతున్న సమయాన
సుష్మా లాంటి వాళ్ళు
ఘనుల దొరలను దోసిట పట్టింది
నేను కాదంటే నేను కాదని
కడిగేసుకో చూస్తున్నారు చోద్యంగా.

తాము అధికారంలోకి వస్తే
వెంటనే తెలంగాణా అని
తీరా ప్రధాని పీటమెక్కిన పద్మం
ఇస్తే తామర హస్తిన కుర్చీ నుండి కింద పడుతుందని
తెప్ప తగలెట్టి తామూ ఆ తానూ ముక్కలే అని
తెలంగాణా వారికి తేట తెల్లం చేసారు.

ఇప్పుడు కొత్తగా
మరో సారి అధికారంలోకి వస్తే
మొదటగా చేసే పని తెలంగాణా ఇవ్వడమే అని
వింతగా మరో సారి వినుకోండి అని విన్నాపాలు చేస్తున్నారు.

వినే వాడి వెఱ్రిని బట్టి
రాజకీయ నాయకులు
తమకు తాళం వేసే లా
తమ నాలుకను నాట్యం చేయిస్తారు.
అందుకే కొత్తగా తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది.

మన టోకెన్ ఎప్పుడు?

అరవ’జీ’లు ఇద్దరు ఎంత అరిచి మొత్తుకున్నా
కటకటాల వెనక కాలం వెళ్ళబుచ్చుతున్నారు
తాజాగా ౨ జీ లో ఇంకో జీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది
‘చెయ్యి’ దాటిపోయి సుప్రీం దగ్గర
ఏమి సుద్దులు వినాల్సి వస్తుందో అని
ఆ మూడో జీ నే సమాధానం చెప్పాలి అని
మనీష్ తివారీ మట్టి దులుపుకొన్నాడు.

కన్నడ నాట
కనకాడంబరాలతో
ఎదురులేదనుకొంటున్న
ఘనులకు కుర్చీ ఏసింది
నేను కాదంటే నేను కాదని
అందిన ముందస్తు ఉప్పుతో
కమల నాయకులు కలవరపడిపోతూ
కడిగేసుకోడానికి చూస్తున్నారు

ఆంధ్రాలో
అవినీతిపరులకు కూడా
అన్నీ సిద్దం చేస్తున్నారు
పాపం వీళ్లేమో పార్టీ అంటూ
అప్పుడే టికెట్ల సర్వేలు
గెలుపోటముల సర్వేలతో
ఊహల్లో తేలుతున్నారు
సమరం ముందు
సమస్యల్లోకి నెట్టబడి
ఊచలు లెక్కించ బడే సన్నివేశాలను మాత్రం
మాట మాత్రంగా కూడా
మదిలో రానియ్యడం లేదు.

31, మే 2011, మంగళవారం

వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి

ఉస్మానియా విద్యార్థుల ముసుగుల్లో ఉన్మాదులు
ఊరకుక్కల్లా ఊగిపోతూ
దాష్టీకాలు చేస్తే దానిని ఉద్యమం అనాలి.

తిరగబడి ఎదురు దాడి చేస్తే
ఉద్యమ కారులపైన దౌర్జన్యం అని ఖండించాలి.

అదే ఉన్మాదులు
ఇచ్చే పాలకుల దగ్గర పిల్లుల్లా ఉంటే
ఉలుకూ పలుకూ లేని ఉన్మాదుల నాయకుడిని
ఉద్యమ నాయకుడు అని ఒప్పుకోవాలి.

ప్రజాస్వామ్యంలో పక్క పార్టీలను అణచడానికి
ఆచరిస్తున్న పెడ ధోరణులకు
ఉద్యమం అని పేరెట్టుకొని
పెట్రేగి పోతున్న వీళ్ళను తెలబాన్లు అంటే తప్పేంటి.

రాజకీయాల కోసం మామ కోపాన్ని దిగమింగుకొన్నాడు.

అల్లుడా మజాకా
చూసి అలా తానూ అవ్వాలనో ఏమిటో
చిరంజీవికే అల్లుడై
అల్లుడా మజాకా చూపిస్తే
రాజకీయాల కోసం మామ కోపాన్ని
దిగమింగుకొన్నాడు.

ఎందుకోసమైతే తను సహించాడో
అదే రానప్పుడు
అసలు రూపం చూపాడు అల్లుడికి.

పాపం సుప్రీం కోర్టు కూడా సుప్రీం హీరో అల్లుడికి
బైలు నిరాకరించింది.

విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

రాజా గారు జనాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చి
తమకు ఇచ్చే లోపుల పోయాడని
రోశయ్య నుండి కిరణ్ వరకు ఇస్తారేమో నని
చూసి విసిగి అలిగి
అరిచే ఓపిక కూడా లేక
జనాలను కరుస్తూ తమ నిరసన తెలుపుతున్నాయి
విశ్వసనీయతకు మారు పేరైన కుక్కలు.

విశ్వసనీయతకు మారు పేరైన
ఆయనే ఉంటే ఆరోగ్య శ్రీ కార్డు వచ్చి
రేబిస్ రాకుండా టీకాలు వేయించుకొని ఉండేవేమో.

కనీసం ఉండవల్లి లాంటి వాళ్ళు కూడా
జరుగుతున్నా అన్యాయం పై
ఉలుకూ పలుకూ లేకపోయే సరికి
పౌరుషం వచ్చిందేమో.

దానితో పాటు పొద్దున్న
తాము అరవడం కన్నా ముందే
తమ బాషను రాజకీయ నాయకులు
యదేక్షగా టీ వీ లైవ్ షో లలో వాడేసుకొంటూ
తిట్టుకోడానికి తమతో కంపేర్ చేసుకొంటున్నారని
కంపరమెత్తి కక్ష గట్టాయా అన్నట్టుగా
అన్నిప్రాంతాల్లో ఏ పార్టీ కూడా చొచ్చుకు పోలేక
విఫలమౌతున్న సమయానా
ఇవి మాత్రం సందు సందు కూ సందడి చేస్తూ
అన్ని ప్రాంతాల్లోనూ తమ ప్రతాపం చూపిస్తున్నాయి.

ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా..

కొత్తగా కట్టిన అసెంబ్లీ
అమ్మకానికి పెడుతున్నారంటగా
మా మహా నేత తనయుడు యువనేత
దక్షిణాదిలో ప్రతి రాష్ట్రంలో
ఓ కోట ఉండేలా చూసుకొంటున్నాడు
మీదే కొనేస్తాడు
కానీ మీరు కొంచం సమయం ఇవ్వాలి
ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా
కన్నెర్ర చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకొన్నారు
అదైన వెంటనే
దేవుడు దగ్గర ప్లీనరీ ఒకటి పెట్టుకొన్నారు
దానితో చిరంజీవి తరువాత
సునామీ సృష్టించేది తామే అని
నిరూపించుకొనే పనిలో
నిమిషం తీరిక లేకున్నారు.

రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

అధికారం ఇవ్వండి అని సునామీ సృష్టిస్తే
ఎగబడి వచ్చి చూసి ఎన్నో ఆశలు కల్పించిన జనాలు
రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

ఆ తరువాత పక్కలో బల్లెంలా తయారైన మీడియా
ప్రతిసారీ ప్రతి విషయం లో
రేటింగుల కోసం అరటి పండును చేసారు.

గౌరవ నిమజ్జనానికి
జనపద్ దగ్గర పడిగాపులు కాస్తూ
ఏదన్న విదిలిస్తారు అని ఎదురు చూస్తుంటే
ఎం ఎల్ సీ ఎంగిలి మెతుకులు కూడా విదల్చక
ఆటలో అరటిపండు స్థానానికి
భంగం వాటిల్లకుండా
వాటేసుకొంటామని వంచిస్తున్నారు.

28, మే 2011, శనివారం

విసిగించకండి: చంద్రబాబు పనితీరుపై హరికృష్ణ గరం గరం

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ శనివారం మహానాడులో సీతయ్య అవతారమెత్తారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పార్టీ నాయకుల మద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మనోవేదనను పార్టీ నాయకుల వద్ద వెళ్లబోసుకున్నారు. మహానాడులో మాట్లాడాలని పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు చేసిన విజ్ఞప్తిని ఆయన తోసిపుచ్చారు. తాను మాట్లాడలేనని, తనను విసిగించవద్దని ఆయన వారితో అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు.

చంద్రబాబు నాయుడు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎవరి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబు ఏకపక్ష ధోరణి వల్ల పార్టీ నష్టపోతోందని ఆయన అన్నారు. తాను వారసత్వ పోరు గురించి మాట్లాడడం లేదని, పార్టీని రక్షించుకోవాలన్నదే తన ఉద్దేశమని ఆయన అన్నారు. కరీంనగర్ రణభేరీని ఎప్పుడో నిర్వహించాలని తాను సూచించినా పట్టించుకోలేదని ఆయన అన్నారు. పులివెందులలో వైయస్ విజయమ్మపై పోటీకి దిగకూడదని, జగన్‌పై పోరాటం చేయాలని చెప్పానని, తన మాటలను పట్టించుకోలేదని ఆయన అన్నారు.

మీడియా ప్రతినిధులతో మాట్లాడడానికి కూడా హరికృష్ణ నిరాకరించారు. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వల్ల తాను మాట్లాడలేనని ఆయన అన్నారు. తాను మాట్లాడకపోవడానికి కారణాలు తర్వాత చెప్తానని ఆయన అన్నారు. మహానాడులో ఆయన ముభావంగానే ఉన్నారు. మొదటి రోజు కూడా మహానాడు నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మహానాడు వేదికపై హరికృష్ణ ఫొటో కనిపించలేదు

చంద్రబాబుపై జూ ఎన్టీఆర్ వైరం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై పోరు సాగించడానికే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. తన తండ్రి నందమూరి హరికృష్ణతో కలిసి ఆయన చంద్రబాబుపై యుద్ధం చేయడానికే సిద్ధపడ్డారని అనిపిస్తోంది. ఆయన మహానాడుకు దూరంగా ఉండడం, నందమూరి హరికృష్ణ మహానాడులో ప్రసంగించకుండా నిరసన వ్యక్తం చేయడం అందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మహానాడుకు రావాలని చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కూడా జూనియర్ ఎన్టీఆర్ తిరస్కరించారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉండడం వల్లనే మహానాడుకు వెళ్లడం లేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన మాటలు నమ్మేట్లుగా లేవు. హైదరాబాదులోని ఉన్న ఆయన మహానాడుకు వెళ్లాలంటే పెద్ద సమయం వెచ్చించాల్సిన అవసరం లేదు. మర్యాదపూర్వకంగానైనా అలా ఇలా రావచ్చు. ఓ పది నిమిషాల పాటు మాట్లాడి పోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ మాత్రం సమయం కూడా లేదంటే విశ్వసించే పరిస్థితి లేదు.

ఇకపోతే, హరికృష్ణ మహానాడులో వ్యవహరించిన తీరు కూడా చంద్రబాబుతో విభేదాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి తగిన బలాన్ని చేకూరుస్తున్నది. మహానాడులో ప్రసంగించాలని కోరిన పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని ఆయన కసురుకున్నారు. తాను మాట్లాడబోనని తెగేసి చెప్పారు. పైగా, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని కూడా చెప్పారు. ఎన్టీఆర్ జయంతి రోజున పార్టీలో విభేదాలను బయటపెట్టడం ఇష్టం లేకనే ఆయన మాట్లాడలేదని అంటున్నారు. శుక్రవారం మధ్యలోనే మహానాడు నుంచి ఆయన వెళ్లిపోయారు. శనివారం స్పష్టంగా నాయకుల వద్ద తన అభిమతాన్ని బయటపెట్టారు. బాలకృష్ణ మాత్రం చంద్రబాబుకు మద్దతుగా నిలబడేట్లే ఉన్నారు. మహానాడు ప్రసంగంలో ఆయన చంద్రబాబును ప్రశంసించారు.

చంద్రబాబు ఆలోచన ఎలా ఉందనేది తెలియడం లేదు. హరికృష్ణను చంద్రబాబు పట్టించుకోవడం లేదా, కావాలనే పట్టించుకోనట్లు నటిస్తున్నారా అనేది తెలియడం లేదు. అయితే, మహానాడులో మాట్లాడాలని యనమల రామకృష్ణుడిని చంద్రబాబే అడిగించారని తెలుస్తోంది. హరికృష్ణ తీరు పట్ల చంద్రబాబుకు నచ్చడం లేదని కూడా చెబుతున్నారు. మహానాడు నుంచి హరికృష్ణ శనివారం నాడు కూడా మధ్యలోనే వెళ్లిపోయారు. తన వారసుడిగా నారా లోకేష్‌ను తేవాలని చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలే తండ్రీకొడుకులు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లకు నచ్చడం లేదని చెబుతున్నారు. ఏమైనా, ప్రస్తుతం తెలుగుదేశంలో వారసత్వ పోరు బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తోంది.

బాబు స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడేనా?

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తున్నారా అనేది అనుమానమే. ఆయన ఎన్టీ రామారావు పేరును వాడుకున్నప్పటికీ వారసత్వాన్ని మాత్రం కొనసాగించడం లేదని అందరూ చెప్పే మాటే. ఎన్టీ రామారావు బొమ్మ వేరేవారి సొంతం కాకుండా జాగ్రత్త పడుతూ నారా వారసత్వాన్ని స్థాపించడమే చంద్రబాబు లక్ష్యమని చెబుతున్నారు. తన కుమారుడు నారా లోకేష్‌కు తన వారసత్వాన్ని అందించాలనేది ఆయన ప్రయత్నంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా పార్టీ మహానాడు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీని మాత్రం చంద్రబాబు తప్పకుండా పాటిస్తున్నారు.

ఎన్టీ రామారావుకున్న తెగువ, సూటిదనం చంద్రబాబుకు లేవు. పైగా, తన చేతిలోకి వచ్చిన తర్వాత పార్టీ స్వరూప స్వభావాలనే మార్చేశారు. ఇతరులు చెప్పే మాటను వినే అలవాటు ఎన్టీఆర్‌కు ఉంది. ఎవరైనా చెప్తే ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తే దాన్ని ఆచరణలో పెట్టేవారు. కాంగ్రెసుకు బద్ద వ్యతిరేకిగా వ్యవహరించారు. అందువల్ల ఆయన మొండివాడిగా కూడా ముద్ర పడ్డారు. ప్రజల మేలు తప్ప మరోటి ఆయనకు తట్టేది కాదు. పైగా, ప్రజలకు మేలు జరుగుతుందంటే నిబంధనలను కూడా పక్కన పెట్టేవారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారు. పార్టీపరంగా తీసుకున్న నిర్ణయానికి నష్టమైనా, కష్టమైనా కట్టుబడి ఉండేవారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సంక్షేమ దిశ నుంచి అభివృద్ధి దిశకు, అదీ పెట్టుబడీదారి దిశకు మళ్లించారు. చంద్రబాబు సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. వ్యవసాయం దండుగ వంటి మాటలు మాట్లాడారు. ఉద్యోగ నియామకాల్లో తెలంగాణ స్థానికేతరులకు అన్యాయం జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పుడు దాన్ని సరిదిద్దడానికి 610 జీవోను విడుదల చేశారు. కానీ దాన్ని చంద్రబాబు అమలు చేయలేకపోయారు. అంతేకాదు, రాజకీయ ప్రయోజనం కోసం తీసుకున్న తెలంగాణ అనుకూల వైఖరికి ఇప్పుడు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పటి తెలుగుదేశం కాదనేది అందరికీ తెలిసిన విషయమే.

26, మే 2011, గురువారం

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది.

నరసింహా రావు గారి నాన్చుడు దారిలో
నారా వారు ఇంకా [ఈ కాలం లో కూడా] ప్రయాణిస్తూ
ప్రభుత్వ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

కానీ గ్రామ గ్రామానికీ విస్తరించి ఉన్న పార్టీ శాఖ
ఇదే విషయంలో విసిగిపోతోంది.

వయసుమళ్ళిన వాళ్ళు వాహ్యాళికి వచ్చినట్టు
వచ్చి ఇంకా పార్టీ వ్యవహారాలూ నడుపుతుంటే
అవకాశం రాని యువత అంగలారుస్తూ
తక్షణమే పేరొచ్చే పెడదారులను వెతుక్కొంటున్నారు.

రైతు సమస్యలు అవినీతి సమస్యలపై అధినేత అరుస్తున్నా
వాహ్యాళికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్న
పండిన వృద్ద ఝంభూకాల జంజాటాన్ని
ఎంత తొందరగా వదులుకొని
జనంలో మమేకమయ్యే మనుషులకు
మేధావులకు పార్టీ పనులు అప్పజేబుతారో
అప్పుడే తెలుగు దేశం దశ తిరుగుతుంది.

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా
చరిత్రలో మిగిలిపోతుంది.

కుటుంబంలో ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

కనిమొళక్కో

కరుణ కూతురుగా ఉన్నా

కాస్తా దూరంగానే ఉంటివి

రాక రాక రాజకీయాలకు వస్తివి

రాజ్య సభకు వెళ్తివి

కుటుంబ గొడవల్లో కళైంజర్ ఛానెల్ పెడితివి

రాజాతో చేరి చేసిన రచ్చ

రచ్చ రచ్చ అయ్యి

అది కాస్తా 2 జీ అయ్యి

బైలు దొరక్క

జైలు పాలవుతున్నావు

అయినా మీ కుటుంబంలో

ఎవరు జైలుకు పోతే వాళ్ళే సి ఎం అయిపోతారు

బాధపడకు.

ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే సందేహం వద్దు

ఈ సీరియల్ లో
కథా నాయకుడు
కన్నీళ్లు తుడిచే నెపంతో వస్తాడు.
ఆ పాత్రను స్వయంగా కథా నాయకుడే
ఆవిధంగా మలుచుకొన్నాడు.
మధ్య మధ్య లో దీక్షల ఎపిసోడ్స్ తో అలరిస్తున్నా
అడపా దడపా ఎన్నికలంటూ డబ్బులు ఎదజల్లే
ఎపిసోడ్స్ తో ప్రత్యేక టెలి ఫిల్ములు చేస్తున్నా
ఈ సీరియల్ మాత్రం
తనకు ఖశ్చితంగా
కుర్చీ తెచ్చిపెడుతుందని నమ్మినందువల్లా
కథానాయకుడు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లతో
ఏడిపించడానికి
రెండో సంవత్సరానికి దగ్గరవుతున్నా
రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు
ఎప్పడూ ‘ఓదార్పు’ పేరుతొ ఏడుపేనా అనే
సందేహం వద్దు
ఏడిపించబోయే ఇంటికి వెళ్లక ముందు
డబ్బులు కొడుతూ
బాణా సంచా కాలుస్తూ
బహు సందడి తో
హాస్యాన్ని కూడా పండిస్తారు.
లైవ్ సీరియల్ కాబట్టి
షూటింగ్ వచ్చిన వాళ్ళందరికీ
కవరేజి గ్యారెంటీ తో
గమ్మత్తు కలగజేస్తారు.
వీలయితే షూటింగ్ కు వెళ్ళండి
లేదంటే 24 గంటల లైవ్
టీ వీ ల లో వస్తుందని మరచిపోకండి.

తోడు పంపిస్తారని భయమా?

యువనేత తనకు మాత్రమే
రైతు సమస్యలపై పేటెంటు ఉన్నట్టు
మిగిలిన వారు ఎవరు ఏమి చేసినా
కనీసం ప్రస్తావించినా
కిందా మీదా పడి
తనను కాపీ కొడుతున్నారని
మొసలి కన్నీరనీ మొత్తుకొంటున్నాడు
ఇన్నాళ్ళూ సభ్యుడై ఉండీ
భత్యాలు తీసుకొంటూ
సభ్యత కోసమైనా
పార్లమెంటులో ఒక్క సారైనా ప్రస్తావించాడా?
ఇక్కడ మాట్టాడి కుర్చీ కొట్టేద్దామనే బదులు
అక్కడ ప్రస్తావిస్తే ప్రసారం చేసే
సొంత మీడియా ఉండదనా లేక
హసన్ అలీ లేక మధు కోడాకు చేసిన సత్కారం చేసి
2 జీ రాజా కు తోడు పంపిస్తారని భయమా?

ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

సొంతంగా పార్టీ పరంగా గెలిచిన
ఎం ఎల్ ఏ ఒక్కరే.

మిగిలినవి అన్నీ కప్పదాట్లే.
అవి కూడా పాతికకు మించి లేదు.

పాలకులు తలుచుకొంటే
కప్ప దాట్లను సభకే రానివ్వకుండా చెయ్యొచ్చు.

ఇన్నీ తెలిసి పాలకులను పడగొట్టేస్తాం అని
పదే పదే చెప్పడం ఎందుకో ?

సిన్సియారిటీ చూస్తుంటే చిరంజీవి గుర్తుకు వస్తున్నాడు
ఏ పిలుపు వచ్చి డిల్లీకి వెళ్ళినా పోలవరం అంటాడు
తరువాత పత్తా ఉండడు.

సేం డిటో అలానే రైతు సమస్యలు అని ఓ టెంట్ వేస్తారు
కానీ ఓ సొంత పార్టీ ఎం పీ గా
విత్త మంత్రులను నిద్రలేపే వినతి పత్రం ఇవ్వలేరు.

టెంటు అవుతూనే
కుర్చీ సుమన్ అవతారం ఎత్తి
ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

వెళ్ళిన చోట్లల్లా
ట్రాఫిక్ లేని జంక్షన్లు వెదికి
విగ్రహాన్ని పెడుతూ
యువ నేత మహా నేత విగ్రహావిస్కరణ అని
తన మీడియా లో రోజులో ఎప్పుడు చూసినా
తప్పించుకోకుండా బాధుతారు.

కుర్చీ తన బాబు సొత్తు అనే బాధ ఎక్కువగా ఉండేట్టు ఉంది
కూల్చేదేదో కూల్చేసి ఆ భారం దింపుకొంటే బావున్ను.

నేనే ఎలికవ్వాలని అనుకొంటే ఎలా కుదురుతుంది.

తానూ ఓ ఏలిక అవ్వాలని
ఓ ఎలుక
తన కుటుంబం మొత్తంతో
ఇంట్లో చిందర వందర చేస్తుంది
అందరూ చూసే లోపల
తన కుటుంబం మొత్తాన్ని
కలుగులో ఉంచుకొంటుంది
చిందర వంద చేస్తున్న భాగాన్ని
తన ఏలుబడికి వదిలేయమని
తతిమా ఎలుకలేవీ అలా సెయ్యకుండా
ఏదన్నా ప్రయత్నించినా
కలుగు దాటి బయటకు వచ్చి
ఇంట్లో ఇంకో మూల చప్పుడు చేసినా
ఎలికవ్వాలని కలలుగనే ఎలుక
చప్పుడు చేసే ఎలుకల కలుగుల ముందర
టమోటో పిండేసి గుడ్ల పెంకులు పెట్టేసి
నా నా రభస చేస్తోంది
అన్ని ఎలుకలూ ఒక్కటై
చెత్త జేస్తే కదా ఈ ఇంట్లో ఉండలేమని
సామాన్లు సర్దుకు పోయేది అక్కడ ఉన్నోళ్ళు.
నచ్చినప్పుడు కలుగు బయట వచ్చి
చిందర వందర చేసి
మిగిలినప్పుడు కలుగులోకి వెళ్లి పోయి కాలాక్షేపం చేస్తూ
నేనే ఎలికవ్వాలని అనుకొంటే
ఎలా కుదురుతుంది.

అరిచే కుక్క కరవదు

అని అందరికీ ఓ నమ్మకం
ఒక వేళ కరిస్తే బొడ్డు చుట్టూ
పద్నాలుగు సూదులు పొడి పించుకోవాలనే
మరో నమ్మకం
ఆ నమ్మకాలన్నీ విడిచి పెట్టండి.
అట్టని నేను జన విజ్ఞాన వేదిక కార్యకర్తను కాను,
ఆంధ్రాలో రోజుకొక్కరైనా కుక్క కరిచి చస్తున్నారు
పద్నాలుగు బదులు వచ్చిన ఒక్క సూది కూడా
ఆంధ్రాలో దొరకదు
అలా తయారయ్యింది మన ఆస్పత్రుల పరిస్థితులు.

మనకు ఉచితంగా వచ్చే ఆరోగ్య శ్రీ లు కావాలి కానీ
కుక్క కరిచి పోతే ఏమి అని అనుకొనే రోజులు వచ్చేసాయి.

అమెరికా వాళ్ళకు ఈ విషయం తెలియనట్టు ఉంది
లేదంటే ఈ పాటికి ఆంధ్రాకు వెళ్లి కుక్క కరిచి చావకండి
అని అందరూ కాండ్రించి ఉమ్మేట్టు
తమ పౌరులకు హెచ్చరికలు చేసి ఉండేది.

అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షేనా?

అన్నను ఆదర్శంగా తీసుకొని
అబ్దుల్ కలాం పిలుపందుకొని
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
సామాజిక న్యాయాన్ని మంది మదిలో చొప్పించలేక
రెంటికీ చెడ్డ రేవడి అయి
గౌరవ నిష్క్రమణకోసం చూస్తుంటే
కేంద్ర మంత్రి ఇంటికి రాంగానే
తనకో కేంద్ర అమాత్య పదవి వస్తుందేమోనని ఆశపడి
పెట్టే బేడాతో సహా పార్టీని చేతిలో పెట్టడానికి ఒప్పుకొని
చేతి కోసం ఓట్లడిగి
తనూ రాహుల్ గాంధీ లాంటి వాడేనని నిరూపించుకొని
ఒగరుస్తూ ఓపిగ్గా హస్తిన ప్రయాణాలు చేసి
హస్త రేఖలు చూసుకొని మురిసిపోతూ
ప్రజల మధ్య ఉండాలను కొంటున్నానని
సముద్రం (చేతి పార్టీని సముద్రం పార్టీ గా వర్ణిస్తారు రాజకీయ విశ్లేషకులు)
ఒడ్డున నిలుచుకొని కేకేసి చెప్పి
ఇంటికొచ్చి అలక పాన్పు ఎక్కేసాడు
మరో సారి ప్రయాణం కట్టమని హస్తిన నుండి పిలుపొచ్చింది
అమాత్య పదవి కోసం అడిగి మళ్ళీ భంగపడుతాడో ఏమిటో?

ఇక్కడ భంగపడతాడు అని ఖశ్చితంగా ఎందుకు చెబుతున్నాను అంటే
ఈయనకు పదవిచ్చి ఖాళీ అయ్యే తిరుపతి లో
పరపతి నిలుపుకొనే ధైర్యం సముద్రానికి లేదు కాబట్టి
అదీ స్థానిక ఎన్నికల ముందు అసలు ఆ ఊసే ఊహకు కూడా రానివ్వరు.
అందుకే అందరివాడికి అమాత్య పదవి అందని ద్రాక్షే అవుతుంది
కాదు అమాత్యాడు అవ్వాలని మొండిఘటం అయితే రాష్ట్రం లో ఇస్తారు.

గోనె పట్టలు కూడా రైతులకు ఇవ్వలేని ఘోర ప్రభుత్వంలో
ముఖ్యమంత్రి పదవికి కోసం పార్టీ పెట్టి
రాష్ట్ర మంత్రులలో ఓ బోడి లింగ మవ్వడానికి
మనః సాక్షి అంగీకరిస్తుందా అన్నది ఓ ప్రశ్న?

జూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు చెక్?

తన కుమారుడు నారా లోకేష్‌కు అడ్డం పడాలని చూస్తున్న తన మేనల్లుడు జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పూర్తి కాలం రాజకీయాలపై దృష్టి పెట్టలేని స్థితిని గమనించి ఆయన నారా లోకేష్‌ను పార్టీలోకి దింపుతున్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ పాగా వేశారు. ఒకప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి గల్లా అరుణ చేతుల్లోకి పోవడాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ తాను పాగా వేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇందులో భాగంగా తన కుమారుడు నారా లోకేష్‌ను అక్కడి నుంచి రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్లనే చంద్రగిరి నియోజకవర్గం పార్టీ నేతలు నారా లోకేష్‌ను ఇంచార్జీగా నియమించాలని పట్టుపడుతున్నారు.

కాగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతను సినిమాలను తగ్గించుకోవడానికి కనీసం పదేళ్లయినా పడుతోంది. ఈ పదేళ్ల లోపు అతను పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు. నందమూరి హరికృష్ణ ముందుకు వచ్చి పార్టీ నాయకత్వం చేపట్టే స్థితి కూడా లేదు. హరికృష్ణకు తగిన సమర్థత కూడా లేదు. పార్టీ నాయకులు అందుకు అంగీకరించే అవకాశం లేదు. ఇప్పుడిప్పుడే సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చే సాహసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తాడని అనుకోలేం. అందువల్ల నారా లోకేష్‌ను అడ్డుకుని జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేవు. వచ్చే పదేళ్ల కాలంలో, అంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల వైపు దృష్టి సారించాలని అనుకునే సరికి నారా లోకేష్ నాయకుడిగా స్థిరపడిపోతారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఏ విధమైన ఆటంకాలు ఉండవని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ, బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టాలని అనుకుంటే మాత్రం కాస్తా తేడా రావచ్చు. కానీ, లోకేష్‌ను అల్లుడిగా చేసుకున్న బాలకృష్ణ అందుకు సాహసించకపోవచ్చు. ఇప్పటికే, చంద్రబాబు, బాలకృష్ణల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు. మొత్తం మీద, కుమారుడు నారా లోకేష్‌కు చంద్రబాబు లైన్ క్లియర్ చేసి పెట్టారు. పార్టీ ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా నారా లోకేష్‌ను సమర్థించేవారే. అంటే చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండేవారే. నామా నాగేశ్వర రావువంటి నాయకులు నారా లోకేష్‌కే మద్దతు తెలుపుతారు

25, మే 2011, బుధవారం

కాంగ్రెసులో రెడ్డి వర్సెస్ కాపు

ఇన్నాళ్లూ రెడ్డి ఆధిపత్యం ఉన్న కాంగ్రెసు పార్టీ క్రమంగా తన దిశ మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కాసు బ్రహ్మానందరెడ్డి హయాం నుండి నిన్నటి వైయస్ రాజశేఖరరెడ్డి హయాం వరకు రాష్ట్ర కాంగ్రెసులో రెడ్డిలకే ప్రాధాన్యం ఉండేది. కాంగ్రెసులో రెడ్డిలకే అధిక ప్రాధాన్యత ఉన్నప్పటికీ వైయస్ హయాంలో రెడ్ల ప్రాధాన్యత మరింత పెరిగిందనే వారూ ఉన్నారు. అయితే వైయస్ఆర్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ విడిచి కొత్త పార్టీ పెట్టడం, ఆయన వైపు పలువురు నేతలు చూస్తుండటంతో కాంగ్రెసు ఇప్పుడు రెడ్డిని కాదని కాపుల వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇన్నాళ్లూ కాంగ్రెసుకు అండగా ఉన్న రెడ్లు జగన్ పార్టీ పెట్టడం కారణంగా వారు ఆయన వైపు చూస్తుండటంతో తమకంటూ ఓ సామాజికవర్గం ఓట్లు ఉండాలనే ఉద్దేశ్యంలో భాగంగానే కాంగ్రెసు పార్టీ రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గంలో ఒకటి అయిన కాపులను దరి చేర్చుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ వ్యూహంతోనే ప్రజారాజ్యం పార్టీని పార్టీలో విలీనం చేసే దిశలో చిరంజీవిని ఒప్పించి సఫలం చెందిందని తెలుస్తోంది.

కాంగ్రెసు కార్యకర్తల్లో ఎక్కువ కాపులే ఉన్నప్పటికీ ప్రాధాన్యత మాత్రం రెడ్డిలకే ఇప్పటి వరకు ఉంది. రెడ్లంతా ఇప్పుడు జగన్ వైపు చూస్తున్న నేపథ్యంలో కాపులకు పార్టీలో కీలక పదవులు అప్పగించడం ద్వారా వారిని మరింత దరి చేర్చుకునే వ్యూహంతో పార్టీ ముందుకు వెళుతోంది. రెడ్లు దూరం కావడం ద్వారా 2014లో ఏర్పడే లోటును కాపుల ద్వారా పూడ్చుకునే ఉద్దేశ్యంతోనే చిరును దరి చేర్చుకున్నట్లు తెలుస్తోంది. చిరును తమ వైపు తిప్పుకోవడం ద్వారా చిరు అభిమానులతో పాటు, కాపు వర్గాన్ని దమ వైపు తిప్పుకోవచ్చునని కాంగ్రెసు భావిస్తోంది. సామాజికంగా, ఆర్థికంగా రెడ్డిలదే ముందంజ. కాపులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రెడ్ల ప్రాధాన్యం తగ్గించి లాభం పొందాలను అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా రెడ్లకే ప్రాధాన్యత ఉంది. కిరణ్ కేబినట్లో 15 శాఖలు రెడ్డి సామాజిక వర్గం చేతిలోనే ఉన్నాయి. అయితే కిరణ్ పనితీరుపై అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నది. కాబట్టి క్రమంగా రెడ్లకు ప్రాధాన్యత తగ్గించి కాపులను అందలం ఎక్కించాలనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికిప్పుడు చిరంజీవికి సిడబ్ల్యుసిలో స్థానం కేటాయించడం ద్వారా పార్టీ రెడ్లతో పాటు కాపులకు మంచి ప్రాధాన్యం ఇస్తుందనే ధోరణి కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు మంత్రి బొత్స సత్యనారాయణకు పిసిసి పదవిని కట్టబెడతారని, వట్టి వసంతకుమార్, కన్న లక్ష్మీనారాయణలకు కూడా ప్రాధాన్యం ఉన్న పోస్టులను ఇస్తారనే వార్తల వెనుక కూడా కాపులను మరింత దగ్గరకు చేర్చుకోవాలనే ఉద్దేశ్యమే అని తెలుస్తోంది. టిడిపికి బిసి, కమ్మ, జగన్‌కు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఉన్నట్లు ఇక ముందు ముందు కాంగ్రెసుకు కాపు సామాజిక వర్గం దగ్గరవుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

24, మే 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఇంచార్జీ??

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కుమారుడు నారా లోకేష్‌కు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కౌంటర్ ప్రారంభమైంది. పార్టీ మహానాడుకు ముందే తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు ముదురుతోంది. తెలంగాణలో సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం రగులుతున్న సమయంలోనే వారసత్వ పోరు కొత్త రూపు ధరించడం విశేషం. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి నారా లోకేష్‌ను ఇంచార్జీగా ప్రకటించాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించుకున్న సమయంలోనే కృష్ణా జిల్లా రాజకీయాలు దానికి కౌంటర్‌గా ప్రారంభమయ్యాయి.

కృష్ణా జిల్లాలోని ఏదో ఒక శాసనసభా నియోజక వర్గం ఇంచార్జీగా జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రకటించాలని కోరుతూ జిల్లా నాయకత్వం తీర్మానం చేయడానికి సిద్ధపడుతోంది. మంగళవారం మధ్యాహ్నం బందరులో కృష్ణా జిల్లా పార్టీ సమావేశం జరుగుతోంది. ఇందులో మహానాడులో ప్రతిపాదించే తీర్మానాలపై చర్చ జరుగుతుంది. ఇందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్‌ను ఏదో ఒక నియోజకవర్గం ఇంచార్జీగా నియమించాలనే తీర్మానం పురుడు పోసుకుంటుందని అంటున్నారు. తాత స్వర్గీయ ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణా నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఇంచార్జీగా వ్యవహరించడానికి అనువైన నియోజకవర్గాన్ని కూడా పార్టీ నాయకులు గుర్తించనున్నారు.

తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జీగా నియమించాలనే చిత్తూరు జిల్లా పార్టీ నాయకుల ఒత్తిడిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో వారసత్వ పోరు రగలడం చంద్రబాబుకు కాస్తా ఇబ్బందిగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణకు సంబంధించి నాగం జనార్దన్ రెడ్డి వ్యవహారం తలనొప్పిగా పరిణమించింది. ఇదే సమయంలో వారసత్వ పోరు కొత్త మార్గంలో తలకు చుట్టుకుంటుండడం చంద్రబాబు అసహనానికి కారణమని అంటున్నారు.

చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజకీయాల్లో చాణక్యుడని, అతని వ్యూహం ముందు అందరూ చిత్తు కావాల్సిందేనని ఇప్పటి వరకు ఓ నమ్మకం ఉంటూ వచ్చింది. అంతేకాకుండా, ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా తెలుగుదేశం పార్టీ భరిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండేది. ప్రత్యర్థులనే కాదు, పార్టీ వ్యతిరేకులను తన వ్యూహాలతో దారికి తెచ్చుకునే నేర్పు చంద్రబాబుకు ఉందని అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులవుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీపై, పార్టీ నాయకులపై చంద్రబాబు పట్టు కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. తాను అనుసరించిన వ్యూహమే తన కొంప ముంచేలా ఉంది. తన దారిలో నడవని నేతలను కట్టడి చేయడానికి పార్టీలో వారికి వ్యతిరేకంగా మరో గ్రూపు తయారు చేసే చంద్రబాబు వ్యూహం బెడిసి కొడుతోంది.

మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి విషయంలో చంద్రబాబు అనుసరించిన వ్యూహం పూర్తిగా బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. పార్టీ వైఖరిని నాగం జనార్దన్ రెడ్డి తూర్పారపడుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటారా, ఆ నిర్ణయాన్ని సమీక్షించి వెనక్కి తీసుకుంటారా తేల్చాలని ఆయన పట్టుబడుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి పట్టులో అర్థం ఉంది. తెలంగాణ ప్రజల ముందు చంద్రబాబును నాగం జనార్దన్ రెడ్డి ద్రోహిగా నిలబెడుతున్నారు. ఇతర పార్టీల నాయకులు ఇప్పటికే కావాల్సినంత చంద్రబాబు వైఖరిని తప్పు పడుతూ వచ్చారు. దీంతో తెలంగాణ ప్రాంతంలో ప్రజలు చంద్రబాబును నమ్మడానికి వీలు లేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డే ముందుకు రావడంతో ఆయన పప్పులు ఉడికేట్లు లేవు. చంద్రబాబు అనుకూల తెలంగాణ ప్రాంత నాయకత్వం దుమ్ము దులిపేందుకు కూడా ఆయన వెనకాడడం లేదు.

ఇకపోతే, వారసత్వ పోరు నానాటికీ రాజకుంటోంది. తన కుమారుడు నారా లోకేష్‌ను తెర మీదికి తేవాలనే చంద్రబాబు వ్యూహం కూడా తిరగబడేట్లే ఉంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి పార్టీ ఇంచార్జీగా నారా లోకేష్ పేరును ప్రకటించాలని ఆ ప్రాంత నాయకులు పట్టుబట్టడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగానే పరిణమించింది. నారా లోకేష్‌ను అడ్డుకోవడానికి నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తమ అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. కృష్ణా జిల్లాలో దాని ప్రకంపనలు కనిపిస్తున్నాయి. వల్లభనేని వంశీని దారికి తెచ్చామని అనుకున్నా అది రగులుతూనే ఉన్నది.

తాజాగా, పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి పార్టీ నుంచి తప్పుకోవడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. బుచ్చయ్య చౌదరి పార్టీ నాయకత్వ తీరు పట్ల, అంటే చంద్రబాబు తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం మాత్రం నిర్ధారణ అయింది. నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత నాయకులను చంద్రబాబు ఉసిగొల్పినా అది ఫలితం ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. సీమాంధ్ర సీనియర్ నాయకులు పార్టీ వ్యవహారాల పట్ల పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, చంద్రబాబు కోలుకోలేని స్థితిలోకి జారుకుంటున్నారని మాత్రం అనిపిస్తోంది.