22, మార్చి 2011, మంగళవారం

వినే ఓపిక వుందా!!!!

ప్రే.మనాలుగు అక్షరాల పదం...
వంద అర్ధాలు...
వెయ్యి పొరపాట్లు..
పదివేల ప్రశ్నలు...
బట్ నో సింగిల్ ఆన్సర్
కవితలు చెప్పే హృదయం వుంది !ప్రేమించే మనసు వుందిమనసులొన మంచి ఉహ వుందిఉహల లొకం లొ ఒక ఆశ వుందికలసి వుండే కోమలి యెక్కడ వుందొ?చెప్పాలి అంటే చాలా వుంది వినే ఓపిక వుందా

నీ చిరునవ్వు....
మిలియన్ డాలర్లు ఐతే !
నేను కొనలేను నేస్తం....
మిలియన్ రక్తకణాలు ఐతే
ధమనుల్ని సిరల్నీ పిండి ఇవ్వగలను ......

చివరకు మిగిలేది మిత్రులే .....!

కదిలిపొయే కెరటంలా,
సాగిపొయే నావ లాంటి నా జీవితం లొ....
ఆశల హరివిల్లు పూయిస్తూ ఆప్యాయంగా
పలకరించిన మిత్రమా!
అరుణొదయ సంద్య లొగిలిలొ...
సుఖదు:ఖాల జీవిత సంగమం లో
చివరకు మిగిలేది మిత్రులే .....!
మరో సూర్యుడు నాకోసం ఉదయిస్తే
నేను మరో జన్మలొ మనిషి గా జన్మిస్తే నీలాంటి స్నేహితురాలి మమతానురాగాలు కోసం
ఎన్నిసార్లు అస్తమించడానికైనా నేను సిద్దమే .....!

తేలివిగల వ్యాపారీ ఇక నుంచి వ్యాపారాలు నుంచి తప్పుకుంటాడంట!!!!

కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆటాడుకున్న గాలి జనార్దన్ రెడ్డి కార్యకలాపాలకు క్రమంగా బ్రేక్ పడుతోంది. తాజాగా, గాలి జనార్దన్‌రెడ్డికి చెందిన బ్రహ్మణి ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం అయింది. పరిశ్రమల శాఖ తయారు చేసిన నోటీసును జారీ చేయడానికి న్యాయశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. "ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మూడేళ్ళలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉండగా కనీసం పది శాతం పని కూడా పూర్తి కాలేదు. ఒప్పంద ఉల్లంఘన జరిగినందున స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించిన భూములు ఎందుకు వెనక్కి తీసుకోకూడదు?'' అంటూ పరిశ్రమల శాఖ తన నోటీసులో పేర్కొంటోంది.


2007 మార్చి 26న అట్టహాసంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధ్యక్షతన కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై గాలి జనార్దన్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యాంబాబులు సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం కంపెనీ మూడేళ్లలో తొలి దశ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉంది. పరస్పర అంగీకారంతో ఈ గడువును పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే పొడగింపునకు ఇప్పుడు అవకాశం లేదని తెలుస్తోంది. కొద్ది రోజుల కిత్రమే పరిశ్రమల శాఖ బ్రహ్మణీ ఇండస్ట్రీస్ నుంచి ప్రాజెక్టు ప్రగతిపై నివేదిక కోరింది. ఈ నివేదికలో కంపెనీ 10760 ఎకరాల భూమి లెవలింగ్ పనులతోపాటు కాంపౌండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ప్రాజెక్టుపై 1350 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించారు.

కొంత మేర బ్లాస్ట్ ఫర్నేస్ మెషీనరీ ప్రాజెక్టులో వెచ్చించామని, మరికొంత మొత్తంతో మెషినరీకి ఆర్డర్ చేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత స్టీల్ ప్లాంట్ కోసం సర్కారు కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో అంబవరం వద్ద 10760 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాజెక్టు విషయంలో కంపెనీ కనీస ప్రగతి కూడా చూపించలేకపోయినందున భూ కేటాయింపులు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసు జారీ చేస్తున్నారు.

ఈ సంస్థకు ప్రభుత్వం ఎకరా 18 వేల రూపాయల లెక్కన కేటాయించింది. బ్రహ్మణీ ఇండస్ట్రీస్ కోర్టుకు వెళ్లకుండా భూమి వెనక్కి ఇవ్వటానికి అంగీకరిస్తే ప్రభుత్వం ఈ భూమి ధరకు సంబంధించి కంపెనీ చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కేటాయించిన 10760 ఎకరాలను తనఖా పెట్టి బ్రహ్మణీ ఇండస్ట్రీస్ బ్యాంకుల నుంచి రూ.350 కోట్ల రుణం పొందింది. ఇప్పుడు ఈ సంస్థకు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటే ఈ రుణాన్ని ఎవరు చెల్లించాలన్నది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. తనకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకునే కావచ్చు, తాను వ్యాపారాల నుంచి తప్పుకుంటానని జనార్దన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు

నీ ఉనికి చాటారా నీ సత్తా చూపారా

ఇది తెలంగాణా విజయమా,
తెలుగు ప్రజానీకానికి జరిగిన అవమానమా,
ప్రజా ప్రయోజనానికై జరుగుతోన్న సంఘర్షణా,
స్వప్రయోజనానికై చేస్తున్న దీక్షా కండమా
ఆనాడు తెల్ల దొర చేతిలో చీలింది దేశం,
ఈనాడు తెల్ల దొరసాని చేతిలో చెల్లా చెదురు
అవుతుంది రాష్ట్రం
నేతల ప్రయోజనాలకు చీలుదామా,
సమైక్య ఆంధ్రకు జై అందామా
సమస్యకు సమాదానం నేవే తమ్ముడా,
అగ్గి బారుట పట్టుకొని పోరాడే వీరుడా
తెలుగువీర లేవరా సమైక్యాంధ్ర కోరరా,
నీ ఉనికి చాటారా నీ సత్తా చూపారా

అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే ఈ కరాళ నృత్యం ఇంకా ఎన్నల్లు

రగులుతున్న ఆంధ్రావని ఎందరో త్యాగధనుల పుణ్యభూమి
నేడు రాజకీయాలకు బలై ఖండమై పోయింది
ముక్కలు చెక్కలై కుక్కలు చింపిన విస్తరిలా మారబోతుంది
అన్నదమ్ములు దాయాదులై తల్లిని పంచుకుంటారా
ఏది తెలంగానం ఏది ఆంధ్రరాజ్యం ఏది సీమరత్నం
కులాల చిచ్చు నేడు భాషకు కూడా పాకిందా..
పూర్ణ భోజనాన్ని చేతులారా కుక్కలపాలు చేస్తారా.
స్వార్థ రాజకీయాల కుతంత్ర యుక్తులకు బలై
వెర్రి ఆవేశాన్ని నింపుకొని సాగించే ఈ దహనకాండ
మారణ హోమం ఎవరి తృప్తి కోసం , ఎవరి మనుగడ కోసం
అమ్మను చంపి రక్తపుటేరులు పారిస్తూ శవాల మీద సాగించే
ఈ కరాళ నృత్యం, పైశాచిక ఆనందం, అఖండ భారతావని
భాషా చరిత్రలో మరో నికృష్ట అధ్యాయం .
సర్వ మానవాళి సిగ్గుతో తలవొంచుకునే దుర్దినం.
ఎవరి స్వార్థం కోసం ఈ అభినవ పద్మవ్యూహం
ఎందరో ఆభిమన్యులు కలి తంత్రాలకు బలై,
సొంత సోదరుల చేతిలో పతనమయ్యే ఈ
అభినవ భారత మహా సంగ్రామం, భాషా సంగ్రామం
ఆగేదేపుడు..దీనికి అంతమెపుడు..పగసేగలు చల్లారేదెపుడు

తెలుగు తల్లి మరో మారు పురిటి నొప్పులు పడుతున్నది

వేల ఏళ్ళ చరిత మనది
ఘనమైన కీర్తి మనది
విశిష్ట సంస్కృతి మనది
విభిన్న పద్ధతి మనది.

కోటిలింగాల శాతవాహనులు
విజయపురి ఇక్ష్వాకులు
ఓరుగల్లు కాకతీయులు
వేంగి చాళుక్యులు
చోళులూ రాయలూ
ఎందరెందరో...
రెండు సహస్రాబ్దుల పాటు
తెలుగు వారిని ఆంద్ర జాతిని
ఒక్క త్రాటి పై నడిపి
ఒకే సంస్కృతి గా నిలిపి
భరత వర్ష మందు
ఆంధ్ర జాతి భళిరా
యని దేశ దేశముల యందు
మన కీర్తిని ప్రజ్వలింప జేసిరి.

వేదాల లో ఉపనిషత్ లలో
రామాయణ భారతం లో
మనమంతా ఒక్కటని
ఆంధ్ర జాతి మనదని
తెలుగు వారం మనమని
చదివి విని ఘర్వ పడే
తెలుగు వారలందరికీ
చెప్ప మనసు రాని గాయం చే
ఏర్పడిన ఐదు వందలేళ్ళ
ఎడబాటును అడ్డు చూపి
ఐదు దశాబ్దాల నుంచి
స్వార్ధ పరులు కొందరు
తెలంగాణ పేరిట
వేరు కుంపటి రేపుతుంటే...

తెలుగు తల్లి మరో మారు
పురిటి నొప్పులు పడుతున్నది
ఈ చీలిక తానోర్వ లేనని
భరత మాతకు మొరపెట్టుకుంటున్నది!

తెలుగు వీర లేవరా తెలంగాణ సోదరా
చీలిక పేరు చెప్పే నాయకుల
నాలుకలు చీల్చి చెండాడరా.
తెలుగు వారలందరం
ఎప్పటికీ ఒక్కటేననీ-
తెలుగు బాష మనదని
ఆంధ్ర జాతి మనదని
మనమంతా ఆంధ్రులమని
భరత మాత బిడ్డలమని-
దిక్కులు పిక్కటిల్లేలా
సమైఖ్యాంధ్ర నినాదాన్ని
యావదాంధ్ర జాతి లో
ఏకమై వినిపించరా.