6, మార్చి 2011, ఆదివారం

ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి.

పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా? వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు. పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు. ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి పాడె కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి.

మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్

మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది.

మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు!

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010 న కే.సి.ఆర్."== ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.

"పల్లె పట్టాల పైకి" అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది. పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.