9, ఫిబ్రవరి 2011, బుధవారం

ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

నగిషీ కొసం ప్రాకులాడే మానవుడు

అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...

కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...

గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....

జీవన నాడులైన అప్యాయతలను వదిలి....

స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....

అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....

సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...

మమకారాలను అదృష్యం చేస్తూ.....

మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!

కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....

గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!

బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...

ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ కనులకు కాంతి నేను....

నీ కలలను కన్నది నేను....

నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....

నీ చిరునవ్వు.... దిగులు... నేను....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....

నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...

నీ కన్నిటిని తుడిచేది నేను....

నువ్వు గెలిచిన విజయం నేను...

నీ అలసట తీర్చేది నేను....

నీ మెలుకువకు దీపం నేను....

నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....

యువత వేతుకులాట

దేనికొసం ఈ యువత వేతుకులాట...!?

అందం కొసమా....?

తగ్గుతున్న లావణ్యం కొసమా...?

కానే కాదు....

మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!

బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....

ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....

శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....

మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!

మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!

ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!

రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!

నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....

మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....

అత్మసైర్ధ్యం

గెలుపు కొసం కదిలే నీ పాదాలకు సందేహపు అడ్డుకట్ట వేయ్యకు...

నదిలా పరుగులు తీసే నీ ఆశయపు పయనాన్ని నిరాశతొ ఆనకట్ట కట్టకు...

నీ కలల వెనుక కదిలే ఆశల ఆరాటాన్ని అలసిపొనివ్వకు....

క్షణాలలొ కుదుటపడే ఆవేశాన్ని ఆరని చితిగా మార్చకు....

కృంగదీస్తున్న కష్టాలపై కసిరగలాలి....

అడుగంటుతున్న నీ జీవితం ... వసంతంతొ చిగురించాలి....

బ్రతుకును గేలి చేస్తున్న ప్రతి అపజయం....

నీ పట్టుదల పిడికిలిలొ బందికావాలి....

విర్రవిగుతూ విరుచుకుపడే అవమానాలు...

నీ ఆత్మవిశ్వాసం ముందు విలవిలబొవాలి.....

నీ చేదు జ్ఞాపకమేదయినా అనుభవాన్నిచ్చే ఓదార్పుగా నిలవాలి....

పసితనం దాటిన నీ ప్రాయం... సమరానికి స్వాగతమవ్వాలి...

పసిడితనంతొ నిండిన నీ యువ్వనం....ప్రయత్నంలొ ఎదురైన పరాజయాలను ఆస్వాదించాలి.....

రగిలే శ్వాసే నడిచే నీ గమ్యాన్ని చేర్చే దిశగా మారాలి..

కంటిదడిలొ నీ కన్నీరు ఇంకిపొయినా...బ్రతుకు ఓడిలొ నవ్వులు విరియాలి ...

కలగనే నీ సౌదమేదయినా దైర్యాన్ని పునాదిగా కట్టాలి...

యదను తాకే గాయాలు ఏవైనా... మదిని పుసే చైత్రాలవ్వాలి...

ఎదురుచూసే కాలలు ఏన్నతైనేంటి.....విజయాన్ని ఆస్వాదించే ఆ ఒక్కరొజు కావాలి....

వెలుగుగా మారే వేకులేన్నుంటేనేం... అడియాసలను చీల్చే ఆనందం రావాలి.....

సుటిపొటి మాటలు తూపాకులైతేనేంటి...ధగా చేస్తున్న కాలపు గుండెల్లొ తూటవవ్వాలి...

గగనమే నీ తొలి కడలి....బ్రమరమే నీ మజిలి....

అలలుగా మారిన నీ ఆలొచన సంద్రాన్ని నలుదిశల విస్తరించు.....

హేలన చేసిన అపజయం ....నీ నమ్మకమనే ఆత్మసైర్ధ్యానికి బానిసవుతుంది.....

నా "నీడ"

నీ వెవరొ నాకు తెలుసు....

నా వెంట పడుతున్నావని తెలుసు...

నాకు తొడుగా వుంటావని కూడ తెలుసు....

కాని కొన్ని సమయాలలొ....అంటే....

మబ్బులు కమ్మినప్పుడు మేఘగర్జనకు భయపడి పారిపొతావు...

వర్షం పడినప్పుడు తడిసిపొతానని భయపడి దాగుంటావు....

చీకటి అలుముకున్నప్పుడు భయపడి నాలొ కలిసిపొతావు...

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ....

నన్ను ఒంటరి వాడిని చేసినా..

నన్ను వీడి పారిపొయినా...

భయపడను.... బాధపడను....

ఎందుకొ తెలుసా....

నీవు ఎందుకు పనికిరాని నా "నీడ"వి కాబట్టి.....!

కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

ఓటు నాడు నీతుల కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....

విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......

బ్రతుకు బరువై...గుండె చెరువై....

వర్షం మరుగై.....నీరు కరువై.....

భొరు...భొరున విలపిస్తూ....

భూమాతకు చిల్లులు వేసినా....

బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....

అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....

క్షేమం మరచి... క్షామం వలచి

కనికరించని వరునుడు....

ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....

భాగొగులు మారెదేప్పుడు.....

వారి తలరాతలు మార్చేదెవ్వరొ....

తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....



ఎందుకొ నాకనిపిస్తుంది.....! మరి ఎందుకొ??????

ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....

ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....రెండూ సూర్యుడు నుండే వస్తాయి...

వాసన ఇచ్చే పూలు...నేల రాలే ఆకులు... రెండూ చెట్టు నుండే వస్తాయి...

ఆహ్లదనిచ్చే చిరు జల్లులు....ప్రాణాలు తీసే తుఫాను... రెండూ మేఘాలే సృష్టిస్తాయి....

ఆకలిని తీర్చే పంటలు...కలచవేసే భూకంపాలు ... రెండూ పృధీ నుండే పుడతాయి...

ఎగిసిపడే అలలు...ముంచెత్తే సునామీలు....రెండూ సముద్రం నుంచే జ్వలిస్తాయి...

జన్మనివ్వటం...ప్రాణాలు తియ్యడం...రెండూ దేవుడి నుంచే అవతరిస్తాయి...

అందానిచ్చే పర్వాతాలు...ఆత్మహత్యల లొయలు...రెండూ కొండల నుండే జ్వనిస్తాయి...

కృంగదీసే కష్టాలు...సేదతీరే సుఖా:లు...రెండూ మానవ ఇతిహాసంలొ బాగాలవుతాయి...

తొక్కుతున్న బండ...మ్రోక్కుతున్నా శిలలు...రెండు రాయి నుండే వస్తాయి...

కంటని తడిపే ఓటమి...కన్నీటిని తుడిచే చెలిమి...రెండు జీవితానికి బొమ్మ బొరుసులవుతాయి...

తప్పటడుగుల పసితనం...తప్పుటడుగుల యువ్వనం...రెండు వయస్సు నుండే పుడతాయి....

గుండెలొ ద్వేషం...ఆదరించే అభిమానం...రెండు ప్రేమనుండే వస్తాయి...

సమతుల్యం కోసం ప్రతి దానిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి...

మంచిని ఆస్వాదించాలి...చెడుని పోరాడాలి...అప్పుడు గెలుపు నీ ఇంటిపేరవుతుంది...

అనాధ పిల్లలు వేదన

రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో

అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!


ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే

మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!


మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో

ఒక చుక్క విలువను నాపై కార్చండి!


మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో

మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు

ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !


రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని

తుడిచే పిలగాడినీ నేనే....!


మీ ఎంగిలి ప్లేట్లను కడిగి

మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!


లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య

తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.


ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల

లోకాన ఉమ్మివేయబడ్డాను......


నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదండీ.....!


మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు

ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!


నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో

రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని

ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....


నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....

ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....

రేపటి నా పయనం

నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....



తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి.....

మీ చేతిలో బాంబ్

మొబైల్‌ఫోన్ లేకపోతే ఏమవుతుంది..? ఒక్కసారి ఆలోచించండి.. అమ్మో ప్రపంచం ఆగిపోతుంది అంటారా..? కావచ్చు.. సెల్ చేతిలో లేకపోతే ఒక్కక్షణం కూడా మనకు తోచదు. రోజులో ఒక్కకాల్ అయినా రాకపోతే.. మనసు విలవిలలాడిపోతుంది. ఆదిలాబాద్‌లో ఉన్నవాడిని.. అనకాపల్లిలో ఉన్నవాడిని.. అమెరికాలో ఉన్నవాడినీ ఒక్క క్షణంలో కలిపేశక్తి మొబైల్ సొంతం. కానీ.. అదే సెల్‌ఫోన్.. ఇప్పుడు మన పాలిట పిశాచిలా మారింది. మన ప్రాణాన్ని బలితీసుకోబోతోంది.

మన చేతిలో... మన జేబులో.. మన ఇంట్లో.. చివరకు మన జీవితంలో.. ప్రతీ చోటా బాంబ్... ఒకరూ ఇద్దరూ కాదు... దేశంలో 70 కోట్లమంది మృత్యువును చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్నారు.. మీ చేతిలో బాంబ్ ఎప్పుడైనా పేలొచ్చు.. ఎవరి ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు.. ఎలాగైనా పోవచ్చు.. ఆ బాంబే.. సెల్‌ఫోన్. మన ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతున్నమహమ్మారి. మన ప్రాణాన్ని కబలించడానికి సెల్ చురుగ్గా పావులు కదుపుతోంది. అత్యంత ప్రమాదకరమైన బ్రెయిన్ క్యాన్సర్‌ను కలిగిస్తోంది సెల్‌ఫోన్. సాధారణ వ్యక్తులతో పోల్చితే.. సెల్ వాడుతున్నవారికి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు దాదాపు 400 శాతం ఎక్కువట. దీన్ని బట్టి.. మీ చేతిలో ఉన్న సెల్‌ఫోన్ ఎంత డేంజరో ఒక్కసారి ఆలోచించండి..

ఈ విషయాన్ని ఏదో అల్లాటప్పా సర్వే తేల్చింది కాదు.. పిచ్చిసర్వే చెప్పింది అంతకన్నా కాదు.. మన కేంద్ర ప్రభుత్వం తేల్చిన విషయం. సెల్‌ఫోన్ రేడియేషన్ ఎఫెక్ట్‌పై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం నిజానిజాలను వెలికి తీయడానికి, ఎనిమిదిమంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, మెంబర్ సెక్రటరీ, డీఓటీ నుంచి సభ్యులను ఈ కమిటీలో నియమించింది. సెల్‌ఫోన్ వినియోగంపై విస్తృతంగా పరిశోధించిన ఈ కమిటీ.. సెల్‌ఫోన్ రేడియేషన్‌కు సంబంధించి భయంకరమైన వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది. అందులో కీలకమైన విషయమే.. బ్రెయిన్ క్యాన్సర్ ఎఫెక్ట్. అందుకే.. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ఇంత ఆందోళన. బ్రెయిన్ క్యాన్సర్‌ను 400 శాతం పెంచుతుందంటే.. సెల్‌ఫోన్ తెచ్చిపెట్టే ముప్పును ఊహించవచ్చు.

క్యాన్సర్ అత్యంత ప్రాణాంతక వ్యాధి. బ్రెయిన్ క్యాన్సర్ కూడా అంతే. ఎర్లీస్టేజ్‌లో గుర్తించకపోతే.. ఇక ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మెదడులో కణుతులు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. సెల్ వాడకం ఎక్కువైతే.. బ్రెయిన్‌లో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటాయి. అందుకే.. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని ఎన్నో పరిశోధనలు కూడా చెప్పాయి. ఇది వాస్తవమా.. కాదా అన్నది తేల్చడానికే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏకంగా 400 శాతం ఎక్కువని తేలడంతో.. సెల్ వినియోగంపై అంతా దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. సెల్లే కదా అని ఈ విషయాన్ని సిల్లీగా తీసుకుంటే మాత్రం.. మీ లైఫ్‌కు గ్యారెంటీ ఉండదు. సెల్ వినియోగదారులూ... తస్మాత్ జాగ్రత్త.

ఎన్నో సమస్యలు

రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టడం లేదా...? ఎంత ట్రై చేసినా కళ్లు మూతపడడం లేదా..? మనిషి జీవితంలో నిద్రకు చాలా ప్రాధాన్యం ఉంది. ఉదయమంతా అలసిపోయిన శరీరం పూర్తిగా విశ్రాంతి తీసుకొని, కొత్త శక్తిని సంపాదించుకొనేది నిద్రపోయే సమయంలోనే. కానీ.. ఎంతో అవసరమైన ఈ నిద్రే ఇప్పుడు చాలామందికి సమస్య. నిద్రలేమితో రాత్రుళ్లు నెట్టుకొస్తున్నవాళ్లు ఎంతోమంది. అర్థరాత్రి దాటినా వారికి కునుకుపట్టదు.. ఫలితం.. పగలు పూర్తిస్థాయిలో పనిచేయలేరు. అంతా చికాకుగా ఉంటుంది.

దీనికి కారణం.. సెల్‌ఫోన్ వాడకం. నిద్రలేమితో బాధపడుతున్నవారిలో నూటికి డెబ్బై శాతం మంది సెల్‌బాధితులే. మొబైల్‌లో కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయేవారినే ఈ సమస్య ఎక్కువగా వేధిస్తోంది. బెడ్ ఎక్కిన తర్వాత సెల్‌ను వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారికేసరిగ్గా నిద్రపట్టడం లేదని కేంద్రం నియమించిన కమిటీ తన రిపోర్ట్‌లో పేర్కొంది..
సెల్‌ఎక్కువగా వాడితే వచ్చే మరో సమస్య తలనొప్పి. మొబైల్‌ను విపరీతంగా వాడేవారిలో తరచూ కనిపించే సమస్య ఇది. సెల్‌ఫోన్ కారణంగా తలలో జరిగే మార్పులే దీనికి కారణం. మొబైల్ ఫోన్‌ను చెవికి అతికించేసుకుని మాట్లాడేవారూ మనమధ్య తరచూ కనిపిస్తుంటారు. వారికి సెల్లే లోకం. అలాంటి వారిని చెవి సమస్యలు చుట్టుముడతాయి. చెవిలో ఏవో శబ్దాలు మారుమోగుతున్నట్లు అనిపిస్తుంది. క్రమంగా వినికిడిశక్తి తగ్గిపోతుంది. నాలుగేళ్లకన్నా ఎక్కువకాలం సెల్‌ఫోన్ వాడుతున్నవారిలో చెవి సంబంధ వ్యాధులు ఎక్కువగా బయటపడుతున్నట్లు ఎన్నో పరిశోధనల్లో తేలింది.
సెల్‌తో మాటలు కలుస్తున్నాయేమో గానీ, మనశ్సాంతి మాత్రం కరువవుతోంది. సెల్‌వాడకంతో ఒత్తిడి పెరుగుతుంది. సెల్‌ఫోన్ రేడియేషన్‌పై ప్రభుత్వానికి కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. ఏకాగ్రత తగ్గిపోవడం, విసుగు, అరుగుదల లోపించడం, చర్మ సంబంధిత వ్యాధులు రావడం, శరీరంపై ట్యూమర్లు రావడం, మగతగా ఉండడం.. మతిమరుపు పెరగడం లాంటి ఎన్నో సమస్యలు సెల్‌కారణంగా వస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి లక్షణాలు మీలోనూ కనిపిస్తే.. మీరు చేయాల్సిందల్లా.. వేలాదిరూపాయలు పోసి ట్రీట్‌మెట్ తీసుకోవడం కాదు... సింపుల్‌గా సెల్‌ను పక్కన పెట్టేయడం.

మగాళ్లకూ ముప్పే

సెల్‌ఫోన్‌తో మగాళ్లకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. ప్యాంట్ జేబుల్లో సెల్ పెట్టుకుంటే ప్రమాదంలో పడ్డట్లే అని హెచ్చరిస్తున్నారు ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిశోధకులు. సంతానోత్పత్తికి కీలకమైన వీర్యకణాల సంఖ్య ఈ సెల్‌ఫోన్ వల్ల తగ్గిపోతున్నాయన్నది జెఎన్‌యూ పరిశోధకులు తేల్చిన విషయం.
మగ ఎలుకలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయాన్ని జెఎన్‌యూ స్కాలర్స్ కనిపెట్టారు. సెల్‌ఫోన్ వెలువరిచే రేడియేషన్‌కు ఈ ఎలుకలను గురిచేసినప్పుడు వాటిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా స్పెర్మ్ సెల్స్‌లోని డీఎన్‌ఏ విచ్చిన్నం కావడాన్ని వీరు గుర్తించారు. దీని వల్ల వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందన్నది వారి అంచనా. ఇదే ఎఫెక్ట్ మనుషులపైనా ఉంటుందని జెఎన్‌యూ పరిశోధకులు చెబుతున్నారు. అందుకే, సెల్ వినియోగించేవిషయంలో మగాళ్లు చాలా జాగ్ర్తత్తగా ఉండాలంటున్నారు. వీలైనంతవరకూ ప్యాంట్ జేబులో సెల్ పెట్టుకోకూడదంటున్నారు..

పిల్లలకు ఫోనొద్దు
మహిళలకూ సెల్‌తో ప్రమాదమే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు మరీ ప్రమాదం. గర్భం దాల్చిన తర్వాత ఫోన్‌ను ఎక్కువగా వాడితే.. కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. కొన్ని అవయవాలు సరిగా ఎదకపోవచ్చు. ఇక చిన్నపిల్లలను మొబైల్‌ఫోన్‌కు వీలైనంత దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎదిగే వయస్సులో మొబైల్ వాడడం వల్ల రేడియేషన్ ప్రభావం వారిపై చాలా ఎక్కువగా పడుతుంది.
మొబైల్ ఫోన్లు మాత్రమే కాదు.. సెల్ టవర్లు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. కొన్ని నిమిషాలు గంటలు మాత్రమే వినియోగించే ఫోన్ వల్లే ఇన్ని సమస్యలున్నప్పుడు.. 24గంటలూ రేడియేషన్‌ను వెలువరిచే సెల్‌టవర్ల వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి. టవర్‌కు సమీపంలో ఉండేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని ఎన్నో రిపోర్ట్స్‌లో బయటపడింది. ఈ ప్రాంతాల్లో ఉండేవారికి చర్మసంబంధ వ్యాధులూ ఎక్కువగా వస్తాయి. ఏవైనా వ్యాధులు వస్తే.. అవి తగ్గడమూ చాలా ఆలస్యమవుతుంది. ఇలా ఏ రకంగా చూసినా.. సెల్‌ద్వారా.. సెల్ టవర్ల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడాల్సిందే.


శరీరం ఛిద్రం

అమెరికా నుంచి ఫోన్ చేసినా.. అరక్షణంలోనే మనకు ఫోన్ వచ్సేస్తుంది. మనం మాట్లాడేది వెంటనే అవతలివైపు చేరిపోతుంది. ఇంత వేగంగా ఎలా వెళ్లగలుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? దానికి కారణం.. సెల్ సిగ్నల్స్ వెళ్లే వేగమే.. సెకనుకు లక్షమైళ్ల వేగంతో ఈ సిగ్నల్ పాస్ అవుతుంటాయి. ఇదే రేడియేషన్. గామారేస్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్, ఆల్ఫా ఆర్టికల్స్ లాంటివి ఇందులో భాగంగా ఉంటాయి. ఇవన్నీ కలగలిసి... దూసుకుపోతుంటాయి. మన శరీరాల్లోనుంచి కూడా ఇవి చొచ్చుకుపోతాయి. అంతవేగంతో ఇవి ప్రయాణిస్తూ.. మన శరీరంలోని కణాలను అవి ఢీకొడితే.. ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి... అందుకే శరీరంలో కణజాలం దెబ్బతింటుంది.
మనం ఉపయోగించే ప్రతీ ఎలక్ట్రానిక్ పరికరమూ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. మైక్రోవేవ్ ఓవెన్‌, రేడియో, సెల్‌ఫోన్, టెలివిజన్ ఇలా ప్రతీదీ ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్‌ను విడుదల చేయవడం వల్లే అవి మనకు ఉపయోగపడుతున్నాయి. ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్‌లో ఈ రేడియేషన్ పాస్ అవుతుంది.
సెల్‌ఫోన్‌ను వాడుతున్నప్పుడు కూడా... ఈ రేడియేషన్ ఎక్కువగా విడుదల అవుతుంది. మొబైల్‌ను మనం చెవికి ఆనించి ఉంచుతాం కాబట్టి.. ఆ రేడియేషన్ ఎఫెక్ట్.. మన తలపై ఎక్కువగా పడుతుంది. దాని కారణంగా మెదడులో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయి. సున్నితమైన మెదడు.. ఈ రేడియేషన్ ఎక్కువగా ప్రభావితం అవుతుంది.
రేడియేషన్ కారణంగా మన శరీరంలోని రక్త కణాల్లో ఎలాంటి మార్పులు వస్తాయన్నదానిపై పరిశోధన జరిగింది.రేడియేషన్ లేనప్పుడు.. రక్తకణాలు విడివిడిగా ఉంటాయి. అదే లో రేడియేషన్‌కు గురిచేసినప్పుడు ఈ కణాలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. కొన్ని విడిగా ఉన్నాయి. అదే కంప్యూటర్ ముందు గంటకు పైగా గడిపినప్పుడు ఈ రక్తకణాలు మరికాస్త దగ్గరకు జరిగాయి. అదే పది నిమిషాల పాటే సెల్‌పోన్‌లో మాట్లాడితే ఆ రక్తకణాలు కుచించుకుపోయాయి. ఈ తరహా రక్తకణాల అమరిక.. సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లలోనే కనిపిస్తుంటుంది. అందుకే.. సెల్ వాడుతున్నవారికి క్యాన్సర్ సోకే అవకాశాలు ఎక్కువవుతున్నాయి.

తస్మాత్ జాగ్రత్త!

మీ సెల్ మీకు హెల్ చూపించకూడదనుకుంటే.. మొదటి అడుగు నుంచే జాగ్రత్త పడాలి. సెల్‌ఫోన్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మొబైల్.. రేడియేషన్ ఎంత విడుదల చేస్తుందన్నవిషయాన్ని ప్రతీ కంపెనీ తప్పనిసరిగా మ్యాన్యువల్‌లో పేర్కొనాలి. దీన్నే స్పెసిఫిక్ అబ్సార్పషన్ రేట్.. SAR అంటారు. మన దేశంలో దీని మాగ్జిమమ్ లిమిట్ 2 వాట్ పర్ కేజీ. ఓ రకంగా ఇది కూడా ప్రమాదకరమైన స్థాయే. SAR వాల్యూ 2 వాట్ ఉంటే హైరేడియేషన్‌ను ఆ ఫోన్ వెలువరుస్తుందని అర్థం. అందుకే... అంతకన్నా తక్కువగా ఉన్న ఫోన్లలో కొనుగోలు చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కూడా ఈ SAR విలువపై కీలకమైన సలహాను ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న 2 వాట్‌ను.. 1.6 వాట్‌కు తగ్గించాలని సూచించింది. ఇక రేడియేషన్ తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో ముఖ్యంగా స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న చోట నుంచి మొబైల్ టవర్లను తొలగించడంతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయకూడదని సూచించింది. సెల్ వినియోగం పెరగడంపైనా ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. సెల్ వాడుతున్నవారు.. అత్యవసరానికి మాత్రమే ఫోన్‌ను వాడాలే తప్ప.. అనవసరంగా వాడితే ఆరోగ్యసమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.
ఇప్పటికే దేశంలో దాదాపు మూడున్నర లక్షల సెల్‌టవర్లు ఉన్నట్లు అంచనా. ప్రతీ కంపెనీ దేనికదే సెల్‌టవర్లను ఏర్పాటు చేసుకొంటోంది. అయినా.. చాలాప్రాంతాల్లో ఇప్పటికీ సిగ్నల్స్ అందవు. అందుకే.. టవర్ల సంఖ్య పెరగుతూనే ఉంది. పైగా కొత్త కంపెనీలు రావడంతో ఈ టవర్లు విచ్చలవిడిగా జనం మధ్య కొలువుతీరవచ్చు. అంటే ఓ రకంగా మరింత రేడియేషన్‌ మనపై దాడిచేయబోతుందన్నమాట. ఈ విషయంలోనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అన్ని కంపెనీలు ఒకేటవర్‌ను వాడుకునేలా నిబంధనలు మార్చాలి. అప్పుడు రేడియేషన్ ప్రభావం కాస్త తగ్గొచ్చు. అంతే తప్ప.. జనం మధ్య టవర్లే లేకుండా చేస్తే.. సెల్ మూగబోతుంది. జనానికి పిచ్చెక్కుతుంది.
మొబైల్ వాడే వారూ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా ఫోన్‌ను చెవికి ఆనించడం కన్నా, ఇయర్ ఫోన్స్ వాడడం మేలు. కాల్ చేసేటప్పుడు శరీరానికి కనీసం ఒక ఇంచ్ దూరంలో ఫోన్‌ను పెట్టడం వల్ల రేడియేషన్ నేరుగా శరీరంలోకి చొచ్చుకుపోదు. ఒకవేళ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడాల్సి వచ్చినప్పుడు.. చెవి వేడెక్కితే వెంటనే కాల్‌ను ఎండ్ చేయాలి. వీలైనంతవరకూ తక్కువ మాట్లాడడం వల్ల రేడియేషన్‌కు గురికాకుండా ఉండొచ్చు.

వెర్రి పరుగు

దేని వెంటో పరుగు
ఎండమావిని అందుకోవాలని ఆరాటం
ఈ పరుగు పందెంలో
మనిషి ఎంత అలసిపోతున్నాడు
ఎంత కోల్పోతున్నాడు
సుఖాన్ని,శాంతిని
సంతోషాన్ని,సంబరాన్ని
గుండె నిండా అనుభవించలేని
అసంకల్పిత పరుగు
ఆగి ఆయాసం తీర్చుకునే
తీరికలేని పరుగు
చుట్టూ పరుచుకున్న అద్భుతాల్ని
చిన్న ఆనందాల్ని
తోసిరాజని పరుగే పరుగు
ఇంధ్ర ధనుస్సు ఎదురొచ్చినా
తలెత్తి చూడకుండానే
వాన చినుకులు కురుస్తున్నా పట్టించుకోకుండానే
ఉరుము ఉరిమినా
మెరుపు మెరిసినా
ఆకాశంలో విద్యుల్లతలు విరగ పూసినా
నా కోసం కాదులే
నాకవసరం లేదులే
అంతా నిర్లిప్తత,నిరాసక్తత
ప్రక్రుతిలో మమేకం కాలేకఫొవడం
మనిషి చేస్తున్న మహా తప్పు

అదొక మానసిక స్థితి

సంతోషాన్ని నిర్వచించగలమా
ఆనందానికి అర్ధం చెప్పగలమా
అదొక మానసిక స్థితి
ఈ మానసిక స్థితి శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పరవశంలో పొంగి పొర్లుతున్న మనసు
ముఖంలోనే కాదు
మొత్తం శరీరంలో ప్రతిఫలించడం
ఎవరైనా ఎపుడైనా చూసారా
పాపికొండల పారవశ్యం ఒకవేపు
గోదారమ్మ గలగలలు మరోవైపు
నీ స్నేహ మాధుర్యం మరోవైపు
ముప్పేటలా నన్ను ముంచెత్తిన వేళ
నా ముఖంలో వెయ్యి మతాబుల కాంతి
వెలుతురు విరజిమ్మతున్న పరిసరాల్లో
నిన్ను చుట్టుకున్న చేతుల్లో
పూసిన కాంతి పుంజరాలు
సంతోషాన్ని మనస్సే కాదు
శరీరం కూడా వ్యక్తం చేస్తుందని
ప్రక్రుతి పచ్చదనమే కాదు
ప్రియ నెచ్చలి వెచ్చని స్పర్శ కూడా
ఒళ్ళంతా విద్యుత్తరంగాలు పుట్టిస్తుందని
మన చాయాచిత్రం చూసాకే అర్ధమైంది.

కొత్తగా పునర్నిర్మాణం అంటున్నాడు

అమాత్య పదవి రాలేదని
వేర్పాటు వాద సిద్దాంతం తో పుట్టిన పార్టీని
కూడా జాతీయ స్థాయి పార్టీ
కాదు కాదు అవినీతిలో అంతర్జాతీయ స్థాయి కి
కృషి చేస్తున్న పార్టీలోకి
కలుపు కొంటామని
ఆ పార్టీ వాళ్ళు చెబుతుంటే
వేర్పాటు నాయకుడు ఖండిస్తూ
రాష్ట్రాన్ని చీల్చడమే కాదు
రెండో ముక్క
పునర్నిర్మాణం లో కూడా
భాగం పంచుకొంటామని చెబుతున్నాడు
అంటే పునర్నిర్మాణం జరిగేలా
పునాదులతో కూడా
ఆంద్ర రాష్ట్ర తిరోగమనం
జరిగే వరకు గమ్మున ఉండే
ప్రసక్తే లేదని ప్రస్పుటం చేస్తున్నాడు.

రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని పాపులర్ డైలాగు

రెండున్నర ఏళ్ల రీళ్ళను
వెనక్కు తిప్పితే

వెంకన్న సాక్షిగా
ఆయన పాదాల చెంత
సామాజిక న్యాయం
ప్రజా రాజ్యం తో సాధ్యం అని పొలికేక పెట్టే డైలాగుతో
షాట్ మొదలయ్యింది

అందరూ అంచనా వేసినట్టే
హీరో అవినీతి సామ్రాట్టులకు మళ్ళీ
అధికారం అందించడంలో
విజేతగా నిలిచే సన్నివేశాలు చిత్రీకరించి

ఇక జెండా పీకేద్దాం అని గుస గుసలు పోయినప్పుడు
గుస్సా అయి అంతెత్తున లేచి
జనం గుండెల్లో నుండి తీసేసేదెవరు అని
తీక్షణంగా ప్రశ్నించే సన్నివేశాన్ని బాగా పండించి

మరో షాట్ లో
నేనే పోయినా
పార్టీ ఉంటుందని ఉద్ఘాటించే సన్నివేశంలో
ఉద్విగ్నత ను చూపి

నూట ఏభయ్యో సినిమా కథ కోసం
వెతుకుతున్నానంటూ
అభిమానులకు ఎన్నో ఆశలు కల్పించే
మరో సన్నివేశంతో
కథలో కీలక మలుపు తిప్పి

రెండున్నర ఏళ్ల రీళ్లకు
హస్తినలో దహన సంస్కారాలు చేసే సన్నివేశంతో
షాటు మొదలెట్టి
దానికి దర్శకురాలిగా
విదేశీ పరిజ్ఞానంతో
స్వదేశీలో రెచ్చిపోతున్న
సోనియా గాంధీని ఎన్నుకొని
కొత్త సినిమాను మొదలెట్టాడు

ఆంటోనీ కథా చర్చలు గావిస్తే
పటేల్ రాసిన మాటలతో
మొయిలీ క్లాప్ తో
రెండున్నర ఏళ్ళు తీసి తగలెట్టిన రీళ్ళలోని
పాపులర్ డైలాగు ‘సామాజిక న్యాయాన్ని సాధించడానికి’ అంటూ
హీరో కొత్తగా చెప్పడాన్ని
డీ ఎస్ కిరణ్ కేరింతల మధ్య
దర్శకురాలి దగ్గర చాన్స్ రాని
మరో హీరో ఫ్యాన్సు కుత కుతల మధ్య
అద్బుతంగా ప్రారంభమయ్యింది

వెర్రి బాగుల వాడు

వెనకటికి మా ఊరిలో ఒక సామెత ఉండేది. ఎందుకూ పనికి రాని ఒక వెర్రి బాగుల వాడిని, ఒరేయ్ నీకు పొలం ఎంత ఉందిరా అని అడిగితే, రాజు గారిదీ నాదీ కలిపి నూటఒక్క ఎకరాలు అని చెప్పుకొనేవాడంట. ఇంతకీ అందులో నీది ఎంతరా అని గుచ్చి అడిగితే మాత్రం సిగ్గు పడుతూ ఒక ఎకరం నాది, వంద ఎకరాలు రాజు గరివీ అని ఒప్పుకొనేవాడంట.
కొత్త గా సోనియమ్మ జపం చేస్తున్న మన వెర్రి బాగుల వాడు కూడా, ఇప్పుడు నావీ కాంగ్రెస్ వీ కలిపి నూటా డబ్బయ్యి స్థానాలు అని చెప్పుకొంటున్నాడూ. కలిపి సరే, నీవి సొంతం గా ఎన్ని అని ఎవరన్నా పొరుగు రాష్ట్రం వారు అడిగితే మాత్రం వెకిలి గా నవ్వుతూ పద్దెనిమిదిలో రెండు పోగా పదహారు అని చెప్తున్నాడు. ఇలాంటి సిగ్గులేని మనుషులు పుడతారని ముందే ఊహించి కాబోలు మన పెద్దలు అలాంటి సామెతలు సృష్టించారు.

తిరుపతి లో హోటెల్ గదిని ఏదో దొంగల స్తావారాన్ని వెతికినట్టు వెతికించినది ఈ కాంగ్రెస్ వారే అన్నది గుర్తుందో లేదో ఈ కొత్త బిచ్చగానికి.