4, నవంబర్ 2011, శుక్రవారం

చరిత్రను పునరావృత్తం చేయవచ్చు

చైతన్యం వస్తోంది
చదువు సంధ్యలు ఎక్కువ అయ్యాయి
కలిసి ఉంటే కష్టం
మిగిలిన ప్రదేశాల్లో లా
మన దగ్గర ఎందుకు అభివృద్ధి జరగలేదని
నిలదీస్తారు

విడదీస్తే
మళ్ళీ మనమే బాంచన్ దొర అని చెప్పించుకొంటూ క్రింది చరిత్రను పునరావృత్తం చేయవచ్చు.

“చెరువుల్లో నీరు మొదట భూస్వాముల పొలాలు సాగు అయిన తరువాతనే ఇతర రైతులు తీసుకోవాలి. వ్యవసాయ కూలీలు మొదట భూ స్వాముల నాట్లు వేసిన తరువాతే ఇతరులవి వేయాలి. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ ముందు చాకలి వారు నిత్యం నూరు బిందెల సానిపి చల్లాలి. వారి దున్నపోతులకు క్షురకులు క్షవరాలు చేయాలి. కచ్చడాల ముందు ఉరకాలి. మూటలు మోయాలి. పక్కలు వేయాలి. పచ్చి బాలింతలను కూడా పాలు పిండి చూపితే తప్ప పనుల నుండి వదిలేవారు కాదు. గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు, జాగీరు ఉద్యోగులు వచ్చినప్పుడు ఆ గ్రామంలోని చిల్లర దుకాణదారులు అధికారులకు కావలిసిన సన్న బియ్యం, మాలు, మసాలా, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, సబ్బులు తదితర వస్తు సామాగ్రినంతా ఉచితంగా సరఫరా చేయాలి. గొర్రెలు, మేకలు, కల్లు, కోళ్ళు, పందులు, చేతివృత్తుల ఉత్పత్తులతో సహా బలవంతంగా అధికారులు గుంజుకునేవాళ్ళు. ఈ విధంగా జనాన్ని బానిసల కన్నా హీనంగా చూసేవారు. ఈ బాధలు భరించలేక ఎవరైనా ఎదిరించినా, నిలదీసినా సహించేవారు కాదు. వారిని నిర్బంధించి క్రూరంగా హింసించేవారు. హత్య చేసి తమ గడీలలోనే పాతిపెట్టేసేవారు”.

చచ్చే వరకు ఎదురు చూస్తున్నా కొడుకు

చచ్చే వరకు
సంపాదనపై చర్చ పెట్టక
ఎదుటోళ్ళ పై రచ్చ చేస్తూ
కొడుక్కోసం మడమ తిప్పలేదు
నాన్న

ప్రతిపక్షానికి ప్రతిపక్షమై
నాన్న కోసం బొంతపడిన వారంటూ
అంతులేని ఓదార్పు
మడమ తిప్పకుండా చేస్తూ
‘చెయ్యి’ ఎప్పుడు కలుగులోకి తోసి
బొచ్చ చేతికి ఇస్తుందో నని
ఎదురు చూస్తున్నాడు
కొడుకు

ఈ రోజు దొడ్డి దారిలో సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?

నాన్న జమానాలో
వాయు వేగంతో వ్యాపారవేత్త అయిపోయి
నాన్న పోతూనే
అదే వేగంతో పాలక పగ్గాలు కావాలని
వేసిన పాచికలు పారక
తిరగబడితే

పరిస్థితులు ఎదురు తిరగబడి
వాయు వేగపు సంపాదనలో
ముద్దాయిగా ఆరోపణలు ముసురుకొని
దానిపై విచారణ ఒకింత నెమ్మదిగా పోతోంది

ఇంకో ఘనుల గాలి వాటపు సంపాదనలోని
వాటా లు
ఈ వాయు వేగపు సంపాదనకు
తోడయ్యాయేమో
అనే అనుమానంతో పిలిపిస్తే
లేదు నన్ను పిలిచింది సాక్షిగా నే
అని సంబరపడిపోవడం చూస్తుంటే
చిన్నపిల్లాడి మనస్తత్వం గోచరిస్తోంది

అక్కడ అడిగిన ప్రశ్నలు ఏవో చెప్పక
నాన్న ఇచ్చిన సహకారంతో
రెచ్చిపోయి మరో కేసు విషయమై బోనులో ఉన్న
కోనేరు కు మొదటి స్నేహితుడు
బాబే ఆయననూ పిలవండి పేరంటానికి అని
పెంకి దాడులు మొదలెట్టడం విచిత్రమే

ఒక వేళ బాబు తన జమానాలో పిలిచినా
తరువాత ప్రభువుగా ఉన్న నాన్న
నానా గడ్డి కరుస్తున్న కోనేరు ను ఆపక
ఆయన వేసిన గడ్డిని తిన్నాడా?
అనే విషయం పై సాక్షికి నోరు పెగలదు ఎందుకో?
ఎదుటోడికి నైతిక విలువలు చెప్పే ముందు
తను ఏ తానులో ఉన్నాడో రుజువు చేసుకోవాలి కదా?

మాట్టాడితే మడమ తిప్పను అని
మతిలేని మాటలు చెబుతారు
ఈ రోజు దొడ్డి దారిలో
సాక్షిగా ఎందుకు పోవాల్సి వచ్చింది?