23, ఫిబ్రవరి 2011, బుధవారం

స్వతంత్ర భారత దేశాన్ని . . . . . . . . . .

నేత్తురోడ్చి, ఆత్మార్పణకావించుకుని ఎందరో వీరులు మనకు అందించినా ఈ స్వతంత్ర భారత దేశాన్ని ఎలాంటి నాయకులకు అందిస్తున్నాం!!

ప్రజారంజకమైన, సామాన్యులకి చేయుత నిచ్చే పధకాలు ప్రవేశపెట్టడం, వాటిని సక్రమంగా అమలు చేసేలా చూడటం.. ప్రజా సమస్యలు గురించి చ...ర్చించడం
నల్లధనాన్ని భారతదేశానికీ తిరిగి రప్పిచ్చడం, దానిని విద్య,వైద్యం, అన్ని మౌలిక అవసరాలకు, వెనకపడిన ప్రాంతాల అభివృద్ధికి వినియోగపడేలా చేయటం
ఇవి మీ నుండి అసిస్తున్నవి
ఒకరినొకరు తిట్టుకుంటూ అడ్డుగోలుగా సంపాదిస్తూ తన మీదకి కత్తి వచ్చినపుడు కుల,మత,ప్రాంతాలని అడుపెట్టుకుంటూ Divide and Rule అనుకునే నిచమైన రాజకీయవాదులు
..మసాల వార్తలే వ్యాపరమనుకునే మీడియా... అంత ప్రజలు గమనిస్తూనే వున్నారు.
గొప్ప ఉద్యమాలను స్వప్రయోజనాలకి వాడుతూ అమయుకులని బలి చేస్తూ పోతే మీకే ఘోరి కట్టగలరు

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు.
హైరరాబాద్ ఎవరిది అన్న వాదనకి చరిత్ర నుండి సాక్ష్యాలు
===============================
హైదరాబాదు కట్టి 400 ఏళ్ళు దాటింది అంటే సుమారు 1600 లలో
1600-1788 వరకూ నిజాం పాలన లో ఉన్న సర్కార్ జిల్లాల (కోస్తా ఆంధ...్ర జిల్లాలు) ప్రజలు.
1600-1800 వరకూ నిజాం పాలన లో ఉన్న దత్తమండలాల (రాయలసీమ జిల్లాలు) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న మరట్వాడ (మహారాష్ట్ర మరట్వాడా జిల్లాల) ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న 4 కర్నాటక జిల్లాల ప్రజలు
1600-1948 వరకూ నిజాం పాలన లో ఉన్న తెలంగాణా జిల్లాల ప్రజలు
1948-1956 వరకూ భారత హైదరాబాదు ప్రావిడెన్సు ప్రజలు
1956-2011 వరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు
వీళ్ళ అందరి డబ్బులూ ఉన్నాయి
1800-1948 వరకూ హైదరాబాద్ సంస్థాన సైనిక సాయంకోసం సర్కారు (కోస్తా ఆంధ్ర జిల్లాలు), దత్తమండలం(రాయలసీమ జిల్లాలు) ప్రాంతాలని బ్రిటిష్ వాళ్లకి అమ్మగా వచ్చిన డబ్బులూ ఉన్నాయి. ఈ డబ్బు ను హైదరాబ్ అభివృద్దికి వాడారు. హైదరాబాద్ ప్రతి ఇటుకలో ప్రతి ఆంధ్రుడి ముత్తాతల దగ్గర నుండి ఈ తరం వరకు ఉన్న వాళ్ళ సొమ్ము ఉంది.

హైదరాబాదు అందరిదీ, ఎవరి అబ్బ సొమ్మూ కాదు. తెలంగాణా వాళ్ళ అబ్బ సొత్తు అసలే కాదు, హైదరాబాద్ కావాలనుకుంటే కలిసిఉండాలి లేకపోతే శుభం.

ప్రతిరోజూ ఒక మంచిమాట

నాలుక కత్తిలాంటిది, ఎలాంటి రక్తపాతం లేకుండానే ఇది మనుషులను చంపివేయగలదు.



పక్షులు పాదాల కారణంగా చిక్కుల్లో పడితే , మనుషులు నాలుకలు కారణంగా చిక్కుల్లో పడతారు.



పగ తీర్చుకుంటే ఆరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం కలిగే ఆనందాన్ని బలిపెట్టకూడదు.

ఓ యువకా మేలుకో, పుట్టుకతో వృద్ధుణ్ణి కానని చాటుకో

"వెళ్ళండి, దేశంలో ఎక్కడెక్కడ కరువు కాటకాలు సంభవించి దారిద్య్రం తాండవిస్తుందో, ఎక్కడైతే ప్రజలు కష్టాలు కన్నీళ్లతో బాధపడుతున్నారో మీరందరూ ఆయా చోట్లకు వెళ్ళండి. వాళ్ళకు చేయి అందించండి. కష్టాలను ఉపశమింపజేయండి. వారలనాదుకునేందుకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడండి. మహా అయితే ఆ ప్రయత్నంలో మరణించవచ్చు. చావు ఎప్పటికైనా తప్పదు. ప్రజలకు సేవ చేసే కర్తవ్యంలో చావడాన్ని మహదావకాశంగా స్వీకరించండి. భావితరాలకు ఆదర్శంగా నిలవండి. ఈ దేశ భవిష్యత్తు గురించిన ఆశలన్నీ యువకులైన మీపైనే ఉంచుతున్నాను" ఈ మాటలన్నదెవరో కాదు. నిరంతరం ప్రజల కోసం పరితపించిన మహా తాత్వికుడు స్వామి వివేకానందుడు.


ఈ గమనంలో యువకులదే ప్రధాన పాత్రగా ఉండాలని పూర్వపు నాయకులందరూ కాంక్షించారు. వివేకానందుడుకూడా ఒక దేశపు ఉన్నతి యువతపైనే ఆధారపడియుందని (What we want is muscles of iron and nerves of steel....& Arise, Awake and Stop not till the goal is reached....etc) బోధించాడు

ఆహార భద్రత అంటే చాలీ చాలని సరుకుల్ని తక్కువ రేట్లకు పంచి పేదరికాన్ని మరింత పెంచడమూ, పేదల్ని అవమానించడమా? రైతు భద్రతతో కూడిన ఉత్పాదన, నిల్వలు, పేదల కొనుగోలు శక్తీ పెంచడమా?

ఐరాస రూపొందించిన మానవాభివృద్ధి సూచికలో మన దేశం భూటాన్, లావోస్‌కన్నా వెనుకబడి ఉన్నది. కాని ఇదే దేశంలో ఫోర్బ్స్ పత్రిక జాబితాకెక్కిన 49 మంది శతకోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది ప్రభుత్వ సంపదను ఉచితంగా అందుకున్నవారే. నిజానికి డబ్బు కొరత మన దేశానికి లేనేలేదు. ప్రస్తుత బిల్లుకు ఆహార భద్రత అని పేరు పెట్టామే కాని 'ఆహార హక్కు' అనలేదు.
"ప్రతిరంగంలోనూ చైనాను అధిగమించడమే మన టార్గెట్" అంటూ ఆడంభరంగా చెప్పుకునే మన నేతలు (వాస్థవానికి అత్యంత జనాభాగల దేశంగా తప్ప మరే విషయంలోనూ ఇప్పట్లో మనకది సాధ్యం కాదు) అదే చైనా జూన్ 1, 2009 నుండే "ఆహార భద్రతా చట్టాన్ని" అమలు చెయ్యడమేకాకుండా ఇప్పుడు దాన్ని మరింత మెరుగు పరిచి నాణ్యమైన "నూతన ఆహార భద్రతా ప్రమాణాల వ్యవస్థను" రూపొందించేందుకు ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి కృషి చేస్తోంది" అనే విషయం తెలియదనుకోవాలా?
ఆహార భద్రత అనే ఓపేరుగొప్ప కార్యక్రమం చేపట్టి తామేదో పేదల్ని ఉద్ధరించబోతున్నట్లు, ప్రపంచంలో ఇంతవరకు ఎవడూ పొడవనిది తామే ప్రధమంగా పొడవబోతున్నట్లు మొన్నటి కాంగ్రేసు ప్లీనరీలో "ఆహారాన్ని ఓ హక్కుగా ప్రజలకు అందించే దేశం ప్రపంచంలో మరొకటి ఉంటుందా?" అంటూ గడసరిగా ఆశ్చర్యాన్ని ప్రకటించి జనాల చెవుల్లో పబ్లిగ్గా పువ్వులు పెట్టాలని చూసిన ప్రణబ్ ముఖర్జీ గారికీ, వారి సోనియమ్మకూ ఈ విషయం తెలియదనుకోవాలా?? దాదాపు 22 దేశాలు ఆహార హక్కును అమలు చేస్తున్నాయి. ఉదాహరణకు ఆహార హక్కును బ్రెజిల్ రాజ్యాంగం స్పష్టంగా గుర్తించింది. గత ఏడాది ఫిబ్రవరి 3న అక్కడి ఉభయ సభలూ బిల్లును ఆమోదించాక బ్రెజిల్లో రాజ్యాంగ సవరణను ఆమోదించారు. ఇప్పుడు అక్కడ ఆహార హక్కు రాజ్యాంగపరమైన మానవ హక్కుగా ఏర్పడింది. అదే విధంగా తగినంత ఆహారాన్ని పొందే హక్కును గౌరవించి, రక్షించి, నెరవేర్చాలనే స్పష్టమైన బాధ్యతను రాజ్యానికి కల్పించే అంతర్జాతీయ మానవహక్కుల చట్టాలపై కూడా బ్రెజిల్ సంతకాలు చేసి, ఆమోదించింది.

ఆమధ్య అమెరికా ప్రెసిడెంటెవడో ఇండియాలో పేదలక్కూడా బలవబట్టే (సంపాదన పెరగడమట!)& తెగతింటుండడంవల్లే ప్రపంచంలో ఆహార నిల్వలు తరిగిపోతున్నాయన్నప్పుడు మన నేతలు తెగ గింజుకున్నారు.
ఇప్పుడు మన ఘనతవహించిన యూపీయే పాలక ప్రభువులూ దాదాపు అదేవాగుడు మరోలా వాగారు.
ద్రవ్యోల్భణ కట్టడికై గురువారం నాడు ఉన్నతస్థాయి జుట్టుపీక్కొనే సమావేశంలో "వేగవంతమైన అభివృద్ధివల్ల(??) పేదల చేతుల్లోకూడా డబ్బులు ఉంటున్నాయనీ (ఇంకా నయం పేదలుకూడా డబ్బులెక్కువై స్విస్సు బ్యాంకుల్లో దాచుకుంటున్నారనలేదు!), ఫలితంగా ఆహార వినియోగం పెరిగి దరలు అదుపులో ఉండడంలేదని సూత్రీకరించారు.రోజుకు 11 రూపాయలు సంపాదించేవారు యుపిఎ ప్రభుత్వం దృష్టిలో పేదలు కారట. నిజంగా నేడు 330రూపాయలతో ఒక మనిషి నెలంతా జీవించగలగటమనేది సాధ్యమేనా?

జీవించే హక్కు వాస్తవరూపం దాల్చాలంటే ఆహార హక్కు ప్రాథమికావసరమని మన రాజ్యాంగంలోని 21వ అధికరణం చెబుతోంది. అందరికీ ఆహార భద్రతను హామీ ఇచ్చేందుకు చట్టబద్ధమైన ప్రాతిపదికను అందించే విధంగా జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తామని 2009లో రాష్ట్రపతి పార్లమెంటులో చేసిన ప్రసంగంలో సూచించారు. పేదలకు నిర్దేశిత హక్కులతో ఆహారానికి చట్టబద్ధమైన గ్యారంటీ ఇవ్వడం అనేది దేశంలో ఆహారం, పౌష్టికత భద్రతను హామీ ఇచ్చే దిశలో ఒక ముఖ్యమైన చర్యగా భావించారు.
ఈ కొత్త బిల్లు ప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలకు 25 కిలోల బియ్యం లేదా గోధుమలు కేజీ 3 రూపాయల వంతున సరఫరా చేయాలి. ప్రభుత్వం గుర్తించిన పేద కుటుంబాలకు నిర్దేశించిన విధంగా ఆహార ధాన్యాలు సరఫరా చేయడంలో విఫలమైనట్లయితే ఆ కుటుంబాలు 'ఆహార భద్రతా అలవెన్స్‌' నగదు రూపంలో పొందే అవకాశం ఆహార భద్రతా చట్టం కల్పిస్తోంది.
ప్రస్తుతం అమల్లో ఉన్న లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ(Targeted Public Distribution System or TPDS) దారిద్య్ర రేఖ(బిపిఎల్)కు దిగువన ఉన్న జనాభాకు సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించాల్సి ఉన్నప్పటికీ ఆ వ్యవస్థలో ఉన్న అనేక లోపాలూ, అవినీతి వల్లా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లా ఆ లక్ష్యాలను చేరుకోలేకపోతోంది. బహిరంగ మార్కెట్లో 15 నుండి 20 రూపాయల వరకూ ఉన్న బియ్యాన్ని(రెండో రకం)2రూపాయలకే అందించడంవల్ల చాలామంది పేదలకు ఉపయోగకరంగానే ఉన్నా, ఎందరో అనర్హులు (కొందరు మధ్య, ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెల్ల రేషన్ కార్డులున్నాయి), కొందరు మధ్య తరగతి, పేద వర్గాలవారుకూడా ఈ బియ్యాన్ని మార్కెట్లో 8 నుండి 10రూపాయలకు అమ్ముకుంటున్నారనేది బహిరంగ రహస్యం. దీన్ని అరికట్టడం ప్రభుత్వాలకు చేతకాదని తేలిపోయినందున అంత్యోదయ వర్గాలకుతప్ప మిగతా వర్గాలకు పీడీ్ఎస్ ను పూర్తిగా రద్దుపరచి వారికి నగదు బదిలీ పధకంలాంటివాటిద్వారా సామాజిక రక్షణ కల్పించి వారికి కావలిసిన సరకులేవో వారే (మార్కెట్ ధరలకే) కొనుక్కునేలా చేయడం తద్వారా పీడీ్ఎస్ సరకుల నాణ్యత బాగాలేనందున అవి అమ్ముకొని మంచి బియ్యాన్ని కొనుక్కుంటున్నామనే అపవాదునుండి తప్పుకోవచ్చేమో? అయితే ఇందులోనూ అవే ఇబ్బందులు-అంటే అర్హుల గుర్తింపు, కట్టుదిట్టమైన వ్యవస్థలేకపోవడం వంటివాటివల్ల ఇదికూడా అనర్హుల జేబుల్లోకి చేరడం తద్వారా మరింతమంది సోమరుల్ని తయారు చెయ్యడం జరగొచ్చన్న వాదనలు లేకపోలేదు. అయితే వస్తు సబ్సిడీల ద్వారా అనర్హులకూ లబ్ది చేకూర్చేబదులు బహిరంగ మార్కెట్‌ను ప్రోత్సహించి పేదలకు నగదు సహాయం చెయ్యడమనేది నిజమైన ప్రత్యామ్నాయమని నేను నమ్ముతాను.రైతు సేద్యానికి వాడే ట్రాక్టర్లకిచ్చే డీజిల్ సబ్సిడీ పేరుతో రోల్స్రాయిస్ కార్లలో తిరిగేవాడిక్కూడ సబ్సిడీపై డీజిల్ ఇచ్చే దుష్ట వ్యవస్థను ప్రక్షాలించి గ్రామస్థాయిలో ట్రాక్టర్లుండే రైతన్నలందరికీ నేరుగా డీజిల్ సబ్సిడీ (నగదు ౠపేణా) ఇవ్వండి. ఇదే సూత్రం గ్యాస్ సిలిండర్‌కూ వర్తిస్తుంది. పేదోడికోసమని సిలిండర్ ధర పెంచం. కానీ పెద్దోడు నెలకు ఒకటి వాడితే పేదోడు మూడునాలుగు నెలలకు ఒకటి వాడతాడు. 100లో ఉండే 60మంది ఉండే పేదోళ్ళు సంవత్సరానికి (60X3=180) సిలిండర్లు వాడితే పెద్దోళ్ళు (40X12X1=240) సిలిండర్లు వాడతారు. ఒక్కో సిలిండరుపై పెద్దోళ్ళకు 200 ఎక్కువ వడ్డించి పేదోడికి ఇంకో వంద తగ్గించినా (2400X200-180X100= 10000) ఇంకా 10000 ప్రభుత్వానికి లాభమే:)
దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం తరహాలో స్వయం ప్రతిపత్తి గల కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు/అనర్హులు అవకతవకలకు పాల్పడకుండా అన్ని బిపిఎల్‌ కుటుంబాలకూ ఆహార ధాన్యాలు కేటాయించగలుగుతాయి.

స్వతంత్రతంటే తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!

1) ఓటు కోసమే నోటి మాటలు,
నేటి వరకే ఈ నీటిమూటలు.

ప్రజధనం కొల్లగోట్టే ముఠాదొంగలు,
ప్రజలకేమో చేస్తారు ఒంగిదండాలు.

అతివినయం చూపించే రాబంధులు,
పదవీ నియామకం కోసమేగా ఈ పకడ్బందీలు.

రోజుకోక పుట్టగోడుగులా పార్టీ జెండాలు,
ప్రజాసంపధ కాజేయడామే వారి ఎజెండలు.

పదవి చేతికిప్పించే ప్రజలు అమాయకులు,
పెదవిమాట దాటేసే రాజకీయ నాయకులు.

మార్పుకోసమే ఎదురుచూసే పిచ్చిజనాలు,
ఏనాటికి జరగదదని తెలుసుకోలేరు పచ్చినిజాలు.
2) నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

కులాల చిచ్చులు రేపటం మేము నేర్చుకున్న మానవత్వం,
మనుషులని చంపటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

ఐకమత్యాన్ని ఆచరించకపోవటం మేము నేర్చుకున్న మానవత్వం,
ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటం మేము నేర్చుకున్న మా'నవత్వం'!

మంచిని మరచి వంచన చేయటమే మేము నేర్చుకున్న మానవత్వం,
మా దేశం నేర్పిన పాఠం ఇదే, మా మనుషులు నడిచే బాట ఇదే?!

ప్రేమను మరచి,స్వార్దంతో బతకటమే మాకు తెలిసిన మానవత్వం,
ఇదే మేము నేర్చుకున్న మానవత్వం, మా నవతకు నేర్పుతున్న మా'నవత్వం'?!

3) బ్రతికేద్దాం... బ్రతికేద్దాం...
మనకెందుకులే అని బ్రతికేద్దాం!
మానవతను వదిలేద్దాం.....
బ్రతుకు హీనమైపోతున్నా, భవిత పాడైపోతున్నా,
ప్రజలు చచ్చిపోతున్నా,ప్రగతి పతనమవుతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

రాష్ట్రం రగిలిపోతున్నా, బాంబులు పేలిపోతున్నా
హింస రేగిపోతున్నా, ధరలు మండిపోతున్నా,
బ్రతికేద్దాం... బ్రతికేద్దాం!!

సిగ్గులేక బ్రతుకేద్దాం, గోడమీది పిల్లిలా వ్యవహరిద్దాం,
మార్పు రాలేదని బాధపడదాం, ఎదుటివారి మీద నిందలేద్దాం,
మనం మాత్రం మారక్కర్లేదని సరిపెట్టుకుందాం!

బ్రతికేద్దాం... బ్రతికేద్దాం....
బ్రతుకలేక బ్రతుకీడుస్తూ బ్రతికేద్దాం,
స్వతంత్రమంటే ఏంటో తెలియని స్వాతంత్ర్య బానిసలుగా బ్రతికేద్దాం!!

ప్రభుత్వమునకు మంగళాశాసనము-అథర్వణవేదము- దీనికి మన నాయకులెలా భాష్యం చెబుతున్నారో చూడండి

ఓ ప్రజాపాలకా! నీవు ప్రజలచే ఎన్నుకొనబడిన సత్యమైన పాలకుడవుగా ప్రవర్తింపుము.దివ్యతేజ స్సంపన్నుడవై ప్రకాశింపుము.నీవు ప్రజల ఆపదలను తొలగించి సన్మార్గమున అభీష్టసిద్ధి నందునట్లు నడిపింపుము.నీకు ప్రజలందరు మోకరిల్లి నమస్కరింతురు.దేవతలు అదృశ్యముగ నిన్ను అనుగ్రహింతురు. న్యాయము-దయ నీకు పరమ ధర్మములు.సంపదను ప్రజాహితమునకై వినియోగింపుము.సద్వర్తనమే నీ కీర్తికి బాట. దృఢమైన దయగల పాలకుడుగ పది కాలములు జీవింపుము. అందరితో కీర్తిని పంచుకొని ఆర్జింపుము.ఆనందింపుము. అహంకారము,అధికారమదము నీ దరిచేరకుండుగాక. (అధర్వణ వేదము-3-4-2)

మరి మన నాయకుడు దీనికి తన భాష్యం ఎలా చెబుతున్నాడో చూద్దాం

నేను పేరుకే ప్రజలచే ఎన్నుకోబడ్డాను కానీ నావెనుక అండగా EVMలున్నాయి తెలుసుగా.అక్రమార్క స్సంపన్నుడనై ప్రకాశిస్తా.ప్రజలు ఒకవేళ పొరపాటున సుఖసంతోషాలతో ఉన్నా వారికి లేని ఆపదలను సృష్టించి అంటే వేర్పాటువాదాలు,మతఘర్షణలు లాంటివి కలిగించి ఇబ్బందుల పాలుజేస్తా.సన్మార్గములో నడిచే వాళ్ళను కూడా పెళ్ళికి ముందు అది తప్పుకాదు ఇది తప్పుకాదు అని న్యాయస్థానాలతో తీర్పులిప్పించి వాళ్ళను చెడిపోయేటట్లు తయారుచేస్తా.ప్రజలందరినీ భయకంపితులనుజేసి నాకు మోకరిల్లేటట్లు చేస్తా.సారావ్యాపారాలు చేస్తూ దేవాలయాల ధర్మకర్తగా దేవతలనే ఓ ఆటాడిస్తా.వాళ్ళు చచ్చినట్లు నన్ననుగ్రహించేటట్లు చేసుకుంటా. అన్యాయము-కాఠిన్యము నాకు పరమ ధర్మములు.దేశసంపదను నా కుటుంబహితమునకు మాత్రమే వినియోగిస్తా.దుర్వర్తనమే నా కీర్తికి రాజమార్గం.దృఢమైన కఠిన హృదయము గల పాలకుడుగా పది కాలాలు జీవిస్తా. సహ మంత్రులందరితో కీర్తిని పంచుకొంటా. ఆనందిస్తా.అహంకారము, అధికారమదమే ఎల్లప్పుడూ నా సుగుణాలుగా భాసిల్లునట్లు చేసుకుంటా.

ఆంధ్రా సీమలో మనదే హవా

నాన్న బిక్ష
నా దయా దాక్షిణ్యం అని
దీక్షల మీద దీక్షలు చేసి
హైదరాబాదులో ఏడురోజుల దీక్ష సెట్టు వేసి
బ్యాక్ గ్రౌండులో
ఆంధ్రా సీమలో మనదే హవా
అనే సర్వే పాట వినిపించినా
వినిపించుకొనే నాధుడు లేదు
జనం సొమ్ము తిన్నాడనే ఫీలింగో ఏమో
అయ్యోపాపం మూడు రోజులుగా తినడం లేదు
అనే జాలి కూడా కలగడం లేదు జనాలకు