4, ఏప్రిల్ 2011, సోమవారం

కృష్ణా జిల్లా లో మళ్లి రాజుకున్న వర్గపోరు

చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో కృష్ణా జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. కృష్ణా జిల్లాలోని ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు కాంగ్రెసులోకి వస్తుండడం మాత్రమే కాకుండా తన చిరకాల ప్రత్యర్థి వంగవీటి రాధాకృష్ణ కూడా కాంగ్రెసు నాయకుడు అవుతుండడంతో దేవినేని నెహ్రూకు మింగుడు పడడం లేదు. తన ప్రాబల్యం తగ్గిపోయే వాతావరణం ఏర్పడింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి నిర్ణయం జరగక ముందు ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు నాయకుడు వైయస్ జగన్‌తో వెళ్లే ఆలోచన కూడా ఆయన చేశారు. గతం లో వంగవీటి రాధాకృష్ణ కూడా జగన్ పార్టీ లో చేరే యత్నాలు చేస్తే చిరంజీవి ఆపారు.
చాలా కాలంగా దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. దేవినేని ఉమా మహేశ్వర రావు దీనికి సహకరిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి వెంట కాంగ్రెసులోకి వచ్చే వంగవీటి రాధాకృష్ణను ఎదుర్కోవడానికి, వంశీని దెబ్బ తీయడానికి తెలుగుదేశం పార్టీని ఎంచుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
దేవినేని నెహ్రూ తెలుగుదేశం పార్టీలోకి వస్తే తమ ప్రాబల్యం తగ్గడం ఖాయమని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, వంశీకి, నెహ్రూకు క్షణం పడదు. వారిద్దరు ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో దేవినేని నెహ్రూ తెలుగుదేశం ప్రవేశాన్ని అడ్డుకోవడానికి వారు దేవినేని ఉమా మహేశ్వర రావుపై తీవ్ర విమర్శలు చేస్తూ వంశీ పార్టీ పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమం లో వల్లభనేని వంశీ జగన్ పార్టీ లో చేరుతారనే పుకార్లు వచ్చాయి. పరిటాల రవి అనుచరుడిగా పేరు గాంచిన వంశీ అలా చేయడు.

కడప, పులివెందులు లో ఎవరి సత్త ఎమిటో ఇపుడు తెలుస్తుంది

మాజీ పార్లమెంటు సభ్యుడు, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ సీటును గెలుచుకోవడానికి వ్యూహాలు చేస్తున్నారు. గత ముప్పయ్యేళ్లుగా వైయస్ కుటుంబం వైపే నిలబడిన కడప, పులివెందుల ప్రజలు ఇప్పుడు వైయస్ మరణం తర్వాత నిలువునా కుటుంబం చీలడంతో ఎటువైపు ఉంటారనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే వివేకానందరెడ్డికి స్థానికంగా ఉన్న పట్టు దృష్ట్యా ఆయన వైపే ప్రజలు ఉంటారని కొందరు చెబుతుండగా, వైయస్ ఇమేజ్ దృష్ట్యా జగన్ వైపే ఉంటారని మరికొందరి వాదన.


ఈ ఎన్నికల ద్వారా జగన్ కాంగ్రెసు వైపు కాకుండా వైయస్ వైపు ఉన్నారని చెప్పడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు కడప పార్లమెంటు స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తన వర్గం నేతలతో శనివారం భేటీ అయ్యారు. ఎన్నికలలో వ్యూహాలపై వారితో చర్చించారు. ఎవరెవరు ఏం చేయాలో నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఇక తన వంతుగా తల్లిని పులివెందుల స్థానం నుండి గెలిపించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చేయించుకున్న ప్రచార రథంలో మంగళవారం నుండి ప్రచారం ప్రారంభించనున్నారు. సోమవారం ఉగాది పండుగ ఉన్నందున 6వ తారీఖు నుండి 30 తారీఖు వరకు జగన్ పర్యటన ఖరారు చేశారు. ఇందుకు రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. 25 రోజుల పాటు సాగే ఈ ప్రచార పర్యటనలో జగన్ కడప నుండి తాను గెలవడానికి ఒక్కో నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించనున్నారు.

ఇక తల్లి విజయమ్మ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి ఆమెను గెలిపించడానికి ఏకంగా 7 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ ఎన్నికల ద్వారా జిల్లా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పడమే కాకుండా తన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించుకోనున్నారు. జగన్ తన పర్యటనను జమ్మలమడుగు నుండి ప్రారంభించనున్నారు. అయితే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెసుకు ఏకపక్షంగా ఉన్న కడప, పులివెందులు ఆ కుటుంబం నిలువునా చీలడం వలన టిడిపి లాభపడుతుందా లేదా వైయస్ కుటుంబం నిలుపుకుంటుందా, కాంగ్రెస్ పట్టు సాధించుకుంటుందా చూడాలి.

కుటుంబలు మద్య విభేదాలు వచ్చాయి

రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలకు చెందిన రెండు ప్రధాన కుటుంబాల మధ్య సంక్షోభం నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెసు పార్టీకి ఇన్నాళ్లుగా పెద్ద దిక్కుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబంలో చీలికలు వచ్చాయి. బాబాయ్ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మధ్య కుటుంబ విభేదాలు వచ్చాయి. దీనిని క్యాష్ చేసుకుందామని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం భావిస్తున్న తరుణంలో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్ కుటుంబంలో కూడా పొరపొచ్చలు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడు తన తర్వాత రాజకీయ వారసుడిగా తన తనయుడు లోకేష్ కుమార్‌ను చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. దీనిని గమనించిన హరికృష్ణ తన తనయుడు ఎన్టీఆర్‌ను భావినేతగా ప్రజల ముందు ఉంచడానికే తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల కృష్ణా జిల్లా టిడిపిలో భగ్గుమన్న విభేదాలు అందుకు నిదర్శనమని పలువురు భావిస్తున్నారు.


కాంగ్రెస్‌ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన దివంగత సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌ పార్టీని వీడటం, తమ్ముడు వివేకానందరెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే ఉండిపోవడంతో వైఎస్‌ కుటుంబం రెండుగా చీలింది. రానున్న ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నుంచి తన వదిన విజయలక్ష్మిపై పోటీ చేస్తానని, బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరని కూడా వివేకానందరెడ్డి స్పష్టం చేశారు. నిత్యం వదినపై పోటీ చేస్తారా అని ప్రశ్నించే వాళ్లకు తన భార్య లోక్‌సభకు స్థానానికి పోటీ చేస్తే జగన్‌ పోటీ నుంచి తప్పుకుంటారా అని వివేకా ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దీంతో వారి కుటుంబం మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెసు పార్టీని కాపాడటం కోసం దివంగత వైయస్ కుటుంబాలను, పార్టీలోనుండి నేతలను చీల్చే వారు అనే అపవాదు ఉంది. అయితే ఇఫ్పుడు ఆయన కుటుంబమే రాజకీయాల కోసం చీలిపోయింది. కడప జిల్లాలో ఉన్న వైఎస్‌ కుటుంబసభ్యుల్లో మెజారిటీ శాతం జగన్‌ వైపే నిలవగా, కొద్దిమంది మాత్రమే వివేకా వెంట ఉన్నారు. అయితే, కడప, పులివెందుల ఉప ఎన్నికల తర్వాత ఈ సమీకరణలో మార్పు వచ్చే అవకాశాలు లేకపోలేదన్న అంచనా వివేకాలో కనిపిస్తోంది.

ఇక తెలుగుదేశం పరిస్థితి ఇందుకు మినహాయింపు కనిపించడం లేదు. అయితే, వైఎస్‌ కుటుంబం మాదిరిగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కొనసాగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. హరికృష్ణ జూనియర్‌ ఎన్టీఆర్‌ మద్దతుదా రులయిన ఎమ్మెల్యే కొడాలి నాని, విజయవాడ నగర అధ్యక్షుడు వంశీ నేరుగా చంద్రబాబుపై దాడి చేయకుండా ఆయన మద్దతుదారుడైన ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమపై విరుచుకు పడటం విశేషం. ఎన్టీఆర్‌-హరికృష్ణకు మద్దతుదారులయిన మీడియా కూడా వీరికి అండగా ఉన్నట్టుగా పలువురు భావిస్తున్నారు. తమకు ఎన్టీఆర్‌ కుటుంబమే ముఖ్యమని హరికృష్ణ మద్దతుదారులు స్పష్టం చేయటంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో తమకు సంబంధం లేదని స్పష్టం చేయడం ద్వారా తమకు హరికృష్ణ -జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రధానమని చెప్పకనే భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు చాలాకాలం నుంచి హరికృష్ణకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన వర్గీయులు హటాత్తుగా దేవినేనిని అడ్డుపెట్టుకుని బాబుపై పరోక్ష దాడి చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. ఇక బాలకృష్ణకు పార్టీలో క్రియాశీలపాత్ర పోషించాలన్న ఉత్సాహం ఉన్నప్పటికీ, ఆయన తనకున్న కుటుంబ మొహమాటాల వల్ల ముందుకు రాలేక పోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే, హరికృష్ణకు మాత్రం బాబు తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ పగ్గాలు తీసుకోవాలన్న కోరికతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హరికృష్ణ చేసిన ప్రక టనలు, విడుదల చేసిన లేఖల వల్ల పార్టీ ఇబ్బందిపడిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

లోకష్‌ను పార్టీలో క్రియాశీలంగా పాల్గొనడం హరికృష్ణ వర్గానికి రుచించడం లేదంట. ఇటీవల చంద్రబాబు నిరాహార దీక్షలో లోకేష్ బయటకు వచ్చారు. అయితే వైఎస్‌ కుటుంబానికి భిన్నంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు మాత్రం దీనిపై ఎక్కడా బయటపడకుండా గుంభనంగా వ్యవహరిస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే ఎన్టీఆర్‌ కుటుంబానికి సన్నిహుతులు మాత్రం ఎన్టీఆర్‌ కుటుంబంలో బాహాటంగా కలహాలు వచ్చే అవకాశం తక్కువేనంటున్నారు. ఏమైనా వచ్చినా ఈ సమయంలో వారు సర్దుకు పోతారనే వాదనలు వినిపిస్తున్నాయి

శ్రీ ఖర నామ శుభాకాంక్షలు.---- మీ నాని

ఇప్పుడు ఉగాది అంతే ఏమిటో తెలుసుకుందాము .వుగా అంతే నక్షత్ర గమనం ప్రారంభమయిన రోజు అంతే సృష్టి ప్రారంభమైన రోజు .సూర్యుడు చైత్ర శుద్ధ పాడ్యమి నాడు భూమధ్య రేఖ మీద వుంటాడు .చంద్ర గమనం కూడా అదే రోజు అశ్విని నక్షత్రం తో ప్రారంభం అవుతుంది .ఈ రెండు కలిసిన రోజే యుగ దినం ప్రారంభం అవుతుంది .యుగం అంతే జంట కాలం భగవంతుని చేతనం కదా .సంవత్షరం వల్లనే సప్త తంతు యజ్ఞం జరుగు తుంది .సూర్య మండలం అనే వినేల్క ఆకాశం నుంచి ఉచ్చారణ లాగా వ్యక్తం చేసే పరా ప్రకృతి ఆవు .సూర్యుడు దాని పొదుగు .సంవత్షరం లోని నాలుగు భాగాలూ దాని స్థానాలు .ఘర్మం అంతే ఎండ వేడి దాని క్షీరం .సంవత్షరం దాని దూడ మేఘాలే వర్షించే ధేనువులు ఆంటే ఆవులు 368 అంగిరసులు అనే dhenuvulu గుంపులై సంవత్షరం అనే దూడ కోసం పాలు ఇస్తాయి ఆంటే ఎండ రూపం లో వెచ్చదనాన్ని పాలుగా ఇస్తున్నాయి అని మహా భారతం లో వుంది .సంవత్షరం వయసు గల దూడను బష్కం అంటారుఆంటే సత్యాన్ని సూర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది . .ఈరలర్య రశ్మి రూపం లో సృష్టి గా పిండేది అని భావం .అందుకే ఉగాది మహత్తర మయిన రోజు .
ఉగాది నాడు ఏమి చెయ్యాలి ?తలంటి కొత్త బట్టలు మామూలే .ఉగాది పచ్చడి తినాలి వేపపూత మామిడి ముక్కలు కొత్త చింతపండు చెరుకు ముక్కలు మిరియం పొడి పటికబెల్లం సైంధవ లవణం ఆంటే రాక్ సాల్ట్ వెండి గిన్నెలో కలిపి దేవునికి నైవేద్యం పెట్టి తినాలి ఇందులోని ఆరు రుచులు తీపి కారం ఉప్పు పులుపు వగరు తీపి ఆరోగ్యానికే కాక జీవితంలోని కష్టాలు ,సుఖాలు మొదలయినవి ఉంటాయి జాగ్రత్తగా నడచు కోవాలని అర్ధం .వసంత ఋతువు ప్రరంభామయే రోజు కోయిల పాటలతో మత్తెక్కించి కొసరు రోజు సాయంత్రం దేవాలయాలలో పంచాంగ శ్రవణం చేస్తారు అది వింటే శత్రు సంహారం జరుగుతుందని ,చెడ్డ కలలు రావని,గంగా స్నానం చేసినంత ఫలితం అని గోదానం తో సమాన మని ఆయుర్వృద్ధి కలుగుతుందని సుభకరమని మంచి సంతానము లభిస్తుందని మంచి పనులు చేయటానికి సాధనం అనిపెద్దలు చెప్పారు ఆదాయం యెంత వ్యయం యెంత పూజ్యం యెంత అవమానం యెంత తెలుస్తుంది ప్రమాదాలను హెచ్చరిస్తుంది తప్పుడు మార్గం లోకి జార కుండా కాపాడ్తుంది భవిష్యత్తు పై ఆస కల్గిస్తుంది నిరాశ తాత్కాలికమే నని సూచిస్తుంది కష్టాలను ఎదుర్కోవటానికి ఏమి చెయ్యాలో పంచాంగం చెబుతుంది .
ఈవిదం గా శుభాశుభాలకు చిహ్నమే మన ఉగాది పర్వదినం తెలుగు సంవత్చరాది .ఆంధ్రులకు గొప్ప పండగ .శ్రీ ఖర నామ సంవత్షరం శుభకరం శ్రీకరం సంతోషకరం సౌభాగ్యకరం కావాలనిఆశిస్తూ శుభాకాంక్షలతో సెలవు మీ కాజ చైతన్య