11, మార్చి 2011, శుక్రవారం

మాసిపోని అపచారం ట్యాంకు బండు విధ్వంసం

తెలుగు జాతి ఔన్నత్యానికి బాటలు వేసి, సాహిత్యం, కళలు సహా వివిధ రంగాల్లో విశేష కృషి చేసి, తెలుగువారికి అంతర్జాతీయ ఖ్యాతినార్జించి పెట్టిన మహనీయుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి. హైదరాబాదులో గురువారం నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌లో ఆందోళనకారులు 12 విగ్రహాలను ధ్వంసం చేయడంతో కొన్నేళ్లుగా ప్రజలను అలరిస్తున్న ట్యాంక్‌ బండ్‌ తీరం కళ తప్పింది.
ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలబాన్ ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి.తెలుగు వైతాళికుల విగ్రహాలని తెలుగు వారే ధ్వంసం చేస్తుంటే ఏడుపో... బాధో.....కసోఏమీ చేయలేని అస్సహాయతో.. ఏమీ అర్థం కాని ఓ ఆవేదన!!!

మిలియన్‌ మార్చ్‌ జయాపజయాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తెలుగు ప్రజల మహత్తర వారసత్వాన్ని వీర తత్వాన్ని తూట్లు పొడిచే ప్రక్రియ విజయవంతంగా సాగింది.చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషవా, బ్రహ్మమొక్కటేనని మానవులు ఏకత్వాన్ని ఏనాడో చాటిన అన్నమయ్య ,విప్లవ కవితా ప్రవక్త శ్రీశ్రీ చెప్పాలంటే ప్రాత:స్మరణీయులైన మహనీయులందరి ప్రతిమలను తుత్తునియలు చేసి అనాగరికతను చాటుకున్న అరాచకం తాండవించింది. ఈ విగ్రహాలకు విలువ ఇవ్వడం కాదు విగ్రహాల వెనకనున్న విలువల విధ్వంసం ఇక్కడ సమస్య.నాలుగు డబ్బులు ఖర్చు చేస్తే రేపే వాటిని పునరుద్దరించవచ్చన్న మాటలు జరిగిన విధ్వంసం కన్నా తీవ్రమైనవి.దీనికి నాయకులైన వారు పునరాలోచించుకోకపోతే రేపు ఇదే వారికీ జరగొచ్చు.

“ఎవరు ఎలా తగలడితే మాకేంటి?” అని ఇటువంటి ఇక్కట్లకు అలవాటుపడ్డ భాగ్యనగర వాసులు(అయోమయంలో), నిత్య జీవితాన్ని ఎలాగోలా నెట్టుకొద్దామనే ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్టు రహదారులమీది ట్రాఫిక్ చూస్తే అర్థమవుతోంది.ఇదా పద్దతి? ఖర్మ కాలి గోడవలు రగులుకునుంటే, ఆ పిల్లల సంగతేంటి? ఇంతటి నీఛానికి దిగాల్సిన అవసరముందా? అసలే పరీక్షల సమయం. అందులో మిట్ట మధ్యాహ్నం. చిచ్చుపెడితే రగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితులు.

ప్రతిరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకులు ఆ విగ్రహాల వద్ద సేదతీరుతూ తమ పిల్లలకు ఆ మహనీయుల గురించి వివరించే హక్కు మనము పొగుట్టుకున్నము.ఇదేనా!!ఇదేనా!!ఇదేనా!!రేపటి మన పిల్లలకు మనము ఇచే కానుక. ఇకనైనా మనము కళ్ళు తేరవండి.

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని

ఏమున్నది ఏమున్నది ఈ ఉద్యమాల ఔచిత్యం
దుందుడుకు చర్యలకు ఎక్కడిది ఔనత్య౦
తెలుగు వాడు సిగ్గుపడే దుర్దినం
స్పృహ లేని దిశగా నిర్దేసనం లేని ఈ ఉద్యమం

వెర్రి ముదిరితే తలకు రోలు చుట్టమన్నాడొకడు
చుట్టుకున్నోడూరుకోక పది మందిని పోగు చేసి
భలే భలే బావుందంటూ వీధిన పడి వెర్రి తలలు వేస్తున్న ఈ వైనం
పది కాస్త వందలై ట్యాంక్‌బండ్ విగ్రహాల మీద దుశ్చర్య సాగించిన ఈ కుత్సితం

వార్తని చూశాను టీవీ 9 లో వార్తను చూశాను
దుర్మదాంధ బుద్ధిహీన శూన్యుల దుశ్చర్యలను
వికృతమైన చేష్టలను
బుద్ధిమాంద్యుల ఉనికిని
నా దేశం నా రాష్ట్రము నా జిల్లాలో ఉందని
తెలుసుకొని అభివృద్ధి పధాన సాగుతున్న తీరుని..
హే రామా మాటలు ఆగిపోయి స్థాణువునై నే మిగిలిపోని

ఇన్నాళ్ళు తెలబాన్లు అంటూ బ్లాగర్లు సంభోదిస్తున్న తీరు కరెక్ట్ కాదేమో అన్న ఒక మీమాంసలో ఉన్న జనాలకు ఈనాడు సాగించిన ఈ దుర్మార్గపు దుశ్చర్య వాళ్ళకు ఎంత గౌరవం అర్హమో అంతే లభిస్తుందని నిరూపించుకున్నారు. పరమ భక్తాగ్రేసరుడు పద కవిత పితామహుడు అన్నమయ్య విగ్రహాన్ని కూడా వదల్లేదంటే పిచ్చి ముదిరి రోకలి తలకు కట్టించుకొని తిరుగుతున్నారు.
బుద్దుని బమియాన్ విగ్రహాలు ద్వంసం చేసి ఆనాడు వాళ్ళ ఉనికిని ప్రపంచానికి చాటారు ఆ తాలిబన్లు. మన వాళ్ళు అంతకు రెండు ఆకులు ఎక్కువే చదివి మన సంస్కృతికి చిహ్నాలైన మహనీయుల జ్ఞాపికల ఫై పడి మరెంతో ఘన కీర్తిని సంపాయించారు. శబ్భాష్ !! ఉన్మత్త తాండవం చేసే బుద్ధి హీనుడికి పరతమ బేధాలు మంచి చెడు విచక్షణ కోల్పోయి ఈ విధంగానే ప్రవర్తిస్తారు.

రోజు చేయండి మిలియన్ మార్చులు. రాత్రి పగలు తేడ లేక మరీ చేయండి. మనకెలా పనికి మాలిన పరీక్షలు .అవి కూడు పెడుతాయా గుడ్డ పెడుతాయా. భూమి ఏర్పడక ముందే ఏర్పడింది ఈ తెలంగాణా ఆకాంక్ష. యుగాలు మారినా మనువులు మారినా ఈ బ్రహ్మాండం అంతా వ్యతిరేకంగా కుట్రలు చేసి మా కలలు సాకారం కానికుండా మేము దోపిడీకి గురయ్యాము ఈ రాత్రికి రాత్రే తెలిపోవాలె, ఏమి ఎందుకు తేలరాదు రాత్రి పోయి తెలవారట్లే? యుగాల ఆకాంక్ష ఈ రాత్రికి రాత్రి తీరే వరకు ట్యాంక్ బండ్ మీద నిరసన సాగాలి.