17, మార్చి 2011, గురువారం

ఇదేనా మన దేశం

దక్షిణ భారతదేశంలో నోటుకు ఓటు పద్ధతి బాగా ఉందని చెప్పిన వికీలీక్స్ మరో సంచలనాన్ని బయటకు తెచ్చింది.
గత సాధారణ ఎన్నికలకు ముందు 2008వ సంవత్సరంలో అమెరికాతో అణు ఒప్పందం నేపథ్యంలో యూపిఏ ప్రభుత్వంతో కమ్యూనిస్టు పార్టీలు తెగతెంపులు చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం మైనారటీలో పడిపోయింది. అప్పుడు విశ్వాస పరీక్షలో నెగ్గడానికి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎల్‌డి పార్లమెంటు సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10 కోట్లు ముట్టజెప్పినట్టు వికీలీక్స్ తాజాగా బయట పెట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్ శర్మ నేతృత్వంలో ఈ డబ్బులు పంచినట్టుగా బయట పెట్టింది.

కాగా రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి చెందిన అసదుద్దీన్ ఓవైసీ కూడా ఓటును నోటు పద్ధని అనుసరించారని చెప్పింది. ఎన్నికలలో తమ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాడనికి ఎలా ప్రలోభ పెట్టారో అసదుద్దీన్ బాహాటంగానే ఎలాంటి సంకోచం లేకుండా చెప్పారన్నది. వికిలీక్స్ వెల్లడించిన విషయాలు.

కామెంట్‌లు లేవు: