13, ఏప్రిల్ 2011, బుధవారం

"యధాప్రజ తధారాజా"

"యధారాజా తధాప్రజ" అన్నది రాచరికపు రొజుల నాటి నానుడి. "యధాప్రజ తధారాజా" అన్నది ఇప్పటి నిజం. మనమే ప్రతీ విషయం లో ఇంత స్వార్ధం తో నిజాయితీ లేకుండా అలొచిస్తుంటే ఇక మనల్ని రిప్రజెంట్ చేసే , మనం ఎన్నుకున్న నాయకులు ఇంకెంత స్వార్ధం తొ ఆలోచిస్తారు. డబ్బు, మద్యం, గిఫ్ట్లు లంచం తీసుకుని అవినీతి పరుల్ని ఎన్నుకునేది సామాన్య జనమే (మనమే). బోల్డు డబ్బులు ఖర్చుపెట్టి, లంచం ఇచ్చి ఓట్లు కొన్న నాయకులు నిజాయితీ గా పనిచెయ్యాలని కొరుకొవడం చాలా అత్యాశ , అన్యాయం కూడా. మరి ఆ లంచం తీసుకునేవాళ్ళకన్నా ఆ లంచం ఆశ చూపించేవారిదే తప్పు అనుకుంటే , మరి లంచం తీసుకునే ప్రభుత్వ అధికారులకన్నా లంచం ఇచ్చే మనది తప్పు అన్నమాట. ఇదొక కరేప్షన్ సైకిల్ అన్నమాట... ఈరోజు లంచం ఇచ్చినవాడు రేపు వాళ్ళదగ్గరే తీసుకుంటాడు..ఆ మర్నాడు మళ్ళీ వాళ్ళకే లంచం ఇవ్వాల్సి రావచ్చు... ఆ సైకిల్ అలానే అనంతం గా సాగిపోతుంది. ఒక రకంగా ఈ సైకిల్ మన కల్చర్ లో భాగం అయిపొయింది. కొత్త సాఫ్ట్వేర్ మార్కెట్ లోకి రాగానే పాస్వర్డ్ బ్రేక్ చేసేవారిని మహా తెలివైన వాళ్ళగా పోగుడుతాం, డబ్బులిచ్చి ఒరిజినల్ డివిడి కొన్నవాడిని తింగరొడిని చూసినట్టు చూస్తాం. అది ఇప్పటి కల్చర్ ..

ఒక్కడు లక్ష రూపాయిలు ప్రబుత్వ సొమ్ము దోచేస్తే ఎంత నస్టమో, లక్ష మంది ఒక్కొకరు ఒక్కో రూపాయి చొప్పున దొచినా అంతే నస్టం. అయితే రూపాయి ఎవరికీ కనిపించదు.... అది తప్పు లా అనిపించదు....


నేను మారను కానీ నా పక్క ఉన్నవాళ్ళు అందరు మారిపోవాలి అన్న ఆలోచనలో ఉన్నంతకాలం ..ఎంతమంది అన్నా హాజారా లు వచ్చినా ఉపయోగం లేదు... ఏదో కొన్నాళ్ళు హడావుడి తప్పించి....
మనం చేసే అవినీతి గురించి ఆలోచన లేకుండా , సమాజం మాత్రం అవినీతి రహితం గా ఉండాలనుకోవడం , దానికి పాదయాత్రలు చెయ్యడం, నిరాహార దీక్షలు చెయ్యడం, లెక్చర్లు దంచడం కన్నా అత్మ వంచన ఇంకేమీ లేదు. అన్నా హాజారే కి లక్షకోట్లు తిన్న జగన్, రెండువేల ఎకరాలు ప్రబుత్వ రేట్ కి జాక్ పాట్ కొట్టిన రామోజీ రావు మద్దతు ప్రకటిస్తుంటే ఎంత కామెడీ గా ఉందొ ... మనం మద్దతు ప్రకటించినా అలానే ఉంటుంది....

ఈ రొజు సమాజానికి కావాల్సింది మన నిరాహారదీక్షలు, ఊరేగింపులు కాదు.... ప్రతీ మనిషిలో ఒక చిన్న రిజల్యూషన్. ఈ రొజు నుండి ఈ పర్టిక్యులర్ అవినీతి నేను త్యజిస్తున్నా ... ఈ తప్పు నేను మళ్ళీ చెయ్యను అని.... సంఘానికి పూర్తి వ్యతిరేకంగా ఎదురీదుతూ అపర నిజాయితి పరుడిగా ఒక్కరొజే మారిపొనక్కర్లేదు....మారలేం కూడా... అయితే మనకి చేతనయినంతలొ... మనం కొంచెం కస్టం తొ చెయ్యగలిగినవి చెయ్యగలిగితే చాలు.... మార్పు చాలా స్లొగా వస్తుంది. అయితే ఆ మార్పు ముందు ఎదుటివాడి నుండి ప్రారంభం అవ్వాలనుకోకుండా... మననుండి ప్రారంభం అవ్వాలని నిర్ణయించుకొవడమే నిజమయిన దేశభక్తి...

ఏ రకం గా చూసిన ముందు మారాల్సినది మనం. ఇది ఒక అవకాశం ... ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకుందాం. వీలయినప్పుడల్లా ఒక్కో అవినీతి మార్గం వదిలేస్తూ పోదాం. కొన్నాళ్ళకి అంటే కనీసం ఒకటి రెండు తరాల తరువాతివారికయినా నిజాయితీ విలువ పూర్తిగా అర్ధం అవుతుంది.

కామెంట్‌లు లేవు: