19, మే 2011, గురువారం

ప్రజారాజ్యం విలీనాన్ని ప్రశ్నిస్తూ అధినేత చిరంజీవికి లీగల్ నోటీసులు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి ఆ పార్టీకే చెందిన ఓ కార్యకర్త లీగల్ నోటీసులు పంపించారు. ప్రకాశం జిల్లాకు చెందిన లక్ష్మణ్ నాయుడు అనే ప్రజారాజ్యం పార్టీ కార్యకర్త పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడాన్ని ప్రశ్నిస్తూ లీగల్ నోటీసులు పంపించారు. పార్టీని విలీనం చేయడం ద్వారా చిరంజీవి పార్టీకి ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ నోటీసులు ఇచ్చారు.

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన కారణంగా తాను పార్టీ కోసం ఇప్పటి వరకు ఖర్చు చేసిన డబ్బును ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇటీవల పార్టీ విలీనంపై ప్రజారాజ్యం పార్టీ నేతలు చిరంజీవిని ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

కామెంట్‌లు లేవు: