15, ఫిబ్రవరి 2011, మంగళవారం

పోయినోడి చిత్త సుద్ధి

ధన యజ్ఞం అజెండా ప్రకారం
కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి
కమీషన్లు నొక్కేసి
ఖాళీ కాలువలు చూపి
కాలం చేసాడు
కానీ అడ్వాన్సులకు కావాల్సిన డబ్బులకోసం
గ్రామ గ్రామానికి బెల్టులు పెట్టి
మద్యాన్ని పారించిన యజ్ఞాన్ని
ఆయన సుపుత్రుడు
జల యజ్ఞంగా జనాలకు చెబుతూ
అర్ధాంతరంగా ఆగిపోతోందని ఆవేశ పడుతూ
పాదయాత్రలు చేస్తున్న తీరు చూస్తుంటే
‘గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది’ అనే
గాఢ నమ్మకంతో
గద్దె కోసం కమీషన్ల ఖర్చుతో చేస్తున్న
జాతరను చూసి జాతి మురిసిపోవునా?