15, ఏప్రిల్ 2011, శుక్రవారం

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెసు-కాంగ్రెసు కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని సర్వేలు తెలుపుతున్నాయి. రెండు ప్రసిద్ధ సంస్థలు వేరు వేరుగా చేసిన సర్వేలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి అధికారంలోకి వస్తుందని తేలింది. హెడ్ లైన్స్ టుడే ఛానల్ కోసం ఓఆర్‌జి చేసిన సర్వేలో టిఎంసి 182 స్థానాలను, లెఫ్ట్ కూటమి 101 స్థానాలను గెలుచుకుంటుందని తేల్చింది. స్టార్ ఆనంద ఛానల్ కోసం నీల్సన్ చేసిన సర్వేలో టిఎంసి 215, లెఫ్ట్ కూటమి 74 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బుద్దదేవ్ కంటే మమతా బెనర్జీవైపై బెంగాళీలు మొగ్గు చూపుతున్నారని సర్వేలు తేల్చాయి.


ముఖ్యమంత్రిగా మమతను 56 శాతం మద్దతు ఇస్తే, బుద్దేవ్‌కు 20 శాతం మాత్రమే ఇవ్వడం విశేషం. అయితే ఇప్పటి వరకు జ్యోతిబసు మెరుగైన ముఖ్యమంత్రిగా బెంగాళీలు చెబుతున్నారు. టిఎంసి గద్దెనెక్కితే ముప్పయి అయిదేళ్ల లెఫ్ట్ అధికారానికి బెంగాళీలు గండి కొట్టినట్లే. దశాబ్దాల పాటు అధికారం కోసం వేచి చూస్తున్న మమత ఈసారి తనకు అధికారం తప్పకుండా వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయం నుండే లెఫ్ట్ కూటమి ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. భారీగా పార్లమెంటు సీట్లను టిఎంసికి కోల్పోయింది. ఇప్పుడు కూడా సర్వే ఫలితాలు నిజం అయితే 227 స్థానాలున్న లెఫ్ట్ సగానికి పైగా తగ్గుతాయి.

మమత ప్రభంజంలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇరుక్కుపోయారు. ఆయన తన సొంత నియోజకవర్గం జాదవ్‌పూర్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థులుగా ఆయన ప్రభుత్వం హయాంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన మనీష్ గుప్తా టిఎంసి నుంచి, సిపిఎం నుండి బయటకు వచ్చిన శమీర్ పార్టీ ఫర్ డెమక్రటిక్ సోషలిజం నుండి బుద్దదేవ్‌పై పోటీకి దిగుతున్నారు. దీంతో ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పలువురిని గెలిపించాల్సిన బాధ్యతలో ఉన్న బుద్దదేవ్ తన గెలుపుకోసం తన నియోజకవర్గంలోనే ఎక్కువ సమయాన్ని కేటాయించడం విశేషం. గత పార్లమెంటు ఎన్నికలలో సిపిఎం ఎపీ అభ్యర్థి చాలా తక్కువ ఆధిక్యంతో గెలుపొందడం బుద్దదేవ్‌కు చెమటలు పట్టిస్తున్నాయి. అయితే బుద్దదేవ్‌పై ఓటర్లకు వ్యతిరేకత లేకున్నప్పటికీ పార్టీపైన మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది

కామెంట్‌లు లేవు: