31, మే 2011, మంగళవారం

రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

అధికారం ఇవ్వండి అని సునామీ సృష్టిస్తే
ఎగబడి వచ్చి చూసి ఎన్నో ఆశలు కల్పించిన జనాలు
రాజ్యం నేతకు ఆటలో అరటిపండు స్థానం ఇచ్చారు.

ఆ తరువాత పక్కలో బల్లెంలా తయారైన మీడియా
ప్రతిసారీ ప్రతి విషయం లో
రేటింగుల కోసం అరటి పండును చేసారు.

గౌరవ నిమజ్జనానికి
జనపద్ దగ్గర పడిగాపులు కాస్తూ
ఏదన్న విదిలిస్తారు అని ఎదురు చూస్తుంటే
ఎం ఎల్ సీ ఎంగిలి మెతుకులు కూడా విదల్చక
ఆటలో అరటిపండు స్థానానికి
భంగం వాటిల్లకుండా
వాటేసుకొంటామని వంచిస్తున్నారు.

కామెంట్‌లు లేవు: