31, మే 2011, మంగళవారం

ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా..

కొత్తగా కట్టిన అసెంబ్లీ
అమ్మకానికి పెడుతున్నారంటగా
మా మహా నేత తనయుడు యువనేత
దక్షిణాదిలో ప్రతి రాష్ట్రంలో
ఓ కోట ఉండేలా చూసుకొంటున్నాడు
మీదే కొనేస్తాడు
కానీ మీరు కొంచం సమయం ఇవ్వాలి
ఏడుపు తుడిచే పని ప్రస్తుతానికి ఆపినా
కన్నెర్ర చేసే కార్యక్రమం ఒకటి పెట్టుకొన్నారు
అదైన వెంటనే
దేవుడు దగ్గర ప్లీనరీ ఒకటి పెట్టుకొన్నారు
దానితో చిరంజీవి తరువాత
సునామీ సృష్టించేది తామే అని
నిరూపించుకొనే పనిలో
నిమిషం తీరిక లేకున్నారు.

కామెంట్‌లు లేవు: