4, నవంబర్ 2011, శుక్రవారం

చరిత్రను పునరావృత్తం చేయవచ్చు

చైతన్యం వస్తోంది
చదువు సంధ్యలు ఎక్కువ అయ్యాయి
కలిసి ఉంటే కష్టం
మిగిలిన ప్రదేశాల్లో లా
మన దగ్గర ఎందుకు అభివృద్ధి జరగలేదని
నిలదీస్తారు

విడదీస్తే
మళ్ళీ మనమే బాంచన్ దొర అని చెప్పించుకొంటూ క్రింది చరిత్రను పునరావృత్తం చేయవచ్చు.

“చెరువుల్లో నీరు మొదట భూస్వాముల పొలాలు సాగు అయిన తరువాతనే ఇతర రైతులు తీసుకోవాలి. వ్యవసాయ కూలీలు మొదట భూ స్వాముల నాట్లు వేసిన తరువాతే ఇతరులవి వేయాలి. విసునూరు దేశ్‌ముఖ్‌ రామచంద్రారెడ్డి గడీ ముందు చాకలి వారు నిత్యం నూరు బిందెల సానిపి చల్లాలి. వారి దున్నపోతులకు క్షురకులు క్షవరాలు చేయాలి. కచ్చడాల ముందు ఉరకాలి. మూటలు మోయాలి. పక్కలు వేయాలి. పచ్చి బాలింతలను కూడా పాలు పిండి చూపితే తప్ప పనుల నుండి వదిలేవారు కాదు. గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు, జాగీరు ఉద్యోగులు వచ్చినప్పుడు ఆ గ్రామంలోని చిల్లర దుకాణదారులు అధికారులకు కావలిసిన సన్న బియ్యం, మాలు, మసాలా, నెయ్యి, నూనె, పప్పు, చింతపండు, బీడీలు, సిగరెట్లు, సబ్బులు తదితర వస్తు సామాగ్రినంతా ఉచితంగా సరఫరా చేయాలి. గొర్రెలు, మేకలు, కల్లు, కోళ్ళు, పందులు, చేతివృత్తుల ఉత్పత్తులతో సహా బలవంతంగా అధికారులు గుంజుకునేవాళ్ళు. ఈ విధంగా జనాన్ని బానిసల కన్నా హీనంగా చూసేవారు. ఈ బాధలు భరించలేక ఎవరైనా ఎదిరించినా, నిలదీసినా సహించేవారు కాదు. వారిని నిర్బంధించి క్రూరంగా హింసించేవారు. హత్య చేసి తమ గడీలలోనే పాతిపెట్టేసేవారు”.

కామెంట్‌లు లేవు: