6, మార్చి 2011, ఆదివారం

మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్

మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని పరీక్షలు వాయిదా వేయాలంటూ ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి వుంది.

కామెంట్‌లు లేవు: