6, మార్చి 2011, ఆదివారం

మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు!

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010 న కే.సి.ఆర్."== ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.

"పల్లె పట్టాల పైకి" అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది. పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Will you say the same thing about your bootakapu "samaikya udyamam 15 months ago?