6, మే 2011, శుక్రవారం

అమెరికాతో పాటు భారత్‌పైనా పాక్ తన ఆగ్రహాన్ని చూపించింది

తమ దేశంలోనే తమకు తెలియకుండా అమెరికా ఆపరేషన్ జరిపి అంతర్జాతీయ తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చడంపై పాకిస్తాన్ ఆగ్రహం ఇంకా చల్లారనట్టే కనిపిస్తోంది. లాడెన్ చంపిన తరహా ఆపరేషన్‌లు మరిన్ని పాకిస్తాన్‌లో జరుపుతామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పాక్ తీవ్రంగా స్పందించింది. ఆలాంటి ఆపరేషన్‌లు మరిన్ని జరిపితే తాము తీవ్రంగా స్పందిస్తామని చెప్పింది. అలా చేస్తే అమెరికాను వదిలే పరిస్థితి ఉండదని హెచ్చరించింది. అవసరమైతే అమెరికాతో సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.

అమెరికాతో పాటు భారత్‌పైనా పాక్ తన ఆగ్రహాన్ని చూపించింది. అమెరికా లాంటి ఆపరేషన్లు భారత్ తమ దేశంలో నిర్వహించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ దాడులను తిప్పికొడతామని ప్రకటించింది.

కామెంట్‌లు లేవు: