3, జూన్ 2011, శుక్రవారం

తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది

బురదలో వికసించడానికి బదులు
కూరుకు పోతున్న తామరను
కర్ణాటక కుర్చీ పై పెట్టాలని
ఘనుల దోపిడీదారులను దోసిట పట్టి
వారి పుణ్యాన పాలకులుగా పులకరిస్తూ
ఇప్పుడు వాళ్ళు పాపాత్ములుగా తేలుతున్న సమయాన
సుష్మా లాంటి వాళ్ళు
ఘనుల దొరలను దోసిట పట్టింది
నేను కాదంటే నేను కాదని
కడిగేసుకో చూస్తున్నారు చోద్యంగా.

తాము అధికారంలోకి వస్తే
వెంటనే తెలంగాణా అని
తీరా ప్రధాని పీటమెక్కిన పద్మం
ఇస్తే తామర హస్తిన కుర్చీ నుండి కింద పడుతుందని
తెప్ప తగలెట్టి తామూ ఆ తానూ ముక్కలే అని
తెలంగాణా వారికి తేట తెల్లం చేసారు.

ఇప్పుడు కొత్తగా
మరో సారి అధికారంలోకి వస్తే
మొదటగా చేసే పని తెలంగాణా ఇవ్వడమే అని
వింతగా మరో సారి వినుకోండి అని విన్నాపాలు చేస్తున్నారు.

వినే వాడి వెఱ్రిని బట్టి
రాజకీయ నాయకులు
తమకు తాళం వేసే లా
తమ నాలుకను నాట్యం చేయిస్తారు.
అందుకే కొత్తగా తామర కూడా తన వంతు ప్రయత్నిస్తోంది.

కామెంట్‌లు లేవు: