15, జులై 2011, శుక్రవారం

అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు....

అసలు టైటిల్ విషయానికొస్తే, పాండవ వనవాసం సినిమా చూసినప్పుడు విన్న డవిలాగు అది. సావిత్రి బాగా బాధ పడుతూ చెప్పిన డయిలాగు. ద్రౌపదిని( అదే సావిత్రే లెండి) తీసుకురమ్మని ప్రాతిగామిని పంపిస్తాడు రారాజు. అప్పుడు ఈ విషయం కనుక్కురమ్మని సావిత్రమ్మ చెప్పే డయిలాగు ఇది.
" నా స్వామి తన్నోడి నన్నోడెనా లేక నన్నోడి తన్నోడెనా,".
ఈ డయిలాగు విన్నప్పుడు నేను, ధుర్యోధనుడు( అదే మన ఎస్ వీ ఆర్) ఒకలాగే ఆలోచించాము. ఎలా అయితే ఎంటి మొత్తానికి ఓడారా లేదా. అంతా టైం వేస్టింగ్ టాక్టిక్స్.
కాని రెండిటికి ఏంత తెడా ఉందో ఇప్పుడు అర్థం అవుతుంది. అంటె ధర్మరాజు తను ఓడిపోవడం వల్ల ద్రౌపది ఆటోమేటిక్ గా రారాజుది అవుతుంది. అలాంటప్పుడు ధర్మవిధిత(lawful bid). కాని, ధర్మరాజు ద్రౌపదిని జూదంలో పెట్టి ఓడిపోతే, అసలు ధర్మ రాజుకు ద్రౌపదిని పెట్టే హక్కు ఎక్కడిది. ద్రౌపది తన ఒక్కడికే భార్య కాదే, కాబట్టి తను అధర్మవిధిత( unlawful bid). ఇది వికర్ణుడు చెప్పే వాదం. ఏదేమయితేనేం ఇందులో పెద్ద ధర్మ సూక్ష్మం ఉంది. అంత వీజీగా పక్కన పెట్టే డయిలాగు కాదు

కామెంట్‌లు లేవు: