2, నవంబర్ 2011, బుధవారం

ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు

ప్రకృతికి చెందిన పంచభూతాలను వంచనతో ద్రుతరాస్ట్రుడికి మల్లే దురాశపడిన కొడిక్కి దోచి ఇచ్చిన దొర పై ఓపిక నశించిన ప్రకృతే పగబట్టి విజయం సాధిస్తే ఇంకా ఆ సంపాదన సాక్షిగా చెరపట్టే దుశ్శాసనులు వీక్షకుల ముందు వచ్చి విశ్లేషణలు గావిస్తుంటే శకుని శత్రు శిబిరం నుండి సంకేతాలు పంపుతుంటే సమరంలో నిలిచిన కొడికి పక్షాన ప్రజల కళ్లకు గంతలు గడుతూ స్వయంగా తల్లే తలపడుతోంది పంచభూతాల పగకు పతి ప్రాణాలు పణంగా పెట్టినా పసి వాడి పాడు బుద్ధికి సుద్దులు చెప్పడం మరిచి మళ్ళీ తలపడడం మనందరికీ ఆశ్చర్యం కలిగించి నాది అక్షర సత్యం మహా భారతం మళ్ళీ నడుస్తోంది

కామెంట్‌లు లేవు: