2, నవంబర్ 2011, బుధవారం

అన్నదాతల గుండెకోత ఎవరికి తెలుసు ????

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకృత విధానాల ప్రభావాన్ని మన రైతు చవిచూస్తున్నాడు. వీటివల్ల దేశంలో సంపద అనూహ్యంగా పెరిగింది. ఉత్పత్తులు కూడా పెరిగాయి. వాటికి మార్కెటింగ్‌ సౌలభ్యం వృద్ధిచెందింది. అదే సమయంలో ఈ దేశంలో రైతు మాత్రం నీరుగారిపోయాడు. వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతాంగం అప్పులపాలైంది. వ్యవసాయం నష్టదాయకంగా మారింది. అప్పులు తీర్చలేక ఆర్థిక ఇబ్బందులకు గురైన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనంతటికీ కారణం ప్రపంచ బ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల ఆదేశాలే. వీటిమేరకు భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో సబ్సిడీల్ని తగ్గించింది. అంచెలంచెలుగా మొత్తం తొలగిస్తోంది

కామెంట్‌లు లేవు: