7, నవంబర్ 2011, సోమవారం

మన రాష్ట్రం లో దేవుడని చెప్పుకొని ..........

రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్ముతో
పట్టణాలలో ప్యాలస్ లు
లోటస్ ప్యాండ్ లు
అని ప్రశ్నిస్తున్నారు?

రాముడి భక్తుడు రామదాసు
కృష్ణ దేవరాయలు లాంటి వాళ్ళు
అనంత పద్మనాభ స్వామీ కి
కేరళ రాజులు
సత్య సాయి బాబా కు
వారి వారి భక్తులు

తమ దేవుళ్ళకు
గుళ్ళూ గోపురాలు
నగా నట్రా వజ్ర వైడూర్యాలు లాంటి
అనంత సంపదను
ఆయా దేవుళ్ళు
అడగ కుండా
భక్తులు ఇచ్చారు

మన రాష్ట్రం లో
దేవుడని చెప్పుకొని
కొడుకు ప్రచార మాధ్యమాలతో
వాన రాక పోక లతో సహా
దేవుడే అని నిరూపిస్తూ
చెవినిల్లు కట్టుకొని చెప్పినా

ఒక్క భక్తుడైనా
గుడి గోపురం
అడగకుండా అనంత పద్మనాభ స్వామికి ఇచ్చినట్టు
సంపదలు సమర్పించారా

అందుకే కలియుగ దైవం
కన్నుమూయక ముందే
కన్న కొడిక్కి
తనకు ఇష్టం వచ్చినట్లు
కావాల్సినంత కానుకలు
ఇచ్చి వెళ్ళాడు

కానుకల స్వీకారం మొదలెట్టి
పోగేసే సమయం నుండి
పోయే దాక
పోయినాక కూడా
చంద్రబాబుది ఒకటే పోరు
ఈయనది ఏదో పోయినట్టు

కడుపు మంట కాక పోతే
రామదాసులా చంద్రబాబు
ఎవడబ్బ సొమ్మని అడగడం
ఎబ్బెట్టుగా లేదూ.

కామెంట్‌లు లేవు: