7, నవంబర్ 2011, సోమవారం

మతం వారిగా మడతపేచీలు పెట్టి ప్రాంతాల వారిగా పాడెలు కట్టి శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

తెలుగు తల్లి ఒడిలో
బురద పద్మాన్ని
పెట్టనివ్వని
తెలుగోడు
మొట్ట మొదట
అదే పద్మాన్ని
హస్తిన కుర్చీ ఎక్కించి
ఏమి కావాలన్నది
ఇక్కడ నుండే
శాసించి మరీ రాబట్టుకొన్నాడు

అటువంటి ఆంద్ర ప్రదేశ్ లో
ఎన్నేళ్ళు పడిగాపులు గాసినా
పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే ఉన్నట్టు వుంది

అందుకే ఆంగ్లేయులకు మల్లే
ఆంధ్రులను విడదీసి
సందులో దూరి సడేమియా అంటాము
తరువాత పాగా వేసి పాలిస్తాము

అలనాడు ఆంగ్లే యులను
ఆదరించిన దేశ ద్రోహులకు మల్లే
ఆంధ్రా లో ఉన్న అంధులు కొందరు
దగ్గరికి రానిస్తున్నారు

హస్తిన కుర్చీ ఎక్కిన క్షణం
చీల్చడానికి వెరవం
మీరు ఛీ కొట్టినా సరే

మతం వారిగా మడతపేచీలు పెట్టి
ప్రాంతాల వారిగా పాడెలు కట్టి
శవాల మీద ఓట్ల చిల్లర వేరుకొంటాము.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Nice post. That is exactly what BJP is doing.