31, మార్చి 2011, గురువారం

వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది.

మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి వ్యూహానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వైయస్ జగన్ వర్గం దిమ్మ తిరిగి పోయింది. వైయస్ రాజశేఖర రెడ్డి భూ కేటాయింపులపై తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్న సమయంలో శాసనసభలో వివేకానంద రెడ్డి రెచ్చిపోయారు. తెలుగుదేశం సభ్యులపైకి దూసుకెళ్లి దాడికి యత్నించారు. ఈ సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు వివేకానంద రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఆవేశకావేశాల మధ్య జరుగుతున్నదేమిటో వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు అర్థం కాలేదు. అర్థమయ్యే సరికి దృశ్యం మారిపోయింది.

త్వరలో జరిగే పులివెందుల, కడప ఉప ఎన్నికల నేపథ్యంలో వైయస్ రాజశేఖర రెడ్డి ప్రతిష్టను తాను తప్ప మరెవరూ కాపాడలేరని చెప్పుకోవడానికి వైయస్ వివేకానంద రెడ్డి శాసనసభలో అంతగా రెచ్చిపోయారని కాస్తా ఆలస్యంగా వైయస్ జగన్ వర్గం గుర్తించింది. దీంతో అప్పటి వరకు వివేకాకు మద్దతుగా నిలిచిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు రివర్స్ గేర్ వేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమ్మక్కయి వివేకానంద రెడ్డితో నాటకం ఆడించారని ఆడిపోసుకోవడం ప్రారంభించారు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Repu kadapa elections lo dimma tirige vaallaki tirugutundi