27, ఏప్రిల్ 2011, బుధవారం

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు.

ఈనెల 24వ తేదీన నిర్యాణం చెందిన భగవాన్ శ్రీ సత్యసాయి అంతిమ సంస్కారాలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, బాబా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు ప్రారంభించారు. కోట్లాది మందికి తన ప్రసంగం ద్వారా ఆధ్యాత్మిక ప్రసంగాలతో ఉత్తేరజపరిచిన చోటే సమాధికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ద్రాక్షారామం నుంచి వేద పండితులు ప్రత్యేక విమానంలో రకరకాల పుష్పాలు, పుణ్య నదీజలాలు, పవిత్రమట్టితో పుట్టపర్తికి వస్తున్నారు.
ఇదిలావుండగా, అంతిమ సంస్కారాల నిర్వహణపై సత్యసాయి ట్రస్టు కీలక భేటీ నిర్వహించింది. మంగళవారం 11.30 గంటల నుంచి 12.30 గంటల వరకు గంటపాటు ఈ భేటీ జరిగింది. బుధవారం నిర్వహించే అంతిమ సంస్కారం ఎలా చేపట్టాలి, వేదపండితులను ఎక్కడి నుంచి పిలిపించాలి, ఎలాంటి పూజలు నిర్వహించాలి, ఖననంలో ఎలాంటి నిబంధనలు పాటించాలి అన్న అంశాలపై చర్చించారు.

బాబా పార్థివ శరీరాన్ని బాబా ప్రసంగించే కుల్వంత్ హాలులోనే సమాధి చేయాలని నిర్ణయించారు. చివరి దర్శనానికి వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మంత్రులు గీతారెడ్డి, రఘువీరారెడ్డి ట్రస్టు సభ్యులతో కలిసి చర్చించిన పిమ్మట మీడియాకు వివరాలు వెల్లడించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా దాక్షారామం నుంచి ప్రముఖ వేద పండితులను బాబా అంతిమ సంస్కారానికి పిలిపించాలని నిర్ణయించారు. సన్యాసం, బ్రహ్మచర్యం, సర్వమత సమానత్వాన్ని పాటించిన సత్యసాయికి ఏ తరహా అంతిమ సంస్కారాలు నిర్వహించాలో వేద పండితులతో ట్రస్టు వర్గాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ క్రియను నిర్వహించడానికి మూడు పద్దతులు ఉన్నట్లు కూడా వేద పండితులు సూచించినట్లుగా సమాచారం.

కామెంట్‌లు లేవు: