29, ఏప్రిల్ 2011, శుక్రవారం

జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట.

కడప, పులివెందుల ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులపై భారీగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరిలో జగనే పందెం కోడిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కడప నుండి పోటీ చేస్తున్న జగన్, డిఎల్ రవీంద్రారెడ్డి, మైసూరారెడ్డి, పులివెందుల నుండి పోటీ చేస్తున్న విజయమ్మ, వైయస్ వివేకానందరెడ్డి, బిటెక్ రవిలపై జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కడప బరి నుండి జగన్ గెలిస్తాడనే దానికంటే ఆయన ఆధిక్యత(మెజార్టీ) పైనే జోరుగా బెట్టింగులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.


జగన్ ఆధిక్యతపై బెట్టింగులు ఐపిఎల్‌ను కూడా మించి పోయేలా ఉన్నాయంట. ఐపిఎల్ మ్యాచ్‌లపై కూడా ఇంతలా బెట్టింగులు జరగడం లేదంట! బెట్టింగులు కేవలం రాయలసీమ ప్రాంతానికే పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశంలో కూడా జగన్ ఆధిక్యతపై జోరుగానే బెట్టింగులు సాగుతున్నాయంట. జగన్ 2 లక్షల ఆధిక్యం సాధిస్తే, ఇంత, మూడు లక్షల ఆధిక్యం సాధిస్తే ఇంత అని బెట్టింగులు కాస్తున్నారంట.

జగన్ లక్ష మెజార్టీతో గెలిస్తే లక్షకు రెండు లక్షల రూపాయలు, కోటికి రెండు కోట్ల రూపాయల తీరులో బెట్టింగులు సాగుతున్నాయని తెలుస్తోంది. జగన్‌పై బెట్టింగులు ఇలా ఉంటే ఇక తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ పైన కూడా బెట్టింగులు జరుగుతున్నాయంట. అయితే ఈ రెండు పార్టీలలో ఏది రెండవ ప్లేసులో ఉంటుందనే విషయంపై బెట్టింగులు జరుగుతున్నాయంట. దీంతో బెట్టింగకు పాల్పడుతున్న వారికి జగన్ గెలుపుపై గట్టి ధీమా ఉండటంతో పాటు, కాంగ్రెసు, టిడిపిలు గెలవడం కష్టమనే భావనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో "సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
-మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి