26, మే 2011, గురువారం

ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

సొంతంగా పార్టీ పరంగా గెలిచిన
ఎం ఎల్ ఏ ఒక్కరే.

మిగిలినవి అన్నీ కప్పదాట్లే.
అవి కూడా పాతికకు మించి లేదు.

పాలకులు తలుచుకొంటే
కప్ప దాట్లను సభకే రానివ్వకుండా చెయ్యొచ్చు.

ఇన్నీ తెలిసి పాలకులను పడగొట్టేస్తాం అని
పదే పదే చెప్పడం ఎందుకో ?

సిన్సియారిటీ చూస్తుంటే చిరంజీవి గుర్తుకు వస్తున్నాడు
ఏ పిలుపు వచ్చి డిల్లీకి వెళ్ళినా పోలవరం అంటాడు
తరువాత పత్తా ఉండడు.

సేం డిటో అలానే రైతు సమస్యలు అని ఓ టెంట్ వేస్తారు
కానీ ఓ సొంత పార్టీ ఎం పీ గా
విత్త మంత్రులను నిద్రలేపే వినతి పత్రం ఇవ్వలేరు.

టెంటు అవుతూనే
కుర్చీ సుమన్ అవతారం ఎత్తి
ఓదార్పు అంటూ ఏడిపించడానికి వెళతారు.

వెళ్ళిన చోట్లల్లా
ట్రాఫిక్ లేని జంక్షన్లు వెదికి
విగ్రహాన్ని పెడుతూ
యువ నేత మహా నేత విగ్రహావిస్కరణ అని
తన మీడియా లో రోజులో ఎప్పుడు చూసినా
తప్పించుకోకుండా బాధుతారు.

కుర్చీ తన బాబు సొత్తు అనే బాధ ఎక్కువగా ఉండేట్టు ఉంది
కూల్చేదేదో కూల్చేసి ఆ భారం దింపుకొంటే బావున్ను.