26, మే 2011, గురువారం

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది.

నరసింహా రావు గారి నాన్చుడు దారిలో
నారా వారు ఇంకా [ఈ కాలం లో కూడా] ప్రయాణిస్తూ
ప్రభుత్వ పగ్గాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు.

కానీ గ్రామ గ్రామానికీ విస్తరించి ఉన్న పార్టీ శాఖ
ఇదే విషయంలో విసిగిపోతోంది.

వయసుమళ్ళిన వాళ్ళు వాహ్యాళికి వచ్చినట్టు
వచ్చి ఇంకా పార్టీ వ్యవహారాలూ నడుపుతుంటే
అవకాశం రాని యువత అంగలారుస్తూ
తక్షణమే పేరొచ్చే పెడదారులను వెతుక్కొంటున్నారు.

రైతు సమస్యలు అవినీతి సమస్యలపై అధినేత అరుస్తున్నా
వాహ్యాళికి వచ్చినట్టు ప్రవర్తిస్తున్న
పండిన వృద్ద ఝంభూకాల జంజాటాన్ని
ఎంత తొందరగా వదులుకొని
జనంలో మమేకమయ్యే మనుషులకు
మేధావులకు పార్టీ పనులు అప్పజేబుతారో
అప్పుడే తెలుగు దేశం దశ తిరుగుతుంది.

లేదంటే ఒకప్పటి వెలిగిన దేశంగా
చరిత్రలో మిగిలిపోతుంది.

కామెంట్‌లు లేవు: