12, మే 2011, గురువారం

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు.

మాస్ట్రో ఇళయరాజా తన అద్వితీయమైన సంగీత జ్ఞానంతో అజరామరమైన పాటలను రూపొందించి సంగీత ప్రియులను మైమరపించారు. ఇప్పుడు ఆ స్వరబ్రహ్మ తన జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ రేపటితరం సంగీత కళాకారులను తయారు చేసే పనికి పూనుకున్నారు. ఈ ప్రయత్నానికి ప్రముఖ నటుడు, నిర్మాత పద్మశ్రీ డా. మోహన్ బాబు చేయూతనందించనున్నారు.

ఇళయరాజా, మోహన్ బాబు సంయుక్తంగా సంగీత విశ్వ విద్యాలయాన్ని నెలకొల్పటానికి సంకల్పించుకున్నారు. వారిరువురు సోమవారం రాత్రి తిరుమలలో వెంకటేశ్వర స్వామి సన్నిదిలో ఈ విషయాన్నీ విలేకరులకు తెలియజేసారు. మోహన్ బాబు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఇంతవరుకు సంగీత విశ్వ విద్యాలయం లేదు, తిరుపతిలో తాను ఏర్పాటు చేసిన శ్రీ విద్యానికేతన్ ప్రాంగణంలోనే ఈ సంగీత యునివర్సిటీ స్థాపన జరుగుతుందని అన్నారు. ఈ అంశానికి సంబందించిన పూర్తివివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.

కామెంట్‌లు లేవు: